22, సెప్టెంబర్ 2020, మంగళవారం

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

 


తిరుమల, 2020 సెప్టెంబ‌రు 22: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా మంగ‌ళ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి,హెచ్‌డిపిపి సభ్యులు శ్రీ సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు. ఆల‌యం ముందు ఈ గొడుగుల‌ను టిటిడి అధికారుల‌కు అందించారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.


మొత్తం 11 గొడుగులను తీసుకురాగా, ఇందులో 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, మరో 2 గొడుగులను సోమ‌వారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి సమర్పించారు.


Follow Us : @beautifultirupathi 

.

#Tirupati #BeautifulTirupathi #BeautifulTirupathiUpdates #Tirumala #TirumalaHills #srivaribrahmostavam #srivarisalakatalabramotasavam

కామెంట్‌లు లేవు: