9, ఫిబ్రవరి 2026, సోమవారం

నక్షత్రం: పుబ్బ / పూర్వఫల్గుణి

  🌹🌷💫⭐🛕⭐💫🌷🌹

*ఆదివారం 8 ఫిబ్రవరి 2026*


             *నక్షత్ర స్తోత్ర మాలిక*                  

               *11 వ రోజు*

*నక్షత్రం: పుబ్బ / పూర్వఫల్గుణి* *(Pubba / Purva Phalguni)*


*అధిపతి: శుక్రుడు (Shukra)*


   *ఆరాధించాల్సిన దైవం* 

    *మహాలక్ష్మి / భగుడు*


​పుబ్బ నక్షత్ర జాతకులు మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కోరుకునే వారు, ఐశ్వర్య ప్రాప్తి కోసం పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం:


*​🙏 శ్రీ కనకధారా స్తోత్రం 🙏*


​*వందే వందారు మందార మిందిరా నందకందళమ్।*

*అమందానంద సందోహ బంధురం సింధురకన్యకామ్॥1॥*


​*అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ*

*భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్।*

*అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా*

*మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 2 ॥*


​*ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః*

*ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ।*

*మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా*

*సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః ॥ 3 ॥*


​*విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం*

*ఆనంద హేతు రధికం మురవిద్విషోఽపి।*

*ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధం*

*ఇందీవరోదర సహోదర మిందిరాయాః॥ 4 ॥*


​*దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*

*అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే ।*

*దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం*

*నారాయణ ప్రణయినీ నయనారువాహః||5॥*


​*సంపత్కరాణి సకలేంద్రియ నందనాని*

*సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి ।*

*త్వద్వందనాని దురితాహరణోద్యతాని*

*మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 6 ॥*


​*కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః।*

*అవలోకయ మామకించనం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 7 ॥*


​*స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం*

*త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।*

*గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతీ తే భువి బుధభావితాశయాః॥8॥*


​॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత శ్రీ కనకధారా స్తోత్రం సంపూర్ణమ్ ॥


              ​*విశేషం*


పుబ్బ నక్షత్రం రోజున ఈ స్తోత్రాన్ని పఠించి, లక్ష్మీదేవికి పాయసం లేదా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితం ఉంటుంది.```


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

09ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

*🌹09ఫిబ్రవరి2026🌹*      

  *దృగ్గణిత పంచాంగం* 

               

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : అష్టమి* ‌పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : విశాఖ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*యోగం : వృద్ధి* రా 12.52 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : బాలువ* సా 06.12 వరకు *కౌలువ* పూర్తిగా రాత్రంతా

*సాధారణ శుభ సమయాలు*

           *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *రా 10.04 - 11.51*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : ప 11.19 - 01.06*

*దుర్ముహూర్తం  : మ 12.44 - 01.31 & 03.03 - 03.49*

*రాహు కాలం   : ఉ 08.02 - 09.29*

గుళికకాళం      : *మ 01.48 - 03.15*

యమగండం    : *ఉ 10.55 - 12.22*

సూర్యరాశి : *మకరం*                       

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.46*

సూర్యాస్తమయం :*సా 06.15*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.36- 08.54*

సంగవ కాలం      :*08.54 - 11.13*

మధ్యాహ్న కాలం  :*11.13 - 01.31*

అపరాహ్న కాలం  :*మ01.31- 03.49*

*ఆబ్ధికం తిధి :మాఘ బహుళ అష్టమి*

సాయంకాలం    :*సా03.49- 06.08*

ప్రదోష కాలం      :*సా 06.08- 08.37*

రాత్రి కాలం           :*రా 08.37- 11.57*

నిశీధి కాలం        :*రా 11.57- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.56 - 05.46*

******************************

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*పౌరోహిత్యం రజనిచరితం* 

*గ్రామణీత్వం నియోగో*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

మాఘ పురాణం - 22వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷సోమవారం 9 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 22వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *9వ తేదీ సోమవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు* 


మాఘ పురాణం  ఇరవైరెండవ అధ్యాయంలో, జహ్నుడు ఏకాదశి వ్రతం మహాత్మ్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గృత్నృమదుడు పౌరాణిక ఘటనమైన క్షీరసాగర మథనాన్ని వివరించాడు. 

