25, జనవరి 2025, శనివారం

ఆదివారం🌞* *🇮🇳26, జనవరి, 2025🇮🇳* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🌞ఆదివారం🌞*

  *🇮🇳26, జనవరి, 2025🇮🇳*

    *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*


*తిథి      : ద్వాదశి* రా 08.54 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం   : ఆదివారం*(భానువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* ఉ 08.26 వరకు ఉపరి *మూల* 


*యోగం  : వ్యాఘాత* రా 03.34 వరకు ఉపరి *హర్షణ*

*కరణం  : కౌలువ* ఉ 08.48 *తైతుల* రా 08.54 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 11.00 - 12.00 మ 02.00 - 03.30*

అమృత కాలం  : *రా 02.28 - 04.07 తె*

అభిజిత్ కాలం  :  *ప 11.57 - 12.43*

*వర్జ్యం         :  సా 04.38 - 06.16*

*దుర్ముహూర్తం  :సా 04.30- 05.15*

*రాహు కాలం   :సా 04.36- 06.01*

గుళికకాళం       : *మ 03.10 - 04.36*

యమగండం     : *మ 12.20 - 01.45*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.39*

సూర్యాస్తమయం :*సా 06.01*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం       :*08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.28*

అపరాహ్న కాలం   : *మ 01.28- 03.45*


*ఆబ్ధికం తిధి : పుష్య బహుళ ద్వాదశి*

సాయంకాలం      :*సా 03.45- 06.01*

ప్రదోష కాలం       :*సా 06.01- 08.33*

రాత్రి కాలం         : *రా 08.33 - 11.55*

నిశీధి కాలం         :*రా 11.55- 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    *🌞IIశ్రీ సూర్య సోత్రంII🌞*


*ఉదితవతి త్వయి వికసతి ముకులీయతి* *సమస్తమస్తమితబింబే న హ్యన్యస్మిందినకర* 

*సకలం కమలాయతే భువనం*


 *🙏ఓం నమో సూర్యాదేవాయ నమః* 


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

Panchaag


 

మూడు దారులు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏          🔥ప్రతీ సమస్యకు మూడు దారులుంటాయి.. ఆమోదించడం.. మార్చుకోవడం.. వదిలేయడం..సమస్యను యధాతందంగా ఆమోదించలేక పొతే మార్చుకోవాలి.. మార్చుకోలేక పొతే వదిలేయాలి.🔥బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయ్.. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బందాన్నే పూర్తిగా వదిలివేయి.. జీవితం అంతా తల దించుకుని బ్రతకడం అసాధ్యం...హేళన చేసే వాడిని చెయ్యనివ్వు.. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు  సమయం రావాలే గానీ కాలం ఎవ్వరినీ వదలి పెట్టదు .. ఎంత్తవాడికి అంత శిక్ష పడుతుండు🔥ఎప్పుడూ కాలం తీరు ఒకేలా ఉండదు.. నిన్ను చిన్న చూపు చుసిన ప్రతీ ఒక్కరికి బుద్ది చెప్పే రోజు ఒకటి వచ్చేలా చేస్తుంది.. ఇది ముమ్మాటికీ నిజం.. కాస్త ఓపిక కావాలి అంతే.. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు🔥 *చెడు స్వాభావం కలవారని తెలిస్తే సొంత వాళ్ళయినా, పరాయి వాళ్ళయినా సరే పక్కన పెట్టు.. ఎందుకంటే మన దొడ్డిలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే ఆది మంటనే పుట్టిస్తుంది.. చల్లదనాన్ని ఇవ్వదు.. అలాగే చెడు స్వాభావం  చెడు ఆలోచనలు కలవారు కూడా  అంతే న్నిప్పుకి దూరంగా ఉండడం ఎంతో మంచిది*🔥🔥 మీ * అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్  ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారుకి రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9

9182075510* 🙏🙏🙏

మహాభారతం

 🙏మహాభారతం - శాంతి పర్వం 🙏

                   సప్తమ భాగం 


కృష్ణుడి మాటలు విని ధర్మరాజు " కృష్ణా ! నాకు సృంజయుడి వృత్తాంతం వినాలన్న కోరిక కలుగుతుంది. వివరించు " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నీవు వ్యాసుడి వలన నారదుడి వృత్తాంతం విని ఉన్నావు. పర్వతుడి వృత్తాంతం విని ఉన్నావు అదికూడా చెప్తాను విను. ఒకసారి నారదుడు పర్వతుడు దివినుండి భువికి దిగివచ్చారు. ఆ సమయంలో వారిరువురు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒకరి మానసులోని మాట ఒకరికి దాపరికం లేకుండా చప్పాలన్నదే ఆ ఒప్పందం. అలా చెయ్యని ఎడల శాపగ్రస్తులు ఔతారన్నది ఆ ఒప్పందం. అలా వారిరువురు విహరిస్తూ వారు ఒకరోజు సృంజయుడిని కలుసుకున్నారు. వారు సృంజయుడి కోరికమీద అతడి గృహంలో కొన్ని రోజులు ఉందామని అనుకున్నారు. అప్పుడు సృంజయుడు తన కుమార్తె సుకుమారిని పిలిచి " అమ్మా ! వీరు మహర్షులు. వీరి సేవచేసి తరించు " అని చెప్పాడు. సుకుమారి అందుకు అంగీకరించింది. సుకుమారి సేవలతో నారదుడు, పర్వతుడు ఆనందంగా కాలం గడుపుతున్నారు. అతిలోక సుందరి అయిన సుకుమారి మీద మనసుమరులుగొన్న నారదుడు బయటకు చెప్పుకోలేక లోలోపలే కృంగిపోసాగాడు. నారదుడు అలా చిక్కిపోవడం చూసిన పర్వతుడు సందేహించి దివ్యదృష్టితో నారదుడి మనసులో విషయం తెలుసుకున్నాడు. పర్వతుడు తమఒప్పందం ప్రకారం నారదుడు తన మనసులో మాట బయటపెట్టనందుకు ఆగ్రహించి " నారదా ! నీకు సుకుమారి మీద మనసు లగ్నమైన విషయం నా వద్ద దాచి మనఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నేను నిన్ను శపిస్తున్నాను. నీవు ఆమెమీద మనసుపడ్డావు కనుక ఆమెను వివాహంచేసుకోకుండా ఉండలేవు. ఆమెను వివాహం చేసుకున్న మరుక్షణం నీకు కోతిముఖం ప్రాప్తించుగాక ! అని శపించాడు. అందుకు నారదుడు పర్వతుడి మీద కోపించి " నీకిక స్వర్గ లోక ప్రాప్తి ఉండక ఉండుకాక " అని ప్రతిశాపం ఇచ్చాడు. తరువాత నారదుడు శాపానికి భయపడక సృంజయుడి సహాయంతో అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పర్వతుడి శాపవశాన అతడికి కోతిముఖం వచ్చింది. అతడిభార్య సుకుమారి నారదుడి కురూపానికి అసహ్యించుకోక అతడిని సేవిస్తుంది. ఒక రోజు నారదుడు సమీపంలోని అరణ్యానికి వెళ్ళి అక్కడ పర్వతుడిని కలుసుకున్నాడు. పర్వతుడు నారదుడితో " నారదా ! నీవు నాకు ఇచ్చిన శాపం మరల్చవా ! " అని అడిగాడు. నారదుడు " పర్వతా ! నీవేకదా నాకు ముందుగా శాపం ఇచ్చావు. కనుక నీవు నీ శాపాన్ని ముందుగా మరల్చిన నేను నా శాపాన్ని వెనక్కు తీసుకుంటాను " అన్నాడు పర్వతునితో. నారదుడు పర్వతుడు తమతమ శాపాలను వెనక్కు తీసుకున్నందున నారదుడికి నిజరూపం వచ్చింది. వారిరువురు సృంజయుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ సుకుమారి వారిని గుర్తించక ఎవరో కొత్తవాళ్ళనుకుని లోపలకు వెళ్ళబోయింది. అప్పుడు పర్వతుడు " సుకుమారీ ! ఇతడు నారదుడు నీ భర్త. నేను ఇచ్చిన శాపవశాన నారదుడికి వానరముఖం వచ్చింది. నేను నా శాపం వెనక్కు తీసుకున్నందున అతడికి నిజరూపం వచ్చింది " అని చెప్పగానే అప్పుడు సుకుమారి కూడా తనభర్తను గుర్తించింది " అని కృష్ణుడు చెప్పాడు.


తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నేను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.

                       సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వాహన మెంచి వాడుట

 ఉ. వాహన మెంచి వాడుట ప్రవర్ధన మొందెడు దేహ రక్షకే 

సాహస యాత్ర జేసి కొన సాగుట కోసము గాదు గాన స

మ్మోహము వీడి మత్తునకు మూల్య మొసంగక జాగరూకులై

స్నేహ విశిష్ట యోచనల సేమము నెంచుట మేలు  భారతీ!౹౹ 5


శా. క్షేమమ్మైన ప్రయాణ మార్గములు సంక్లిష్టమ్ము లై యొప్పు తా

మేమాత్రమ్ము ప్రమత్తులై చనినచో నింటిల్లిఁ గూలార్చు ని

ద్రామోహమ్ములు చోదకత్వమున విధ్వంసమ్ము సృష్టించు సం

క్షేమమ్మున్ మది నెంచుచు న్నడపగా శ్రేయమ్మునౌ భారతీ౹౹6

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  - ఏకాదశి - అనూరాధ / జే‌ష్ఠ -‌‌ స్థిర వాసరే* (25.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మధుమేహ నివారణ చూర్ణం -

 మధుమేహ నివారణ చూర్ణం - 


   ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి  చాలా మందిలో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే.  శరీరానికి అనువైన ఆహారం సరైనా వేళల్లో తీసుకోకపోవడం, సరైన సమయంలో నిద్రించకపోవడం వంటి కార్యక్రమాలు ఎక్కువ కాలం చేయడం వలన మానవ శరీరాలు ఎన్నో రకాల వ్యాధులకు గురి అవుతున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరం అయినదే ఈ మధుమేహ వ్యాధి. ఇది మానసికంగా మరియు శారీరకంగా మనిషిని బలహీనపరుస్తుంది. మనకు తెలియకుండానే మన అంతర్గత అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మధుమేహం కంటే  మధుమేహ నివారణకు ఎక్కువ కాలం వాడే అల్లోపతి మందులు యొక్క దుష్పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి. 


           భారతీయ ప్రాచీన ఆరోగ్య పద్ధతి అయిన ఆయుర్వేదములో ఈ మధుమేహ వ్యాధికి చాలా చక్కని పరిష్కారం కలదు. ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా వ్యాధిని దూరం చేయుటకు చాలా ప్రభావవంతమైన ఔషధాలు కలవు. వాటిలో ఇప్పుడు నేను చెప్పబోయే "మధుమేహ నివారణ చూర్ణం " అత్యంత ప్రభావవంతంగా పనిచేయును. ఈ చూర్ణం సుమారు 14 రకాల శుద్ధ మూలికలతో తయారుచేయబడినది. ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. ఇందులోని మూలికలు సరాసరి "ప్యాంక్రియాస్ గ్రంధి " మీద ప్రభావం చూపించును. దాని పనితీరు మెరుగుపడేలా చేయును.  అంతర్గత అవయవాలు మీద "మధుమేహ వ్యాధి " ప్రభావం లేకుండా చేయును. 


      నేను చికిత్స చేయు సమయంలో గమనించిన ప్రధాన అంశం ఏమిటంటే మధుమేహ చికిత్సలో శరీరాన్ని శుద్ధి చేయకుండా ఎన్ని ఔషధాలు ఇచ్చినను అవి సంపూర్ణ ప్రభావం చూపించడం లేదు. అందుకే ఈ " మధుమేహ చూర్ణం"తో పాటు శరీర శుద్ధికి కావలసిన ఔషాధాలు కూడా కలిపి వస్తాయి.  

ఈ ఔషదం ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి అర్ధ గంట ముందు నీటితో లోపలికి తీసుకోవాలి.  ఎటువంటి దుష్పరిణామలు ఉండవు. ఇది పూర్తి ప్రకృతి సిద్ధముగా తయారుచేయబడినది. మధుమేహ వ్యాధి ప్రధమ దశలో ఉన్నవారు కొంతకాలం వాడి ఆపేయవచ్చు.  తీవ్రత ఎక్కువ ఉన్నవారు కొంచం ఎక్కువ కాలం వాడవలసి ఉంటుంది.  మధుమేహ వ్యాధిలో ఇతర అవయవాలును కాపాడుకోవడం అనేది ప్రధానంగా చేయవలసిన పని. ఆ విషయంలో ఇది అద్భుతంగా పనిచేయును. 


         ఈ "మధుమేహ నివారణా చూర్ణం " కావలసిన వారు  9885030034 నెంబర్ నందు నన్ను సంప్రదించగలరు.  



               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                        9885030034

శనివారం🍁* *🌹25, జనవరి, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🍁శనివారం🍁*

*🌹25, జనవరి, 2025🌹*  

     *ధృగ్గణిత పంచాంగం*


            *ఈనాటి పర్వం* 

      *సర్వేషాం షట్తిలైకాదశి*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : ఏకాదశి* రా 08.31 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం  : అనూరాధ* ఉ 07.07 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం  : ధ్రువ* (26) తె 04.38 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం  : బవ* ఉ 08.03 *బాలువ* రా 08.31 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు* 

      *ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 11.09 - 12.50*

అభిజిత్ కాలం  :  *ప 11.57 - 12.43*

*వర్జ్యం             :  మ 01.02 - 02.43*

*దుర్ముహూర్తం  : ఉ 06.39 - 08.10*

*రాహు కాలం   : ఉ 09.30 - 10.55*

గుళికకాళం       : *ఉ 06.39 - 08.05*

యమగండం     : *మ 01.45 - 03.10*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.39*

సూర్యాస్తమయం :*సా 06.00*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం         :      *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :      11.12 - 01.28

అపరాహ్న కాలం    : *మ 01.28 - 03.44*

*ఆబ్ధికం తిధి         : పుష్య బహుళ ఏకాదశి*

సాయంకాలం        :  *సా 03.44 - 06.00*

ప్రదోష కాలం         :  *సా 06.00 - 08.32*

రాత్రి కాలం            :  *రా 08.32 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹II శ్రీ వేంకటేశ పంచక స్తోత్రంII🙏*


*నన్దగోపనన్దనం సనన్దనాదివన్దితం*

*కున్దకుట్మలాగ్రదన్తమిన్దిరామనోహరమ్*

*నన్దకారవిన్దశఙ్ఖచక్రశార్ఙ్గసాధనం*

*నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్*


*🙏ఓం నమో వెంకటేశాయ🙏*

******************************


*🍁అంజని పుత్ర స్తోత్రం..!!🍁*


*స్థిర నిల్యావర హనుమంత ఈశ బాలక హనుమంత*

*జయ బజరంగబలి జయజయ జయ బజరంగబలి*


           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీవారిని దర్శించుకుంటే

 *శ్రీవారిని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం* 


 *🛕\|/🛕* అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమౌతుంది. కొండ లలో నెలకొన్న కోనేటిరాయుడ్ని కళ్లారా ద ర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్ర మే లభించే శ్రీవారి దివ్యమంగళరూప దర్శ నంకోసం తహతహలాడతాము.


*🛕\|/🛕* శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏ ఏ వారాలలో దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం


 *🛕\|/🛕* శ్రీనివాసుడ్ని ఆదివారం దర్శిం చుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధినేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రు నాశనం, నేత్ర, శిరోబాధలనుండి ఉపశమ నం వంటి ఫలితాలు కలుగుతాయని  పురాణవచనం.


 *🛕\|/🛕* సోమవారం శ్రీవారిని దర్శించు కుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూ లత, తల్లికి, సోదరీమణులకు శుభం, వా రినుండి ఆదరణ, భాగస్వామితో అన్యో న్యత కలుగుతాయి.


 *🛕\|/🛕* మంగళవారం శ్రీవారిని దర్శించు కుంటే భూమికి సంబంధించిన వ్యవహారా ల్లో కార్యసిద్ధి, భవననిర్మాణ పనులకు అవ రోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి.


 *🛕\|/🛕* బుధవారం స్వామిని దర్శించు కుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజి క గౌరవం లభిస్తాయి.


 *🛕\|/🛕* గురువారం స్వామిని దర్శించు కుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురు వుల ఆశిస్సులు లభిస్తాయి.


 *🛕\|/🛕* శుక్రవారం గోవిందుడ్ని దర్శించు కుంటే సమస్త భోగభాగ్యాలు, వాహనసౌ ఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి.


 *🛕\|/🛕* శనివారం ఏడుకొండలస్వామిని  దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెప్తున్నాయి.


*🛕\|/🛕* పౌర్ణమినాడు గరుడవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభా గ్యాలు కలుగుతాయి.

మంగళకరంగా ఉండుగాక!*

 🌹🙏🌴🪔🌴🙏🌹


*సమస్త దేవతల శుభాశీస్సులతో...*

*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*


*సర్వేజనాః సుఖినోభవంతు!*


*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*

*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*

*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*


*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*

*అందరికీ శుభమే జరుగుగాక!*


*సర్వేషాం శాన్తిర్భవతు!*

*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*


*సర్వేషాం పూర్ణంభవతు!*

*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*


*సర్వేషాం మంగళం భవతు!*

*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*

🙏🌹☘️🌹☘️🌹🙏


*వేదఆశీర్వచనము 👇*                                 

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: అర్జున ఉవాచ:


యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామా నవస్థితాన్

కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే(22)


యోత్స్యమానా నవేక్షే௨హం య ఏతే௨త్ర సమాగతాః

ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః(23)


కృష్ణా... శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడనికి సమరరంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

 🎻🌹🙏శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి  ఆలయం-  అప్పలాయగుంట...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి. యిది అప్పలాయగుంటలో వెలసినది.


         🌹ఆలయ చరిత్ర🌹


🌸శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి,


🌿 ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్త్యేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం


       🌹పేరువెనుక చరిత్ర🌹


🌸ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్ధం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడినదని కాలక్రమంలో అది అప్పలగుంటగా మారిందని తలుస్తుంది. 


🌿అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసినవారికి కూలి అప్పు చెప్పకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది


       🌹ఆలయ ప్రత్యేకతలు🌹


🌸ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. 


🌿ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంది


🌸ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణములో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.


🌿అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.


🌸“వినా వేంకటేశం ననాథో న నాథ: సదావేంకటేశం స్మరామి స్మరామి ...🚩🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1000


⚜ కేరళ  : తిరువనంతపురం


⚜ శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం



💠 ఇంతకాలం తిరుపతి వెంకన్న.. 'సిరి' గల వాడు! ఇప్పుడు కేరళ పద్మనాభుడు.. అనంత 'సిరి' గల వాడు!! లక్ష కోట్లకు మించిన ఆస్తులు బయటపడిన ఈ దేవాలయం వెనుక కథలేంటో తెలుసుకుందామా!


💠 తిరువనంతపురంలో ముఖ్యంగా చూడవలసింది అనంత పద్మనాభస్వామి ఆలయం. 

ఇది చాల ప్రాచీనమైన ఆలయం,  1733 లో మార్తాండవర్మ అనే రాజు పద్మనాభస్వామికి తన సర్వస్వం సమర్పించి 'పద్మనాభదాసు' అనే పేరుతో రాజ్యాన్ని పాలించిన పరమ భక్తుడు. ఇలా స్వామికి ప్రతినిధిగా ప్రజాపాలన చేసిన ప్రభువులు చాలా అరుదు. 

రామాయణంలో పాదుకలను సింహాసనం పై ప్రతిష్ఠించి రామ రాజ్యానికి ధర్మకర్తగా వ్యవహరించిన భరతుడు ఇలాంటి మనస్తత్వానికి మంగళాచరణం చేశాడు. 

ఆ తర్వాత మళ్ళీ మర్తాండవర్మ ఈ సంప్రదాయాన్ని పోషించిన పుణ్యజీవి.


💠 దళితులకు ఆలయంలో ప్రవేశం లభించింది కూడా మొట్టమొదట ఈ ఆలయంలోనే అని అంటారు.

గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో అది జరిగింది.


💠 ఆలయంలో స్వామి విగ్రహం శయన ముద్రలో ఉంటుంది. ఆదిశేషుడయిన అనంతుని వేయిపడగలపై ప యనించియున్న పద్మనాభస్వామిని దర్శించేందుకు ఒక్క ద్వారం చాలదు. 

స్వామి 18 అడుగుల పాన్పు పై శయనించి ఉండటం వల్ల ఆయన నాభికమలం మాత్రం మధ్య ద్వారం నుంచి కనిపిస్తుంది. 

ఒక వైపు నుంచి వక్షస్థలం, శిరస్సును చూడవచ్చు. మరోవైపునుంచి పాదాలను సేవించవచ్చు. 

ఇంతటి విశాలమైన విగ్రహం మరే విష్ణు మందిరంలో కనిపించదు.


💠 మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి.


💠 ఆలయ ప్రాంగణంలో వందల కొలది స్తంభాలే కాక సీతా రామలక్ష్మణ హనుమదాదుల ఆలయాలు కూడా ఉన్నాయి. గర్భగుడిలో ప్రవేశించే ముందు యోగ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది.


🔆 స్థల పురాణం 


💠 చాలాకాలం క్రితం దివాకరుడనే మునీశ్వరుడు కృష్ణుని కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి ఆ ముని సాలగ్రామాన్ని గటుక్కున మింగి పారిపోయాడు. ముని తరిమేసరికి ఓ చెట్టు చాటుకి వెళ్ళి మాయామయ్యాడు. 

చూస్తుండగానే ఆ చెట్టు శేషతల్పం మీద పడుకున్న విష్ణుమూర్తిగా అతి పెద్ద విగ్రహంగా మారిపోయింది. అప్పుడా ముని ప్రార్థన మేరకు పరిమాణం తగ్గిపోయింది. అలా తగ్గిన విగ్రహాన్నే ఇప్పుడు కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భక్తులు దర్శిస్తారు. అయినా మూడు ద్వారాల నుంచి చూస్తే కానీ పూర్తిగా చూడలేనంత పెద్దగా ఇక్కడి విగ్రహం ఉంటుంది.


💠 నూరు అడుగుల ఎత్తుగా, ఏడంతస్తులతో నిర్మితమైన గాలిగోపురం అద్భుత శిల్పకళా వైభవంతో ఆకట్టుకుంటుంది. 

అందమైన అలంకారాలతో చెక్కిన 365 గ్రానైట్ స్థంభాల మండపం. ప్రాచీన శిల్పుల నైపుణ్యాన్ని కళ్లకు కడుతుంది. స్కంద, పద్మ పురాణాల ప్రకారం ఏడు పరశురామ క్షేత్రాల్లో ఒకటిగా, 108 విష్ణు 'దివ్య దేశాలు'లో 59వ దివ్య దేశంగా ఈ ఆలయం భక్తులను ఆలరిస్తుంది.

  

💠 బిళ్వ మంగళ స్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై యుండెను . 

అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపము ప్రత్యక్షమునిచ్చెను.

అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమయినా పెరుమాళ్ కు నివేదించ వలయునన్న తపనతో  పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమియు లేక పోయినందువలన ప్రక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలనుంచి స్వామికి అర్పించెను .

ఈ ఆలయమున ఇప్పటికినీ అది ఆచారముగా కొనసాగించుచున్నారు . 

కాని పచ్చి మామిడి కాయల ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదించుచున్నారు . నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికినీ సుప్రభాత సేవ చేయుదురు . 


💠 ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి.  అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.


💠 ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. 


💠 అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. 

ఈ దేవాలయం పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 

‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం.


💠 ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. 

 

💠 నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది.

ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. 

 

💠 సరిగా ఇలాంటి దేవాలయమే ఆది కేశవదేవాలయం అనే పేరిట ఇక్కడికి 45 కి.మీ. దూరంలో ఉంది. 

అక్కడి స్వామి విగ్రహం కూడా 18 అడుగుల పొడవు ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండటం వల్ల ఆదికేశవులు అనంత పద్మనాభస్వామిని చూస్తూ ఉన్నారవి అంటారు. 


రచన

🌀 Santosh Kumar

కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 999


⚜ కేరళ  : పాలక్కాడ్‌


⚜ కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం



💠 కిల్లిక్కురుస్సి మంగళాన్ని లక్కిడి అని కూడా అంటారు. 

నీలా (భారతపూజ) నది లక్కిడి దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. 


💠 కేరళలోని పాలక్కాడ్‌లోని పచ్చని కొండల మధ్య ఉన్న లక్కిడి ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం మాత్రమే కాదు. 

ఈ సుందరమైన పట్టణంలో కిల్లిక్కురిస్సి మహాదేవ దేవాలయం అని పిలువబడే వాస్తు అద్భుతం కూడా ఉన్నది.

సందర్శించే వారందరి నుండి ప్రశంసలను పొందుతున్న దాని అద్భుతమైన చెక్క నిర్మాణాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది.శివునికి అంకితం చేయబడింది.


💠 శ్రీ పరశురాముడు  కేరళలో 108 శివాలయాలు, 108 భగవతి దేవాలయాలు మరియు 108 ధర్మ శాస్తా దేవాలయాలను స్థాపించాడు.

ఈ మహాదేవ ఆలయం అందులో ఒకటి..


