22, సెప్టెంబర్ 2020, మంగళవారం

కర్మలు మూడు విధాలా ఉంటాయి

 🕉🌞🌎🌙🌟🚩


*కర్మలు మూడు విధాలా ఉంటాయి అని పెద్దల యోగుల వచనం. అవేమిటో చూద్దాం.


*సంచితం,ప్రారబ్దం,

ఆగామి ఇవి మూడు కర్మలు. ఇవి ఎలా ఉంటాయి?*


*సంచితం అనగా పూర్వపు జన్మలలో చేసిన పాపాపుణ్యముల మూటలు.*



*ప్రారబ్దం అనగా ఉదాహరణకి పాపం 30 మూటలు ఉంది. పుణ్యం 200 మూటలు ఉంది ఇది సంచితం. ఈ సంచితం లోని మూటలలో పుణ్యం నుండి 30 బస్తాలు, పాపము నుండి 5బస్తాలు కలిపి జీవుడిని భూమి మీదకి పంపుతాడు కమలాసనుడు అనగా బ్రహ్మ.. దీనిని ప్రారబ్దం అంటారు. పుణ్యం ఎక్కువ ఉంది కనుక ధనవంతుల ఇళ్లల్లో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మరి పాపం ఓ ఐదు బస్తాలు ఉంది కదా. దానివలన సంతానం లేకపోవడం, భార్య అనుకూలవతి కాకపోవడం ఎన్ని ఉన్నా అశాంతితో జీవించడం పాపఫలం. వీటిని బ్రహ్మ కాదుకదా సాక్షాత్తు శివకేశవులు కూడా మార్చలేరు. కాకపోతే ఇక్కడ మానవుల అదృష్టం ఏమిటంటే!*



*బుద్ది పెట్టాడు భగవంతుడు. మనం ఎలా బ్రతకాలో మనం నిర్ణయించుకోవచ్చు. పుణ్యకర్మలే చేస్తూ అనగా ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడం, సాయం కోసం వచ్చినవాడికి సాయం చేయడం, దేవాలయాల దర్శనం, తీర్థస్నానం, యాత్రలు చేయడం, దానధర్మాలు చేయడం వంటివి. దీనివలన పుణ్యం పెరుగుతుంది. ఇలా చేయకుండా గురునింద, దైవదూషణ, తల్లిదండ్రులను అశ్రద్ధ చేయడం, ఇతరులకు కీడు తలపోయడం, ఈర్ష్య అసూయ ద్వేషాలు కోపం వంటి అవలక్షణాలు పాపహేతువులు. వీటివలన పాపం ఏర్పడుతుంది.*



*కొందరికి పైన చెప్పిన పనులు చేయడం వల్ల పాపం ఎక్కువ పుణ్యం తక్కువ ఉండడం వలన రోజు గడవడం మీద దృష్టి ఉండడం తప్ప దేవుడు, పుణ్యం, పాపం అనేవి ఊహకు కూడా అందవు. తిండి కష్టం, బట్ట కష్టం, అనారోగ్యం.. పుణ్యం వలన వచ్చిన డబ్బులు తాగుడు జూదం వంటి వాటికి ఖర్చు చేసి ఆ రోజుకు హాయిగా నిదిరిస్తాడు. బుద్దికూడా సవ్యమార్గంలో ఉండకపోవడంతో కొన్ని వందల జన్మలు ఇలా పుడుతూ చస్తూ మళ్లీమళ్లీ అలానే జరుగుతుంది. కానీ ఏదో ఒకజన్మలో పుణ్యం చేసే తీరతారు. పుణ్యం పెరగడం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు కూడా బుద్ది పెడత్రోవ పడితే మళ్ళీ మొదలెత్తుకోవాలి. ఇవి ప్రారబ్ద ఫలితం.*



*ఆగామి కర్మ.. ఈజన్మలో చేసిన పాపం పుణ్యం ఈజన్మలో కాకుండా వెళ్లి సంచిత కర్మలు అనే సంచిలో చేరతాయి. మీజన్మలకు హేతువులవుతాయి. ఎలాంటి జన్మ కావాలో బుద్ధితో ఆలోచించి మనమే నిర్ణయం చేసుకోవచ్చు.*



*ప్రారబ్ద వశాన కష్టానష్టాలతో, సుఖసంతోషాలతో బ్రతుకు సాగుతున్నా బుద్దితో యోచన చేస్తూ ముందుకి సాగితే రాబోయే జన్మలలో ఉత్తమ జన్మలు పొంది సద్గురువు సేవ చేస్తూ యోగం ద్వారా ధ్యానం ద్వారా కర్మలను జ్ఞానాగ్నితో, యోగాగ్నితో దగ్ధం చేసి,... జీవుడిని బ్రహ్మంలో ఐక్యం చేసుకోవచ్చును. మానవ జన్మ ఇంతటి దుర్లభం. కనుక క్షణమైనా వృథా చేయకుండా సద్వినియోగం పరుచుకోవాలి.*


🕉🌞🌎🌙🌟🚩

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

 


తిరుమల, 2020 సెప్టెంబ‌రు 22: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా మంగ‌ళ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి,హెచ్‌డిపిపి సభ్యులు శ్రీ సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు. ఆల‌యం ముందు ఈ గొడుగుల‌ను టిటిడి అధికారుల‌కు అందించారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.


మొత్తం 11 గొడుగులను తీసుకురాగా, ఇందులో 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, మరో 2 గొడుగులను సోమ‌వారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి సమర్పించారు.


Follow Us : @beautifultirupathi 

.

#Tirupati #BeautifulTirupathi #BeautifulTirupathiUpdates #Tirumala #TirumalaHills #srivaribrahmostavam #srivarisalakatalabramotasavam

నిధి ఉన్న బిచ్చగాడు 🙏


ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. 


ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.

ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......


బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.


తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.


ఆ ఘడియ రానే వచ్చింది.

బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.


ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.

వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.

అవన్నీ అతడి సొంతమయ్యాయి.


మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.

అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.


కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.


నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.


దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు. 


అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. 


అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.


మానవ సేవే మాధవ సేవ 


వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి!🙏

కరోనా గురించి


〰️〰️〰️〰️〰️〰️〰️

1 ప్రశ్న :-. కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 జవాబు :- కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.

మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు. 

Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది. 

అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది. 

అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు. 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

2వ ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 జవాబు:- శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. 


మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో పోరాడ గలదు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 

3వ ప్రశ్న:-. Glycin ఎలా తయారవుతుంది?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

జవాబు:+ Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి. 

Glycin కి ఉపయెాగ పడేవి

 1. తోటకూర

 2. . ఆవాలు

 3. నువ్వులు

〰️〰️〰️〰️〰️〰️

పోషకాహారాలు

〰️〰️〰️〰️〰️〰️

 4. కరివేపాకు

 5. మునగాకు

〰️〰️〰️〰️〰️〰️〰️

  సి విటమిన్

〰️〰️〰️〰️〰️〰️〰️

 6. నిమ్మ

 7. ఉసిరి

    

వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారావెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్ ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి

పైన చెప్పిన పదార్దములు ప్రతి రోజు తినడం ద్వారా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకో గలం.  

🙏🙏🙏🙏🙏🙏🙏🙏థాంక్యూ 

మీ రాము

కథ

 *👉"గురువుగారు….దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా.. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా?"*


*"అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను"* 


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి

ప్రసన్నంగా నవ్వుతూ *"తథాస్తు"* అన్నాడు. 


శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. 


*" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను."*


*"ఏమిటా కోరిక గురువు గారూ"*


*"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."*


*"వచ్చే జన్మలోనా"*


*"కాదు ఈ జన్మలోనే"*


శిష్యుడు పగలబడి నవ్వాడు, *"గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "*


*" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా"*


*" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"*


*" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."*


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత. 


శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత

విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 


గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." 


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.

ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 

చేశాడు శిష్యుడు. 


భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు.

🙏🙏🙏🙏🙏🙏

భరత భారత

 భరత భారత అనే పదం ప్రయెూగం ఋగ్వేదము నుండి వున్నట్లుగా తెలియుచున్నది. అసలు భా అనగా అగ్ని యెుక్క ప్రకాశ తత్వ మని అది వేదము వలననే తెలియునని వేద సాధన వక్క భారతదేశములోనేయని దీనికి నైమిశారణ్యమే శరణమని గంగా గోదావరి సింధూ యమునా సరస్వతీ నదీ పరివాహక ప్రాతములే భారత అనగా జీవ ప్రకాశించుట, పేరుతో గాని మనుజులతోకానీ యీ పదము పుట్టలేదు. అది వక కిరణముగా యున్నది పదార్ధము గాని మారిన ఙ్ఞానాన్ని తెలుపు చున్నది. వేదమే భ, భా అని జీవ లక్షణమే భాస్కర అని యీ పేరు తోనే జీవ లక్షణము ప్రకాశించు తెలియుచున్నది. భారత్ ప్రకాశించుట శక్తి కిరణరూపంలో మారి లక్షణముగా మారుటకు అనగా పదార్ధాలు లక్షణము గా మారుటకు.

*ఆవుపాల శ్రేష్ఠత*




*1. కొంచెము పలుచగా ఉంటాయి.*

*2. త్వరగా అరుగుతాయి.*

*3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము*

*4. మనిషిలో చలాకీని పెంచుతుంది.*

*5. ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .*

*6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.*

*7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.*

*8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.*

*9. సాత్విక గుణమును పెంచుతాయి.*

*10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.*

*11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.*

*12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.*

*13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.*

*14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.*

*15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.*

*16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.*

*17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.*

*18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.*

*19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.*


*మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.*

*20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.*


*పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు.*


*ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.*


*ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము కదా .*

కర్మ భూమి

 యిది కర్మ భూమి క్రమ యిక్కడనే చెయ్యాలి. అసలు వివేకానందుడు వివరించినట్టుగా యీ దేశం విడిచి ధనమును ఆశపడి కర్మ భూమిని వదలుటయే వినాశనం. ఎందుకనగా ఎన్నో యుగాల బట్టి ఎంతో మంది మహర్షులు ఙ్ఞానులు యీ భూమిని వదలి వక్క రోజైనా వుండలేరు. ఎందుకనగా వక్క రోజైనా కర్మ చేయకపోతే మన జీవిత ఆయువు వక రోజు తపో ఫలం వదలుకున్నట్టే. నిజంగా కర్మ చెయ్యాలని వుంటే ఆదేశం అక్కడి సంపదలు వదిలేసి యెక్కడను రమ్మని చెప్పండి. ఇతర దేశాలలో తర్పణాలు అర్ఘ్యప్రదానాలు తర్పణాలు జప తగాదాలు లేవు. చేసినా ఫలితం సున్నా యూదా భోగాలు ఎక్ువవుతాయి. కానీ మెూక్షమని రాదు. అక్కడ వుండి చేస్తే మెూక్షం రాదు

యివన్నీ వట్టి డాంబకమైన మాటలు మాత్రమే. దీనికి వశిష్ట వృత్తాంతమే. ఆయన కూడా కొంతకాలము కర్మలను వదలి యప్పటికో స్విడ్జర్లాండులో నివసించేవారు.రాముడు ని చూడాలని వంకతో యిక్కడకు వచ్చినివసించేరు యిలాంటివాటి దృష్టాంతాలు ఎన్నో. కొంతకాలము ఆకారము లో ఆయన పడిన వేదన యితని చెప్పాలంటే. అక్కడ వున్నప్పుడు కూడా ఆయన కర్మ ఆచరించ లేదు. కనుక వృధా మాటలు కట్టి పెట్టి యిక్కడకు వచ్చి కర్మలను ఆచరింమనండి. జననీ జన్మ భూమీశ్చ స్వర్గానికి గరీయసీ.

 అన్నింటికి సవరణలు వున్నాయి కానీ మెూక్షమార్గమునకు సవరణలు జపతపాదులకు కర్మభూమిలోనే ఆచరించాలి. తాగి తందనాలు ఆడే ప్రాంతంలో జపతపాదులకు. ఆహా ఏమి యీ కావున మహిమ. జుట్టు కత్తిరించుకొనే చోట జపతపాదులు.యిదే విధివైపరాత్యం. అగ్నిహోత్రము లేని చోటు జపతపాదుకలువచోటులేదు. కనీసం యిక్కడ దేవాయాలలోనైనా కొన్ని సందర్భలలనైనా అగ్ని కార్యం యింకా కొంతమంది ఆచరిస్తున్నారు.

సృష్టి రహస్యం తెలిసిన అహంకారం. యిది బ్రహ్మ కైనా తప్పలేదు. పరిశీలిస్తే అహంకారము రాక్షస త్వం. రాక్యసత్వమే అహంకారం. వేదముల వలన బ్రదుకు కూడా సృష్టి రహస్యం తెలిసి సృష్టి కార్యక్రమం మానేసి నేనే అంతా అనుకుని అహంకారం. ప్రతీ పరిణామ క్రమంలోను సృష్టిని వినాశనము చేసే ప్రయత్నమే. అదే భగవంతుని లీల మత్స్యావతారము వలన గాని బ్రహ్మ దయచేసిన సోమ రస తత్వం తెలియలేదు. సోమ రసము అనగా సృష్టికి కారణమైన పదార్ధ లక్షణము. అది అహంకారము వలన సముద్రగర్భంలో దాచి నుంచుటకై రాక్షస తత్వం. ఆ తరువాత అహంకారపతనమైనగాని తన వునికి కారణము తెలిసిన తరువాతనే సృష్టి వుపక్రమణ. మనం కూడా సృష్టి కార్యమును ఆపి ధనం కొరకే స్త్రీలు తల్లులు సరియైన వయస్సులో సరియైన సృష్టి ధర్మములను నెరవేర్చవలెనని. లేదా రాక్షస తత్వం పెరిగి కొంతకాలమునకు కరోనాలాంటి వాటి కన్నా బలమైన మహమ్మారిలా వ్యాప్తమైనగాని జీవ కోటి వి నాశనమగును. కూర్మావతారం వలన సృష్టిని ప్రకృతి పరంగా నడుపుటకును సాధన. అ తరువాత కూడా వరాహావతారం అది కూడా అది కూడా సృష్టి ని ఆపేసి భూమిని జలతత్వంమైన సృష్టి ఆరిపోవును. యిది యును అహంకారము. ప్రతీ దశలోని అహంకారము ప్రబలిన సృష్టి వినాశనం. అవతార ఆవిర్భావమే అహంకారమును పారద్రోలుటే. యూదా యిప్పటికిని గాఢ నిద్ర అనే, అజ్ఞానంలో వున్నా. మేల్కొని పోతే పతనము అంచునకు ప్రయాణమై. అందుకే శంకరుల వారు తస్మాత్ జాగృత......


*సంకల్ప మంత్రం*



సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.


ఈ కాలంలో చాలా మంది భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు కదా. 


అంటే అమెరికాలో వున్నటువంటి మన ప్రవాస భారతీయులు నోములు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు ఈ సంకల్ప మంత్రం ఎలా చెప్పాలి. 


మన పంచాంగ గణకులు అమెరికాకు తగ్గట్టు విరచించిన సంకల్ప మంత్రం వుంటే దయచేసి పంపగలరు.

కౌపీన పంచకం (శంకరాచార్య) ॥

కౌపీన పంచకమ్

వేదాన్తవాక్యేషు సదా రమన్తో

భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః ।

విశోకమన్తఃకరణే చరన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౧॥

వేదాంత విషయాలలో ఎప్పుడూసంచరిస్తూ 

బిషటనతో లభించిన దానితో సంతుష్టుడై 

 శోకాన్ని వదిలి వున్నవాడు 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి -1


మూలం తరోః కేవలమాశ్రయన్తః

పాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః ।

కన్థామివ శ్రీమపి కుత్సయన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౨॥


ఆశ్రయం కోసం చెట్టు అడుగున కూర్చుని,

దోసిలికి పట్టినంటే తిండి తిని 

 వదిలిన వస్త్రంలా సంపదలను త్యజించటం చేసే 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి  (2)


స్వానన్దభావే పరితుష్టిమన్తః

సుశాన్తసర్వేన్ద్రియవృత్తిమన్తః ।

అహర్నిశం బ్రహ్మసుఖే రమన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౩॥


తానూ పొందే ఆనందంతో ఎల్లప్పుడూ తృప్తిగా ఉండటం,

అతని ఇంద్రియాల కోరికలను పూర్తిగా అరికట్టడం,

బ్రహ్మమానందలో  పగలు మరియు రాత్రిగడపటం చేసే 

,కౌపీన దారి అత్యంత భాగ్యశాలి  (3)


దేహాదిభావం పరివర్తయన్తః

స్వాత్మానమాత్మన్యవలోకయన్తః ।

నాన్తం న మధ్యం న బహిః స్మరన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౪॥


మనస్సు మరియు శరీరన్ని పూర్తిగా గమనిస్తూ 

తనలో వున్నది ఆత్మ తప్ప మరొకటి కాదనే భావనకలిగి 

ఆ ఆత్మ ఆది, మధ్య, అంత రహిత మైనదని  తెలుసుకునే 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి   . (4)


బ్రహ్మాక్షరం పావనముచ్చరన్తో

బ్రహ్మాహమస్మీతి విభావయన్తః ।

భిక్షాశినో దిక్షు పరిభ్రమన్తః

కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః ॥ ౫॥


విమోచన పదమైన బ్రహ్మన్ని స్పరిస్తూ, 

నేనే బ్రహ్మను అనే ద్యాస కలిగి ఉండటం.  

బిక్షాటనతో జీవిస్తున్న స్వేచ్ఛ విహారి 

కౌపీన దారి అత్యంత భాగ్యశాలి . (5)

॥ ఇతి శ్రీమద్ శఙ్కరాచార్యకృత కౌపీన పఞ్చకం సమ్పూర్ణమ్ ॥


సేకరణ

కౌపీన ధారిని ఉద్దేశించి వ్రాసిన ఐదు శ్లోకాలు  అత్యంత వేదాంత పరమైనవి. ఆధ్యాత్మిక చింతనలో జీవనం గడిపే వారికి ఇవి ఎంతో  మార్గదర్శనం చేస్తాయి. 

