1, ఏప్రిల్ 2021, గురువారం

చీమ మిడత కథ

 *చీమ మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది* .


ఒరిజినల్ కథ :


ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని  తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .


ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :


చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .

మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను  ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు  ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది . 

NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 ,  మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని ,  అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది . 

విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .

రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు . 

ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి  తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .

.

.

జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .

.

.

.

కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .

.

.

.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .

.

.

.

మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .


Hats off to the Great Democratic India..


*_సోమరిపోతులకకి_* ,

*_బిక్షగాళ్ళ తయారీకి_* 


*_కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు  ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు._*


*_అన్నీ ఉచితం ! అంతా ఉచితం !_*

✍🏻

45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,


45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.


*_ఇంక జీవితంలో లేదు టెన్షన్,_*

.

ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్


రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు


నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,


చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !


పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.

.

అంతా బాగానే ఉన్నది !

భూతల స్వర్గం భారతదేశం !


కానీ

.

అన్నపూర్ణ క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?


రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?


ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?

.

వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.


*5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??*


*పండుగలకు బహుమతి అడిగారా??*


లేదు 


*నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.*


*రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.* 


కానీ


అవి కాకుండా ఇదేమి విచిత్రం.


అసలు మనం ఎటు పోతున్నాం.


అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?

.

ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !

.

*వ్యవసాయానికి కూలీలేడు* 

*కొట్లోకి గుమాస్తా దొరకడు !*


పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.

.

*మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి* ! 


కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !


అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???


.

*_ఎవరికి ఉచితమివ్వాలి_*?


*పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు* *అభాగ్యులకు.*

*వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను* *రూపొందించండి*.

.

అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


*పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,*

🙏🙏🙏🙏

*_ఆలోచించండి.... ప్రజలారా-*🙏🙏🙏🙏

Sri గాయత్రీ april

 https://drive.google.com/file/d/1-MuNUykBwMp4AtkCtWX3WtRQhm_UHrdm/view?usp=drivesdk

Good news

 Good news

After all, someone started something…

VHP has opened a helpline for 'stranded in trouble' Hindus ...

On the very first day 85000 calls have come ....

If a 'Muslim boy' is harassing a Hindu girl, then how to protect her ... It is also being given ..


A team of about thirty thousand workers is ready round the clock to help any Hindu.


Praveen Togadia says,

"This helpline was started with the aim of increasing fraternity among Hindus. Its purpose is to give information about Hindutva as well as to provide legal and other help to the Hindus who are in trouble in an unknown city. We immediately give the collars. Let's try to help. "


Deepak Kumar, Coordinator of New Delhi's Hindu Helpline, says, "All the calls that come here are important.


A Gurgaon-based caller sought help to save his daughter from Muslim youth.

He said that a group of Muslim boys were harassing their daughter. "

Praveen Togadia ji, at least now you have the courage to do something for Hindus at the ground level ..

thanks for this!!


Note friends number

And distribute among Hindu siblings ..

020 668 03300

075 886 82181


Ajay Shri Ram, Dr. Shyama Prasad Mukherjee National Thought Forum New Delhi India मंच


Sincerely: Omprakash Sharma

వడదెబ్బ నివారణా యోగాలు -

 వడదెబ్బ నివారణా యోగాలు  -


 *  ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.


 *  వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.


 *  నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.


 *  వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.


 *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.


 *  విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.


 *  48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.


 *  తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.


 *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .


 *  చన్నీటితో స్నానం చేయించవలెను .


 *  వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .


        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.


         మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి . మరిన్ని సులభయోగాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మామిడికాయ పచ్చడి*

 *మామిడికాయ పచ్చడి*   

             ( *కాశీ*)

            🌷🌷🌷

పదకొండేళ్ళ క్రితం,  పేరుకి హైదరాబాద్ అయిన ఒక మారుమూల ప్రదేశం లో నా కాస్తార్జితం (కష్టార్జితం) పోసి కట్టాను ఇల్లు. 

"చచ్చిపోతున్నాను, ఈ ఎండుటాకులు, చెత్త వూడవలేక రోజూ.  మీకే మీ పాటికి చెట్లు పాతేసి చక్కా కూర్చున్నారు. " వూడ్చుకుంటూ విసుక్కుంది మా ఆవిడ.

" పనిమనిషిని పెట్టుకోవే బైట పనికి ఆని వెయ్యిసార్లు చెప్పాను." భయం భయం గానే అన్నాను నేను. 

" అవును , ఉన్న ఇద్దరికీ పనిమనిషి కూడా తోడైతే ఇంకా పోత్రాల్లా ఊరి పోతాం" ఉరిమింది.

"ఏవేవ్ ! ఇందాక పైన వాకింగ్ చేస్తూ చూసా, జామకాయలు ఓ నాలుగు పండాయి." అన్నా, టాపిక్ మారుద్దామని ప్రయత్నిస్తూ.

"సరే నిచ్చెన తెండి! కోస్తాను" అంది మా ఆవిడ. 

ఏమన్నా బాలా కుమారి అనుకుంటున్నారేమో మా ఆవిడ నాకంటే ఏడాదిన్నర చిన్న. ఇంకో మూడేళ్ళల్లో 50 యో పడిలో పడుతుంది. 

సరే నేను ముందు సపోటాలు కోస్తాను తరువాత కిందకి వస్తా అని చెప్పి సపోటాలు కొయ్యడం మొదలెట్టాను. 

"ఇప్పుడే వెనకంతా ఊడ్చాను, మళ్ళీ సపోటా ఆకులు పోశారు వెనకంతా"  నీలిగింది మా ఆవిడ. 

"ఉండవేవ్ ! మావిడి కాయలు రెండు తగ్గాయి. ఎవడో కోసేసి నట్టున్నాడు చూడు. "

"అవునండి. అక్కడ రెండు కాయలు ఉండాలి. లేవు. కింద పడ్డాయేమో చూడండి" అంటూ చెట్టు  గట్టెక్కింది మా ఆవిడ కూడా గొడవతల చూస్తూ. 

"అందుకే చెప్పాను కోసేద్దామని, విన్నావు కాదు. పెద్దవవుతాయ్ అంటూ కూర్చున్నావ్." అంటూ విజృంభించాను నేను.  మా ఆవిడ మీదకి కాదు లెండి చెట్టుమీదకి. 

ఇంతలో మా ఆవిడ స్నానానికి వెళ్లింది. 

అదే అదనుగా ఒక పాతికకాయ చిన్నవి, పెద్దవి కోసేశాను. అన్నీ జాగ్రత్తగా సద్ది మామిడికాయలు, జామకాయలు, సపోటాలూ అన్నీ ఫోటోలు తీసి కూర్చున్నాను. 

కోసినంతసేపు పట్టలేదు మా ఆవిడకి పంచెయ్యడానికి. దానికి, మా అమ్మకి ఇంట్లో సరుకు ఉంటే కంగారూ వచ్చేస్తుంది. అసలే మా కాలనీ లో మన పేరు "ఆవిడ గారి ఆయన". ఆ చివర ఆకువడల వాళ్ళ దగ్గరనుండి మొదలు పెట్టి ఈ చివర ఆరటి కాయల వాళ్లవరకు అన్నీ మా ఆవిడకి ఇచ్చి పుచ్చు కోవడాలే. ఏవిటో నాకు వాళ్లిచ్చే పదార్ధాల పేర్లే కానీ వాళ్ళ పేర్లు గుర్తుంది చావవు. 

ఒకసారి అదే కొంప ముంచింది. వచ్చినావిడని చూసి అలవాట్లో పొరపాటుగా " ఏవేవ్ ఆ ములక్కాడలావిడ వచ్చింది " అన్నాను చిన్నగా. అంతే ఆవిడ వెళ్ళాక మా ఆవిడ సహస్రనామం అందుకుంది, "ఇంటికి ఎవ్వరిని రానివ్వరా" అంటూ. 

నిజానికి ఒక వయసు వచ్చేసరికి పిల్లలకి రెక్కలు వచ్చేస్తాయి. అప్పుడు అందరి ఇళ్ళల్లోనూ " మిథునం" సినిమానే నడుస్తుంది. 

వయసులో ఉన్నప్పుడూ పెద్దగా నిండుగా అనిపించిన ఇల్లు, వయసైపోయాక ఖళీగా, మరీ పెద్దగా  కనిపిస్తుంది. ఇంకా ఈ చెట్లు, ఆ కాయలు, మా తీర్థ యాత్రలు దీనితోనే గడిపెయ్యలి. ఎదురుచూస్తూ. 

నాన్నగారు ఎప్పుడు త్వరగా వెళ్ళి పోవాలని, లేక అలాంటి మాటలు కానీ అనేవారు కాదు. ఎప్పుడు ఆయన ఆలోచన భవిష్యత్తు లో మేము ఏంచేయాలో అనే ఉండేది. ఆయన ఆలోచనలని మా మీద ప్రేమ కప్పెసింది. అమ్మ అంటువుండేది, త్వరగా వెళ్ళి పోవాలని, అది పోయేముందు ఒక రెండు మూడు సంవత్సరాలనుండి. 

ఇంతవరకు శంకరాచార్యుడి లా తన నిర్యాణం ని ఒక ప్రణాళికతో అమలు పరిచిన వాళ్ళని చూడలేదు, కానీ కాశీ లో ఉండాలని ఉంది. 

ఇలా అన్నానంటే, వెంటనే మా ఆవిడ అంటుంది "ఇంతకంటే కాశీ ఎందుకండి, రెండు కిలో మీటర్లు నడిచి వేడితే కానీ మనిషి కనపడని చోటులో కట్టారు మన ఇల్లు" అని. 

ప్రస్తుతానికి మావిడికాయ పప్పు, కొబ్బరికాయ (ఇవి మా ఇంట్లోవే నండోయ్ కాకపోతే మా వూళ్ళో ఇల్లు ఉంది, అక్కడవి). మామిడికాయి పచ్చడి, పొన్నగంటి కూర (ఇది ఇంట్లోడే నండోయ్, ఒక నెల క్రితం సంత లో కొన్న కూర కాడలు పాతితే వచ్చింది.) తో భోజనం తిని. అల్పాహారంగా ఓ జామకాయ ముక్క కడుపులో పారేసి నడుం వాలుద్దామా అన్నంతలో, మా ఆవిడ అంది "మరి కాశీ అన్నారు" అని. 

"వెడదాం, వెడదాం , రాత్రికి మావిడికాయ పచ్చడి వుంచావా" అని ఆరా తీస్తూ నిద్రలోకి జారుకున్నా.

Symptoms,,, COVID-19

 *WE WILL NOT BE ABLE TO TAKE THE 2ND PHASE OF LOCKDOWN...*


*COVID-19 CRUCIAL INFORMATION*


◉ Due to the collapse of the health system, we, the health professionals, have prepared this message for the people, in case you do not want to risk going to the hospital immediately;

  __________

  ◉ Symptoms appear from the third day after infection (viral symptoms).

   ➙ 1st phase;

  ◉ Body pain

  ◉ Eye pain

  ◉ Headache

  ◉ vomiting

  ◉ Diarrhea

  Runny nose or nasal congestion

  ◉ Decomposition

  ◉ Burning eyes

  ◉ Burning when urinating

  ◉ Feeling feverish

  ◉ Scuffed throat (sore throat)

  ➙ It is very important to count the days of symptoms: 1st, 2nd, 3rd.

  ◉ Take action before the onset of fever.

  ◉ Be careful, it is very important to drink plenty of fluids, especially purified water.  Drink plenty of water to keep your throat moist and to help clear your lungs.

  __________

  ➙ 2nd phase;  (from 4th to 8th day) inflammatory.

  ◉ Loss of taste and / or smell

  ◉ Fatigue with minimal effort

  ◉ Chest pain (rib cage)

  ◉ Tightening of the chest

  ◉ Pain in the lower back (in the kidney area)

  __________

  ➙ The virus attacks nerve endings;

  ◉ The difference between fatigue and shortness of breath:

  • _Lack of air is when the person is sitting - without making any effort - and is out of breath;

  • Fatigue is when the person moves around to do something simple and feels tired.

  __________

  ➙ It takes a lot of hydration and vitamin C.

  __________

  Covid-19 binds oxygen, so the quality of the blood is poor, with less oxygen.

  __________

   ➙ 3rd phase - healing;

  ◉ On day 9, the healing phase begins, which can last until day 14 (convalescence).

  ◉ Do not delay treatment, the sooner the better!

  __________

  ➙ Good luck everyone!

  It is better to keep these recommendations, prevention is never too much!

  • Sit in the sun for 15-20 minutes

  • Rest and sleep for at least 7-8 hours.

  • Drink 1 and a half liters of water per day

  • All food should be hot (not cold).

  ➙ Keep in mind that the pH of the coronavirus ranges from 5.5 to 8.5.

  So all we have to do to eliminate the virus is to eat more alkaline foods, above the acid level of the virus.

  As;

  ◉ Bananas, Lime → 9.9 pH

  ◉ Yellow lemon → 8.2 pH

  ◉ Avocado - pH 15.6

  ◉ Garlic - pH 13.2

  ◉ Mango - pH 8.7

  ◉ Mandarin - pH 8.5

  ◉ Pineapple - 12.7 pH

  ◉ Watercress - 22.7 pH

  ◉ Oranges - 9.2 pH

  __________

  ➙ How do you know you have Covid-19 ?!

  ◉ itchy throat

  ◉ Dry throat

  ◉ Dry cough

  ◉ High temperature

  ◉ Difficulty breathing

  ◉ Loss of smell and taste

  __________

  DO NOT keep this information just for yourself, give it to all your family and friends.

W E   C A R E

As received


*Important Message for all* 


The hot water you drink is good for your throat. But this corona virus is hidden behind the paranasal sinus of your nose for 3 to 4 days. The hot water we drink does not reach there. After 4 to 5 days this virus that was hidden behind the paranasal sinus reaches your lungs. Then you have trouble breathing.

That's why it is very important to take steam, which reaches the back of your paranasal sinus. You have to kill this virus in the nose with steam.

At 50°C, this virus becomes disabled i.e. paralyzed. At 60°C this virus becomes so weak that any human immunity system can fight against it. At 70°C this virus dies completely.

This is what steam does. 