💠 గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం- శ్రీ కిల్లిక్కురుస్సి మహాదేవ క్షేత్రం నుండి ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు దీనిని శ్రీ శుక బ్రహ్మ ఋషి స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి.


💠 ఆలయ ప్రధాన గర్భగుడి, పశ్చిమం వైపు ఉంది, ఋషి శుక మహర్షిచే ప్రతిష్టించబడిందని నమ్ముతున్న శివలింగం ఉంది. 

ముఖ్యంగా, ఆలయంలోని నంది విగ్రహం ఈశాన్యం వైపు వంగి, దాని ఆధ్యాత్మిక శోభను పెంచుతుంది. గర్భగుడి ప్రక్కనే, ఎడమ మూలలో ఒక గణపతి మూర్తి ఉంటుంది, పార్వతి దేవి, గురువాయూరప్పన్, వనదుర్గ మరియు నాగం వంటి ఇతర ఉప దేవతలు కూడా ఇక్కడ పూజించబడ్డారు.


💠 విశేషమేమిటంటే, ఈ ఆలయం ఉత్సవాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది, ఎందుకంటే శివుడు స్వయంగా దాని ఆవరణలో తపస్సులో నిమగ్నమై ఉన్నాడని నమ్ముతారు.


💠 ఆలయం సాధారణంగా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. 


🔆 పండుగలు:


💠 శివుడికి అంకితం చేయబడిన వార్షిక పండుగ శివరాత్రి, కిల్లిక్కురిస్సి మహాదేవ ఆలయంలో అత్యంత గొప్ప వేడుక. 


💠 గ్రానైట్ లేదా రాతితో నిర్మించిన అనేక దక్షిణ భారత దేవాలయాల మాదిరిగా కాకుండా, కిల్లిక్కురిస్సి మహాదేవ ఒక ప్రత్యేకమైన చెక్క నిర్మాణాన్ని కలిగి ఉంది. క్లిష్టమైన శిల్పాలు గత యుగాల హస్తకళను ప్రదర్శిస్తాయి.


💠 ఈ గ్రామం ప్రసిద్ధ మలయాళ వ్యంగ్య కవి మరియు ఒట్టంతుల్లాల్ కళారూపాన్ని స్థాపించిన కుంచన్ నంబియార్ (రామ పనివాడ) జన్మస్థలం. 

కుంచన్ నంబియార్ జన్మించిన ఇల్లు- కలక్కతు భవనం ఇప్పుడు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. 

ఇక్కడ కుంచన్ నంబియార్ జ్ఞాపకార్థం కుంచన్ స్మారక వాయనశాల- కుంచన్ మెమోరియల్ లైబ్రరీ అనే గ్రంథాలయం కూడా ఉంది. 


💠 పురాణ కూడయాట్టం మరియు చాక్యార్ కూతు కళాకారుడు మరియు ప్రఖ్యాత నాట్యశాస్త్ర పండితుడు నాట్యాచార్య విదుషకరత్నం పద్మశ్రీ గురు మణి మాధవ చాక్యార్ కూడా ఇక్కడ నివసించారు, వీరు అభినయ (నటన) అధికారి.

అతని ఇల్లు కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయానికి సమీపంలో ఉంది. 

ఇది చాక్యార్ యొక్క ప్రముఖ శిష్యులలో ఒకరైన గురు కేలు నాయర్ స్వస్థలం.

ప్రసిద్ధ సంస్కృత పండితుడు కొప్పట్టు అచ్యుత పోతువల్ కూడా ఈ ఆలయానికి సమీపంలో నివసించారు.


💠 పాలక్కాడ్ నుండి 70 కి.మీ.ల దూరంలో ఉంది


రచన

©️ Santosh Kumar

12-15-గీతా మకరందము

 12-15-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హరామర్షభయోద్వేగైః

ముక్తో యస్స చ మే ప్రియః.


తా:- ఎవనివలన ప్రపంచము ( జనులు) భయమును బొందదో, లోకమువలన ఎవడు భయమును బొందడో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత- మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.


వ్యాఖ్య:-' లోకాన్నోద్విజతే - సత్యమార్గమున జనువాడు ప్రపంచము యొక్క నిందాస్తుతులకు ఏ మాత్రము జంకగూడదు. నిర్భయుడై ముందుకు సాగిపోవలెను. (Be fearless) విగతభీః - అని యొకతూరి భగవానుడు సెలవిచ్చిన విషయమును జ్ఞాపకమునందు ఉంచుకొనవలెను.


"హర్షామర్షభయోద్వేగైః "- హర్షము (సంతోషము} మంచిదే అయినను ఆవేశములకు లోనై, స్తోత్రములకు ఉప్పొంగిపోవుటయు, నిందలకు క్రుంగిపోవుటయు కూడదనియు, ఆ ప్రకారము ద్వంద్వములకు లోబడక, నిర్వికారుడై సమభావముగలిగి యుండవలెననియు తెలుపుటయే యగును.

తిరుమల సర్వస్వం -128*

 *తిరుమల సర్వస్వం -128*

 

 *తిరుమలకు చేరుకుందాం! 1*


 *సప్తగిరుల సమారోహమైన తిరుమలక్షేత్రం లోని ఏడవ శిఖరం “వేంకటాద్రి” పై నెలకొన్న ఆనందనిలయంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.* 



 *తిరుమలకు నడక మార్గాలు*


 తిరుమల క్షేత్రం చేరుకోడానికి అనాదిగా నాలుగు ముఖ్యమైన మార్గాలున్నాయి:


 చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక స్థలమైన తలకోన నుండి అరణ్యమార్గంలో దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. కాలాంతరాన ఈ మార్గం పూర్తిగా కనుమరుగై పోయింది.


 రెండవమార్గం కడప జిల్లా నుండి వచ్చేవారికి అనుకూలంగా ఉండేది. ఈ మార్గం కడప పట్టణంలో ప్రస్తుతం *"దేవునిగడప"* గా ప్రాచుర్యం పొందిన వేంకటేశ్వరుని ఆలయం నుండి ప్రారంభమయ్యేదని చెబుతారు. అచ్చటి నుండి కుక్కలదొడ్డి, మామండూరు గ్రామాల మీదుగా కనుమలతో కూడుకున్న అడవుల్లో సాగిపోయే ఈ మార్గం ప్రస్తుతం చాలావరకు శిథిలమైపోయింది. అయితే, ఈ దారిలో పురాతన సోపానమార్గపు ఆనవాళ్లు, కొన్ని విశ్రాంతి మంటపాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తిరుమలక్షేత్ర మందు పాపనాశనం వెళ్లే దారిలోని *"గోగర్భం"* ఆనకట్ట ప్రక్కన ఉన్న *"ఈతకాయల మంటపం"* వాటిలో ఒకటి. ఇప్పటికీ అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు అటవీశాఖ వారి ప్రత్యేక అనుమతితో, విశేష సందర్భాలలో ఈ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అపాయాలతో కూడుకున్న, జనసంచారం లేని ఈ మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం ఒకరకంగా సాహసయాత్రే!


 మూడవది మనలో చాలామందికి సుపరిచితమైన తిరుపతి పట్టణం లోని *"అలిపిరి"* నుండి మొదలయ్యేది. 


 నాలుగవ మార్గం చంద్రగిరి పరిసర ప్రాంతం నుండి బయలుదేరి తిరుమలకు చేరుకుంటుంది. దీనినే *"శ్రీవారిమెట్లు'* గా పిలుస్తారు. -


 ఇవే కాకుండా, తిరుమల క్షేత్రానికి నలుదిక్కుల నుంచి ఇంకా అనేక మార్గాలు ఉన్నట్లుగా చెబుతారు. పురాణాల ననుసరించి కపిలతీర్థం ఆలయం నుండి ఒక రహస్యమైన సొరంగమార్గం కూడా ఉండేది. తొండమాన్ చక్రవర్తి ఆ మార్గం గుండా వెళ్లి స్వామిని సేవించుకునే వాడు.


 ప్రస్తుతం *"అలిపిరి"* మరియు *"శ్రీవారిమెట్లు"* నడకమార్గాలు లేదా మెట్ల మార్గాలు మాత్రమే (వాహనాలు వెళ్ళి వచ్చే రెండు ఘాట్ రోడ్ లు కాకుండా) వాడుకలో ఉన్నాయి.