కౌపీనం (గోచి) ధరించిన ఒక సాదారణ సాధువు ప్రజలకు ఏమి లేని అతి పేదవాడుగా కనబడతాడు. కానీ అతని జీవితం పూర్తిగా ఆ బ్రహ్మత్వం వైపు మాత్రమే మళ్లిస్తాడని ఆది శంకరాచార్యులు వ్రాసిన ఈ కౌపీన పంచకం. 











మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి

 చెన్నై : మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు శబరిమల సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదని దేవస్థానం బోర్డు పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా మార్చి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు. నవంబరులో జరిగే మండల పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. ఇందుకుగాను ముందస్తు ఏర్పాట్లను దేవస్థానం బోర్డు చేపట్టింది. శబరిమలకు వచ్చే భక్తులకు నీలకల్‌ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించి, రోజుకు 5వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. 18 మెట్ల వద్ద పోలీసులు ఉండరు. భక్తులు తమకు తామే ఎక్కి వెళ్లాలని దేవస్థానం బోర్డు పేర్కొనింది. తమి ళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు కొన్ని రోజులు సన్నిధానంలో బస చేసి వెళ్తుంటారు.

**సింహాచలం**

 **దశిక రాము**


**మన సంస్కృతి సాంప్రదాయాలు**





సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు.ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత.


‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు.


కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయడాని పురాణాలు వివరిస్తున్నాయి. అంతటి దుర్మార్గుడిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు. తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరశ్యకశిపుడు ఘోరం తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని, తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు.

హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో హిరణ్య కశిపుని భార్య లీలావతి గర్బవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే, ఇంకా అతడికి కొడుకు పుడితే వారు ఇద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పని భావించాడు. మాయా రూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకొని పోతుండగా, దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు. ఓ గర్భిణినిచెరబెట్టి తీసుకుపోతావా? ఇంతనీచానికి దిగాజారుతావని నేననుకోలేదని గద్దించాడు. తాను దురుద్దేశంతో అలా చెయ్యడం లేదని దేవతల క్షేమం కోసం అలా చెయ్యాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానం ఇచ్చాడు. అయితే, ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని, ఒక గొప్ప హరి భక్తుడనే విషయాన్ని వెల్లడించాడు.


ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరి భక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నమంటూ లేదు. సామ బేధ దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి, పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే, శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు. ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలం. హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహ్లాదుని కోరికమేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరహామూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహ మూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు.స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తొలగించగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించి తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుని, మళ్లీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక.


పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి అది ఆగిపోతుంది. దీంతో ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరు అక్క డే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై వున్నానని, వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు.


స్వామి కలలో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెదికినా ఫలితం ఉండదు. రెండో రోజు స్వామి మరో సారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని, వెలికి తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర

చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యంకావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని (500 కేజీలు) సమర్పిచడం జరుగుతుంది

🙏🙏🙏

సేకరణ


*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏 

మూకపంచశతి

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌷 మూకపంచశతి 🌷


🌷 ఆర్యాశతకము🌷


🌹4.

కుటిలకచం కఠిన కుచం


కుందస్మితకాంతి కుంకుమచ్ఛాయమ్౹


కురుతే విహృతిం కాంచ్యామ్


కులపర్వత సార్వభౌమ సర్వస్వమ్౹౹


🌺భావం: 

అందముగా వంకరలు తిరిగిన ముంగురులతో, కఠినమైన కుచములు ,కుందపుష్పములవంటి తెల్లనైన మందహాసముతో,కుంకుమవర్ణ కాంతితో కులపర్వత సార్వభౌముడైన హిమవంతుని గారాబుపుత్రిక,ఆతని సర్వస్వమైన శ్రీ కామాక్షీ దేవి కాంచీనగరమున విహరించుచున్నది.

🙏అమ్మా ,కామాక్షీ !మమ్ముల బ్రోవుము తల్లీ 🙏



🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 


పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


**శివానందలహరి** 4 వ శ్లోకం

 *దశిక రాము**



" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

అవతారిక:
సర్వ దేవతల కంటే శివుడు గొప్పవాడని తలచి, శివుని పాద సేవ
చేసే భాగ్యం తనకు కల్గింౘమని ఆ శివుణ్ణి శంకరులు యాచిస్తున్నారు.

శ్లో" **సహస్రం వర్తంతే,**

**జగతి విబుధాః **

**క్షుద్ర ఫలదాః**

**నమన్యే స్వప్నేవా**

**తదనుసరణం తత్కృత ఫలమ్.**

**హరిబ్రహ్మాదీనా మపి **

**నికట భాజా మసులభం**

**చిరం యాచే శంభో** _ 

**శివ తవపదాంభోజ భజనమ్** !!

పదవిభాగం:
సహస్రం వర్తంతే, జగతి _విబుధాః _ క్షుద్ర ఫలదాః _ న మన్యే, స్వప్నే _ 
వా_ తదనుసరణం _ తత్కృత ఫలమ్ _ హరిబ్రహ్మాదీనామ్ _ అపి_
నికటభాజామ్ _ అసులభం _ చిరం _ యాచే _ శంభో _ శివ _ తవ 
_ పదాంభోజ భజనమ్.

తాత్పర్యం:
ఓ శంభూ! మహాదేవా! జగత్తులో స్వల్పమైన ఫలములను ఇచ్చే
దేవతలు, ఎందరో ఉన్నారు. వారిని అనుసరింౘడం కానీ, వారిచ్చే
ఫలములను కానీ, నేను కలయందు కూడా స్మరింపను. ( పగటి వేళ
స్మరింపనని వేరుగా చెప్పనక్కఱలేదు) ఎల్లప్పుడు నూ, నీ సన్నిధానంలో నే
ఉండే విష్ణుమూర్తి, బ్రహ్మవంటి దేవతలకు కూడా దొరకని మీ పాదసేవను
శాశ్వతంగా వేడుకుంటాను. మిమ్మల్ని పదేపదే వేడుకుంటున్నాను.
ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలములను ఇస్తారు. నీవు ఒక్కడివే,
పునరావృత్తి రహితమైన, మోక్షపదవిని ఈయగలవాడవు. అందుచే వారిచ్చే
ఫలమును కోరక, నీ పాదపద్మముల సేవనే నేను యాచిస్తాను.