One who stays at home should take steam once a day. If you go to the market to buy vegetables, take it twice a day. Anyone who meets some people or goes to office should take steam 3 times a day.

                                  


 *Steam week* 

According to doctors, Covid -19 can be killed by inhaling steam from the nose and mouth, eliminating the Coronavirus.  *If all the people started a steam drive campaign for a week,* *the pandemic will soon end*. So here is a suggestion: 

* Start the process for a week morning and evening, for just 5 minutes each time, to inhale steam.  If all adopt this practice for a week  the deadly Covid-19 will be erased.

This practice has no side effects either.

 So please send this message to all your relatives, friends and neighbours, so that we all can kill this corona virus together and live and walk freely in this beautiful world.


 *@ V5 News Thank you*


You are welcome to send this to your known groups / friends.

గుడికెందుకెళ్ళాలి

 గుడికెందుకెళ్ళాలి?


సేకరణ:జి.కామేశ్వరి.


*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*

 

*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*


*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి  గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది ప్రదక్షిణ చేస్తున్నారు.* *ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు. దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో, ప్రతి వారం గుడిలో ఉండే పూజారిగారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు.*


*అమ్మ వెళ్ళమంది అని గుడి కి రావడం మొదలుపెట్టినా,గుడి కి వచ్చిన ప్రతిసారీ ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది.*


*కాని నా మెదడు లో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి, ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారి లాగే ఆ ప్రశ్నల ప్రవాహం లో, ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.*


*ఇంతలో గుడి లో నేను ఎప్పుడు చూడని పూజారి గారు ఒకరు, నన్ను చూసి,నవ్వి,నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడి లో చూడలేదుకదా అన్న సందేహం తో కూడిన ఒక నవ్వు నవ్వాను.*


*కొత్త పూజారి గారు: నిన్ను ఈ గుడి లో చాలా రోజులనుంచి చూస్తున్నాను బాబు. కాని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఏమన్నా ఉంటే చెప్పు పర్లేదు.*

*నేను ఎప్పుడూ చూడని వ్యక్తి నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మోహం మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి*


*నేను: అబ్బే అలాంటిది ఏమి లేదండి.*


 *కొత్త పూజారి గారు: మధ్యాహ్నం నైవేద్యానికి, గుడి మూయడానికి ఇంకా సమయం ఉంది బాబు.* *పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో. నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను.*


*ఎందుకో నాకున్న సందేహాలు అన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.*

*నేను: పెద్దవాళ్ళు,గుడి కి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి. నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.*


*కొత్త పూజారి గారు: (గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరు లో ఉన్నావు. కాని ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుషా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను.*


*భగవంతుడిని నాన్న అమ్మ తో పోల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.*


*నేను: భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడి కి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరు ?*

*కొత్త పూజారి గారు: నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరం గా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్ లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా?కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.*


*నేను: కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా?*

*కొత్త పూజారి గారు: నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందం లో మీ కుటుంబ సభ్యులకి ఏదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఏదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వేెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ కృష్ణుడు.*


*నేను: ఏదైనా పని మొదలు పెట్టే ముందు, దేెవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దేవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఎమంటారు?*


*కొత్త పూజారి గారు: నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి, నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ,ఏకాగ్రతతో ఆలోచించి,పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ,నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా?నిజానికి కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకాగ్రతని పెంచి, నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్దాయి అంతే. దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేది కాదంటావా?*


*నేను: మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు?*

*కొత్త పూజారి గారు: మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమా కి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీదు వెధవకి అని కోపం తో తిడతారా లేదా ? అలా ప్రేమగా కోప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!! మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?*


*ఇవన్నీ విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.*


*తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వం తో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.*


*ఆ కొత్త పూజారి గారిని కలవాలి అనిపించి, ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడి కి వెళ్లాను కానీ ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతి వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను.*


*నేను: పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండీ, ఆయన సాయంత్రం రాలేదా ?*


*గుడిలో ప్రతి వారం వుండే పూజారి గారు: కొత్త పూజారి గారా ? ఎవరు బాబు ? పొద్దున్న కూడా నేను ఒక్కడినే ఉన్నాను బాబు గుడిలో నాతో పాటు ఇంకో పూజారి ఎవరు లేరు బాబు.*


*నేను: లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా.*

*అని అంటూ, ఆగిపోయాను నేను. నైవేద్యానికి సమయం ఉందని అన్నారు కానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా.*


*ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, నాకేమి అర్ధం కాలేదు, అలా కూర్చుండిపోయాను. ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడాను.*


*అమ్మ: ఏరా ఏం చేస్తున్నావు ? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము, నువ్వు భోజనం చేసావా ? పొద్దున్న గుడి కి వెళ్ళొచ్చావా ?*

 *నేను: హా.. పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా ..!!!*


*సేకరణ* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పిల్లలు~దేవుడు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

  *  

                🌷🌷🌷

🛑 *పిల్లలు~దేవుడు!*


*"అనగా అనగా ఒక ఊరిలో,"* అంటూ కథ ప్రాంభించబోయాడు శ్రీపతి. 


మనుమడు మారాము చేస్తుంటే, నన్ను కథ చెప్పమని వాళ్ళ నాయనమ్మ నాకు పురమాయించింది.


"నువ్వు చెప్పొచ్చు కదా? నువ్వయితే వాళ్లకు కావలసినట్టు చెప్తావు"


"నాకు వీలవకే మీకు చెప్పాను ఈ రోజు"


"ఎవరో ఒకరు చెప్పండి, తొందరగా" మనుమడి మారం!


"ఏమిటో ఆ తొందర?"

అనుకుంటూ పునః ప్రాంభించేను కథను.


" ఆ అనగా అనగా తీసెయ్యి . తరువాత చెప్పు" కొంచెం చిరాకు ధ్వనించింది స్వరంలో,

నిద్ర వస్తున్నట్టు వుంది. మళ్ళీ ప్రొద్దునే లేవాలి -స్కూల్ కూడా ఉంది.


"అలాగే చెప్తున్నాను, ఒక్కసారి బాత్రూం కెళ్ళి వచ్చేస్తాను.

మా బంగారం కదూ?"


"బంగారం కాను, కథ చెప్పూ"


జవాబు చెప్పకుండా నేను బాత్రూంకి వడిగా అడుగులు వెసుకుంటూ వెళ్ళాను.


తాపీగా నేను బయటికి వచ్చి- కథ ఎటు తిప్పి ఎటుచెప్పాలి, అని ఆలోచిస్తూ వచ్చేసరికి పిల్లవాడు నిదురపోయాడు.


" అరే -కథ చెప్పమన్నాడు, పాపం నిద్రపోయాడు" 

అనుకుంటూ నేనూ నిద్రలోకి జారుకున్నాను.


మర్నాడు శ్రీపతి నిద్ర లేచేసరికి - మనుమడు స్కూల్ కి వెళ్ళిపోయాడు. 

కొడుకు -కోడలు ఆఫీస్ కి వెళ్ళాలి కదా ! వాళ్ళ పనుల్లో వారు బిజీ గా ఉన్నారు.


శ్రీపతి భార్య పూజ అపుడే 

ముగుంచుకుని కనపడింది.

" రాత్రి కథ బాగానే చెప్పారు." 

నా మీద ఒక కామెంట్ పారేసింది. 


"నేనూ"

"సరే ముందు కాఫీ త్రాగండి!"


శ్రీపతి ఆలోచిస్తున్నాడు. శ్రీమతి గారి ఈ వ్యంగ్య బాణం ఏమిటో అని.

తరువాత తాపీగా అడిగాను,

"మనుమడు స్కూలు కి వెళ్లేముందు లేచావా? "


"అవును .. లేకుంటే నా పూజా పునస్కారం ఇంత వేగరం 

అయ్యేదా?


ఆ వ్యంగ్యాస్త్రం గురుంచి ప్రస్తావిద్దామని చూస్తున్నాను .


"ఇంతకీ మనుమడు ఏమి చెప్పేడేమిటి?


"ఏమంటాడు వాడు స్కూలు కెళ్లే తొందర. నేనే అడిగాను. 

ఏరా ! తాత కథ ఎలా ఉంది అని"


" బాగుంది మామ్మా, కొత్త రకంగా, మా స్కూల్లో విషయాలూ అన్ని కలిపి చెప్పారు" అన్నాడు.


నేను అవాక్కయ్యాను. 

ఏ కథ-నేను చెప్పలేదు. 

అలా అన్నాడేమిటి అని అలోచిస్తున్నాను .


" ఏమిటీ అలా ఉండిపోయారు. ఇంతోటి కథ మీరే చెప్పానని 

సంబడమా !"


"అదే తమాషాగా వుంది. నేను కథ చెప్పే లోపలే నిద్రయేయాడు. మరి నేను కథ చెప్పేనంటున్నాడేమిటి?"


"అవుతే మీరు కథ చెప్పలేదూ ? విడ్డురంగా వుందే"


పసి వాడు అసత్యం చెప్పడు. మరి ఈ తమాషా ఎమిటో అనుకుంటూ చతికిల పడిపోయాము.


అనుకోకుండా ఎదురుగా

వున్న పూజా గది వైపు ఇద్దరి చూపులు వెళ్లాయి. 


కొంటె కృష్ణుడు నవ్వుతున్నట్టు అనిపించింది. అంటే ? నా బదులు ఆ కృష్ణుడు వచ్చి పసివాని కోరిక తీర్చాడా?" 

మతి పోతున్నట్టు అనిపిస్తుండగా-


 -ఎక్కడో దూరంనుండి 


పాత సినిమాలో పాట వినిపిస్తోంది- 


" పిల్లలూ దేవుడూ చల్లని వారే--

కల్లకపటమెరుగని కరుణామయులే"

●●

లక్ష్మీనాథ్

🥀🌻🥀

ఏకలవ్వే

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

            *ఏకలవ్వే*  

      (ప్రభాకర్ పెదపూడి)

              🌷🌷🌷

 “ఒరే! గోపాలం, ఎక్కడికి అలా పరిగెడుతున్నట్లుగా వెడుతున్నావు” అరుగుమీద కూర్చున్న బామ్మ అడిగింది. “ఆ! ఏముంది బామ్మగారూ, బాధలండీ బాధలు మనిషన్నవాడికి కాకుండా పశువులకి వస్తాయా, నా తోడల్లుడు కాకినాడ భానుగుడి దగ్గర చెడా మడా ఆడపిల్లలవైపు చూస్తూ నడుస్తూ పక్కనేఉన్న మురికి కాలవలోపడి కాలూ చేయి పుటుక్కున విరక్కొట్టుకున్నాట్ట. చూడక చస్తానా వెడుతున్నాను, వచ్చేటప్పుడు ఏమైనా తెమ్మంటారా ద్రాక్షపళ్లూ, దానిమ్మకాయల్లాంటివి “ ముక్కుపొడెం డబ్బా బయటకు తీస్తూ అన్నాడు గోపాలం.

 “గోపాలం నాకు ఏమీ పెద్దగా తేనవసరం లేదుకానీ, సర్పవరం సెంటర్లో మామిడి తాండ్ర అమ్ముతారు, రెండు కేజీలు పట్టుకొచ్చి పడై  అప్పుడప్పుడూ ఇంటికొచ్చే పిల్ల వెధవలు చప్పరించడానికి బావుంటుంది. తెచ్చాక డబ్బులు ఇస్తానులే బెంగపెట్టుకోకు, ఐనా మొన్నామద్యన నా దగ్గర  రెండువేలు తీసుకున్నావు అందులో విరగకోసుకో, ఏమిటి అలా ఏడుపు మొహం పెట్టావు వెళ్ళు అంది బామ్మ”.  గబగబా వెళ్లిపోయాడు గోపాలం.

 “ఇదిగో పార్వతీ ఎటు వెడుతున్నావు, మొహం అటు తిప్పుకు పోతున్నావు, పనులేమీ చెప్పనులే పిచ్చి మొహమా!  మీ చంటాడికి కొబ్బరుండలు  అంటే ఇస్టమన్నావు కదా ఓనాలుగు ఉండలు ఇస్తాను తీసుకెళ్లి తినిపించు. పిచ్చి వెధవ  ముద్దుగా బొద్దుగా ఉంటాడు “ లోపలికి వెళ్ళి చిన్న పొట్లం పార్వతి చేతిలో పెట్టింది.  పార్వతి నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

 “ఇదిగో రంగమ్మా పరుగు పరుగున ఎక్కడికి వెడుతున్నావు సినిమాక్కానీ వెడుతున్నావా కొంపతీసి “ అడిగింది బామ్మ చిక్కుడుకాయలు బాగుచేసుకుంటూ.  “అవును బామ్మా “ఏకలవ్య” భక్తి సినిమా , ఎంతబాగుంటుందో” ఆగి చెప్పింది రంగమ్మ. “ ఓసినీ మొహం మండా, వెనకా ముందూ చూసుకోకుండా అలా వెళ్లిపోవడమేనా ఆ సినిమా పేరు “ ఏకలవ్య’’ కాదు “ఏకలవ్వే” నేనూ పొరబడి దెబ్బతిన్నాను. పేర్లు పడ్డాక కానీ తెలియలేదు. నిమిషాల్లో ఇంటికొచ్చి పడ్డాను” బామ్మ చెప్పింది. రంగమ్మ నాలిక కరుచుకుని ఇంటిదారి పట్టింది.