‌ *నడక మార్గంలో మెట్లు*


 1850వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యాత్రికుల సౌలభ్యం కోసం కొండమీదకు ఉన్న నడకదారిలో మెట్లను నిర్మించింది. 1953వ సంవత్సరంలో ఆలయం తి.తి.దే. ఆధ్వర్యం లోకి వచ్చిన తర్వాత, 26 వేల రూపాయల ఖర్చుతో ఆ మెట్ల మార్గం అభివృద్ధి చేయబడింది. ఈ మెట్లు నిర్మించక ముందు, అంటే దాదాపుగా 150 సంవత్సరాల క్రితం, తిరుమల యాత్ర దుర్గమంగా ఉండేది. మార్గమధ్యంలో తరచుగా తారసపడే చిరుతలు, ఎలుగుబంట్ల వంటి క్రూర జంతువులను పారద్రోలటానికి డప్పులు వాయించేవారు; రాత్రులందు మంటలు కూడా వేసేవారు. దొంగల భయం అధికంగా ఉండడం చేత యాత్రికులు సమూహాలుగా మాత్రమే వెళ్లేవారు. భక్తులు లోయలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళపొదలు, క్రిమికీటకాలతో నిండిన అరణ్యమార్గంలో అత్యంత ప్రయాసతో సపరివార సమేతంగా ప్రయాణిస్తూ ; మధ్యలో వంటా-వార్పు చేసుకునే వారు. మధ్య మధ్యలో మంచినీటి కోసం దిగుడు బావులు, విశ్రాంతి తీసుకోవడానికి *'ఠాణాలు"* గా పిలువబడే మండపాలు ఉండేవి. ఎందరో మహారాజులు, జమీందార్లు వారి పేరు మీదా లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదా ఈ మంటపాలను నిర్మించి, *"మానవసేవే మాధవసేవ"* యని ఆనాడే చాటిచెప్పారు. అంగవైకల్యం కలవారిని, వయోవృద్ధులను పల్లకీలా ఉండే డోలీల ద్వారా కొండకు చేర్చడానికి ప్రత్యేకంగా కూలీలు ఉండేవారు. అందుకుగాను మనిషికి పది అణాలు, అంటే కేవలం 60 పైసలు, కూలి వసూలు చేసేవారు. ఈ డోలీలు నిలుపుకోవడానికి, ఆలయ సమీపంలో ఒక *"డోలీ మంటపం"* కూడా ఉండేది. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు *"డోలీ మంటపం బ్లాకు"* లేదా *"డి ఎం బి"* గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుండి సన్నిధివీధి మీదుగా వెళ్లి ఇప్పుడున్న క్యూ కాంప్లెక్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి దర్జాగా శ్రీవారిని దర్శించుకునే వారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*267 వ రోజు*


*మధ్యాహ్నానంతర సమరం*


మధ్యాహ్నం అయింది విరిగిన రథములు, చచ్చిన హయములు, రక్తపుటేరులతో రణభూమి భయానకంగా ఉంది. ఉభయ సైన్యములు పోరు సల్పుతున్నా మన సన్యంలో నైతిక బలంతగ్గుతుంది. వారిలో వారు " అయ్యో సుయోధనుని లోభత్వం, మూర్ఖత్వం వల్లనే ఇంతటి మారణహోమం జనక్షయం దాపురించింది. అసలు పాండవులను జయించగల వారు ఎక్కడినా ఉన్నారా ? " అని తమలో తాము తర్కించుకున్నారు. వారి మాటలను సావధానంగా వింటున్న సుయోధనుడు " వారి పనికి మాలిన మాటలు విననేల అనేకులు అనేక విధముల అనుకుంటారు. మనం యుద్ధం చేస్తాము రండి " అని అందరిని రణముకు ప్రోత్సహించాడు. ఆ సమయంలో భీమసేనుడు రణరంగంలో వీరవిహారం చేస్తూ శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. ఇంతలో భీమసేనుని రథం తెచ్చి సారథి నిలవగానే దానిని అధిరోహించి అత్యంత నిశిత శరములతో బాహ్లికుని రథము విరుగకొట్టాడు. చిత్రరధుడు చిత్ర విచిత్రమైన తన నిశిత శరములు ఉపయోగించి అభిమన్యుని చికాకు పెడుతున్నాడు. అభిమన్యుడు చిత్రరధుని రథము విరుగకొట్టి, సారథిని చంపి, రథాశ్వములను చంపాడు చిత్రరధుడు దుర్ముఖుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళారు. ద్రుపదుడు ద్రోణునిపై శస్త్రప్రయోగం చేసాడు. ఆగ్రహించిన ద్రోణుడు పదునైన బాణములు ప్రయోగించి ద్రుపదుని కవచము చీల్చాడు. ద్రోణుని ధాటికి తాళ లేక ద్రుపదుడు అక్కడి నుండి వెళ్ళాడు. సుశర్మ అర్జునితో యుద్ధం చేస్తూ అర్జునిని మీద కృష్ణుని మీద శరవర్షం కురిపించాడు. వాటిని మధ్యలో త్రుంచి అర్జునుడు క్రూరబాణములతో సుశర్మను తరిమి తరిమి కొట్టాడు. అతడి సైన్యం చెదిరి పోగా అర్జునిని ధాటికి ఆగ లేక సుశర్మ ససైన్యంగా వైదొలిగాడు. అది చూసిన భీష్ముడు అర్జునుని ఎదుర్కొని విజృంభించాడు. మధలో సాత్యకి భీష్ముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు. భీష్ముడు కోపించి శక్తి ఆయుధమును సాత్యకిపై విసిరాడు. శరీరం వంచి దానిని వడిసి పట్టి తిరిగి భీష్మునిపై విసిరి సింహనాదం చేసాడు. భీష్ముడు తన ఆయుధమును తానే త్రుంచి సాత్యకిపై పది పదునైన బాణములు వేసాడు. పాండవ సైన్యం ఒక్కుమ్మడిగా భీష్మునిపై పడింది. సుయోధనుడు దుశ్శాసనుడిని పిలిచి " దుశ్శాసనా ! తాత ఒంటరిగా పోరుతున్నాడు. శకునిని తీసుకుని సాయంగా వెళ్ళు " అన్నాడు. దుశ్శాసనుడు అలాగే వెళ్ళి శకునితో చేరి భీష్మునికి సాయంగా పాండవ సైన్యాలను కకావికలు చేస్తున్నారు. ఇది గమనించిన ధర్మరాజు నకులసహదేవులను అక్కడకు వెళ్ళమని చేయి ఊపాడు. నకుల సహదేవులు భీష్ముని ఎదుర్కొన్నారు. సుయోధనుడు పది వేల అశ్విక దళమును పాండవ సైన్యాలను ఎదుర్కొనమని పంపాడు. వారు పాండవ సేనలో చొరబడి విచక్షణ లేకుండా చంపసాగారు. అది చూసిన నకులసహదేవులు, ధర్మరాజు తమ వాడి శిలీకంతో గుర్రములను కొట్ట సాగారు. కాళ్ళు తెగి గుర్రములు పడి పోతూ రణరంమును బీభత్సం చేసింది. అశ్వసైన్యం అంతకంతకూ తరిగి పోయి సైనికులను లక్ష్యపెట్టక దిక్కు తోచక పరుగెట్టాయి. వాటి కింద పడి సైనికులు చనిపోసాగారు. అనేక హయములు రౌతులనుక్రింద వేసి చంపసాగాయి. అనేకులు తమ గుర్రాల క్రింద పడి మరణించారు. అశ్వదళము నశించగానే పాండవులు భేరి తూర్యనాదాలు చేసారు. ఇది చూసిన సుయోధనుడు " మద్రనరేంద్రా ! పాండవ సేనలు చెలియలి కట్ట దాటిన సముద్రంలా విరుచుకు పడి మనసైన్యాలను ఊచ కోత కోస్తున్నాయి. వాటిని నీవే ఆపాలి. శల్యుడు తన సేనలతో నకులసహదేవ, ధర్మనందనులను ముట్టడించి పెక్కు బాణములు వేసి వారిని నొప్పించాడు. అది చూసిన భీమార్జునులు శల్యునిపై విరుచుకు పడి శల్యునిపై బాణవర్షం కురిపించారు. ఇది చూసిన భీష్మద్రోణులు భీమార్జునులను ఎదుర్కొని వివిధ అస్త్రములను వేసి వారిని నొప్పించారు. సాయం కాలం అయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శివ మానస పూజ*