వివరణ:
బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు, ౘావు పుట్టుకలు గలవారు. వారు
క్షుద్రఫలదులు. కాబట్టి వారిచే ఫలములను తాను కోరననీ, జననమరణాలు
లేని మహాదేవునే సేవిస్తాననీ, శంకరులు ఈ శ్లోకం లో చెప్పారు. శంకరుని
పాదపద్మ సేవనే తాను యాచిస్తున్నానని చెప్పారు. మోక్షము కన్నా శివపాద సేవ
గొప్పదని ఫలితార్థం.
🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**

సౌభాగ్యభాస్కరం

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 5 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీ భాస్కర రాయలవారు – సౌభాగ్యభాస్కరం


అమ్మవారు వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పించి, అందులో ఉన్నరహస్యములను భాస్కరరాయలవారి చేత ప్రకాశింపచేసింది. ‘సౌభాగ్యభాస్కరము’ అన్న పేరుతో వ్యాఖ్యానము రచించి భాస్కరరాయలవారు పూర్తి చేసారు.  


ఆయన కాశీ పట్టణము చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే అక్కడ ఉన్న అనేకమంది బ్రాహ్మణులకు అనుమానము వచ్చింది. అమ్మవారి అనుగ్రహముతో వశిన్యాదిదేవతలు చెప్పిన లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చెప్పడము అంటే మాటలు కాదు. భాస్కరరాయలవారు అంత అనుగ్రహము ఉన్నవాడా? అని ఒకనాడు వారు ఆయన దగ్గరకు వచ్చి అమ్మవారికి ‘మహాచతుషష్టికోటి యోగినీగణసేవితా’ అన్న నామము ఉన్నది కదా! అనగా 64 కోట్ల యోగినుల చేత సేవింప బడుతున్నదని అంటారు. మీరు లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చేసారు కదా! ఆ యోగినుల కధలు, వృత్తాంతములు, పేర్లు మాకు చెపుతారా? అని అడిగారు. నేను చెపుతున్నాను అనేవాడికి బెంగ కానీ అమ్మవారు చెప్పిస్తున్నది అనే ఆయనకి బెంగేమున్నది? అలాగే తప్పకుండా – మీరు సాయంత్రం అగ్నికార్యము పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకి వచ్చి కూర్చోండి చెపుతాను అన్నారు. సరే అని ఆ సాయంత్రం వీరందరూ వెళ్ళి చెప్పండని కూర్చున్నారు. ఆయన కళ్ళు మూసుకుని వినండి చెప్పడము ప్రారంభము చేస్తున్నాను అన్నారు. అందరూ కళ్ళు మూసుకుని వినడము మొదలు పెడితే ఒకేసారి కొన్ని కోట్ల మంది గొంతుకలతో యోగినుల చరిత్రలు వినబడుతుంటే వాళ్ళు తెల్లపోయి కంగారుపడి తమ గురువుగారైన కుంకుమానంద స్వామి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి – ‘గురువుగారు ఒకేసారి కొన్ని కోట్లమంది యోగినులు ఆకాశములో నిలబడి వాళ్ళ చరిత్రలు చెపుతున్నారు. ఇది ఎలా సంభవము అయింది? అంటే భాస్కరరాయలవారు సాక్షాత్తుగా అమ్మవారి అనుగ్రహము పొందిన వ్యక్తి ఆయన సాక్షాత్తుగా అమ్మవారే. ఆయన జోలికి వెళ్ళి పొరపాటు చేసారు. ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండని తన చేతులతో శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు సరిగ్గా చూడమన్నారు. వాళ్ళు భాస్కరరాయలవారి వంక చూస్తే ఆయన కుడి భుజము మీద లలితాదేవి, ఎడమ భుజము మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా 64 కోట్లమంది యోగినులు పైనుంచి నమస్కారము చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సన్నివేశమును ఆరోజు కాశీపట్టణములో ఆకాశవీధిలో కొన్నివేలమంది దర్శనము చేసారు.


వారణాసిలో విశ్వేశ్వర దేవాలయమునుంచి బయటకు రాగానే ఎదురుగా అన్నపూర్ణమ్మ దేవస్థానము ఉంటుంది. ఆ దేవాలయములో కుడిచేతి వైపు పెద్ద అరుగు ఉంటుంది. ఆ అరుగు చివరకు వెళ్ళి చూస్తే కొద్ది లోతుగా మెట్లు కనపడతాయి. అవి దిగి కిందకి వెళితే శ్రీ చక్రేశ్వరుడు అని ఒక శివ లింగము కనిపిస్తూ ఉంటుంది. అది లలితాసహస్రనామ వ్యాఖ్యానము వ్రాయడము పూర్తి అయినప్పుడు భాస్కరరాయలవారు ప్రతిష్ఠ చేసిన లింగము. 


ఇంతటి మహానుభావుడి జీవితములో ఒకసారి విచిత్రమైన సంఘటన జరిగింది. శివాజీ మనుమడి పేరు షాహురాజు. ఆ షాహురాజు గారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న చంద్రసేన జాదవుడికి బిడ్డలు లేరు. గురువుగారైన భాస్కర రాయల వారి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే అనుగ్రహించి నీకు తొందరలో కొడుకు పుడతాడని దీవించి దక్షిణ దేశము వెళ్ళిపోయారు. చంద్రసేన జాదవుని భార్య గర్భవతి అయింది. భాస్కర రాయల వారి శిష్యుడైన నారాయణ దేవుడు ఈ చంద్రసేన జాదవుడు ఉన్న ప్రదేశమునకు వచ్చినప్పుడు తన భార్యకు ఆడపిల్ల పుడుతుందా? మగ పిల్లవాడు పుడతాడా? అని చంద్రసేన జాదవుడు అడిగాడు. నీకు పుత్రికా సంతానము కలుగుతుందని చెప్పాడు. మా గురువుగారు భాస్కరరాయలవారు పుత్ర సంతానము అని దీవించారు ఏది నిజం అని అడిగాడు. ఎంత పని చేసావు? మా గురవు గారు వరము ఇచ్చారని నాకు తెలియదు. ఆయన అంతటి ప్రజ్ఞాశాలి వరము ఇస్తే కొడుకు పుట్టవలసిందే కానీ నేను వాక్సుద్ధి పొందిన వాడిని. ఆ గురువులకు శిష్యునిని. తెంపరితనం తో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా, నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు నపుంసక సంతానము జన్మించుగాక అని వెళ్ళిపోయాడు. కొంత కాలమునకు భాస్కరరాయల వారు మళ్ళీ వస్తే ఆయన కాళ్ళమీద పడి జరిగింది చెప్పాడు. బెంగ పెట్టుకోవద్దు నేను నీ కుమారుడికి పుంసత్వము వచ్చేలా నేను అనుగ్రహిస్తాను. అని దక్షిణ భారత దేశము వెళ్ళి సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేసి ఆ పిల్లవాడైన రామచంద్రునికి పుంసత్వము కలిగేట్లుగా చేసారు. అది భాస్కరరాయలవారంటే!