వయసుకు తగ్గ వ్యాపకం..*

 *వయసుకు తగ్గ వ్యాపకం..*


"ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పల్లకీసేవ నిర్వహించబడును..పల్లకీసేవ లో పాల్గొనదలచిన భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరుతున్నాము.." అంటూ మా సిబ్బంది ఆ శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయం లో మైక్ లో చెపుతున్నారు..ఆ ప్రకటన విన్న కొంతమంది తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు.."ఏమండీ..ఇప్పుడే మైక్ లో పల్లకీసేవ గురించి చెపుతున్నారు..పల్లకీసేవ లో పాల్గొనలేని వాళ్లకు ఇబ్బందేమీ లేదు కదా?.." అని ఆ పెద్దాయన నన్ను అడిగారు.."అదేమీ లేదండీ..పల్లకీసేవ లో అర్చన చేయించుకొని..కొద్దిదూరం ఆ పల్లకీని భుజాన మోసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే తమకు మంచి జరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రజల్లో పాతుకుపోయింది..మీరు వయసులో పెద్దవారు కనుక..ఒక పని చేయండి..శ్రీ స్వామివారి పల్లకీ మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు పూర్తిచేసుకున్న తరువాత..ఆ ప్రధాన ద్వారం వద్ద పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు..మీరు ఆ పల్లకీ క్రింద వైపు నుండి నడచి రండి..అంటే పల్లకీ లో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తి పాదాల క్రింద మీ శిరస్సు ఆనించి నట్టుగా వుంటుంది..అలా చేస్తే కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుందని మరో విశ్వాసం..దాదాపుగా అందరూ ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వస్తారు.." అని చెప్పాను.."ఆ పని చేస్తాను నాయనా..మంచి సలహా ఇచ్చావు.." అని చెప్పి వెళ్లారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాతసేవ పూర్తి అయిన తరువాత..భక్తులందరూ స్వామివారి సమాధి దర్శనం కొఱకు గర్భాలయపు మంటపం లో వేచి వున్నారు..ఆ సమయం లో ముందురోజు పల్లకీసేవ గురించి మాట్లాడిన పెద్దాయన నా దగ్గరకు వచ్చారు.."బాబూ..స్వామివారి సమాధి ని దర్శించుకోవాలి..టికెట్ కూడా కొనుక్కున్నాను.." అన్నారు.."లోపల భక్తులు వేచి వున్నారు..మీ వంతు వచ్చేసరికి మరో గంట పడుతుంది..ఒక ప్రక్కగా కూర్చోండి.." అని చెప్పాను..ఆయన ముఖం లో నిరాశ కనబడుతోంది..మరో గంట తరువాత ఆ పెద్దాయన స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తన అర్చన చేయించుకున్నారు..మళ్లీ తిరిగి నా వద్దకు వచ్చారు.."మీతో మాట్లాడాలి..ఎప్పుడు వీలవుతుంది?.." అని అడిగారు.."మరో గంట లోపల ఈ హడావుడి తగ్గిపోతుంది..మనం అప్పుడు మాట్లాడుకుందాము.." అని చెప్పాను.."అలాగే.." అని వెళ్ళిపోయి స్వామివారి ఎదురుగా ఉన్న మంటపం లో కూర్చున్నారు..స్వామివారి సమాధి దర్శనం తరువాత..ఆయన ముఖం లో ఇంతకుమునుపు ఉన్న నైరాశ్యం లేదు..ఏదో ఆనందం కనబడింది..


సరిగ్గా గంట తరువాత..నా వద్ద ఎవ్వరూ లేరని నిశ్చయం చేసుకున్నాక..ఆ పెద్దాయన వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు.."మీతో మాట్లాడాలని చెప్పాను కదండీ.." అన్నారు.."ఇప్పుడు చెప్పండి.." అన్నాను.."నా పేరు వాసుదేవరావు..ఇప్పుడు నా వయసు డెబ్భై ఐదేళ్లు..నాకు ఒక్కటే కూతురు..అల్లుడు కూతురు అమెరికా లో వున్నారు..నా భార్య చనిపోయి రెండేళ్లు అవుతోంది..దాదాపుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను..అమ్మాయి తన వద్దకు వచ్చి వుండమని చెపుతున్నది..వెళ్లలేక పోతున్నాను..ఏదో అశాంతి ఆవరించి ఉంది..ఇంటిలో ఒక్కడినే ఉండలేను..అందువల్ల ప్రతి నెలలో ఓ పదిరోజులు ఏదో ఒక క్షేత్రానికి వెళ్లి రావడం అలవాటు చేసుకున్నాను..ఈసారి గొలగమూడి లోని శ్రీ వెంకయ్య స్వామి వారి వద్దకు వచ్చాను..అక్కడ రెండురోజులు వున్నాను..అక్కడా పల్లకీసేవ చేస్తారు..అక్కడ ఈ క్షేత్రం గురించి విని..ఇక్కడికి వచ్చాను..నిన్నరాత్రి మీరు చెప్పిన తరువాత..స్వామివారి పల్లకీ క్రింద నుంచి నమస్కారం చేసుకుంటూ నడచి వచ్చాను..ఒక్కసారిగా నా వళ్ళంతా తేలిక పడినట్లు అనిపించింది..అదే అనుభూతి ఈరోజు స్వామివారి సమాధి వద్ద కూడా పొందాను..నాలోని ఒంటరి తనపు భావన మాయం అయింది..ఇందాక ఆ మంటపం లో కూర్చున్న తరువాత..నాకొక ఆలోచన వచ్చింది..నాకు దేవుడు ఆయుష్షు ఎంతకాలం ఇచ్చాడో తెలీదు..ఇక మిగిలిన ఈ శేషజీవితాన్ని..ఒకరికి సేవ చేసుకుంటూ గడపాలి..అని అనిపించింది..ఆ ఆలోచన కూడా ఈ స్వామివారి సన్నిధి లోనే నాకు వచ్చింది..ప్రతినెలా ఒక నియమం పెట్టుకొని..ఒక్కొక్క క్షేత్రం లో ఏదో ఒక సేవలో పాల్గొంటాను..నాకు భుక్తికి కొరవ లేదు..ఇంకొకళ్లకు పెట్టగలిగే స్థాయి ఉన్నది..నా చేతనైన సేవ నేను చేయాలి అని నిశ్చయించుకున్నాను..అదికూడా ఈ స్వామివారి సన్నిధి నుంచే మొదలుపెడతాను..ఒక వారం పాటు నేను ఇక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి..నాకంటూ ప్రత్యేకంగా ఏ వసతీ వద్దు.." అన్నారు.."వయసులో పెద్దవారు..మీరు సేవ చేయడానికి సిద్ధంగా వున్నా..మీ చేత సేవ చేయించడానికి మాకు మనసు రాదు కదా..ఒక పని చేయండి..మీరు ఇక్కడ ఉన్న రోజుల్లో..రోజూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు పదార్ధాలు వడ్డన చేయండి.." అన్నాను.."అలాగే బాబూ..ధన్యవాదాలు.." అని చెప్పారు..


వాసుదేవరావు గారు మరో వారం పాటు మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద వున్నారు..వారికి ఒక గదిని కేటాయించాము..ఆ వారం రోజులూ ఆయన చాలా ఉత్సాహంతో వున్నారు..తన ఒంటరి తనాన్ని మరిచిపోయారు..ఆ తరువాత తన ఊరికి వెళ్లారు..ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వాసుదేవరావు గారు మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి.."ఒంటరితనం తో ఉన్న నాకు మార్గదర్శనం చేసిన స్వామివారి కి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీస బాధ్యత.." అంటూ వుంటారు..రెండు వారాల క్రితం వాసుదేవరావు గారు స్వామివారి దర్శనానికి వచ్చి.."స్వామివారి వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఒక గది నిర్మిస్తాననీ..అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తాననీ " చెప్పారు..


"మీకు ఒక విషయం చెప్పమంటారా..? నేను ఒంటరివాడిని అనే ఆలోచనే ఇప్పుడు రావడం లేదండీ..నేను వెళ్లిన ప్రతి క్షేత్రం లోనూ అక్కడి సిబ్బంది నన్ను తమలో ఒకడిగా చూసుకుంటూ..ఆప్యాయంగా పలకరించుకుంటారు..ఓపిక ఉన్నన్ని రోజులూ ఇలా సేవ చేసుకుంటాను..ఆపై ఈ దత్తుడి దయ.." అని నవ్వుతూ చెప్పారు..


ఎవరికి ఏ సమయం లో ఏ మార్గం చూపాలో స్వామివారికి స్పష్టంగా తెలుసు..వాసుదేవరావు గారికి తగిన వ్యాపకాన్ని నిర్దేశించి చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీకృష్ణదేవరాయలు

 శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగువాడే!


ఆంధ్రజాతి యావత్తు శ్రీకృష్ణదేవరాయని పేరు వినగానే అవనత శిరస్కమై, ఒళ్ళు పులకరించే స్థితిని పొందుతుంది.  సంస్కృతీ, సాహితీ, సమరాంగణ - సార్వభౌముడాయన.  (యావద్దక్షిణదేశం, తూర్పున ఓఢ్రదేశం, పడమటితీరాన గోవా కొంకణదేశం‌ కలుపుకుని ఏకఛ్ఛత్రాధిపత్యం నెరపిన చక్రవర్తిగా ఆంధ్ర, కర్ణాటక, తమిళ, ఓఢ్ర, కొంకణ దేశాధిపతుల్ని జయించిన జోదుగా) ఓటమి అన్నదే ఎరుగని విజేతగా ప్రపంచ చక్రవర్తులలో ఏకైక వ్యక్తిగా నిలిచినాడు.  అన్ని ప్రాంతాల భాషల్లో శాసనాలు, అన్ని ప్రాంతాల జనాలతో సైన్యసమీకరణలు, అన్ని ప్రాంతాల దేవాలయాలలో దానాలు, అన్ని ప్రాంతాల వ్యాపారులతో మంతనాలు, వ్యాపారాలు నెరపిన రేడు.  తాను స్వయంగా వైణికుడు,  మహాకవి, సంగీత సాహిత్య నృత్యాది విద్యలను పోషించినవాడు.  వ్యాయామకర్కశ స్థిరబంధుడు. సుశిక్షితుడైన ఆశ్వికుడు.  స్వయంగా దండు నడిపిన దండనాయకుడు.   అనేక తులాపురుషదానములు, అనేక గోపుర నిర్మాణములు, స్వర్ణలేపనాదులు, తటాకాది నిర్మాణములు చేసిన (సుమారు 500 దాన శాసనాలతో) మహాదాత.  తెలుగువాడిగా, తెలుగు భాషాభిమానిగా, తెలుగు సాహిత్యపోషకునిగా చరిత్రలో సుస్థిరస్థానము సంపాదించిన వాడు కృష్ణరాయడు.  విదేశీ చరిత్రకారులు, రాయబారులు, వణిక్ప్రముఖులు వేనోళ్ళ పొగడి చరిత్రలు చరిత్రలుగా రాసిన సువ్యక్తిత్వశోభితుడు.  ఆ మహనుభావుడు తెలుగువారి పుణ్యఫలంగా తెలుగువాడై పుట్టినాడు.  తెలుగురేడై వెలిగినాడు.  తెలుగుతేజమై మెరసినాడు.


శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడు కాదేమోనన్న శంకతో తెలుగువారు, ప్రాంతీయ దురభిమానంతో మావాడేనన్న కన్నడంవారు చరిత్ర వక్రీకరణలో తమవంతు పాత్ర పోషించినారు.  తెలుగువారిలో మరికొందరు ఉదారులు ఈయనను తుళువ వంశము వాడు గనుక తుళు దేశీయుణ్ణి చేసినారు.  శ్రీకృష్ణదేవరాయలు జన్మతః కన్నడిగుడే యని ఎం. ఎన్. రామచంద్రమూర్తిగారు, తెలుగువాడు కాదన్న వేదం వేంకటరాయ శాస్త్రిగారు మొ॥ వారు। రాయలు ఎందుకు తెలుగువాడు కాదో ఉపపత్తులు చూపలేదు.  సూర్యనాథ్ కామత్, జి.ఎన్. దీక్షిత్ వంటి కన్నడిగులు ప్రాంతీయాభిమానంతో తమవాడన్నారు.  తమిళ కన్నడ భాషీయునిగా పుట్టి ఉంటే, ఆయా భాషలవారు రాయలను తమ జాతీయ నాయకునిగా జగదేక కీర్తనీయునిగా ప్రతిష్టించేవారు.


రాయలు పదహారణాల తెలుగువాడు.  తెలుగురేడు.  అతని తెలుగు మాతృభాషీయతకు తెలుగు జాతీయతకు అనేక సాక్ష్యాలున్నాయి.


రాయల తండ్రి తుళువ నరస నాయకుడు.  తాత ఈశ్వర నాయకుడు.  నాయనమ్మ బుక్కాంబ.  ముత్తాత తిమ్మయ్య నాయకుడు తెలుగువారే.  తిమ్మయ్య శబ్దము తిరుమలయ్యకు వికృతి.  వేంకటేశ్వర నామము.  ఈ తిమ్మయ్య విజయనగర రాజ్య సైన్యాద్యక్షునిగా దక్షిణ దేశ విజయ యాత్రలో అక్కడకు వెళ్ళి, రాజాజ్ఞతో తుళు ప్రాంతమునకు సామంత ప్రభువైనాడు. 'తుళువ రాజ్యము సంతత వీర భోజ్యమై..' ఆ తుళువ రాజ్యమున విఖ్యాతి వహించిరి.  'వారల కగ్రగణ్యుడు.. తిమ్మ ధాత్రీరమణుడు.. ప్రకటిత బాహువీర్యుడై' అని వరాహపురాణం చెప్తోంది.  ఈ గ్రంధం రాయలవారి తండ్రి తుళువ నరసనాయకునికి అంకితంగా నంది మల్లయ ఘంట సింగయలు రాసింది.  పేరులో తెలుగుదనము వీర భోజ్యంగా తుళుదేశం ఏలిన ముత్తతగారి వైనం తెలుస్తోంది.  ఈయన తెలుగువాడే.  తుళు దక్షిణ కన్నడ దేశం.  మంగుళూరు, ఉడుపి, పుత్తూరు ప్రాంతాలను తుళుదేశంగా చెబుతారు.


