30, ఏప్రిల్ 2026, గురువారం

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 29 ఏప్రిల్ 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣1️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *210 వ రోజు*                   

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*సంజయుని రాయబారం*```


సంజయుడు ఉపప్లావ్యం చేరి అర్జునినితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో “ధర్మజా! నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగ క్షేమం కనుక్కు రమ్మని నన్ను పంపాడు" అన్నాడు. 


ధర్మరాజు "మా పెదనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు పెదనాన్న మిమ్ము పంపడం మా అదృష్టం. నిన్ను చూస్తూ వుంటే సాక్షాత్తూ మా పెదనాన్నను చుసినట్లున్నది. వారు క్షేమమా, వారి పుత్రులు క్షేమమా, మనుమలు క్షేమమా, భీష్మ ద్రోణ, కృప అశ్వథామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? వారికి మేమిచ్చిన గ్రామాలను దుర్యోధనుడు లాగుకొన లేదు గదా? గురు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మా విషయంగా దోషములను ఎంచడం లేదు కదా! ఒక్కసారిగా పిడుగులవంటి అరవై తీష్ణ బాణములను ప్రయోగింప గల అర్జునుడి బాహుబలమును స్మరిస్తున్నారా! గద చేత ధరించి దట్టమైన అడవులలో సంచరించే మదపుటేనుగులాగా యుద్ధరంగంలో సంచరించే భీమసేనుడిని స్మరిస్తున్నారు గదా! మునుపు రాజసూయ యాగ సందర్భంగా తనకెదురైన కళింగ రాజును జయించిన సహదేవుని, శిబిని, త్రిగర్త రాజులను జయించిన నకులుడిని స్మరిస్తున్నారా! దురాలోచనతో ద్వైత వనంలోకి ఘోషయాత్రకు వచ్చి బందీలైన ధృతరాష్ట్ర కుమారులను బంధ విముక్తి చేసిన భీమార్జునులను, ఆ సంగతిని స్మరిస్తున్నారా!" అన్నాడు. 


సంజయుడు దానిలోని అంతరార్ధం అర్ధం చేసుకుని తన వాదన వినిపించడం మొదలు పెట్టాడు.. 

“ధర్మజా! నీవు అడిగినట్లే అందరూ కుశలంగా వున్నారు. సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దూరంహంకారులు, నీతి మంతులు, సత్వసంపన్నులు ఇలా అనేక ప్రవృత్తులు కలవారు ఉన్నారు. వారు ఒకరి మాట ఒకరు వినరు. కౌరవులు యుద్ధ ప్రసంగంలో మీ గురుంచి, వీరాగ్రేసరులైన భీమార్జునుల గురుంచి స్మరిస్తున్నారు. ధర్మజా! నీవు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేసావు కాని వృద్ధుడైన దృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదన లేక పోతున్నాడు. మనసులో మధన పడుతున్నాడు. కనుక అజాత శత్రువైన నీవు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించడం ధర్మమా? హస్థినాపుర ప్రజలు శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజా! శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీతమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను” అనగానే ధర్మరాజు “సంజయా నీవు చెప్పదలచినది చెప్పవచ్చు” అన్నాడు.

```

*సంజయుడి దౌత్యం*```

సంజయుడు అందరిని ఒక్క సారి పరికించి “మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ సంధి చేయమని శాంతి సందేశంతో నన్ను పంపాడు. ఇది పాండవులకు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది. ఇది సంయమనం పాటించవలసిన సమయం. మీరు ధర్మస్వరూపులు, శాంత స్వభావులూ. మీరు ఓ చిన్న దోషం చేసినా అది తెల్లని వస్త్రం మీద నల్లని మరకలా స్పష్టంగా కనినిపిస్తుంది. మీకు సుయోధనుని వలన కష్టం కలిగింది.. దానిని నీవు తుడిచి వేయాలి. యుద్ధం వలన జన నష్టం జరుగుతుంది. జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరిని పోగొట్టుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు. మీకు శ్రీకృష్ణుడు పెట్టనికోట, దృపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు ఇక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించ లేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, శల్యులు అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములూ, కుమారులు అజేయులు. సోమదత్త, బాహ్లికులను శివుడు కూడా జయించ లేరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది. కృష్ణార్జునలారా! మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాండవులు వారి బంధు మిత్రులందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా! శాంతించండి. ఆగ్రహమును వీడండి. మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు" అని పలికి కూర్చున్నాడు.```


               *సశేషం* 

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

30ఏప్రిల్2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌷గురువారం🌷*

   *🌹30ఏప్రిల్2026🌹* 

   *దృగ్గణిత పంచాంగం*                 

         

          *ఈనాటి పర్వం*   

      *నరసింహ స్వామి*

            *జయంతి* 


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - శుక్లపక్షం* 


*తిథి : చతుర్దశి* రా 09.12 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : చిత్త* రా 02.16 వరకు ఉపరి *స్వాతి*

*యోగం : వజ్ర* రా 08.55 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : గరజి* ఉ 08.29 *వణజి* రా 09.12 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*           

అమృత కాలం  :*రా 07.20- 09.04*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.30*

*వర్జ్యం    : ఉ 08.56 - 10.40*

*దుర్ముహూర్తం  : ఉ 09.58 - 10.48 మ 03.03 - 03.54* 

*రాహు కాలం  :మ 01.4 - 03.16*

గుళికకాళం      : *ఉ 08.54 - 10.29*

యమగండం    : *ఉ 05.43 - 07.19*

సూర్యరాశి : *మేషం*                  

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 05.51*  

సూర్యాస్తమయం :*సా 06.36*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.43 - 08.16*

సంగవ కాలం    :*08.16 - 10.48*

మధ్యాహ్న కాలం :*10.48 - 01.21*

అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*

*ఆబ్ధికం తిధి :వైశాఖ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం :*సా 03.54 - 06.26*

ప్రదోష కాలం    :*సా 06.26 - 08.42*

రాత్రి కాలం       :*రా 08.42 - 11.42*

నిశీధి కాలం      :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.58*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


        *క్షరాక్షరస్వరూపాయ* 

       *పరాత్పరతరాయ చ*


      *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷*సేకరణ*🌷

       🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వైశాఖ పురాణం

  *🐚బుధవారం 29 ఏప్రిల్ 2026🐚*


_*🚩వైశాఖ పురాణం🚩*_

     *12వ అధ్యాయము*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*```


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుతు నిట్లనెను.. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును 

అనుభవించెనో వివరింపుమని కోరెను. 


శ్రుతదేవుడిట్లనెను..

“కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము..


‘శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిదప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. “అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు.” అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి “కల్యాణీ పతిభక్తిమతీ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను, శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమ”ని పలికెను. 


ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి..

“కల్యాణీ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవుట వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా!```


*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

*శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 29 ఏప్రిల్ 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *72వ భాగం*``


*సూర్యవంశ రాజుల చరిత్ర*```


శ్రీమహావిష్ణువు తన యోగనిద్రను వీడి సృష్టి ఆరంభించాలి ఆని సంక ల్పించాడు. ఆయన నాభి నుండి పద్మము ఉద్భవించింది. పద్మము నుండి పద్మసంభవునిగా బ్రహ్మదేవుడు జన్మించాడు. నారాయణుడు సృష్టి కార్యం ప్రారంభించమని బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ కుడిచేతి బొటనవ్రేలు నుంచి దక్షుడు మానస పుత్రుడిగా జన్మించాడు.


దక్షుడు తన కుమార్తె అదితిని కశ్యపునికి ఇచ్చి వివాహంచేశాడు. కశ్యపునికి-అదితికి జగత్తుకి 

శక్తి,ప్రకాశము ఇచ్చే సూర్యుడు జన్మిం చాడు. సూర్యుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వైవస్వతుడు పుత్రుడిగా జన్మించాడు. వైవస్వతుడు ప్రస్తుత ఏడవ మన్వంతరానికి మనువుగా ఉన్నాడు.


వైవస్వతునికి ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, ప్రాంశుడు, నేదిష్ఠుడు, కరూషుడు, వృషధ్రుడు అనే పదిమంది కుమారులు జన్మించారు. ఈ పదిమందికి జన్మించిన సంతానం శాఖోప శాఖలుగా విస్తరించి సూర్యవంశం గా వృద్ధి చెందింది.


వైవస్వతుడి పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడి పేరుతో ఇక్ష్వాకు వంశం జగత్ ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశం లోనే జన్మించాడు. ఇక్ష్వాకుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వీరిలో యాభై మంది ఉత్తర భారతానికి రాజ్యాలు స్థాపించుకోగా, నలభై ఎనిమిది మంది దక్షిణ భారతానికి వెళ్లి రాజ్యాలు ఏర్పరచుకున్నారు.