సముద్రంలోని అమృతాన్ని పొందేందుకు దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని మథన దండంగా, వాసుకిని కవ్వంగా ఉపయోగించి క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారు. 

మథన ఫలితంగా లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవ వంటి అద్భుతమైన ఐశ్వర్యాలు లభించాయి. కానీ, తరువాత పుట్టుకొచ్చిన భయంకరమైన విషాన్ని శంకరుడు తన కంఠంలో దాచి, లోకాలను కాపాడాడు.

అమృతం కోసం మరింత తీవ్రంగా సాగిన మథనంలో, మోహిని అవతారంఎత్తిన విష్ణుమూర్తి మాయాజాలంతో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. అసుర గురువు శుక్రాచార్యుడి మాయతో రాక్షసులు దానిని అపహరించ ప్రయత్నించగా, సూర్యచంద్రుల సూచన మేరకు విష్ణువు రాహు-కేతువుల తలలను నరికి అమృతాన్ని విడిపించాడు. దేవతలు అమృతం సేవించి మృత్యుంజయాలు కాగా, రాక్షసులు మోసపోయారు. ఈ కథ ద్వారా, క్షీరసాగర మథనంలో ఎదురైన కష్టాలు, విష్ణుమూర్తి యొక్క అవతార మహిమలను వివరించి, ఏకాదశి వ్రతం యొక్క ఫలాన్ని గృత్నృమదుడు జహ్నునికి తెలియజేశాడు. 

ఏకాదశి వ్రతాన్ని పాటించడం దేవతలకు అమృతం లాగా ఫలిస్తుందని, పుణ్యలోకాలను చేరుస్తుందని, దాని మహిమ అశ్వమేధ యాగాలకు సమానమని వివరించాడు…


*క్షీర సాగర మధనము*```


గృత్నృమద మహాముని జహ్ను మునితో నిట్లనెను. “జహ్ను మునివర్యా! వినుము, అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలము నందు తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై ఇంద్ర పదవి నందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలసి పారాయణం చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను.


జహ్ను ముని “గృత్నృమద మహామునీ తిధులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటి కంటె శుభ ప్రదమైనది యెట్లయ్యెను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతము ఓక్కటే ఇచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము” అని అడిగెను. 


గృత్నృమద మహాముని యిట్లనెను.. “పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రత కథను చెప్పెదను వినుము.. “పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజు వాసుకిని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడు వరుసలుగ కట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసన అగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. 

మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. 

దేవ దానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి వద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి..

“దేవ దానవులు చేసిన శివస్తుతి“

```

*నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే*

*నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే॥*


*నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ*

*నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే॥*


*త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక*

*త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే॥*


*త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే*

*అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః॥*


*హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే*

*మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల॥*


*పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్*```


అని భయ పీడితులైన దేవ దానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడు ఆ విషమును మ్రింగి తన కంఠమున నిలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి ఏర్పడినది. 

విష భయము తొలగిపోవుటచే నిశ్చిం తులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. 

ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావి యగు శ్రీమహావిష్ణువు మోహిని రూపమునందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి..“దేవతలారా,దానవులారా!” యని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవ దానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.


ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను. దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొక వైపునను కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహ వ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు నెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకి ఇంపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవళితోను, హస్త కంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవ దానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండెను. 


దేవ దానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.```


*“రాహు కేతువుల వివరణ“*```


రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధన జనిత శ్రమను ఇంకను  వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవ రూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. 


మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. ఈ

రాక్షసులు అమృతమును ఆత్రముగ త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. 


వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి.


చంద్రుడు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ యిట్లుఅయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగారని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.


చక్రముచే నరకబడి  చావు బ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగా యున్నది. మాగతి యేమి? మాకు ఆహారము ఏదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. 


శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలముల యందు సూర్యుని, చంద్రుడిని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. 

ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగా మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. 


కొంత కాలము గడిచెను. సత్యజిత్తను శూద్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.

ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడుగకుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.


పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమునకెగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేద్రుడును ‘నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తి కలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతి దినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకు ఏమి చేయవలెనో తోచలేదు. పుష్ప చోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజ తరువాతి నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల మరియు లోపల అంతటను చల్లెను.

యక్షుడు యధా పూర్వముగ పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుండి పోలేక పోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని ‘ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతి దినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను. 


యక్షుడును ‘నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసితిని. కాని బుధ్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమియు మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడు అయిన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో ఉండెను.