కడుపున పుట్టిన బిడ్డ కీర్తికి అమ్మ సంతోషించినట్టు కారణజన్ముడైన మహాత్ముడు భాస్కరరాయలవారి గురించి చెప్పుకున్న ప్రాంతములో అమ్మ ఆనందతాండవము చేస్తుంది.



శ్రీహరాష్టకం

  

1) నమో భగవతే హరయే 

   చతుర్వ్యూహాత్మకచతుర్భుజవేదపురుషాయ 

   మధుకైటభసంహరరణసింహాయ 

   హిరణ్యాక్షహిరణ్యకశ్యపభంజనాయ ||


2) నమో భగవతే హరయే 

   రావణకుంభకర్ణాసురప్రాణహరణాయ 

   నరకాసురపూతనవత్సధేనుకాసురహరాయ 

   హయగ్రీవాసురనిషూదనభక్తసులభాయ ||




3) నమో భగవతే హరయే 

   అఘాసురతృణావర్తభంజనాయ 

   ప్రలంబాసురబకప్రమథవీరాయ 

   అరిష్టాసురకేశినిబర్హణాయ ||


4) నమో భగవతే హరయే 

   వ్యోమాసురశంఖచూడమర్దనాయ 

   ఖరదూషణాదిదానవసంహరాయ 

   శిశుపాలదంతవక్త్రప్రాణహరణాయ ||






5) నమో భగవతే హరయే 

   మారీచసుబాహుసంహరాయ 

   కబంధతాటకిప్రాణహరణాయ 

   వీతరాగభయక్రోధహరణాయ ||


6) నమో భగవతే హరయే 

   గాఢాహంకారస్థితిహరణాయ 

   అజ్ఞానమోహతిమిరాపహరణాయ 

   జన్మజన్మాంతరపాపసంఘభంజనాయ ||





7) నమో భగవతే హరయే 

   ప్రళయకాలసమయప్రపంచహరణాయ 

   ప్రళయకాలరుద్రభార్గవరామగర్వభంజనాయ 

   జగద్విఖ్యాతశివవిష్ణుచాపభంజనాయ ||


8) నమో భగవతే హరయే 

   జగన్మోహినిఅవతారధరభస్మాసురహరాయ 

   అమృతప్రదానసమయరాహుశిరశ్ఛేదనాయ 

   మహాబలసంపన్నవాలిప్రాణహరణాయ ||


     సర్వం శ్రీహరదివ్యచరణారవిందార్పణమస్తు

expiry date."* 👍

 😄This one is ultimate!!!


*A foreigner came to Kashi.* 

*Visited Viswanath's temple and all the ghats.* 

*Then he bought a VIBHUTHI packet from a boy selling on the street.* 

*Foreigner then asked, "what is its expiry date?"* 

*Boy replied looking surprised: "Its made from expired people and when you apply on your forehead it increases your expiry date."* 👍😄😄





🙏incredible india🙏🏻

దేవుడు

 దేవుడు ( ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)


అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టుక్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ. వాళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు. 


కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు. దేవరపల్లి వీధి దాటి కుంతీమాధవస్వామి గుడి దగ్గరకొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ. దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు. ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు. 


రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న వెంకట్రాజుగారాసుపత్రికి తీసుకెళ్లిపోయేరు. 


బంగళా పెంకేసున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు, ఆరెంపీ అని రాసుంది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత 'షిట్.. ఇన్ని ఇంజ్యూరీస్ తో సఫర్ అవుతూంటే ఆరెంపీ డాక్టర్ దగ్గిరకా? ఈ ఊళ్ళో అపోలో గానీ కేర్ గానీ లేవా' అంటూ అరిచినా వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరినీ వెంకట్రాజు గారిదగ్గిరకట్టుకెళ్ళిపోయి ' డాట్రారండీ.. మరేమోనండీ.. ఈళ్ళిద్దరికీ యాక్సిడెంటైపోనాదండి' అంటూంటే ఆ వెంకట్రాజు గారు మీరందరూ బయటుండండి అని అందరినీ బయటకంపేసి, ఇద్దరి దెబ్బల్నీ శుభ్రం చేసేసి పైన టింక్చర్ అయోడిన్ పూస్తూ చెప్పేడు ' కొద్దిగా మంటగానుంటుంది.. కానీ ఓర్చుకోండి.. గాలికి ఒదిలేసి కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత ఈ దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి చాలు.. త్వరగా ఎండిపోతాయి.. ఇప్పుడు మీ ఇద్దరికీ టెటనస్ ఇంజక్షన్ ఇస్తాను'.. 


హరిత ఏడుస్తా అరిచింది' ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీ ఈజ్.. ఎట్లీస్ట్ ఆస్క్ హిమ్ టు యూజ్ ఎ స్టెరిలైజ్డ్ సిరంజ్'


వెంకట్రాజు నవ్వుతూ బదులిచ్చాడు 'మేడమ్.. ఐ మైట్ లుక్ చీప్.. బట్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ చీప్.. నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు.. ప్రతీ పేషంటుకీ కొత్త సిరంజీ వాడతాను' అని కొత్త సిరంజీలతో ఇద్దరికీ ఇంజక్షన్లు చేసేడు. 


లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకుని పెయిన్ ఎక్కడుందీ అని అడుగుతూంటే 'మోకాలు దగ్గర చెప్పలేనంత నొప్పి, అయినా నేను కాకినాడెళ్ళి అపోలో లో స్కాన్ చేయించుకుంటాను' అంది


ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాలి దగ్గర పరీక్ష చేసిన వెంకట్రాజు గారు చెప్పేరు 'మీ మోకాలి దగ్గర చిన్న డిస్ లొకేషన్.. పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఇప్పుడే ఫిక్స్ చేస్తాన' ని ఆ పిల్ల అరుపులు పట్టించుకోకుండా మోకాలి దగ్గర చిన్నగా తిప్పేడు. ఆ హరిత ఒక్కసారే అరుపులూ, ఏడుపూ ఆపేసి 'ఇదేంటీ.. నెప్పి అలా ఎలా పోయిందీ' అని ఆశ్చర్యపోయింది. 


'ఏమీలేదమ్మా.. చిన్న డిస్ లొకేషన్..పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఫిక్స్ చేసేసేను.. మీ వారికి కాళ్లూ చేతులూ కొట్టుకుపోవడం తప్ప పెద్ద ఇన్జ్యూరీస్ ఏవీ లేవు.. పెయిన్ కిల్లర్ వాడండి.. రాస్తాను ' అని ప్రిస్క్రిప్షన్ రాస్తూంటే ఆ హరిప్రసాదు అడిగేడు' మీ ఫీజెంతండీ? '


ఇంజక్షన్లకీ, అయోడిన్ కీ కలిపి డెబ్భై రూపాయలివ్వండి చాలు' అని బదులిచ్చిన వెంకట్రాజు గారి కాళ్ళకి దణ్ణం పెట్టి, ఫీజు చెల్లించుకునెళ్ళిపోయారా దంపతులు 


ఏ ఊరినుంచొచ్చాడో ఎవరికీ తెలీదు కానీ దేవరపల్లి వీధి లో ఇల్లద్దెకు తీసుకుని ప్రాక్టీసు మొదలెట్టేడా వెంకట్రాజు. ఈయన ఉత్త ఆరెంపీ అంటెహె అనుకుంటూ మొదటెవరూ ఆయన క్లీనిక్ వేపు కన్నెత్తి చూసేవోరు కాదు. ఈయనే ఓ చిన్న పెట్టట్టుకుని ప్రతీ పాకమ్మటా తిరిగి అందరి ఆరోగ్యం వాకబు చేస్తూండేవోడు. 


ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బివ్వబోతే 'డబ్బులక్కరలేదు.. ఇవ్వాళ మీ ఇంట్లో భోజనం పెట్టండనేవోడు.. ఊళ్లో వేరే డాక్టర్లు లా కాకుండా టెస్టులూ అయీ ఎంతో అవసరమైతే తప్ప రాసేవోడు కాదు. ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి రోగమేంటో తేల్చేసేవోడు. 


శివాలయం పూజారి ఏకాంబరశాస్త్రి గారి కోడలు కాన్పయ్యిన తర్వాత కాకినాడ డాక్టర్లు ఏవో బోలెడు మల్టీ విటమిన్ టాబ్లెట్లూ గట్రా రాసేసేరు. అసలే ఇంతింత ఆదాయం తో అంత మందుల ఖర్చు ఎలా భరించాలిరా దేవుడా అని ఆయన బాధ పడుతూంటే 'అయ్యో.. భలే వారండీ.. ఆ టాబ్లెట్లయీ ఏమఖ్ఖర్లేదు.. శుభ్రంగా రోజూ తెలగపిండి కూర మునగాకేసి వండి పెట్టండి.. తల్లికీ బిడ్డకీ మేలని' చెప్పేడు. ఈయన చెప్పింది కరెక్టుగా పనిచెయ్యడంతో ఆ ఏకాంబరశాస్త్రి గారి పరివారం అంతా వెంకట్రాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు. 


అలాగే ఎవరికైనా పాలేళ్ళకీ, రిక్షా వాళ్ళకీ అందుబాటులో ఉన్న పసుపు, మెంతులు, జీలకర్ర వంటివి ఉపయోగించి చిట్కా వైద్యం నేర్పించేసేడు. దాంతో చుట్టుపక్కల జనం ప్రతీదానికీ ఊళ్లో ఉన్న అల్లోపతీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు పైగా వెంకట్రాజంటే ఆళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవారు


అదేంటండీ డాక్టర్ గారూ ఇంకా పెళ్లి చేసుకోలేదేంటండీ అని ఎవరైనా అడిగితే మనకయన్నీ ఎందుకండీ.. మీరందరూ నా కుటుంబంలాంటోరే కదా.. మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండీ అని నవ్వేసేవోడు. 


ఓసారి కాకినాడ పచ్చిగోళ్ళ వాసు గారి హోల్సేలు మందుల షాపులో తనక్కావలసిన మందులవీ కొనుక్కుని తిరిగి పిఠాపురం వెళ్ళడానికి సర్పవరం జంక్షన్లో షేర్ ఆటో కోసం చూస్తూండగా 'డాక్టర్ గారూ' అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డవతల కారాపినుంచున్న ఆ హరికృష్ణ దంపతులు కనబడ్డారు. 


వెళ్లి బాగున్నారా అని పలకరిస్తే 'బావున్నామండీ.. ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము.. మళ్ళీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటువేపు రాలేకపోయేము. మీరేమనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాలిప్పుడురావాలిప్పుడు' అంది హరిత. 


'నేను చేసిందేముందమ్మా.. ఇంకోసారొస్తాను మీ ఇంటికి ' అంటున్నా పట్టించుకోకుండా ' మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి ' అని బలవంతంగా వెంకట్రాజుని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారా దంపతులు. దారిలో చెప్పింది హరిత' మా నాన్నగారు కూడా డాక్టరేనండి మీలాగే.. కాకపోతే ఎండి.. కార్డియాలజీ' 


'అవునా.. మంచిదండి' బదులిచ్చాడు వెంకట్రాజు


'ఇక్కడ అపోలో హాస్పిటల్ లో మా మావగారు కార్డియాలజీ ఛీఫ్ అండి' కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ 


హరిత వాళ్ళింటికెళ్ళేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. లోపలికెళ్ళి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు కుప్పకూలిపోయున్నారు. 