పెద్దకుమారులు ఇద్దరు తండ్రి ఇక్ష్వాకుని వద్ద ఉండిపోయారు. 


ఒకసారి ఇక్ష్వాకుడు పితృదేవతలకు శ్రాద్దకర్మ చేయాలని నిశ్చయించి పెద్ద కుమారుడైన వికుక్షిని అడవికి వెళ్లి కుందేళ్ళ మాంసం తెమ్మన్నాడు. అడవికి వెళ్లి వేటాడి కుందేళ్ళ మాంసం తెస్తున్న వికుక్షికి బాగా ఆకలి వేసింది. ఆకలి బాధ ఎక్కువ సేపు ఓర్చుకోలేక తెస్తున్న కుందేళ్ళ మాంసంలో కొంత అగ్నితో వండుకుని తినేశాడు. మిగిలినమాంసాన్ని తండ్రి ఇక్ష్వాకునికి తెచ్చి ఇచ్చాడు.


శ్రాద్దకర్మలు చేయిస్తున్న కుల గురువు వసిష్టుడు వికుక్షి తెచ్చిన మాంసం చూసి అది వికుక్షి తినగా మిగిలిన మాంసమని గ్రహించాడు. 

ఎంగిలి చేయబడిన మాంసము శ్రాద్ధకర్మకు పనికిరాదని బయట పారవేయమన్నాడు. 


పితృ శ్రాద్ధ కర్మలో అపచారం కలిగినందుకు ప్రతి చర్యగా వికుక్షిని "అడవిలో కుందేలు మాంసం భక్షిస్తూ శశాదుడిగా జీవించమని" శపించాడు.


అడవికి వెళ్లి శశాదుడిగా మారిన వికుక్షి ప్రాయశ్చిత్తంగా అనేక పుణ్యకార్యాలు చేసి ధర్మనిరతుడు అయ్యాడు. ఆశ్రమ జీవితం గడుపుతూ యాగాలు చేసి రాజర్షి అయ్యాడు. దోషం నుండి విముక్తి పొందాడు. తెలుసుకున్న కులగురువు వసిష్టుడు వికుక్షిని అడవి నుంచి రప్పించి ఇక్ష్వాకుని తరువాత రాజుగా పట్టాభిషేకం చేశాడు. జనరంజక పాలన చేస్తూ శశాదుడు పేరు ప్రఖ్యాతులు పొందాడు.


శశాదుని తరువాత శశాదుని కుమారుడు పురంజయుడు రాజైనాడు. ఆ సమయంలో జరిగిన దేవదానవ యుద్దంలో దేవతలు పరాజితులైనారు. దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని తమకు సహాయం చేయమని ప్రార్ధించారు. శ్రీహరి వారితో "ఇక్ష్వాకు వంశంలో నా అంశతో పురంజయుడు అనే రాజు జన్మించి రాజ్యం చేస్తున్నాడు. అతనిని ప్రార్ధించి మీ తరపున దానవులతో యుద్దం చేయమని అర్ధించండి. తప్పక విజయం లభిస్తుంది" అని ఉపాయం చెప్పాడు.


దేవతలు పురంజయుడి దగ్గరకు వెళ్లి తమ తరపున దానవులతో యుద్దం చేయమని అర్ధించారు. 


పురంజయుడు "శత యాగాలు చేసి ఇంద్రపదవి పొందిన ఇంద్రుడు నన్ను భుజాల మీద మోసుకుని యుద్ద రంగానికి తీసుకు వెళ్లితే, నేను యుద్దంచేస్తాను" అనిషరతు పెట్టాడు. ఇంద్రుడు అంగీకరించి వృషభంగా మారాడు.


వృషభాన్ని అధిరోహించి పురంజయుడు దానవుల మీద యుద్ధానికి వెళ్లి వారిని జయించి సంహరించి దేవతలకు విజయం చేకూర్చాడు.  


వృషభ రూపం దాల్చిన ఇంద్రుని కకుత్థ్సాలాన్ని (వీపు) ఎక్కి పురంజయుడు యుద్దం చేసాడు కనుక అతనికి ‘కకుత్థ్సుడు’ అని పేరు వచ్చింది. ఇతని వంశం కాకుత్థ్స వంశము అయ్యింది.


కకుత్థ్సుడి మనవడు పృధు చక్రవరి. ఇతడు భూమిని గోవుగా చేసి క్షీరముగా భూసారాన్ని పిండి ప్రవహింప చేసి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేసాడు. భూమికి ఇతని నామంతో ‘పృధ్వి’ అని పేరు వచ్చింది. పృధు చక్రవర్తి మనవడు యవనాశ్వుడు. యవనాశ్వుడి ముని మనవడు కువలాశ్వుడు.