తుళు దేశాన్ని  పరిపాలించిన జెర్సప్ప నుండి ఈ వంశం హంపీరాయ సింహాసనంతో (విజయనగర ప్రతిష్టాపన కాలం నుండి) వైరం సాధించుతూ వచ్చింది.  కృష్ణరాయని తండ్రి తుళువ నరసనాయకుని కాలం దాకా ఇవి నడిచాయి.  క్రీ.శ.1390, 1417, 1425, 1554ల్లో నాలుగుసార్లు ఈ‌ యుధ్ధాలు జరిగాయి.  బహుశః ఈ‌యుధ్ధాల్లో ఏదో ఒక యుధ్ధంలో విజేతగా హంపీ ప్రభువులు కోలార్ ప్రాంతాన్ని ఏలడానికి తమ నాయంకరుల్లో ఒకడైన తిమ్మయ్య నాయకుణ్ణి సామంతునిగా నియమించి ఉంటారు.  తిమ్మయ్య తరువాత ఇతని కొడుకు ఈశ్వరనాయకుడు అక్కడ ఇమడలేక చంద్రగిరి వచ్చేసాడు.  బహుశః స్థానిక వ్యతిరేక రాజకీయాలు కారణం కావచ్చు.  ఈశ్వరనాయకుడు సాళువ గుండ నరసింహ భూపాలుని సైన్యాధిపతిగా కన్నడాంధ్ర ప్రాంతాలు అనేక దుర్గాలు జయించి రాయ చౌహల్ల మల్ల , ధరణీవరాహ, మోహనమురారి, బర్బరబాహు వంటి బిరుదులు పొందినాడు.  ఉదయగిరి, హుత్తారి, గండికోట, పెనుగొండ, బెంగళూరు, గొడుగుచింత, బాగూరు, సర్నకొండ, శ్రీరంగపట్నం అతడు గెల్చిన కొన్ని గిరిదుర్గాలు.  అంతేకాదు నెల్లురు (తమిళనాడు)ను కూడా జయించడమే కాక అక్కడి జ్వరేశ్వరాలయంలో (శివాలయంలోని శివునికి జ్వరము నుండి ప్రజలను కాపాడునని విశ్వాసం) కళ్యాణమంటపం నిర్మించాడు.  ఈ మంటపం రాయల కంచి మంటపానికి కవలల పోలికగా ఉంటుంది.  వినిర్జిత నిర్జరేశ్వరాలయుడని కృష్ణరాయలు తన తాతను ఆముక్తమాల్యదలో (అవ. 27) పేర్కొన్నాడు. 


తిమ్మరాయలు తుళు దేశస్థుడని వరాహపురాణం చెప్తోందని నేలటూరి వేంకటరమణయ్య రాసారు.  కాని ఆ గ్రంధంలో అలా ఎక్కడా లేదు.  'మిన్నుల మోచి తుళువ రాజ్యము సంతత వీరభోజ్యమై' అని రాసి ఉంది.  'వీరభోజ్యమై' అంటే గెలుచుకున్నదని అర్థం.  కాని మాతృభూమి అని మాత్రం కాదు.  తుళువ అన్నది శ్రేష్టమని ఆనాటి వ్యవహార పదంగా రాయవాచకంలో పేర్కొనబడింది.  దుర్మార్గుడనే అర్థంలో కాదు.


తిమ్మయ్య చంద్రగిరి ప్రాంతీయుడు.  దూపాటిసీమ నేలిన సాయపనేని వారింటి ఆడపడుచు దేవకీదేవితో (క్రీ.శ.1435-40 ప్రాంతంలో) వివాహం అయింది.  ఈవిడ అకాలమరణం వల్ల (క్రీ.శ.1430-50ల మధ్య తుళు దేశం ఏలిన) ఈతడు వెనుకకు తిరిగివచ్చి, చంద్రగిరి సమీపాన దేవకీపురం గ్రామాన్ని తన భార్యపేర నిర్మించాడు.  తిమ్మయగుంట, తిమ్మనాయని పాళెం పేరుగల గ్రామాలు ఇతనివి కావచ్చని విజ్ఞులు పేర్కొన్నారు.  ఈశ్వరనాయకుడు తన తల్లి పేరుతో రాయవేలూరు సమీపాన మరొక దేవకీపురం నిర్మించాడు.


ఒక తరం (ముత్తాత హయాం) గడిచాక తుళుదేశంలో పాళెగాడుగా ఉన్న తిమ్మరాజు కుమారుడు ఈశ్వరనాయకుడు, కుమారుడు నరసనాయకుని తోడ్కొని చంద్రగిరికి సాళువ నరసింగ రాయల కొలువుకు వచ్చినాడు.  నరసింగరాయలు వీరి ప్రతిష్ట తెలిసినవాడు గనుక తండ్రి కొడుకు లిద్దరిని తన చంద్రగిరి దుర్గానికి ఆహ్వానించినాడు మారీచీ పరిణయ కావ్యాధారాన్ని బట్టి రాయల ముత్తాత ఇంటి పేరు సాళువ వారే.  ఈ ఉభయ వంశములకు మధ్య బాంధవ్యం ఉంది.  తుళు దేశ నాయకత్వముతో సాళువ తిమ్మరాజు తుళువ తిమ్మరాజై తుళువ ఈశ్వరరాజుగా చంద్రగిరిలో చలామణి అయినాడు.  ఈతని కుమారుడు, కృష్ణదేవరాయని తండ్రి నరసరాజు, చంద్రగిరి ప్రభువు నరసరాజు ఉభయులు సాళువవారే కనుక సౌకర్యార్థం రాజు సాళువ నరసరాజుగా, సైన్యాధిపతి తుళువ నరసరాజుగా  (నరసనాయకునిగా) వ్యవహారంలోకి వచ్చారు.  ఈ‌ ఇద్దరు నరసింగలతో పోర్చుగీసువారికి వ్యవహారంలో ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు వారే చేసుకొన్నారు.  సాళువ నరసింహరాయలను చంద్రగిరి నరసింగ అని పోర్చుగీసువారు పిలిచే వారని హేరాను రాసాడు (వాల్యూం 1, పేజీ 311).  అలాగే రాయల తండ్రి (అక్కడి నుండి వచ్చాడని)  తుళూవ నరసింగ అయ్యే అవకాశం ఉంది.  ఇద్దరు నరసింగలు ప్రధాన పదవుల్లో ఉన్నవారు కదా.


కృష్ణరాయని తండ్రి చంద్రగిరిలో నివాసము చేసి రాజు సాళువ నరసింగ భూపాలునికి (అన్నమయ్యను చెరలో బంధించిన రాజు) సైన్యాధిపతిగా, ఆత్మీయ సఖుడిగా మెలిగి విశ్వాసపాత్రుడైనాడు.  రాజు ఆజ్ఞతో హంపీకల్లోలములు అణిచేందుకు హంపీ‌ వెళ్ళి,  అపై తన కుటుంబమును అక్కడికే పిలిపించుకున్నాడు. యవ్వన ప్రాదుర్భావములో చంద్రగిరి చేరి, ముగ్గురు భార్యలను, నలుగురు కుమారులను ఇక్కడే ప్రోది చేసినాడు.  కృష్ణదేవరాయని బాల్యము, విద్య చంద్రగిరిలోనే గడిచింది.  రాయనికి తిరుపతి వేంకటేశ్వరస్వామి పట్ల గల భక్తికి చంద్రగిరి బాల్యము కారణము కావచ్చు.


కృష్ణరాయల కుటుంబం కన్నడం వారేనన్న తొలి చారిత్రకులు ప్రొ.యం. రామారావుగారు.  "Later the Family migrated to kishkindha and from there to Chandragiri in andhra desha .. married andhra women and became domiciled in andhra" అని తెలిగింటి ఆడవారిని పెళ్ళి చేసుకొని తెలుగువారై పోయారన్నారు.  ఆంధ్రరాణులను పెళ్ళాడి అని గుర్తించడం ఇక్కడ విశేషం.


కృష్ణరాయని తల్లి నాగలాంబ తెలుగింటి ఆడపడుచు.  కడప జిల్లా గండికోట ప్రభువైన పెమ్మసాని వారింటి కూతురు.  పెమ్మసాని పెద్ద ఓబళయ్య నాయకుని (చెన్నమ నాయకుడని కూడా ఈతని పేరు)కి చెల్లెలు.  ప్రౌఢదేవరాయల (రెండవ ప్రౌఢదేవరాయలు క్రీ.శ. 1423-46) సామంతుడు పెమ్మసాని తిమ్మనాయుడు.  నాగలంబ తండ్రి చెన్నమనాయకుని అన్న.  అతని కుమారుడు నాగలాంబ మేనల్లుడు రామలింగ నాయకుడు రాయలవారి సర్వసైన్యాద్యక్షుడు.  తన మేనబావను రాయలు ఉంచినాడు.  రాయలతల్లి తెలుగు వనిత అనేందుకు ఇది మరో సాక్ష్యం.  అచ్యుతరాయల తల్లి కూడా వీరి వంటిదే.  నరసనాయకుడు గండికోట విజయముతో ఈ పెళ్ళిళ్ళు చేసికొని ఉంటాడు.  నాగలాంబది చిత్తూరుజిల్లా పిచ్చాటూరు సమీపంలో అరిగండాపురమని, ఆ ఊరు రాయలు తరువాత నాగలాపురం అని మర్చాడని మరో అభిప్రాఅయం.  తాడిపత్రిలోని వేంకట రమణుని అసంపూర్ణాలయం సంపూర్ణంగా  నిర్మించిందని (కైఫీయత్తు ప్రకారం) ఈవిడ్ ఈ‌ ప్రాంతం దేమో‌ నని భావించారు.   చిత్తూరు జిల్లాకు చెందినదని మరొక అభిప్రాయం ఉన్నా - నాగమాంబ పేరిట నాగలాపురాలు అధికంగా ఉండి, ఇక్కడ ఈవిడ ఆభిజాత్యము కొంత అస్పష్టంగా ఉంది.   తెలుగు వనిత కావటం మాత్రం తథ్యం.  కృష్ణరాయని తండ్రి నరస నాయకుడు సాళువ నరసింగ భూపాలుని సైన్యాధిపతిగా తమిళ, కన్నడ దేశ దండయాత్రలు చేసాడు.  కొంతకాలం‌ శ్రీరంగపట్నం (మైసూరు దగ్గర) ఏలినాడు.  ఈ విషయం వరాహపురాణం చెప్పుతోంది.


రాయలు తన కూతుళ్ళిద్దరినీ తెలుగిళ్ల కిచ్చినాడు.  కందనవోలు (కర్నూలు) ప్రాంత రాజులైన అరివీటి వేంకటాద్రి రాజు అన్నలు రామరాజు తిరుమలాంబను, తిరుమలరాజు వెంగమాంబను పెళ్ళాడినారు.  వీరి తండ్రి రాయల వియ్యంకుడు.  అర్వీటి శ్రీరంగరాజు తుళువ నరస నాయకుని కాలానికే విజయనగర ప్రభువుల కాశ్రితుడై, రాయల కాప్తుడైనాడు.  నంద్యాల, వెలుగోటి, అవుకు, అర్వీటి, కూరసాని వంశీకులు లేదా పాలకులు రాయల పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.  ఈ‌ అంశం కృష్ణరాయ విజయం చెపుతుంది.


కృష్ణరాయని తండ్రి తుళువ నరస నాయకుడు తెలుగు రేడే అనటానికి మరిన్ని సాక్ష్యాలు చూపవచ్చు.  అతని భార్యలే కాక, ఆయన పోషించిన కవులూ తెలుగు కవులే.  ఈతనికి అంకితమైన ఆంధ్రవరాహపురాణం, నంది మల్లయ్య, ఘంట సింగయ్య కవుల రచన.  ఈ కవు లిద్దరూ తెలుగులో తొలి జంట కవులు.  వీరు కర్నూలు ప్రాంతీయులు.  వీరిలో సింగయ గురువు అఘోర శివాచార్యులు కదపలోని పుష్పగిరికి చెందిన వాడు.  వీరు తమ వరాహపురాణంలో, తమ తెలుగురేని వంశ వివరాలు వివరించారు.  ఈ కృతి అంకితం పుచ్చుకున్నప్పుదు నరస నాయకుడు శ్రీరంగపట్టణం దుర్గాధిపతి.  అతని సైన్యాధిపతి చిక్కరాయలు తిరుమలదేవి తండ్రి, కృష్ణరాయల మామ.  ఘంట సింగయ్య (మలయమారుత కవి బిరుదాంకితుడు)కి నంది తిమ్మన్న మేనల్లుడు.  ఈ విషయం నంది తిమ్మన్న తన పారిజాతాపహరణం (5-108)లో  పేర్కొన్నాడు.  నంది తిమ్మన్న అక్కడి నుండే, తిరుమల దేవిని రాయలు వివాహ మాడినాక, మహారాణితో పాటు విజయనగరం వచ్చి, రాయల కాప్తుడైనాడు.  రాణికి బాల్యం నుండే ఆప్తుడైన కుటుంబ బ్రాహ్మణుడు.   తిరుమలదేవి వెంబడి గయకు కూడా వెళ్ళిన (రాయలు నమ్మకంగా పంపిన) వాడు.  అక్కడ శాసనము వేయించిన వాడు తిమ్మన.  పైన పేర్కొన్న వారంతా తెలుగువారే. 


కృష్ణరాయల అన్న, అతనికి ముందుగా సింహాసనం వీర నరసింహ రాయలు తెలుగు రేడు.  బాల భారతం (వచనం), సౌభరి చరిత్రము (జక్కుల కథ), ద్విపద నారసింహ పురాణము రాసిన ప్రోలుగంటి చెన్నకవిని, వీర నరసింహ రాయలు ఆదరించినాడు.  వీరంతా తెలుగు కవుల కాశ్రయులే కదా!  హంపీ‌ నేలిన నాలుగు రాజ వంశములు తెలుగు ప్రభువులవే.


బళ్ళారి తెలుగు మండలము.  విద్యారణ్యుడు ఓరుగంటి రాజ్యపౌరుడు.  హరిహర బుక్కరాయ సోదరులు కాకతీయ దండనాథులు (కోశాగార ప్రతీహారౌ వీర రుద్రమహీపతే).  అళియ రామరాయల కాశ్రితుడైన ఇబ్రహీం‌ కులీ‌ కుతుబ్‌షా తెలుగు కవిత్వమునకు ఆదర మిచ్చి నాడన్నచో నాటి హంపీ రాజ్యరమ అచ్చమైన తెలుగురాజ్యముగా విలసిల్లినదే.  రాయ సింహాసనముపై రాయలకు ముందు పదముగ్గురు రాజులు (సంగములు ఎనిమిది మంది + సాళువలు ముగ్గురు + తుళువలు ఇద్దరు, వెరసి పదముగ్గురు) తెలుగు వారే.  విజయనగర (విద్యానగర) స్థాపన, (క్రీ.శ.1336)కు 173 ఏండ్ల సుదీర్ఘ పాలన తరువాత క్రీ.శ. 1509లో రాయలు పట్టం కట్టుకొన్న రాజు.  ఇది కన్నడ రాజ్యం ఎలా అవుతుందీ?