 *శివ మానస పూజ*


రత్నైకల్పిత మానసం 

హిమజలైః స్నానంచ దివ్యాంబరం

నానా రత్న విభుషితం 

మృగమదా మోదాంకితం చందనమ్

జాజీ చంపక బిల్వపత్ర రచితం 

పుష్పం చ ధూపం తథా

దీవం దేవ దయానిదే పశుపతే 

హృత్కల్పితాం గృహ్యతామ్


సౌవర్ణే మణిఖండ రత్నరచితే 

పాత్రే ఘృతం పాయసం

భక్షం పంచవిధం పయోదధియుతం

రంభాఫలం పానకం

శాకానామయుతం జలం, రుచికరం

కర్పూర ఖండోజ్జ్వలం

తాంబూలం మనసా మయా విరచితం

భక్త్యా ప్రభో సీకురు


ఛత్రం చామర యోర్యుగం వ్యజనకం 

చాదర్శకం నిర్మలం

వీణాభేరి మృదంగ కాహళకలా 

గీతం చ నృత్యం తథా

సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహూవిధా 

హ్యేతత్ సమస్తంమయా

సంకల్పేన సమర్పితం 

తవ విభో పూజాం గృహాణ ప్రభో


ఆత్మాత్వం గిరిజా మతిః సహచరాః 

ప్రాణాః శరీరం గృహం

పూజాతే విషయోప భోగరచనా 

నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః 

స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం 

శంభ తవారాధనమ్


కరచరణ కృతం వా

కర్మ వాక్కాయజం వా 

శ్రవణ నయనజంవా 

మానసం వాపరాధమ్

విహిత మవిహితం వా 

సర్వమేతత్ క్షమస్వవ

జయజయ కరుణాబ్దే 

శ్రీ మహాదేవ శంభో


              - ఆది శంకరాచార్యులు

కోరికలు కడలి వంటివి

 2🙏🕉️🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏       🔥 *కోరికలు కడలి వంటివి.. తీరం చేరిన అల చెదిరిపోతుందని తెలిసినా అలలు పుడుతూనే ఉంటాయి.. అలాగే కోరికలు కూడా.. ప్రమాధకరమైన కెరటం ఎలా బీభత్సం సృష్టిస్తుందో మితిమీరిన కోరికలు మనిషి జీవితం నాశనం చేస్తుంది* 🔥మనిషికి సంతృప్తి సహజ సంపద అయితే విలాసం కుత్రిమ దరిద్రం..మనసు అదుపు తప్పితే జీవితం దారి తప్పుతుంది.. మాట అదుపు తప్పితే బ్రతుకే దారి తప్పుతుంది..సమయం చెబుతుంది జాగ్రత అని..ఆహ్లాదం పంచే పకృతి సైతం హెచ్చరిస్తూ ఉంటుంది..హెచరికను  హేళన చేస్తే జీవితం నాశనం అవుతుంది తప్ప మిగిలేది ఏమి ఉండదు🔥క్రమశిక్షణ నుండే జీవితం తన విలువను పొండుతుంది.. కాబట్టి జీవితపు క్రమశిక్షణ అన్నది జీవితం కంటే చాలా అమూల్యమైనది..బంధాలను తప్పుగా వాడుకోకండి.. ఎందుకంటే బంధాలు ఎన్నో ఉంటాయి.. కానీ మంచి మనస్సు కలిగిన బంధం ఒక్కసారి వీడిపోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం🔥🔥మీ *అల్లoరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంకు ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారు కొత్తవారికి రాలిని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🕉️🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: సంజయఉవాచ


పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః

పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః(15)


అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః

నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ(16)


శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు.

అధర్మము చేసినవాడు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో𝕝𝕝  యదినాత్మనిపుత్రేషు నచేత్ పుత్రేషు నప్తృషు/* 

         *నత్వేవతు కృతో ధర్మః కర్తుర్బవతి నిప్పలః||* 


*తా𝕝𝕝 అధర్మము చేసినవాడు ఒకవేళ ఆ పాపమును తను అనుభవించకపోయినా తన కుమారుడుకానీ? మనువడుకానీ? తప్పక అనుభవించవలసి ఉంటుంది అంతేకానీ వ్యర్థముగా పోదు.... కావున తాత్కాలికముగా సుఖమును అనుభవించుటకుగానీ? దుఃఖమును తప్పించుకొనుటకు గానీ? అధర్మమును చేయరాదు...*


*పాపము చేయడం - అధర్మముగా ప్రవర్తించడం మానవలె.... కర్మఫలం తప్పించుకోవడం కుదరనిపని....*

 

✍️🪷🌷🌸🙏

కులతుపుజ శాస్తా ఆలయం

 🕉 మన గుడి : నెం 997


⚜ కేరళ  : కొల్లం


⚜ కులతుపుజ శాస్తా ఆలయం



💠 భాగవతం ప్రకారం, శివుడు మోహినీ రూపంలో ఉన్నప్పుడు విష్ణువుతో ప్రేమలో పడ్డాడు. 

 వారి సంబంధమే శాస్తా యొక్క జన్మకి  దారితీసింది.  శివునికి మరొక పేరు హర మరియు విష్ణువు యొక్క మరొక పేరు హరి కాబట్టి, పుట్టిన బిడ్డను హరిహరపుత్ర అని కూడా అంటారు. అయ్యప్ప శాస్తా అవతారమని నమ్ముతారు.



💠 శాస్తా ఆరాధన దక్షిణ భారతదేశపు ప్రాచీన చరిత్రలో భాగం.

దక్షిణ భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్తా ఆలయాలు ఉన్నాయి


💠 ఐదు శాస్తా ఆలయాలు విష్ణువు అవతారమైన పరశురాముడితో ముడిపడి ఉన్నాయని చెబుతారు.  కులతుపుజ, ఆర్యంకావు, అచ్చన్‌కోవిల్, శబరిమల మరియు పొన్నంబల్మేడులోని శాస్తా ఆలయాలు ఐదు శాస్తా ఆలయాలలో ఉన్నాయి


💠 కులతుపూజ శాస్తా ఆలయం కల్లాడ నదికి ఉపనది అయిన కులతుపుళ నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం.  

ఇది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని పునలూర్ తాలూకాలోని కులతుపుజలో ఉంది.  అక్కడి ప్రధాన దైవం బాలశాస్త రూపంలో ఉన్న అయ్యప్ప.  ఇది పంచ శాస్తా క్షేత్రాలలో ఒకటి మరియు కేరళలోని 108 శాస్తా క్షేత్రాలలో ఒకటి.  అక్కడ ఉన్న విగ్రహం పరశురామునిచే ప్రతిష్టించబడిందని నమ్ముతారు మరియు ఎనిమిది రాళ్లతో తయారు చేయబడింది. 

 ఈ ఆలయం కేరళ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

ఈ ఆలయాన్ని సాధారణంగా 'కులతుపూజ బాలకన్' అని పిలుస్తారు.


💠 ఇక్కడ దేవత ఉగ్ర మూడ్ (ఉగ్రమూర్తి) అలాగే శుభ మూడ్ (మంగళప్రదాయకం)లో ఉంటాడు.  శివుడు, యక్షి, విష్ణువు, గణపతి, బూతథాన్, నాగర్ మరియు కరుప్పస్వామి ఈ ఆలయంలోని ఇతర అధీన దేవతలు. 

 

💠 కులతుపుళలోని ఆలయ మూలం గురించిన ఆసక్తికరమైన పురాణం ఏమిటంటే, ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన రామేశ్వరం తీర్థయాత్ర నుండి తిరిగి వస్తున్న కల్లాడ నది ఒడ్డున విడిది చేసాడు, సేవకులలో ఒకరు వంట చేయడానికి కొంత రాయిని అమర్చారు.  రాయి స్థాయి సరిగా లేనందున, అతను విసుగు చెందాడు మరియు స్థిరమైన రాయిని మరొక రాయితో కొట్టాడు.  అకస్మాత్తుగా స్థిరమైన రాయి నుండి రక్తం కారింది.

 

💠 బ్రాహ్మణుడు వెంటనే ఇది దైవిక శిల అని గుర్తించి గాయపడిన వారిపై రామేశ్వరం నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని చల్లాడు.  ఇలా చేయడంతో రక్తస్రావం ఆగిపోయి ధర్మశాస్త వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.  వారిని ఆశీర్వదించిన తరువాత, అయ్యప్ప స్వామి ఆ ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించమని బ్రాహ్మణుడికి సూచించాడు.


💠 చుట్టుపక్కల అడవిలో జీవరాశులకు ఇబ్బంది కలగకుండా ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆయన ఆదేశించారు.  కొట్టారక్కర రాజు ఆదరణతో పర్యావరణానికి విఘాతం కలగకుండా నూతన ఆలయాన్ని నిర్మించారు.  నిజానికి ఈ రోజు వరకు, యాత్రికులు ఆలయం చుట్టూ ఉన్న జీవులకు ప్రత్యేక గౌరవం చూపుతారు.  