```

*మాఘపురాణం ఇరవై రెండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

నేర్చుకుంటాము

 *🔔శుభోదయం🔱Goodmorning 🔔*

     

        *_తెలుసుకోవాలని ముందుకు వెళితే చాలా నేర్చుకుంటాము._*

          *_అంతా తెలుసని ఆగిపోతే చాలా కోల్పోతాము._*


శుభ సోమవారం 🕉️Happy Monday.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - విశాఖ -‌‌ ఇందు వాసరే* (09.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆదిశంకరులు

 ఆదిశంకరులు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్లిపోలేదు. ధర్మ రక్షణ కోసం దేశానికి నాలుగు దిక్కులందు 4 మఠాలను (పీఠాలను) స్థాపించి, ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి "మఠామ్నాయ మహానుశాసనము" అనే గ్రంథమే సాక్ష్యం. దానికి సంబంధించిన పూర్తి శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి:


1. తూర్పు దిక్కు (పూరీ - గోవర్ధన పీఠం):

శ్లోకం:

"పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే |

జగన్నాథః ప్రభుర్దేవో భోగవారో వనస్థలీ ||

ఋగ్వేద శాఖా కథితా హి తత్ర ధర్మస్య వృద్ధిః |

మహావాక్యం చ "ప్రజ్ఞానం బ్రహ్మ" అస్మిన్ పీఠే ప్రతిష్ఠితమ్ ||"

వివరణ: ఆది శంకరులు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి, దానికి పద్మపాదాచార్యుల వారిని పీఠాధిపతిగా నియమించారు.

వేదం: ఋగ్వేదం | మహావాక్యం: *"ప్రజ్ఞానం బ్రహ్మా"*


2. దక్షిణ దిక్కు (శృంగేరి - శారదా పీఠం):

శ్లోకం:

"దక్షిణే శృంగేరీ పీఠం శక్తిః శ్రీ శారదా భవేత్ |

వరాహో దేవతా తత్ర రామక్షేత్రముదాహృతమ్ ||

యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనమ్ |

"అహం బ్రహ్మాఽస్మి" వాక్యం చ తత్రైవ పరికీర్తితమ్ ||"

వివరణ: దక్షిణాన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి, పీఠాధిపతిగా సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు.

వేదం: యజుర్వేదం | మహావాక్యం: *"అహం బ్రహ్మాఽస్మి"*


3. పశ్చిమ దిక్కు (ద్వారక - శారదా మఠం):

శ్లోకం:

"పశ్చిమాయాం శారదామఠః కీటవారః సముదాహృతః |

తీర్థం చ గోమతీ ప్రోక్తం ద్వారకాక్షేత్రముచ్యతే ||

సామవేదో బ్రహ్మరూపః తత్ర ధర్మముదాహృతమ్ |

"తత్త్వమసి" మహావాక్యం తత్రైవ పరికీర్తితమ్ ||"

వివరణ: పడమర ద్వారకా పీఠాన్ని స్థాపించి, పీఠాధిపతిగా హస్తామలకాచార్యుల వారిని నియమించారు.

వేదం: సామవేదం | మహావాక్యం: *"తత్త్వమసి"*


4. ఉత్తర దిక్కు (బదరి - జ్యోతిర్మఠం):

శ్లోకం:

"ఉత్తరే జ్యోతిర్మఠం చ బదరికాశ్రమ ముచ్యతే |

నారాయణః ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తికా ||

అథర్వణ వేద వాక్యాని తత్ర స్వీకురుతే సదా |

"అయమాత్మా బ్రహ్మా" వాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితమ్ ||"

వివరణ: ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యుల వారికి బాధ్యత ఇచ్చారు.

వేదం: అథర్వణ వేదం | మహావాక్యం: *"అయమాత్మా బ్రహ్మా"*