రాయల దేవేరి తిరుమలదేవి తెలుగింటి ఆడపడుచే.  రాయల మామ తన తండ్రి తరువాత విద్యానగర సింహాసన విధేయుడై శ్రీరంగపట్నం‌ ఏలినా, ఇక్కడ నుండి తుళువ నరస నాయకునితో వెళ్ళిన వాడే.  తనతో గల సఖ్యత కారణంగా, అతని కూతురిని తన రెండో కొడుకు రాయలకు నరస నాయకుడు పెళ్ళి చేసినాడు.  అంతే కాదు, అచ్యుత రాయలకు (తన మూడవకుమారుడు),  సకలం వారింటి ఆడపడుచునే కోడలిగా చేసుకున్నాడు.  ఇవన్నీ‌ తెలుగు కుటుంబాలే.


రాయసింహాసనము రాయలకు ముందు కన్నడ రాజ్యరమగా పేర్కొన బడుట ప్రాంతనామము గానే.  కేవల రాజ్య నామమే.  'తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి' అన్న శ్రీనాధుని మాటల్లో రాజ్యం పేరే కాని కన్నడ భాషార్థం లేదు.  అంతే కాదు, శ్రీనాధుడు కాశీ ఖండంలో ప్రౌఢ దేవరాయలను 'కర్నాటక్షితినాధ మౌక్తిక' అని పేర్కొనటంలో దేశవాచకమే ఉంది.   Krishnadevaraya of Vijayanagara and his Times  అనే గ్రంథంలో  డా. సూర్యనాథ్ యు. కామత్ గారు Krishnadevaraya calls himself also as Kannada Raya, poet Allasani Peddana  addresseed him as Kannnada Rajya Rama Ramana and this supports the view of his Kannada origin అని రాసారు.  సూర్యనాథ్ కామత్, జి.ఎస్. దీక్షిత్ వంటివారు చేసిన ఈ వాదనలలో కన్నడరాయ శబ్దాన్ని కృష్ణరాయల విశేషణంగా చూపి, రాయలు కన్నడం వాడని చెప్పే వీరి యత్నాలు ఈ‌ కారణంగానే తిరస్కరించవచ్చు.  కన్నడ దేశం, కన్నడ రాజ్యరమ వంటివి ఈ‌ పధ్ధతిలో వచ్చిన పదాలన్నీ దేశవాచకాలే‌ కాని భాషా వాచకాలు కావు.  పంచ భాషా ప్రదేశాలు హంపీ‌ సింహాసనం క్రింద, తెలుగు, తమిళ, కన్నడ, కొంకణ, తుళు భాషీయుల ప్రాంతాలు, కన్నడ రాజ్యరమ స్వంతాలు.  రాయసింహాసనాధీశు లందరికీ ఈ‌ పేరు వ్యవహారంలో ఉన్నదే.  ఒక్క కృష్ణరాయని కన్నడిగుని చేయటానికి పనికి వచ్చే ఆధారం మాత్రం ఇది కాజాలదు.  పశ్చిమ సముద్రాధీశ్వర, కర్నాటక రాజ్యధౌరేయ, కన్నడ రాజ్యరమారమణ ఇత్యాది సంబోధనలలోని కన్నడ శబ్దం, ఆయన రాజ్యపు హద్దులు లేదా రజ్యం నామాన్ని సూచిస్తుందే తప్ప ఆయన మాతృభాషను కాదు.   అల్లసాని చాటువు లోని 'కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర' అనటంలో అది దేశవాచకమే కదా!


'శ్రీకృష్ణరాయ దినచరి' అనే సమకాలీన కన్నడ గ్రంథంలో రాయలు కన్నడం వాడన్న ఆధారాలు ఏమన్నా రాయబడ్డాయా అంటే అదీ‌ లేదు.  (సూర్యనాథ్ కామత్‌గారిని ఫోన్‌లో సంప్రతించగా నాతో ఈ విషయం చెప్పారు.)


రాయలది తెలుగు కుటుంబమే అనడానికి మరో సాక్ష్యం, రాయల తాత ఈశ్వర నాయకుడు తన తల్లి పేరిట దేవకీ‌పురం రాయవెల్లూరు (తమిళ నాడు)  దగ్గర కట్టించి వేయించిన తెలుగు శాసనం.  ఇది మరో ప్రబలాధారం.


తెలుగదేల యన్న దేశంబు తెలు గేను

తెలుగు వల్లభుండ తెలు గొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స


అన్న ఆముక్తమాల్యద లోని పద్యంలో మొదటి రెండు పాదాలూ శ్రీకాకుళాంధ్ర విష్ణువే అన్నా, రాయలనోట, రాయల కలంలో నుండి వెళ్ళినవే.  అంతే కాదు, తమిళ, కన్నడ, ఆంధ్ర, ఓఢ్ర, కొంకణి, తుళు భాషా ప్రజల కధిపతులైన (ఎల్ల)నృపులున్న సభలో, 'దేశభాషలందు తెలుగే లెస్స' అని బాసాడటం రాయల తెలుగుదనాన్ని పట్టిస్తోంది.  ఇతర భాషీయులకు కన్నెర్ర కాకుండా, దేవునితో ఆజ్ఞాపింప జేసుకున్న వ్యూహం ఇది.  పైగా అందరి ముందూ 'బాసాడి నావని' జ్ఞాపకం చేసినాడు దేవుడు.ఈ సమర్ధన రాయల తెలుగు భాషాభిమానానికి , రాజనీతి చతురతకూ అద్దం పడుతుంది.  కృష్ణరాయలు మొత్తం ఏడు గ్రంథాలు రాసినాడు.  మదాలసచరిత్ర, సత్యావధూప్రీణనమ్‌, సకలకథా సార సంగ్రహం, జ్ఞానచింతామణి, రసమంజరి మొ॥కావ్యాలు సంస్కృతంలో రాసినాడు.  మరే భాషలోనూ‌ రచన చేయ లేదు తెలుగులో తప్ప.  కృష్ణరాయని జాంబవతీ పరిణయం అనే మరో సంస్కృతరచన దొరుకుతుంది.  తెలుగులో ఏకైక రచన ఆముక్తమాల్యద.  రాయల రచనలు ఇతర భాషల్లో లేవు.


రాయలు ఆంధ్రభోజుడు.  ఆయన కన్నడభోజుడో, తమిళభోజుడో కాదు.  తెలుగుకవితకు చలువ పందిళ్ళు కప్పినాడు.  భువనవిజయమున పట్టము కట్టినాడు.  గండపెండేరము తొడిగినాడు.  తెలుగు కవిని, పల్లకీలో -- తాను బోయీగా -- మోసినాడు.  అష్టదిగ్గజము లనెడి కవికూటమి తెలుగులో తప్ప, మరే భాషలోనూ లేదు.  అష్టదిగ్గజములలో ఆంధ్రేతర కవిదిగ్గజములు లేరు.  అష్టదిగ్గజము లన్న మాట, ఆంధ్రేతర సాహితీవేత్తలు ఎరుగరు.


భువనవిజయ సభాభవన మని చెప్పబడే విద్వత్కవితా గోష్టీమందిరము లోని కవుల ప్రశంసలు, అంతఃకలహములు, విజయములు, సమస్యాపూర‌ణములు, పరకవి ఖండనములు, మొత్తం 80 పైగా చాటువులు లభిస్తున్నాయి.  ఇవన్నీ తెలుగులోవే.  గోష్టులు తెలుగులోనే జరిగేవి అనటానికి ఇదొక సాక్ష్యం.  చాటువులు ఇతర దేశీయ భాషలలో లేవు.  రాయల విద్వద్గోష్టి కన్నడంలో జరిగినట్లు ఒక్క సాక్ష్యమూ లేదు.


యుధ్ధాలు చేస్తున్నప్పుడు యుధ్ధపటాలంలో కృష్ణరాయలు వెంట తీసుకొని పోయినాడు.  యుధ్ధభూమిలో సాహిత్యగోష్టులతో పాటు క్లిష్టస్థితిలో సలహాలు తీసుకోవటం కోసం కావచ్చు.  "హితులు భిషగ్గహజ్ఞ బుధబృంద కవీంద్ర పురోహితుల్" అని రాయలు అముక్తమాల్యదలో రాజనీతిలో చెప్పినాడు.  తెలుగు కవులతో‌ క్లిష్టసమయాలలో సంభాషించే‌రాయని మాతృభాష తెలుగు కాక మరొకటిగా ఉండదు. 


సమకాలీనుల రాతలను బట్టిరాయల దేవేరుల ఇండ్లలో తిరుమలదేవి ఇంట తప్ప మిగతా అంతఃపురమంతా తెలుగే మాట్లాడబడేదని, రాయల ఆస్థానంలో కూడా తెలుగే మాట్లాడబడేదనీ తెలుస్తోంది.  రాయలు శ్రీరంగపట్టణ పాలకుడైన తన తండ్రి కాప్తుడైన, తన మామ ఐన సైన్యాధిపతి కుమార వీరయ్యను శ్రీరంగపట్టణాధిపతిగా క్రీ.శ. 1512లో ప్రతిష్టించినాడు.  ఆయన కూతురు తిరుమలదేవిని అప్పటికే వివాహమాడినాడు.  ఈమె కన్నదపు రాచకాంత కాదు.  వీరయ్య రాయల తండ్రికి ఆప్తుడు.  తెలుగునేల నుండి అతడితో వలస వెళ్ళిన వాడే.  ఈవిడ వలన కృష్ణరాయనికి కలిగిన కుమార్తె మోహనాంగి తెలుగు కవయిత్రిగా ప్రసిధ్ధురాలు.  మోహనాంగి మాతృభాషలోనే (పితృభాష కూడా) 'మారీచీ పరిణయం' రాసింది.  ఈవిడకు తిరుమలాంబ అని పేరు పెట్టబడ్డా, రాయడు ఒకే పేరుతో భార్యనూ కూతురిని పిలవతం బాగుండదని, ఆమెను మోహనాంగి అని పిలిచేవాడు.  ఈమెను అళియ రామమరాయల కిచ్చి పెళ్ళి చేసినాడు.  రాయల తెలుగు తనము, తెలుగు కవితాభిమానముతో ఈమె తెలుగు కవయిత్రి కాగల్గినది.  ఈమె సమస్యాపూరణంలో‌ దిట్ట.  రాయలే ఈమె కావ్యాన్ని అంకితం తీసుకున్నాడు.  ఇవన్నీ మోహనాంగి తన గ్రంథంలో చెప్పింది.  కన్నడ వాతావరణంలో పుట్టిన మోహనాంగి తెలుగు కావ్యం రాసిందంటే, తండ్రి తెలుగువాడు, పెరిగిన వాతావరణం తెలుగు అనే కదా.


గుత్తిలో విస్తర్లు కుట్టి, చంద్రగిరిలో భిక్షాటన చేసి, పెనుగొండలో సత్రాల్లో పనులు చేసి కూడు సంపాదించి, తెలుగురాజుల తాంబూలపు తిత్తులు మోసి బ్రతుకు నడుపుకున్న తిమ్మరుసు తెలుగువాడే. అవన్నీ తెలుగు దుర్గాలే.



కం. అయ్య అనిపించి కొంటివి

నెయ్యంబున కృష్ణరాయ నృపపుంగవు చే

అయ్యా నీ సరి యేరీ

తియ్యని విలుకాడ వయ్య తిమ్మరుసయ్యా


అన్న చాటువు రాయలు తిమ్మరుసును అయ్య (అప్ప) అన్నాడనీ, తిమ్మరుసు రాయలను తండ్రిలా రక్షించాడనీ చెప్తోంది.  రాయలు తెలుగు ప్రాంతం లోనే బాల్యం గడిపాడని దీనితో చెప్పవచ్చు.  రాయలు వికృతినామ సంవత్సరంలో క్రీ.శ. 1470లో జన్మించాడు అని ఒక వాదం.  క్రీ.శ. 1440 ప్రాంతంలో జన్మించిన తిమ్మరుసు రాయల కంటె 30 ఏళ్ళు పెద్దవాడు.  సాళువ నరసింహరాయల ప్రధానామాత్యుడు నాందెండ్ల చిట్టిగంగనామాత్యుని వద్ద శిష్యరికం చేసాడు.  కృష్ణరాయని తండ్రికి సమకాలీకుడు, సమవయస్కుడు, ప్రధాని - ఇతని పెంపకం లోనే రాయలు రాజోచిత విద్యలు, శాస్త్రాలు, యుధ్ధశిక్షణ పొందాడు.  ఇద్దరూ తెనాలి వెళ్ళిన విజయ శాసనం ఉంది.  అప్పటికే రాయలు యువకుడు.  ఇతని కారణంగా రాయల బాల్యం చంద్రగిరిలో గదచిందని చెప్పవచ్చు.  రాయలకు తిరుమల వేంకటేశ్వరుడు ఇష్టదైవం కావటానికి ఆయన చంద్రగిరి జీవితం ఒక కారణం కావచ్చు.


చంద్రగిరిలో కృష్ణరాయని తండ్రికి సఖుడై, ఆమాత్యుడై, అత్మీయుడై, మహామంత్రి యైన తిమ్మరుసు మార్గదర్శనంలో చంద్రగిరి, హంపీ నగరములలో పెరిగిన కృష్ణరాయలు తెలుగు వాడే కదా!


రాయలు చక్రవర్తిగా తన సామంతరాజ్యాలైన తంజావూరు, చేంజి, మధుర, మైసూరు వంటి తెలుగేతర ప్రాంతాలకు తనకు ఆత్మీయులైన తెలుగు దళనాయకులను, నాయంకరులనే పంపినాడు.  నాడు ఇవన్నీ తెలుగు రాజ్యాలు, తెలుగు అధికారభాషగా గల్గిన రాజ్యాలు.  తెలుగు సామంతులు దండనాథులు, నాయంకరులు,  పాలెగాళ్ళు, కోవెల పారుపత్తేగాళ్ళు, పూజారులు, కవి పండితులు దక్షిణదేశ మంతా  విస్తరించి, నేడు భారతదేశంలో తెలుగు అత్యధికులు మాట్లాడే భాషగా, తెలుగు కుటూంబాల విస్తరణలో భాగంగా నిలిచినారు.  దీనికి కారణము కృష్నరాయని తెలుగు తేజమే.


రాయలకు ఇంటిపేరు, రాయలకు ఊరిపేరు ఉన్నాయి.   తెలుగు వారికి మాత్రమే, ఇంటిపేరు ఉంటుంది. వీటిని అల్లసాని పెద్దన్న పేర్కిన్నాడు.



రాయరావుతు గండ రాచయేనుగు వచ్చి

యారట్ల కోట గోరాడు నాడు

సంపెట నరసాల సార్వభౌముడు వచ్చి

సింహాద్రి జయశిల చేర్చు నాడు

సెలగోలు సిహంబు చేరి ధికృతి గంచు

తల్పుల కరుల ఢీ కొల్పునాడు

ఘనతర నిర్భర గండ పెండేరమిచ్చి

కూతు రాయలకిచ్చి కూర్చునాడు


ఒడ లెరుంగవొ చచ్చితొ యుర్వి లేవొ

చేరజాలక తలచెడి జీర్ణమైతొ

కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర

తెరచి నిలు కుక్క సొచ్చిన తెరగు దోప


సంపెట నరసాలు అని రాయల ఇంటి పేరుగా, సెలగోలు సింహమని కృష్ణరాయల  గ్రామం పేరుగా సూచించినాడు.  సంపెట ఇంటివారు తెలుగువారు.  సమ్మెట, సంబెట అని నామాంతరాలు.  క్రీ.శ.  1417 ప్రాంతంలో కడపజిల్లా పులివెందుల తాలూకా పేర్నిపాడు పాలించిన సమ్మెట సోమనృపాలుడు (2) కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా గుండ్లూరు (శాసనం) పాలించిన సమ్మెట లక్కయదేవని కుమారుడు సమ్మెట రాయదేవుడు (సంగమవంశీకుడు ఇతడు) ప్రౌఢదేవరాయల సామంతులే.  వెలుగోటి వంశావళిలో పేర్కొనబడిన క్రీ.శ. 1361నాటి సమ్మెట కొండ్రాజు, సాళువ నరసింహరాయల అనగా కృష్ణదేవరాయల తండ్రికి, సమకాలీకులైన సమ్మెట శివరాజు,  సమ్మెట వీరనరసింహరాజు (ఎర్రపాడు ప్రభువులు), సింగభూపాలుని కుమారుడు అనపోతానీడు గెల్చిన సంబెట భూనాధుడు (ఎవ్వరో తెలియదు) బహుశః సమ్మెట సోమనృపాలుడు (వెలుగోటి వంశావళి చెప్పింది 'సంబెట భూనాధ సప్తాంగ హరణ' అని) మొ॥ వారు రాయల వంశీకులే.  సంపెట, దుంపెట వంటి గ్రామనామాలు తెలుగునాట ప్రసిధ్ధం.   సెలగోలు = సెలగ + వోలు గా భావించవచ్చు.  వోలు అనేది ప్రోలుకు రూపాంతరం.  గ్రామం / నగరం అని అర్థం.  ఒంగోలు, నిడుదవోలు, భట్టిప్రోలు ఈ అన్ని (మూడు) రూపాంతరా లున్నాయి.   సెల = నీటి బుగ్గ.  (తెలంగాణలో జెల) సెలయేరు లోని సెల - లేదా చెలమ సెలిమ - నీటి బుగ్గ కల ఊరు.  సెలక - సెలగ - చేను, లేదా సెలగ - చణక - శనగ అన్న అర్థంలో ఈ గ్రామం ఉండి ఉంటుంది.  మహాచక్రవర్తికి ఇంటి పేరు సూచించేంత అవసరం రాదు గనక మరుగున పడ్డా అల్లసాని గజపతీంద్రుణ్ణి హీనునిగా, రాయలను ఉన్నతునిగా చిత్రించేందుకు, నాలుగు పాదాల సీసపద్యంలో రెండు పాదాలు చరిత్రకు వాడుకున్నాడు.  అంతే కాదు,  'కన్నడం‌ బెట్లు సొచ్చెదు గజపతీంద్ర' అన్నప్పుడు, ఇది నేను ఇంతకు ముందే చెప్పినట్లు, దేశవాచకంగానే గాని భాషావాచకంగా లేదని సమకాలీనాధారం రుజువు చేస్తోంది.


స్వయంగా రాయల కూతురు మోహనాంగియే, తన మారీచీపరిణయం గ్రంథంలో, రాయలు తెలుగువాడేనని కంఠోక్తిగా చెప్పింది.


చ. తెనుగునృపాలుడై, నరపతిత్వము గల్గిన వీరభద్రుని పు

త్రిని, మరి యోధుడై గజపతిత్వము గల్గు ప్రతాపరుద్ర పు

త్రిని, వరించియుం, తురక రేడగు నశ్వపతీశు పుత్రి గై

కొనక నృసింహకృష్ణు డొన గూర్చెను బంక్తిని బక్షపాతమున్


తెలుగు నృపాలుడని కృష్ణరాయని ముద్దుల కూతురు మోహనాంగే చెప్పుతుంటే, కాదూ అని వాదుకు వస్తే పిచ్చి వాడనాలి కదా!


రాయలు తన హయాంలో హంపీలో సుమారు 20 శాసనాలు తెలుగులో వేయించినాడు.   తిరుపతిలో వేయించిన సంస్కృత శాసనాలు తెలుగులిపిలోనే ఉన్నాయి.  అంతే కాదు, తాను తిరుమలదేవి, నంది తిమ్మనలతో (బీహార్ రాష్ట్రంలోని) గయకు వెళ్ళి, పితృకర్మలు నిర్వర్తించి, వేయించిన శాసనం తెలుగులోనే ఉంది.  శక.సం. 1444 ( క్రీ.శ. 1521) జూలై  2  నాడు వేయించినది  ఈ శాసనం.  నంది తిమ్మన పారిజాతాపహరణం పద్యం కూడా శాసనంలో ఉంది.  తాను తెలుగువాడే కాకుంటే, గయలో (తెలుగు, కన్నడం కాని చోట) తెలుగులో శాసనం ఎందుకు వేయిస్తాడు?  మాతృభాషపై మమకారం కాదా ఇది?


కృష్ణరాయని చరిత్రకు ఆకరాలు బోలెడు.  పరిష్కారాలు బోలెడు.  వివాదాలూ అన్నే ఉన్నాయి.  రాయవాచకము, కృష్ణరాయవిజయము, పారిజాతాపహరణము, ఆముక్తమాల్యద, మారీచీపరిణయము, మనుచరిత్రము, తిమ్మరుసు బాలభారత వ్యాఖ్య, సంగీతసూర్యోదయము, అచ్యుత రాయాభ్యుదయము, తిమ్మణ భారతము వంటి కావ్య శాస్త్ర గ్రంథములు, వంశాను చరిత్రములు, శతాధిక శాసనాలు, అనుయాయుల, అధికారుల శాసనాలు, ముస్లిం రాజసభా లేఖనాలు, విదేశీయుల రాతలు వంటివి అనేకంగా ఉన్నవి.  విరుధ్ధాంశాలు కూడా ఉన్నాయి.  పట్టాభిషేకవత్సరం, జననమరణాలు, భార్యలసంఖ్య, పుత్రమరణం, తల్లిచరిత్ర వంటివి ఉన్న పలువురు చారిత్రకుల సమన్వయ నిర్థారణము ప్రకారము కృష్ణరాయలు క్రీ.శ. 1484లో పుట్టి, క్రీ.శ.1509లో అన్నగారి మరణానంతరం (లేదా అన్నగారు మరణశయ్యా గతుడైన తరువాత) హంపీ విరూపాక్షస్వామి కోవెలలోని వాకిలిలో కృష్ణజన్నాష్టమి నాడు (07-08-1509న) పట్టాభిషేకం చేసుకున్నాడు.  రాయలవారి పట్టాభిషేకానికి పంచశత వత్సరపు పండగ చేసుకున్నాం.  అతని తొలి అధికార శాసనం ఆగష్టు 9వ తేదీన క్రీ.శ. 1509 అనగా నేటికి 500 సంవత్సరాల క్రిందటిది లభిస్తోంది.   ఈతని ఛత్రఛ్ఛాయలో తెలుగు కవిత నందనోద్యానలతయై నవరత్న రాశి విజయనగర పురవీధుల అంగళ్ళలో సరుకై, తెలుగు పౌరుషము గోదావరీ, కృష్ణా, కావేరీ నదీ‌ మధ్య భూమిపతుల కోటగుమ్మాలపై ధ్వజమై, వితరణ దక్షిణ భారత దేశ దేవాలయ గోపురకాంతి రాశియై శోభిల్లినది.  కృష్ణరాయల వంటి ఉత్తమ చక్రవర్తి మరొకడూ లేడు - తెలుగు భాష వంటి మధురమైన భాష మరొకటీ లేదు.


- వ్యాస రచయిత  

డా॥ సంగనభట్ల నర్సయ్యగారు. (ఫోన్. 944 007 3124)

d r s n a r s a i a h @ g m a i l . c o m

విశ్రాంత ప్రాచార్యులు,

శ్రీలక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల,

ధర్మపురి, కరీంనగర్ జిల్లా.

హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును

 *బ్రేకింగ్ న్యూస్*

    

*నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును ***"

సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు, 

ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది.


 మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం.


రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి.


ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్  లేదా ఇతర పోలీసులు ' మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే.. నేను 

మునిసిపల్ కార్పొరేషన్,  పంచాయతీ సమితి,  నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును....                  


ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది.               


నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగడానికి లేదు.


ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి, 


తద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయండి... !!


  ⚖

దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ న్యాయవాది

రాష్ట్ర అధ్యక్షుడు

ఉమ్మడి న్యాయవాది సమాఖ్య

9452680100

8299683093


*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

ఇన్ఫెక్షన్

 ఇన్ఫెక్షన్ అనే పదాన్ని తెలుగులో సంక్రమణ అని అనువదించవచ్చు . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సోకడం .  డిసీజ్  అంటే వ్యాధి . వైరస్ సోకడం వేరు . వ్యాధి బారిన పడడం వేరు 


వైరస్ సోకడం అనేదాన్ని పెద్దగా ఆపడం కుదరదు . జలుబు చేసే వైరస్ లు సోకుతూనే వున్నాయి . అమెరికా లాంటి దేశాల్లో కామన్ ఫ్లూ కు టీకా లు వున్నాయి . అయినా ఆ వైరస్ సోకుతూనే ఉంటుంది . మరో మూడు నెలలకో ఆరు నెలలలకో దేశం మొత్తానికి కరోనా టీకా ఇచ్చినా వైరస్ సోకడం అనేదాన్ని పూర్తిగా ఆపలేరు . ఇదో నిరంతర ప్రక్రియ గా సాగుతూ ఉంటుంది . టెస్ట్ లు చేసి కేసు లు కేసులు లు అంటూ  ఇప్పటిలా హైరానా పడితే ఇక జీవితాలు ఎప్పటికీ అంతే ! 


వైరస్ సోకడం , వ్యాధి బారిన పడడం    అనేదాని మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి . వైరస్ సోకినప్పుడు మనలో ఇమ్మ్యూనిటి బలంగా ఉంటే అది వైరస్ ను మూడు రోజుల్లో చంపేస్తుంది . అలాంటి వ్యక్తులకు కనీసం జలుబు దగ్గు లాంటివి రావు . ఇన్ని రోజులు వారిని asymptomatic అంటూ పిలుస్తూ  వచ్చారు . పిల్లలు  అందరూ ఇదే క్యాటగిరీకి వస్తారు . లక్ష మంది పిల్లలకు కరోనా సోకితే ఒక్కరే వ్యాధి బారిన పాడుతారు అనేది నిరూపితమైన సత్యం . 


ఇన్నాళ్లు అసిమ్పటోమాటిక్ వ్యక్తుల నుంచి మిగతా వారికి సోకుతుందేమో అనే భయం ఉండేది . ఇప్పుడు టీకా వచ్చింది . టీకా వేసుకొన్న వారికి కరోనా సోకడం అనేదాన్ని ఆపలేము . కానీ టీకా ప్రభావం వల్ల వారు అసిమ్పటోమాటిక్ గా మారిపోతారు . అంటే వారికి వైరస్  సోకుతుంది కానీ వారు వ్యాధిగ్రస్తులు కారు . అంటే వారికి వ్యాధి లక్షణాలు పెద్దగా వుండవు . మహా ఉంటే ఒకటి రెండు రోజులు జలుబు దగ్గు .. అంతే . 


ఇప్పటికే మన దేశం లో వంద మందికి వైరస్ సోకితే 95 మంది అసిమ్పటోమాటికిగా వుంటున్నారు . మరో నలుగురు కూడా కేవలం మైల్డ్ గానే వ్యాధి బారిన పడుతున్నారు . తీవ్రంగా వ్యాధి  బారిన పడేది వందలో ఒక్కరే లేదా ఇంకా తక్కువ అంటే వెయ్యి లో ఒక్కరే ! ఇది నిరూపితమైన సత్యం . 


ఇన్ఫెక్షన్ { వైరస్ సోకడం } డిసీస్ { వ్యాధి బారిన పడడం } అనేదాని మధ్య తేడా గుర్తించనంత కాలం మన బతుకులు ఇలాగే   కునారిల్లు తాయి . అమాయకులైన ప్రజలు ఈ తేడా ను అర్థం చేసుకోలేక భయబ్రాంతులకు గురవుతారు . ఇది మారాలి . ఈ తేడా ను గుర్తించాలి . 