💠 ఈ ఆలయంలోని దేవత బాలశాస్త, ఆయనను మణికండ అని పిలుస్తారు.  ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మహిళలకు అనుమతి ఉంది.

ఈ ఆలయం ఇప్పుడు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ఆధీనంలో ఉంది.


💠 కులతుపుజై, అంటే "నది".  ఎప్పుడూ ప్రవహించే భగవంతుని అనుగ్రహానికి పేరు.  భగవంతుడు మనశ్శాంతి మరియు ప్రశాంత విశ్రాంతి కోసం ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు.  కానీ ఇక్కడ అతని ఉనికికి చాలా ప్రాముఖ్యత ఉంది.


💠 ఆలయ ప్రవేశ ద్వారం వద్ద, మంత్రముగ్ధులను చేసే నదిని ఎదుర్కొంటాము.  ఈ నది దాని పవిత్ర జలానికి మరియు చేపలకి ప్రసిద్ధి చెందింది.  ఆ  నదిలో చేపలకు ఆహారం అందించడం ఆలయంలోని ఒక ముఖ్యమైన ఆచారం.


💠 ఆలయ చెరువు అనేక చేపలను సంరక్షిస్తుంది, ఎందుకంటే అవి అయ్యప్ప స్వామికి ఇష్టమైనవిగా పరిగణించబడతాయి. 

 ఇక్కడ చేపలు పట్టడం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది.

ఈ ఆలయం మీనూట్టు (చేపల దాణా) నైవేద్యానికి ప్రసిద్ధి చెందింది.


💠 తనపై మోహాన్ని కలిగి ఉన్న ఒక జల కన్యక (మత్స్యకన్య)ను మందిర చెరువులో చేప రూపంలో నివసించడానికి శాస్త అనుమతించాడని కూడా నమ్ముతారు.  


💠 చర్మంలోని మొటిమలను నయం చేసేందుకు భక్తులు మీనూట్టు (చేపల దాణా)ని అందిస్తారు.  చేపలను తిరుమక్కల్ (దైవిక పిల్లలు) అని పిలుస్తారు.


💠 సేవకుడు పగలగొట్టిన అసలు రాయి రూపంలో సాస్తాను పూజిస్తారు.  ఇప్పుడు అలంకార నిమిత్తం పంచలోక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఆలయ ప్రాంతం విశాలంగా మరియు పెద్దది కానీ గర్భాలయం చాలా చిన్నది కానీ చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉంది.


💠 కులతుపుజ్హై అనాహత చక్రంతో అనుసంధానించబడి ఉంది, ఇది హృదయ కేంద్రం, ఇది ప్రత్యక్ష జ్ఞానం మరియు గ్రహణశక్తికి శక్తినిస్తుంది. 


💠 రైలు కొల్లాం రైల్వే స్టేషన్ ద్వారా సుమారు 58.8 కి.మీ.


రచన

©️ Santosh Kumar

12-12-గీతా మకరందము

 12-12-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ| కర్మఫలత్యాగము యొక్క విశిష్టతను నిరూపించుచున్నారు-


శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మఫలత్యాగః

త్యాగాచ్ఛాంతిరనన్తరమ్.


తా:- (వివేకముతో గూడని)అభ్యాసముకంటె (శాస్త్రజన్య)జ్ఞానము శ్రేష్టమైనది కదా! (శాస్త్రజన్య)జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము (ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనఃస్థితి) కంటె కర్మఫలమును విడుచుట (ప్రవృత్తియందును విషయదోషములేకుండుట) శ్రేష్టమైయున్నది. అట్టి కర్మఫలత్యాగముచే శీఘ్రముగ (చిత్త)శాంతి లభించుచున్నది.


వ్యాఖ్య: - ఇచట అభ్యాసమని చెప్పినచోట వివేకముతో గూడని అభ్యాసమనియు, జ్ఞానమని చెప్పినచోట శాస్త్రజన్యజ్ఞానమని, ధ్యానమని చెప్పినచోట అసంపూర్ణమగు ధ్యానమని, ధ్యానకాలమందు మాత్రము విషయదోషములేని స్థితియని, అనగా ధ్యానాభ్యాసియొక్క స్థితియని గ్రహించుకొనవలెను.


"జ్ఞానాద్ద్యానం విశిష్యతే"- "వాచా"జ్ఞానముకంటె అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది. జ్ఞానవిషయములను తదేకనిష్ఠతో చింతనచేయుటయే, అనుభూతమొనర్చుకొనుటయే ధ్యానము. కాబట్టి "వాచాజ్ఞానముకంటె,  శాస్త్రజన్యజ్ఞానముకంటె ధ్యానము గొప్పదని వచింపబడినది.


' ధ్యానాత్కర్మఫలత్యాగః'- కర్మఫలములను త్యజించువాని మనస్సు అసంగమై, విషయదోషము లేనిదైయుండును. ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మాత్రము చిత్తము నిర్విషయమైయుండును. త్యాగికి ఎల్లప్పడును అట్లేయుండును. కనుకనే ధ్యానము కంటె కర్మఫలత్యాగము శ్రేష్టమని చెప్పినారు. దీనిని బట్టి నిష్కామకర్మయోగమెంత మహిమ గలిగియున్నదో స్పష్టమగుచున్నది. జనులలో అధికులకు నివృత్తి కంటె ప్రవృత్తిసంస్కారమే ఎక్కువగ యుండియుండును. కాబట్టి అట్టివారు కర్మలనాచరించుచు కర్మఫలత్యాగమును చక్కగ అలవాటు చేసికొనినచో వారు ధ్యాన్యాభ్యాసికంటె, జ్ఞానాభ్యాసికంటె గొప్పస్థానమును బొందినవారగుదురు. మరియు భక్తికొఱకైనను, ధ్యానముకొరకైనను, జ్ఞానము కొరకైనను చిత్తశుద్ది చాల అవసరము. అదియో, నిష్కామకర్మయోగముచే, కర్మఫలత్యాగముచే లభించుచున్నది. కాబట్టి అద్దానిని చక్కగ అనుష్ఠించినచో మాత్రమే - పునాది గట్టిగనున్నచో పైనగల మేడయు సుస్థిరముగ నుండునట్లు - ధ్యాన, జ్ఞానాదులన్నియుకూడ చక్కగ అభివృద్ధి నొందగలవు. కనుకనే భగవాను డీశ్లోకమున నిష్కామకర్మయోగము (కర్మఫలత్యాగము) యొక్క ప్రాశస్త్యమును వెల్లడించిరి.


"త్యాగాచ్ఛాంతిరనన్తరమ్"-

 కర్మఫలత్యాగముచే, ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుటవలన వెంటనే శాంతి ఉదయించుచున్నది. కర్తృత్వత్యాగమువలననే, అహంభావత్యాగమువలననే, దోషత్యాగమువలననే, ప్రాపంచికవిషయసుఖత్యాగము

వలననే శాంతి లభింపగలదు. చిత్తమందలి దోషములు తొలగుటయే శాంతికి మార్గము, (తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్). ఏలయనగా నిర్మలచిత్తమున ఆత్మ ప్రత్యక్షము కాగలదు. దుఃఖభూయిష్ఠమగు ఈ సంసారమున ప్రతివాడును శాంతినే అభిలషించుచున్నాడు. కాని ఆ శాంతి యెట్లు లభింపగలదో తెలియజాలకున్నాడు. 'త్యాగాత్ శాంతిః = త్యాగము వలననే శాంతిచేకూరునని భగవాను డిచట స్పష్టముగ తెలియజేసెను. కాబట్టి విషయసుఖములను, కర్మఫలములను, మమత్వమును, అహంభావమును, కర్తృత్వమును, త్యాగముచేసి పరమశాంతిని జీవుడనుభవించవలెను.


ప్ర:- కర్మఫలత్యాగముయొక్క మహిమయెట్టిదో పేర్కొనుము?


ఉ:- అది (వివేకముతో గూడని)అభ్యాసము కంటెను, (శాస్త్రజన్య)జ్ఞానము కంటెను, (ధ్యాన కాలము మాత్రము నిర్విషయస్థితిగలిగియుండు)ధ్యానముకంటెను శ్రేష్టమైనది.


ప్ర:- శాంతి యెట్లు లభించును?

ఉ:- (కర్మఫల)త్యాగముచే.

తిరుమల సర్వస్వం 126-*

 *తిరుమల సర్వస్వం 126-*

 శ్రీవారి సంవత్సర సేవలు 1* 



 *ఉగాది ఆస్థానం*


 తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సరపు తొలిరోజైన ఉగాది నాడు, సందర్భోచితంగా తెలుగువారి కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరునికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. తిరుమలేశుని వార్షికోత్సవాలు, ఉత్సవాలు అన్నీ ఉగాది తోనే మొదలవుతాయి.