ఆయన భార్య శాంత అంబులెన్స్ పిలవమని కేకలు పెడుతూ ఏడుస్తూంది. హరిత ని చూడగానే 'నీకిందాకటి నుంచి ఫోనుచేస్తున్నాను.. తియ్యవేం?' అని అరిస్తే 'అయ్యో.. ఫోను మ్యూట్ లో పెట్టి మర్చిపోయేను' బిక్కమొహం వేసుకుని బదులిచ్చింది హరిత 


'మీరు కంగారు పడకండత్తయ్యా.. నేను అంబులెన్స్ కి ఫోన్ చేసాను.. వెంటనే వస్తుంది' అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూసేడు. 


అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతీ మీద మోదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరెట్టి ఊదుతూ కనిపించాడు వెంకట్రాజు. 


'ఈయనెవరే? ఏం చేస్తున్నాడు మీ నాన్న గారిని? ' అని అడిగిన శాంత గారిని' ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు.. నువ్వు ఆట్టే టెన్షన్ పడకు మమ్మీ ' అంది హరిత 


కాస్సేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది.' సిపిఆర్ చేసేను.. డేంజరు తప్పినట్లే.. కాకపోతే ఈయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం' అని ఆ రాజేశ్వరరావు గారిని అపోలో లో చేర్పించి వెళ్లిపోయాడు వెంకట్రాజు. 


కొన్నాళ్ళకు వెంకట్రాజు ఇంటి ముందు కారాగింది. హరిత తన తండ్రిని వెంకట్రాజు క్లినిక్ లోకి తీసుకొచ్చి చెప్పింది 'నాన్నగారు కోలుకుంటే అన్నవరం లో వెయ్యిన్నొక్కటి కొబ్బరి కాయలు కొడతానని అమ్మ మొక్కుకుంది.. వెళ్తూ మీకు కనిపించెళ్దామని తీసుకొచ్చేను' 


వెంకట్రాజు ' నమస్కారమండీ.. బాగున్నారా?' అని పలకరించేడు. రాజేశ్వరరావు గారు తల పంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా 'ఇంక మనం వెళ్ళాలి.. లేకపోతే గుడి కట్టేస్తారు' అన్నారు 


వెంకట్రాజు చిరునవ్వుతో చూస్తూండగా వారంతా కారెక్కి వెళ్లిపోయేరు. 


అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీ లో ఓ కవరు వేసి వెళ్లిపోయారు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్నని చెప్పుకోలేదు, ప్రాక్టీసూ చెయ్యలేదు. 


స్వామి వారి హుండీ లో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండీ సర్టిఫికెట్, కార్డియాలజీ లో ఆయన సాధించిన గోల్డ్ మెడల్స్ తో పాటు వెంకట్రాజు ( బ్రాకెట్లో దేవుడు) ని కులపిచ్చి తో ఏడుసార్లు కార్డియాలజీ సబ్జెక్టు లో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలెళ్ళిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది.

*దీపంలో ఉండే నవగ్రహాల అంశం:*



🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


దీపపు ప్రమిద సూర్యుడు, 

నూనె అంశం చంద్రుడు, 

దీపం వత్తి బుద్ధుని అంశం, 

వెలిగే దీపం నిప్పు కుజుని అంశం, 

దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు, 

దీపం నీడ రాహువు, 

దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు( ఆశ ) 

దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు

దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగె శని


🪔🪔🪔🪔🪔🪔🪔🪔


దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమి గాను నూనె నీరు గా ను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి


🪔🪔🪔🪔🪔🪔🪔🪔


దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు

కోరంగీలు

 మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా? శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు వారు ఉపాధి చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు.. అందుకే వారికి కోరంగీలనే పేరు వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న గ్రామమే కోరంగి.. అయితే ఇప్పుడున్న కోరంగి, ఒకనాటి కోరంగి వేరు..


కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడ రేవు.. అంతే కాదు ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లు ఉన్నాయి.. ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చకుంది.. లండన్ రేవులో లంగరు వేసిన కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వారికి కన్ను కుట్టింది.. నౌకా వ్యాపారంపై పట్టు సాధించిన బ్రిటిష్ వారు కోరంగి నౌకా పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పన్నుల భారాన్ని మోపారు.. అయినా తట్టుకొని నిలబడింది ఇక్కడి పరిశ్రమ.. కోరంగి ఓడ రేవు అతి పెద్ద వ్యాపార కేంద్రంగా వర్దిల్లేది..


రెండు అతి పెద్ద తుఫానులు కోరంగిని కాలగర్భంలో కలిపేశాయి.. 1789, 1839 సంవత్సరాలు కోరంగికి మరణశాసనాలుగా మారాయి.. 1789 డిసెంబర్ మాసంలో వచ్చిన మహాతుఫాను ధాటికి కోరంగి అల్లకల్లోలం అయిపోయింది.. దాదాపు 20 వేల మంది మరణించారు.. ఇక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు.. అయినా క్రమంగా కోలుకొని మళ్లీ నౌకా నిర్మాణ పరిశ్రమను కొనసాగించారు.. కానీ 1839లో నవంబర్ 25 తేదీ కోరంగి ఉనికి కాలగర్భంలో కలిపేసింది.. 40 అడుగుల ఎత్తున లేచిన మహా అలలు ఊరంతటినీ ఇసుక సమాధి చేసేసింది.. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు పోయాయి.. ఇళ్లూ, గిడ్డంగులు, నౌకా పరిశ్రమ మాయమైపోయాయి.. ప్రపంచ తుఫానుల చరిత్రలో మూడో అతిపెద్ద విషాదంగా నమోదైంది ఈ ఘటన.. అసలు cyclone అనే పదాన్ని ఇంగ్లీషు వారు ఈ విషాదం తర్వాతే ఉనికిలోకి తెచ్చారంటారు..


కోరంగి ఇప్పుడు లేదు.. ఆనాటి నౌకా పరిశ్రమ కూడా లేదు.. ఇసుక దిబ్బల కింద దాని చరిత్ర సమాధి అయిపోయింది.. ఈ మహా విషాదం జరిగి ఈ రోజుకు సరిగ్గా 175 సంవత్సరాలు..