టీకా లు ఎంతో కొంత మేర కరోనా నుండి రక్షణ నిస్తాయి . అంటే డీసీసీ బారిన పడకుండా కాపాడుతాయి . అంటే టీకా వేసుకొన్న వారికి కరోనా సోకినా వారు పెద్దగా వ్యాధి గ్రస్తులు కారు . అంతకంటే మించి మన శరీరం లో డి విటమిన్ { రోజూ ఇరవై నిముషాలు ఎండలో కూర్చోవడం } సి విటమిన్ { కర్రీ లో నిమ్మకాయ పిండుకోవడం లేదా నారింజ పండు తినడం ; బి 12 విటమిన్ కోసం శాఖాహారులు టాబ్లెట్ తీసుకోవడం , ఐరన్ { ఆకుకూరలు } జింక్ { రోజుకు రెండు ఎండు ద్రాక్షలు } glycene { నువ్వులు } మాంసకృత్తులు { మాంసాహారులకు చికెన్ , మటన్ ఎగ్ { శాఖాహారులకు జామ కాయ, సొయా , పుట్టగొడుగులు , పనీర్ } ఉండేలా ఆహారం తీసుకోవడం జరగాలి . మన ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి వైరస్ అయినా మనల్ని ఏమీ చెయ్యలేవు . 1 . డైట్ .. అంటే పైన చెప్పినట్టు సమతుల ఆహారం } 2 . భయాందోళనలకు గురికాకుండా సంతోషంగా ఉండడం .. పాజిటివ్ ఫీలింగ్స్ ఇమ్మ్యూనిటి ను వంద రేట్లు బలోపేతం చేస్తాయి .  భయం లాంటి నెగటివ్ ఫీలింగ్ ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది . ౩. వర్కౌట్ .. అంటే కనీసం నడక . 4 . మంచి నిద్ర .. ఈ నాలుగు సూత్రాల దారంగా ఎనభై ఏళ్ళ వ్యక్తి కూడా వరం పది రోజుల్లో ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేసుకోవచ్చు . ఇలా చేసుకోకపోతే ఇక పై ప్రపంచం లో వైరస్ లాబరేటరీ లు సృష్టించనున్న కొత్త వైరస్ ను ఎదుర్కోలేము . భయం నేడు ఒక వ్యాపార  వస్తువు . ప్రజల్లో భయాన్ని వ్యాపింప చేయడాన్ని ప్రపంచ వ్యాపితంగా అనేక శక్తులు తమకు లాభాలు కురిపించే వస్తువుగా మార్చుకొంటున్నారు . అప్రమత్తత అవసరం . బయన్దోళనలు అనవసరం . జాగరూకత అవసరం . లేక పొతే బతుకు సాగదు.✍🏾

🙏🙏🙏🙏🙏🙏

న జానామి శబ్దం

 న జానామి శబ్దం న జానామి చార్థం – 

న జానామి పద్యం నజానామి గద్యమ్ |

చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – 

ముఖా న్నిః సరన్తే గిరశ్చాపి చిత్రమ్ ||2||


(~జగద్గురు ఆదిశంకర కృత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం)


*భావం:* "నేను శబ్దము నెరుగను. అర్థము నెరుగను, పద్యము నెరుగను, గద్యము నెరుగను. ఆరు ముఖములు గల ఒకానొక  (సుబ్రహ్మణ్య) చిద్రూపము నా హృదయమునందు ప్రకాశిస్తుండగా, నా నోటినుండి చిత్రముగా మాటలు వెలువడుతున్నవి."


*శుభోదయం*

🦋🦋🙏🦋🦋

. ఆ ఆట పేరు మోక్ష పదం.

 పదమూడో శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని, కవి ఒక పిల్లల ఆట తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్ష పదం. 

మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారి కన్ను ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు అని గ్రహించి

ఆ ఆటని మొత్తం బ్రిటీష్ వారు మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసారు, వారికి కలిసి వొచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటులోకి రావడం.

అలా మోక్ష పదం కాస్తా వైకుంటపాళిగా రూపాంతరం చెందింది.

పాత కొత్త ఆటలో వొంద చతురస్రములు ఉంటాయి, తేడా వొచ్చి మన మునీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో 

12వ చతురస్రరం అంటే 'నమ్మకం' అని, 51వ చతురస్రరం అంటే 'విశ్వసనీయత' అని

, 57 వ చతురస్రరం వొచ్చి 'దాతృత్వాన్ని' సూచిస్తుంది, అలాగే 76వ చతురస్రరం 'జ్ఞానాన్ని' సూచిస్తుంది, 78వ

చతురస్రరం 'మునివృత్తి'ని సూచిస్తుంది. ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది . ఆ గడిలో పాచిక పడితే నిచ్చేనె ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.

అలాగే 41వ గడి 'అవిధేయతకు' ప్రతీకగా ,44వ చతురస్రరం లో పడితే 'అహంకారం' అని, 49వ గళ్లోకి పడితే 'అశ్లీలత' అని, 52వ గడిలోకి ప్రవేశిస్తే 'దొంగతనం' అని, 58వ గడిలో 'అబద్దలాడుట' అని , 62వ 

చతురస్రరం లోకి ప్రవేశిస్తే 'తాగుబోతు' అని, 69వ గదిలోకి అడుగు పెడితే 'అప్పులుపాలు' అని,

73వ గడిలోకి ప్రవేశిస్తే 'హంతకుడు/హత్యలు' అని 84వ 

చతురస్రరం లోకి వెళితే 'కోపిష్టి' అని, 92వ చతురస్రరం 'దురాశను' 95వ గడి 'గర్వాన్ని' సూచిస్తాయి. చివరగా 99వ గడి 'కామాన్ని'

సూచిస్తాయి. ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందకు జారిపోతారు. 

ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని ముని చెప్పకనే తెలుస్తుంది పిల్లలకు. చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి చేరుకుంటారు.

మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలో కూడా చెప్పడం. 

100వ చతురస్రరం లోకి ప్రవేశిస్తే "మోక్షం"

ప్రతి నిచ్చెన పై భాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత లేకపోతే వివిధ స్వర్గాలో , కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలోకం ఇలా ఉంటాయి

ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు.

అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్రవేసుకొని ఏ విధమైన సందేశం లేకుండా చేశారు

ధర్మఆచారములు

 *స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు*


100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు

శ్రీరమణీయం* *-(129)*_

 _*శ్రీరమణీయం* *-(129)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"కోరికలు, అవసరాలు తీర్చుకోవటం జీవన ప్రక్రియలో భాగం కదా ! మరి ఇవి సాధనకు ఎలా అడ్డవుతున్నాయి ?"*_


_*అవసరాలు శరీరానివి అయితే వాటికి సంబంధించిన కోరికలు మనసువి. మనస్సును బాధించని కోరికలు ఎన్ని ఉన్నా ప్రమాదం లేదు. ఫలితాన్ని ఆశించని కోరిక మాత్రమే మనసును బాధించకుండా ఉంటుంది. ఒకసారి మాడిన వంటకాన్ని తిరిగి మార్చలేనట్లే, కోరికవల్ల ఏర్పడ్డ కర్తృత్వం, కర్తృత్వంవల్ల ఏర్పడ్డ కర్మలను ఎవరూ మార్చలేరు. ఈకర్తృత్వం చేతనే మనసు తన పవిత్రతను కోల్పోతోంది. వాస్తవానికి ఏ అవసరాలు లేని మనసు, శరీరం కోసం ఆ కర్తృత్వాన్ని వహిస్తూ కోర్కెల పుట్టగా మారుతోంది ! పోలిక వల్ల ఏర్పడే భావ దారిద్ర్యం నేడు చాలామందిని అశాంతికి గురిచేస్తుంది. అవసరానికి తగినట్లు కాకుండా, అభిరుచులకు తగినట్లుగా ఉండాలన్న అత్యాశ, మనసుని సహజత్వం నుండి దూరం చేస్తుంది. అవసరాలను గుర్తించి, అంతకు మించిన కోరికలను తగ్గించుకుంటే, మనసు తన సహజస్థితిలోనే ఉంటుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'అనవసరమైన ఆలోచనలే ఆటంకం !'*-


🕉🌞🌎🌙🌟🚩

300 పడకల హాస్పటల్

 హైదరాబాద్ లోని 

ఈ సి ఐ ల్ లో 

అత్యాదునిక సదుపాయలతో 300 పడకల హాస్పటల్ ఉంది ...

కనుక ఈ సి ఐ ల్ 

దిగీ ఎవరిని అడిగినా 

తులసి హాస్పటల్  

అడ్రస్ చెబుతారు 

అలాగే పుట్టిన పిల్లలు  

నుండి 80 సంవత్ష రాల వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు ) 

వైద్యమైనా సరే అంటే   

10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా ఉచితమే

సదుపాయాలు కార్పోరేట్ తరహాలో ఉంటాయి

కనుక  

మనలో మన పక్కన  

ఎంతో మంది పేదవాళ్ళు జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు  

అలాంటి వారికి  

ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి 

మనమంతా కలసి 

ఒక్క పసి ప్రాణాన్పి కాపాడినా చాలు    

ఎ ఒక్కరు 

టెంక్షన్ పడకూడదనే 

నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్‌కి 

ఈ మెసేజ్ పంపుతున్నాను

మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే 185000 మందికి 

ఈ విషయం తెలుస్తుంది

కనీసం 50 మంది ప్రాణాలు కాపాడుదాం


తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ 


Contact number 

040-49336699

9505108108


Hospital name 

Tulasi hospitals Ecil Hyderabad 


Just forward please

this is forward message

for your friends

మద్రాసు ఉమ్మడి రాష్ట్రం

 మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.


 దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.


           గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.


మిత్రులకు విన్నప్పము, ,ఇ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు ,ఘంటసాల గొప్పతనం

మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత

*15. వేదాంగములు : శిక్ష*

 *ఓం నమః శివాయ*:

*42-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*



*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*తూర్పుతీరాన్నీ, దానిని ఆనికొని ఉన్న ఆంధ్ర ప్రాంతాన్నీ తీసికొంటే 98% యజుర్వేదాన్ని పాటిస్తారు. మిగిలిన 2% వారు ఋగ్వేదాన్ని. ఆంధ్రలో ''సామవేదం'' వారు లేరనే చెప్పవచ్చు. యజుర్వేదమే ఇక్కడ ప్రమాణమవటం వల్ల ఋగ్వేదంలోని ''ళ'' సహజంగానే ''ద''గా మారంది. తెలుగులో కూడ ఇతర భాషలలోని ''ళ'' 'ద'గా మారింది. ఆంధ్రలో వలె కాకపోయినా తమిళనాడులో కూడ తర్వాతి కాలంలో యజుశ్శాఖాద్యయులు అధిక సంఖ్యా కులైనారు. తమిళనాడులో 80% యజుశ్శాఖేయులు, 15% సామవేదం వారు మిగిలిన 5%  ఋగ్వేదులుగా అనుకోవచ్చు. ఇది ఇప్పటి పరిస్థితే అయినా పూర్వం సామవేదమను సరించే వారే అత్యధికులు తమిళనాడులో సామవేదంలోని 1000 శాఖలను అనుసరించే వారు తమిళనాడులో ఉండే వారనటం తప్పుకాదు.*



*ప్రస్తుతపు కేరళలో వాడుకలో నున్న భాష మళయాళం, తెలుగు, కన్నడములతో బాటు ఈ భాషని  పేర్కొనక బోవటానికి కారణం, పల్లవుల వలె ఇది కూడ ఈ సమీప కాలానికే చెందటం. వెయ్యి సంవత్సరాల క్రితం వరకూ కూడ కేరళ తమిళనాడులోనే ఉండేది - అక్కడ తమిళాన్నే వాడేవారు. ఆ తరువాత మళయాళం తమిళం నుండి జనించింది. తమిళంలోని 'ళ' (zha) తెలుగులో 'ద'గాను, కన్నడంలో 'ళ' గాను మారినా, మళయాళంలో మాత్రం ఆ రూపంతోనే ఉంది. ఇంతకూ చెప్పేదేమిటంటే ఆయా ప్రాంతాలలో వేదాల ఉచ్చారణల ననుసరించి, ప్రాంతీయ భాషలు తమకి ప్రత్యేక లక్షణాలైన అక్షరాలను ఏర్పర్చుకున్నాయి. ఇప్పటి వరకూ  చెప్పినదంతా ద్రావిడులనబడే వారి భూమికి సంబంధించింది. ఇక అఖిలభారత, అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా పరిశీలన.*



*ఉత్తర భారతంలో ''య'' బదులు ''జ''ని, 'వ'కి బదులు ''బ''ని వాడటం పరిపాటి. వాడుక భాషలోనే కాక కావ్య భాషలో కూడ ఇట్లాగే జరుగుతుంది. 'వ', 'బ'గా మారటం బెంగాలులో బాగా కనబడుతుంది. ''య'' 'జ'గా మారటం ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఇంకా ఉత్తర ప్రాంతాలలో కనబడుతుంది. పాణిని సూత్రమైన ''వ బయోరభేదం'' ('వ', 'బ'లను ఒక దాని స్థానంలో మరొకటి వాడవచ్చు) బాగా ఆచరణలో ఉన్నట్టు బెంగాలులో తెలుస్తుంది. బెంగాలులో 'వ' ప్రతిచోటా 'బ'గా మారుతుంది. అసలు 'వంగ' అన్నదే 'బెంగాలు'గా మారింది. ''వంగవాసి'', ''బంగవాసి''గా మారింది. ఈ తప్పుని వారే గుర్తించారు. ఈ తప్పుని దిద్దటానికి బెంగాలులో ఒక పరీక్షని కూడ పెట్టారు. దాని పేరు ''వంగ పరిషత్‌'' అన్ని ప్రచురణలలోనూ ''బ'' కి బదులు ''వ''ని వాడాలని వారి సంకల్పం. ఆ సంకల్పంలో అప్రయత్నంగా, అనవసరమైన చోట్ల కూడా ''బ''ని ''వ''గా మార్చారు.'బంధు' (అంటే చుట్టం)ని 'వంధు'గా మార్చారు. 'వంగబంధు' సరియైన మాట. అది ''బంగబంధు''గా మారితే దానిని తప్పుగా ఇప్పుడు 'వంగు వంధు''గా మార్చారు. ఉత్తర భారతంలోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ ''వ''కి బదులు 'బ'ని వాడుతారు. బిహార్‌, నిజానికి విహార్‌. ఈ ప్రాంతంలో బౌద్ధ విహారాలు పుష్కలంగా ఉండేవి. ''రాష్‌ బిహారి'' నిజానికి ''రసవిహారి'' ''వ''ని ''బ''గా పలుకటానికి కారణమేమిటి? ఒక శాఖకి చెందిన ఆ ప్రాంతీయులట్లా పలకాలని ప్రాతిశాఖ్య నిర్దేశిస్తుంది. ఈ నియమం వేద మంత్ర పఠనానికి సంబంధించినది - కాని అదే వాడుక భాషకీ, సాహిత్య భాషకీ విస్తరింప బడింది. అంటే, ఆ ప్రాంతంలో ఒకప్పుడు 'శిక్ష' నియమాలను ఎంతో నిష్ఠతో పాటించే వారనమాట.*