 ఉగాది పర్వదినాన ప్రాతఃకాల మందు, నిత్యసేవలైన సుప్రభాతసేవ, తోమాలసేవ యథావిధిగా పూర్తయిన తరువాత; ఉభయ దేవేరుల సమేతుడైన శ్రీమలయప్పస్వామి వారికి, సేనాపతి విష్వక్సేనులవారికి ఏకాంతంగా తిరుమంజనం జరుపబడుతుంది. తరువాత, బంగారువాకిలి ముందున్న మహామణిమంటపంలో గరుడాళ్వార్ కు ఎదురుగా స్వర్ణకాంతులీనే సర్వభూపాల వాహనం లో శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు. పట్టు పీతాంబరాలతో, కిరీటాలతో, సర్వాభరణాలతో, పరిమళ భరితమైన పూలమాలలతో ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరిస్తారు. మలయప్పస్వామికి ఎడమవైపున మరో పీఠంపై దక్షిణాభిముఖంగా విష్వక్సేనులవారు ఆసీను లవుతారు. గర్భాలయంలోని మూలమూర్తికి, మిగిలిన ఉత్సవమూర్తు లందరికీ అన్నప్రసాదాలు నివేదించ బడతాయి. తదనంతరం, జియ్యంగార్లు, వారి పరిచారకులైన ఏకాంగులు, అధ్యాపకులు, అర్చకులు, వేదపండితులు వేదపారాయణం చేస్తారు. పెద్దజియ్యంగార్ మూలవిరాట్టు అలంకరణ నిమిత్తం ఒక వెండిపళ్లెంలో ఆరు పట్టువస్త్రాలను అర్చకులకు అందజేస్తారు. తరువాత అర్చకులు స్వామివారికి బంగారుపళ్లెంతో పచ్చ కర్పూర హారతినిచ్చి, అధికారులకు తీర్థ-చందనాదులను అందజేస్తారు. మరో రెండు పట్టు వస్త్రాలను బంగారువాకిలి కెదురుగా ఉన్న మలయప్పస్వామి వారికి, విష్వక్సేనులవారికి ఒక్కొక్కటి చొప్పున అలంకరిస్తారు. 


 అనంతరం శ్రీవారి పాదపద్మాల పైనున్న పంచాంగాన్ని చేతిలోనికి తీసుకొని, ఆస్థానసిద్ధాంతుల వారు శ్రీవెంకటేశ్వరునికి నూతన పంచాంగశ్రవణం చేయిస్తారు. తరువాత, నూతన సంవత్సర ఫలాలను; అన్ని నక్షత్రాల వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలను, నిష్పత్తులతో సహా వివరిస్తారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం గురించి వివరించి, భక్తులందరినీ కాపాడ వలసిందిగా నవగ్రహ దేవతలను ఆదేశించమని; విశ్వమంతా సస్యశ్యామలంగా, అతివృష్టి అనావృష్టి వంటి ఈతి బాధలు లేకుండా చూడమని శ్రీవారిని ప్రార్థిస్తారు. తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా నక్షత్ర ఫలితాలు చెప్పి తీర్థ ప్రసాదాలు నివేదిస్తారు


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*265వ రోజు*

* తొమ్మిదవ రోజు యుద్ధారంభం*

తొమ్మిదవ రోజు యుద్ధానికి కౌరవ సేన సర్వతోభద్ర వ్యూహమున నిలిచారు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కురుకుమారులు, భీష్మునితో వ్యూహం ముందు భాగంలో ఉన్నారు. ద్రోణుడు, భూరిశ్రవసుడు, భగదత్తుడు అతడి కుడి వైపున సోమదత్తుడు, అశ్వత్థామ, విందాను విందులు ఎడమ వైపున శ్రుతాయువు వెనుక వైపున త్రిగర్తాధీసునితో సుయోధనుడు మధ్యభాగమున నిలిచారు. ఈ వ్యూహము చూసి ధర్మరాజు " ధృష్టద్యుమ్నా ! తాత భీష్ములు పన్నిన వ్యూహమును చూసావు కదా మనం ఈ రోజు శిఖండిని ముందుంచి అతనికి సాయంగా మనం నిలిచి పోరాడవలెను. అందుకు అనువైన వ్యూహ రచన చేయుము " అన్నాడు. సాత్యకి, విరాటుడు కుడి వైపున , అభిమన్యుడు, పాంచాల కేకయ రాజులు ఎడమ వైపున కుంతి భోజుడు వెనుక వైపున, యుధిష్టరుడు, నకులసహదేవ , ద్రౌపదీ పుత్రులతో మధ్యభాగమున నిలిచారు. శిఖండిని ముందు నిలిపి అతడికి ఒక వైపున ఘటోత్కచుడు, భీమసేనుడు నిలువగా అర్జునుడు వేరొక వైపు నిలువగా సకల యోదులు వారికి రక్షణగా నిలువగా ధృష్టధ్యుమ్నుడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భేరి నినాదములు, శంఖముల పూరింపుల శభ్దాలు మిన్నంటుతుండగా యుద్ధం మొదలైంది.


*అభిమన్యుని పరాక్రమం*


అభిమన్యుడు కౌరవ వ్యూహంలోకి చొచ్చుకొని పోయి దూదిని నిప్పంటుకున్నాట్లు కౌరవ వీరులను మట్టు పెడ్తుతున్నాడు. తన రధమును గుండ్రంగా తిప్పుతూ ద్రోణా, కృపాచార్య, సైంధవులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది చూసి సుయోధనుడు అలంసుని పిలిచి " అలంబసా ! చూసావా అభిమన్యుడు చిచ్చెర పిడుగులా విజృంభిస్తున్నాడు. వాడిని ఎదుర్కొనగలిగిన వాడివి నీవే నీవే వాడిని చంపాలి " అన్నాడు. అలంబసుడు తన రాక్షస మూకతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారి ధాటికి పెను గాలికి ఎండుటాకుల వలె పాండవ సైన్యం కకావికలైంది. ఇది చూసి ద్రౌపదీ సుతులు అభిమన్యునికి సాయంగా వచ్చి రాక్షసులను హతమారుస్తున్నారు. కోపించిన అలంబసుడు పాండవ కుమారులపై శరవర్షం కురిపించారు. ద్రౌపదీ సుతులు అలంబసునిపై జడివానలా బాణములు కురిపించారు. ఆ బాణముల ధాటికి అలంబసుడు తెలివి తప్పి మరు క్షణంలో తేరుకుని ద్రౌపతీ సుతులపై పుంకానుపుంఖాలుగా బాణములు గుప్పించి వారి విల్లులు, కేతనములు విరిచి ఒక్కొక్కరిపై అయిదు బాణములు వేసాడు. సోదరుల అవస్థ అలంబసుని విజృంభణ చూసిన అభిమన్యుడు అలంబసునిపై అతి క్రూరమైన నారాచ బాణములు ప్రయోగించాడు. మిగిలిన వారు అలంబసుడు మాయావిధ్యా ప్రవీణుడు అభిమన్యుడు దివ్యాస్త్ర సంభూతుడు వీరిరువురి యుద్ధం ఎంత రసవంతరమో అని చూస్తున్నారు. అభిమన్య అలంబచులు దేవేంద్ర వృత్తాసురుల వలె యుద్ధం చేస్తున్నారు. అలంబసుడు తన మాయాశక్తితో రణభూమిని అంధకార బంధురం చేసాడు. అభిమన్యుడు భాస్కరాస్త్ర ప్రయోగంతో ఆ చీకట్లను పటాపంచలు చేసాడు. అలంబసుడు అనేక మాయలు చేయగా అభిమన్యుడు వాటిని అన్నిటినీ తిప్పి కొట్టాడు. అభిమన్యుని శస్త్రధాటికి తాళలేక అలంబసుడు రథం దిగి పారిపోయాడు. అలంసుడు పారి పోగానే అభిమన్యుడు విజృంభిస్తూ కౌరవ సేనలో చొచ్చుకు పోయి ఊచ కోత కోయడం మొదలుపెట్టాడు. కౌరవ సేనలు అభిమన్యుని ధాటికి గజగజలాడాయి. అది చూసి భీష్ముడు అనేక మంది రథికులతో అక్కడికి చేరి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు జంకక అనేక రూపములతో వీరవిహారం చేస్తున్నాడు. అది గమనించిన అర్జునుడు కుమారుని పరాక్రమానికి సంతసింస్తూ భీష్ముని ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*