కువలాశ్వునికి ఇరవై ఒక్క వేలమంది పుత్రులు జన్మించారు. ఆ సమయంలో ధుంధుడు అనే రాక్షసుడు ఉత్తంక మహామునికి తపోభంగం చేసి మునులు ఆశ్రమాలలో చేసే యజ్ఞయాగాదులు భగ్నం చేస్తూ భూమి లోపల దాక్కునేవాడు. ఉత్తంక మహాముని విజ్ఞప్తి పై కువలాశ్వుడు తన ఇరవై ఒక్క వేల పుత్రులతో ధుంధుడు, అతని రాక్షస సేనలపై దండెత్తి యుద్దం చేసాడు. ధుంధుని సంహరించి ధుంధుమారుడు అనే పేరు పొందాడు.


కానీ ఆ యుద్దంలో ధృఢాశ్వుడు అనే కుమారుడు తప్ప కువలాశ్వుని ఇరవై ఒక్క వేల మంది పుత్రులు మరణించారు. ధృఢాశ్వుడు తండ్రి తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. ధృఢాశ్వునికి యవనాశ్వుడు అనే కుమారుడు జన్మించాడు. యవనాశ్వుడు మహావీరుడు. ధర్మ రక్షణ దుష్ట శిక్షణ చేసి ప్రజారంజకంగా పాలన చేసాడు.


చాలాకాలం యవనాశ్వుడికి సంతానం కలుగ పోవడంతో మునులు అతనిచేత పుత్రకామేష్టి యాగం చేయించారు. యాగం పరిసమాప్తికి ముందురోజు రాత్రి యాగమంత్ర జలాలను బంగారు కల శంలో వేదిక పై నుంచి యాగ శాలలోనే నిద్రించారు. యజ్ఞం పరిసమాప్తి అయిన తర్వాత ఆ మంత్ర జలాలను మహారాణి స్వీకరిస్తే పుత్రుడు జన్మిస్తాడు.


యవనాశ్వుడు కూడా మునులతో పాటు ఆ రాత్రి యాగశాలలో నిద్రించాడు. అర్ధరాత్రి యవనాశ్వుడికి దప్పిక కలిగి మెలుకువ వచ్చింది. నోరెండిపోతుండటంతో చీకటిలో మంచి నీరు అనుకుని వేదిక మీద ఉంచిన కలశంలోని మంత్రజలాలు త్రాగి దప్పిక తీర్చుకుని నిద్రపోయాడు.


మరుసటి రోజు ఉదయాన్నే కలశంలో మంత్రజలం లేకపోవడం గమనించి మునులు "ఈ మంత్రజలం మహారాణి గారు త్రాగితే పిల్లలు పుట్టి ఉండేవారు" అని చెప్పి యాగం వ్యర్ధం అయిందని బాధ పడ్డారు. యవనాశ్వుడికి రాత్రి తాను దప్పికతో అదే మంత్రజలం త్రాగి ఉంటాను అని జ్ఞప్తి తెచ్చుకుని మునులకు ఆ విషయం చెప్పాడు.


విన్న మునులు "రాజా! యాగ మంత్రజలం మహిమాన్వితమైనవి. మీరు త్రాగిన ఫలితంగా మీకు గర్భం వచ్చి పుత్రుడు పుడతాడు. కానీ జనన సమయంలో మీరు ప్రాణాలు కోల్పోవచ్చును" అని హెచ్చరించారు. 


పుత్రుడు పుడతాడన్న ఆనందంలో చనిపోతాడన్న విషయాన్ని యవనాశ్వుడు లెక్క చేయలేదు.


యవనాశ్వుడు గర్భం ధరించాడు. నవమాసాలు నిండిన తరువాత అతని ఉదరపు దక్షిణభాగాన్నీ చీల్చుకుని కుమారుడు బయటకు వచ్చాడు. యవనాశ్వుడు మరణించాడు. యవనాశ్వుడి భార్య భర్త దేహంతో చితిపై సహగమనం చేసింది. పుట్టిన పుత్రుడు తల్లితండ్రిలేనివాడయ్యాడు.


మునులు ఆ బాలుని పెంచడానికి తగిన దాది కోసం వెతుకుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై శిశు పోషణ భారాన్ని తాను స్వీకరిస్తానంటూ ‘మాం ధాస్యతి’ అని అన్నాడు. మునులు ఆ బాలునికి ‘మాంధాత’ అని పేరు పెట్టి ఇంద్రునికి అప్పగించారు.