*దేశం మొత్తమ్మీద యజుశ్శాఖవారు అత్యధికులు ఉన్నారు. ఈ వేదానికి రెండు పాఠాలు - అంటే కృష్ణ యజుర్వేదం, శుక్లయజుర్వేదం ఉన్నాయని కూడ. దక్షిణ భారతంలో కృష్ణయజుర్వేదం బహుళ ప్రచారంలో ఉంటే, ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేద ముంది. శుక్లయజుర్వేదానికి గల అనేక శాఖలలో ఒకటి మాధ్యన్దిన శాఖ. దీనిని ఉత్తర భారతంలో నిష్ఠగా అనుసరిస్తారు. తత్సంబంధమైన ప్రాతిశాఖ్య ప్రకారం ''య'' స్థానంలో ''జ''ని వాడవచ్చు. అట్లాగే ''ష'' స్థానంలో ''క''ని వాడవచ్చు. అందువల్లే దాక్షిణాత్యులు ''యత్‌ పురుషేణ హనిషా'' అంటే ఉత్తర దేశీయులు ''జత్‌'' ''పురుషేణ హవికా'' అంటారు. కాలక్రమేణా ఉత్తరదేశంలో ఈ మార్పు చాలా మాటలకి వ్యాపించింది. ''యమున'', ''జమున''గాను, 'యోగి', 'జోగి'గాను 'యుగ', 'జుగ'గాను, 'యాత్ర', 'జాత్ర'గాను మారాయి. 'ష' 'క'గా మారినప్పుడు 'ఋషి' 'ఋకి'గా మారింది. 'క్ష', 'ష' సన్నిహిత బంధువులు కదా. అందువల్లనే ఉత్తరదేశంలో 'క్ష', 'క' అవుతుంది. 'క్షీరం' 'కీర్‌' అవుతుంది. ఇట్లాంటివే ఎన్నో ఉదాహరణలివ్వ వచ్చు.*



*ఇక అంతర్జాతీయ స్థాయిలో పరిశీలన. క్రైస్తవం, బైబిల్‌ జన్మించిన పాలస్తీనాకూ, ఇజ్రెయిల్‌, సెమిటిక్‌ దేశాలకూ వెళ్దాము. క్రైస్తవుల ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ - ముస్లిం కొరాన్‌కి మూలం. మొదటి దాంట్లో ఉన్నవి రెండవ దాంట్లో ప్రత్యక్షమవు తూంటాయి. కాని అరేబియాలో ఉచ్ఛారణ మారుతూంటుంది. 'జోసెఫ్‌' 'యూసఫ్‌'గాను, 'జెహొవ' 'యహొవ'గాను మారుతాయి. క్రైస్తవం, ఇస్లాంలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ దేశాలలో కూడ కొన్ని భాషలలోనే 'య' శబ్దం ప్రముఖంగా ఉంటుంది. కొన్నిటిలో 'జ' శబ్దం ఎక్కువౌతుంది. గ్రీస్‌ వెళ్లితే 'జ' శబ్దం స్పష్టమవుతుంది. దీనంతటికీ మూలం వేదాలలో కనిపిస్తుంది.*



 *వేదాలలోని ''యహ్వన్‌'' అన్న దేవత జహోవ (యహోవ), దేపిత - జూపిటర్‌, సంస్కృతంలో అసంపూర్ణమైన హల్లులు మొదట్లో వస్తే మరొక భాషలో చెప్పేప్పుడు దానిని వదిలివేస్తారు ''దౌపతిర్‌'', ''¸°పితర్‌''గాను జూపిటర్‌గాను మారుతుంది. ''యహ్వన్‌'', ''ద్యౌపితర్‌'' లలోని 'య' 'జ'గా మారటం వల్ల 'జెహోవ' జూపిటర్‌ ఏర్పడ్డాయి - దీని అర్థమేమిటి ?ప్రపంచమంతా వేదవిహితమైన విధులు వ్యాప్తమై యున్న రోజులలో, గ్రీస్‌ ప్రాంతంలో ''మాధ్యన్దిన శాఖ'' (యజుర్వేదం) బాగా ప్రాచుర్యంలో ఉండేదని తెలియటం లేదా? వేదపద ఉచ్చారణ ప్రాంతీయ భాషను ప్రభావితం చేసిందా లేక ప్రాంతీయ భాష వేదపద ఉచ్చారణనా?ఒక్కొక్క ప్రాంతంలో వేదాలలోని పదాలే ఆ ప్రాంతపు వాడుక భాషలో, కావ్య భాషలో వాడబడేవి. దీని బట్టి వేదాలన్ని దేశాలలోనూ వ్యాప్తి చెందాయని తెలుస్తుంది.*



*వేదాల శిక్షానియమాలు ప్రాంతీయభాషలకు ప్రధాన ఉచ్ఛారణ లయ్యాయి. దీనికి కారణం ప్రాతిశాఖ్య నియమాలు ఏ ఒక్క ప్రాంతానికీ చెందినవి కాకపోవటం. వేదశాఖ ప్రచారంలో ఉన్న ప్రాంతాలన్నిటి కొరకూ ఏర్పడింది. కాశ్మీరులోనైనా కామరూపం (అస్సాం)లోనైనా జైమిని సామని పఠించేవారు ''ష'' అని పలికితే ఇతరులు ''ద'' అనో ''ళ'' అనో పలుకుతారు.గుజరాతీయైనా, మరాఠీ అయినా, మరేదైనా మాతృభాష కావచ్చు శుక్లయజుర్వేదాన్ని పఠించేవాడు ''ద''నే పలుకుతాడు. ప్రాతిశాఖ్య ఏ ప్రాంతానికీ పరిమితం కాదు, ఉచ్చారణ నియమాలను నిర్దేశిస్తుంది. కాలక్రమేణా ఏ శాఖ ఏ ప్రాంతంలో వాడుకలో ఉంటే, ఆ అక్షరానికి గల ప్రత్యేక లక్షణం ప్రాంతీయ భాషకి కూడ ప్రాకింది.శిక్షా శాస్త్రం గురించి గమనింపదగ్గ మరికొన్ని అంశాలు: వేద శబ్దాలను, ఉచ్చారణ పద్దతులను మార్చరాదన్నాను. శాఖా భేదాల వల్ల చిన్న చిన్న మార్పులను శిక్షాశాస్త్రం అనుమతిస్తుంది. ఆ విధంగానే స్వరస్థాయికి సంబంధించిన మార్పులూ ఆమోద యోగ్యాలే.*



*వేదాలను వల్లించటంలో సంహిత, పద, క్రమ పద్ధతులున్నాయని చెప్పాను. ఆయా భిన్న రీతులని ప్రాతిశాఖ్య అనుమతిస్తుంది. ఇవి శిక్షాశాస్త్ర భాగాలు. ఇదేదో శబ్దాలకి సంబంధించిన చర్చ అని తేలికగా చూడకూడదు. సంస్థితమైనది శబ్దమే. అందువల్లనే వేదపురుషుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపే నాసిక, శిక్షాశాస్త్రం. సంస్కృతంలోని 50 అక్షరాలు (శబ్దాలు) వేదాలనుండి వచ్చినవే. ''జ్ఞ'' అన్న అక్షరాన్ని విడిగా తీసుకుంటే 51 అవుతాయి. వీటిని ''మాతృక'' అంటారు. ఈ మాటకి చాలా అర్థాలున్నాయి. మాతృ అంటే మాత - దీని అర్థం విశ్వమాత. ఆ పరాశక్తి ప్రతిబింబాలే ఈ 51 అక్షరాలూను. జగత్‌సృష్టి పరాశక్తి వల్లనే జరిగితే, సృష్టికి శబ్దమే మాధ్యమమైతే 51 అక్షరాలూ పరాశక్తి స్వరూపాలే అవుతాయి కదా!*



*శిక్షాశాస్త్రం ప్రకారం ఈ 51 శబ్దాలూ పరాశక్తి శరీరభాగాలే - అంతే కాదు, ఏ అక్షరం ఏ శరీర భాగానికి ప్రతీకో కూడ ఆ శాస్త్రం చెప్తుంది. మన దేశంలో కల శాక్తేయుల 51 స్థావరాలకూ, ఆ విశ్వ దేహపు 51 భాగాలకు సంబంధముంది. శిక్షాశాస్త్రం వేదపురుషుని నాసికగా భావింప బడటమే కాక అక్షరాలన్నీ కలిసి పరాశక్తి - విశ్వమాత - రూపంగా భావింప బడటం ఆ శాస్త్ర ప్రాధాన్యతని మరీ ఎక్కువ చేస్తుంది!*


🕉🌷🕉🌷🕉🕉

ఏది గమ్యం

 (25.03.2021ఈనాడు అంతర్యామి లో వ్యాసం..ఎర్రాప్రగడ రామకృష్ణ)

--------------------------------------

ఏది గమ్యం ?

==========

   నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం. నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పనిలేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు. ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే  చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు.


తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు. బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు. ‘ఎవరికైనా  ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలామందిది ఇదే పరిస్థితి.

(రచన... ఎర్రాప్రగడ రామకృష్ణ)

నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప, ఆలోచన కానేకాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.  ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి  వచ్చి చేరుతుంది. ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే  ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి. చిరునవ్వుతో పలకరించాలి. ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి.


ఆ సంధి  సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం. ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదన లోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.    

సాధన  క్రమంలో ఒళ్ళు జలదరించడం, ఆవలింతలు రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని  జరిగితే- అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని  మనం గ్రహించాలి. పరమహంస యోగానందజీ  చెప్పినట్లు వాటి  ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి. ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు,  వాటికోసం ప్రయత్నించకూడదు. వైకుంఠపాళిలో  నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం!

--- ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి.

రెండు ఇడ్లీలు*

 *రెండు ఇడ్లీలు*

_(రచన-గండ్రాజుల ప్రవీణాఉదయ్)_

*వేదవతి  ప్రతిరోజు  తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ  వచ్చేది.*  

*_ఆకలితో ఉన్నవాళ్లు  ఎవరైనా  తింటారులే..అని._*


*రోజూ ఆ దారివెంట  వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో  చిన్నగా  గొణుక్కుంటూ  వెళ్లడం  జరిగేది.* 

*ఒకరోజు వేదవతి గోడ  పక్కనే  నిలబడి అతను  ఏమి అంటున్నాడో  వినాలని  అనుకున్నది.*  


*అతను చెప్తున్న మాటలు....* 

*"నువ్వు చేసిన  పాపం నీ దగ్గరే ఉంటుంది.* 

*నువ్వు చేసే పుణ్యం  వచ్చి నిన్నే  చేరుతుంది."*  


_ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు. రోజు ఇడ్లీ  పెడుతున్నాను. తీసుకు  పోతున్నాడు._ 


*"నువ్వు మహాలక్ష్మివి  చల్లగా ఉండమ్మా! అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు.... ఇడ్లీలు బావున్నాయని  చెప్పకపోయినా పర్లేదు.... కనీసం ధన్యవాదాలు అమ్మా!" అని చెప్పడం  కూడా  తెలియలేదా  ఇతనికి?*  


_ఏదో ఆ చెత్త వాగుడు  వాగిపోతున్నాడు. అని చాల కోపంతో  రగిలిపోయింది.  అయినా ఇడ్లీలు పెట్టడం మాత్రం మరిచిపోలేదు._


*రోజురోజుకి అతనిపై  పెరుగుతున్న  కోపం  అతనిని  చంపేయాలి..  అనేంతగా  మారిపోయింది.*  


*ఒకరోజు ఆ ఇడ్లీలపై  కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనసు ఒప్పుకోలేదు... చేతులు వణకడం  మొదలెట్టాయి. ఆలోచన మొదలయింది.* 

*ఛ.. ఛ* వద్దులే... అతను అలా ఉంటే  నేను ఎందుకు ఇలా మారిపోయాను.  అని ఆ ఇడ్లీలు పడేసి  మంచి ఇడ్లీలే పెట్టింది. 


*ఆ వ్యక్తి  ఇడ్లీలు తీసుకుని  మళ్ళీ అవే మాటలు చెప్తూ  వెళ్ళాడు. కొట్టాలన్నంత కోపం  వచ్చినా తనను  తాను  సమాధాన  పరుచుకుంది.*  


*_ఆ రోజు మిట్ట మధ్యాహ్నం  ఎవరో తలుపు కొట్టినట్టు   ఉంటే వెళ్లి  తలుపు తీసింది. ఎదురుగా మురికి  బట్టలతో ఓ యువకుడు.🙎‍♂️అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం  చేసుకుంటానని ఇల్లు వదిలి  అలిగి  వెళ్లిన తన కొడుకే._* 


*అమ్మా! ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించారు.*  💰

*చేతిలో చిల్లి గవ్వ లేదు. బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను.*  

*ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు. నా ప్రాణాలు  కాపాడాడు.  అని చెప్పాడు.*  👨🏾‍🦯


*ఆ మాటలు వినగానే  ఆమెకు  వణుకు  పుట్టేసింది.*  

*విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకుకి  నేనే  యముడినై  ఉండిఉంటానే  అని కంటతడి  పెట్టుకుంది.*  


*ఇప్పుడు ఆమెకు  ఆ ముసలాయన మాటలక అర్థం  తెలిసింది.*  


*"నువ్వు చేసిన పాపం నీతోనే  ఉంటుంది* 

*నువ్వు చేసే మంచి నిన్ను  వెతుకుని  వచ్చి చేరుతుంది."*


_అందరికీ అన్ని అర్థం అవ్వవు._  

_అర్థం అయ్యేంతవరకు  ఎవ్వరమూ  ఎదురుచూడము._


*చేసిన ధర్మం  ఎప్పుడూ   ఏదో ఒక రూపంలో  మనకు  వచ్చిచేరుతుంది*


*ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకుందాం.*


*మనం తెలియక చేసే తప్పులనుండి  బయట పడే ఒకేఒక్క మార్గం... మంచి చేయడం మాత్రమే!*


*ధర్మాన్ని కాపాడుదాం- అది మనల్నీ కాపాడుతుంది.*


🙏🙏🙏🙏🙏 *(సేకరణ -వెలిశెట్టి నారాయణరావు)*