ఇంద్రుడు బాలుని ఆకలి తీర్చడానికి తన చూపుడు వ్రేలు శిశువు నోటిలో ఉంచి అమృతాన్ని స్రవింప చేశాడు. అమృత పానం వలన మాంధాత మహా బలవంతుడై భూమిని పాలించి మాంధాత చక్రవర్తి అయ్యాడు. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అనే కుమారులు జన్మించారు. విష్ణు భక్తులైన వీరు ధర్మబద్దంగా పరిపాలన చేసి వైకుంఠం చేరి విష్ణు సన్నిధి పొందారు.


                *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శ్రీ గురుమూర్తయే నమ

 🙏*దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః|||*

*స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః!!!*

*మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణే|||*

*తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!!* 🙏


శుభ గురువారం 🕉️Happy Thursday

Mantra - 25

  Mantra - 25 ARUNAM 3 anuvaakam


వసంత ఋవుతు వర్ణన తర్వాత వచ్చే **గ్రీష్మ ఋతువు** (ఎండకాలం) యొక్క తీవ్రతను, దాని వెనుక ఉన్న రుద్రుని శక్తిని ఈ మంత్రం వివరిస్తుంది.


శుక్లవాసా రుద్రగణః| 

గ్రీష్మేణా వర్తతే సహ| 

నిజహన్ పృథీవీగ్ం సర్వామ్|

జ్యోతిషా ప్రతిఖ్యేన సః|| 


శుక్లవాసా రుద్రగణః: శుక్లవాసా అంటే తెల్లని వస్త్రములను ధరించినవాడు. రుద్రగణః అంటే రుద్రులతో (ఏకాదశ రుద్రులు) కూడినవాడు. గ్రీష్మ ఋతువులో ఎండ తీవ్రత వల్ల ఆకాశం లేదా వెలుగు తెల్లగా, ప్రచండంగా ఉంటుంది. ఆ వెలుగునే ఇక్కడ తెల్లని వస్త్రంగా వర్ణించారు.


గ్రీష్మేణా వర్తతే సహ: ఈ రుద్ర శక్తి గ్రీష్మ ఋతువుతో కలిసి సంచరిస్తుంది. వేద పరిభాషలో గ్రీష్మ ఋతువుకు అధిపతులు రుద్రులు.


నిజహన్ పృథీవీగ్ం సర్వామ్: నిజహన్ అంటే తపింపజేయడం లేదా దహించడం. ఆ తీవ్రమైన ఎండతో భూమినంతటినీ (సర్వామ్ పృథీవీమ్) వేడిక్కిస్తుంది. గ్రీష్మంలో ఎండలు మండిపోవడాన్ని ఇది సూచిస్తుంది.


జ్యోతిషా ప్రతిఖ్యేన సః: ప్రతిఖ్యేన జ్యోతిషా అంటే ప్రతి వస్తువును వెలిగించే లేదా కాల్చివేసే తేజస్సుతో అని అర్థం. సూర్యుడు తన ప్రచండమైన కాంతితో లోకాన్ని దహిస్తూ, ప్రతి అణువును వేడి చేస్తున్నాడని భావం.


అరుణప్రశ్న ప్రకారం, ఒక్కో ఋతువు ఒక్కో దేవతా శక్తికి ప్రతీక:

రుద్రుల ఆగమనం: వసంత కాలం 'వసువుల' (శాంత స్వభావం) తో కూడినదైతే, గ్రీష్మ కాలం 'రుద్రుల' (తీవ్ర స్వభావం) తో కూడినది. రుద్రుడు అంటే లయకారుడు. గ్రీష్మంలోని వేడి ప్రకృతిలోని జడత్వాన్ని, పాత తనాన్ని కాల్చివేసి వర్ష ఋతువుకు సిద్ధం చేస్తుంది.


శుక్ల వస్త్రం - ఎండ తీవ్రత: మండువేసవిలో సూర్యకాంతి ఎర్రగా కంటే ఎక్కువగా 'ధవళ వర్ణం'లో (తెల్లగా) కనిపిస్తుంది. అందుకే గ్రీష్మ ఋతువును తెల్లని వస్త్రాలు ధరించిన రుద్రునిగా వర్ణించారు.


ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భూమిలోని మలినాలు నశిస్తాయని, ఇది ఒక రకమైన శుద్ధి ప్రక్రియ అని వేద దృష్టి.


ప్రచండమైన వెలుగును వస్త్రంగా ధరించి, రుద్రులతో కలిసి వచ్చే గ్రీష్మ ఋతువు, తన తీక్షణమైన తేజస్సుతో భూమినంతటినీ తపింపజేస్తుందని ఈ మంత్రం చెబుతోంది.

మనం క్రమంగా వసంతం (వసువులు) నుండి గ్రీష్మం (రుద్రులు) వరకు వచ్చాము. దీని తర్వాత వచ్చే వర్ష ఋతువు (ఆదిత్యులు) గురించి కూడా తెలుసుకోవాలి.


అద్వైత తత్వార్థం

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ గ్రీష్మ వర్ణన జ్ఞానాగ్ని మరియు వైరాగ్యం అనే అంశాలను ప్రతిబింబిస్తుంది:

శుక్లవాసా - పరమ శుద్ధ చైతన్యం

'శుక్ల' అంటే తెల్లని లేదా స్వచ్ఛమైన అని అర్థం. మాయా కల్పితమైన రంగులు (రాగ ద్వేషాలు) లేని నిర్గుణ బ్రహ్మమునకు ఇది సంకేతం. రుద్రుడు అంటే భయపెట్టేవాడు మాత్రమే కాదు, రుతమ్ దుఃఖం ద్రావయతీతి రుద్రః - అంటే దుఃఖాన్ని హరించేవాడు అని అర్థం. అద్వైతంలో, అజ్ఞానమనే దుఃఖాన్ని అంతం చేసే పరమాత్మ స్వరూపమే ఈ రుద్రుడు.


నిజహన్ పృథీవీమ్ - సంసార దహనం

గ్రీష్మ తాపం భూమిపై ఉన్న నీటిని (తేమను) ఎలా పీల్చేస్తుందో, జ్ఞానాగ్ని కూడా సాధకుడిలో ఉన్న విషయ వాసనలను (Desires) అలా దహించి వేస్తుంది.

భూమి (పృథివి): ఇది మన దేహేంద్రియాలకు, ప్రాపంచిక ఆకర్షణలకు సంకేతం.

నిజహన్: జ్ఞానోదయం కలిగినప్పుడు, ప్రపంచం సత్యమనే భ్రమ (మాయ) నశించిపోతుంది. గ్రీష్మ సూర్యుడు భూమిని తపింపజేసినట్లు, ఆత్మజ్ఞానం సంసార భ్రమను శుష్కింపజేస్తుంది.


జ్యోతిషా ప్రతిఖ్యేన - స్వీయ ప్రకాశం (Self-Luminosity)

పరమాత్మను జ్యోతిషాం జ్యోతిః (జ్యోతులకే జ్యోతి) అని అంటారు. బయట కనిపించే సూర్యుడి కాంతి ఒక ప్రతీక మాత్రమే. నిజానికి ఆత్మ చైతన్యమనే వెలుగులోనే బుద్ధి, ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి. గ్రీష్మ సూర్యుడిని ఎవరూ నేరుగా చూడలేనట్లు, అపరిమితమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని మనస్సుతో గ్రహించలేము, కేవలం అనుభూతి చెందగలం.


రుద్రగణః - శక్తుల సమూహం

మాయా ప్రపంచంలో పరమాత్మ అనేక శక్తులుగా (గణములుగా) విడిపోయినట్లు కనిపిస్తాడు. కానీ అద్వైత దృష్టితో చూస్తే, ఆ గణాలన్నీ ఆ ఒక్క రుద్రుని (బ్రహ్మము) యొక్క విభూతులే. సృష్టి, స్థితి, లయ అనే మూడు కార్యాల్లో ఇక్కడ 'లయ' (సంహార) శక్తిని జ్ఞానానికి ప్రతీకగా చెప్పారు.


జ్ఞానమనే గ్రీష్మ సూర్యుడు ఉదయించినప్పుడు, అది తన ప్రచండమైన కాంతితో (జ్యోతిషా) అజ్ఞానమనే అంధకారాన్ని, దేహాభిమానమనే తేమను దహించివేస్తుంది. అప్పుడు మిగిలేది నిర్మలమైన, శుద్ధమైన శుక్ల (చైతన్యం) మాత్రమే.

వసంతంలో సృష్టి (చిగురించడం) ఉంటే, గ్రీష్మంలో 'తపస్సు' (పరిపక్వత కోసం దహించుకుపోవడం) ఉంది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - చతుర్దశి - చిత్ర -‌‌ గురు వాసరే* (30.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*