25, జనవరి 2023, బుధవారం

Advocate in Telangana

 Respected Advocate,


Pls check your COP status by entering your Enrolment number. If the particulars are with empty space it infers that you have to submit COP, which you can submit by 31-1-2023. Pls also inform to your colleague advocates.


Advocates enrolled after June 2010 upto December 2017 and who have not submitted the COP, should submit Form A ( COP application) on or before 31-01-2023.


Advocates enrolled from 2018 onwards have to submit declaration form without fail.


If required download the COP forms from Bar Council website.



http://www.telanganabarcouncil.org/cop-details/


A Ananthasen Reddy

Bar Council Member, TS

సుభాషితమ్

 *సుభాషితమ్* 


శ్లో𝕝𝕝 కుతోఽహమాగతః కోఽస్మి  క్వ గమిష్యామి కస్య వా।

కస్మిన్ స్థితః క్వ భవితా కస్మాత్కిమనుశోచసి॥


తా𝕝𝕝  "నేను ఎవడను? ఎక్కడినుండి వచ్చాను? ఎక్కడికి పోతాను? ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఏ ప్రదేశంలో ఉన్నాను? ఎక్కడ మళ్లీ జన్మిస్తాను? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలుసునా? ఇవి అన్నీ బాగా ఆలోచిస్తే ఇంకా దుఃఖించడం ఎందుకు?".


*సేకరణ*

సన్యాసి - సమాధి

 సన్యాసి - సమాధి


1986లో తిరుచిరాపల్లిలోని ఆంగరై నుండి కొంతమంది భక్తులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారు వారితో చాలా విషయాలు మాట్లాడిన తరువాత కావేరీ తీరంలో ఉన్న సంధ్యావందన ఘాట్ గురించి వారిని అడిగారు.


అక్కడే దగ్గర్లో నిలబడి మహాస్వామివారి భిక్షా కైంకర్యం పర్యవేక్షిస్తున్న ఆంగరై శ్రీకంఠన్ ను చూపిస్తూ, “నేను ఎప్పుడు ఆంగరై గురించి అడిగినా, ఇతను తనకు ఏమి తెలియదని సమాధానం చెబుతాడు” అని అన్నారు.


అందుకు శ్రీకంఠన్ స్వామివారితో, “నేను ఆంగరై వదిలి నలభై సంవత్సరాలు అయ్యింది. కాబట్టి నాకు అక్కడి విషయాలు ఏమి తెలియవు” అని సమాధానం చెప్పాడు.


“ఎవరో కొంతమంది ఆ సంధ్యావందన ఘాట్ ని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం కొంత స్థలం మాత్రమే మిగిలిఉంది” అని దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పారు.


“వారంతా పేదవారు. వారిని మీరు అక్కడినుండి పంపించాల్సిన పని లేదు. ఆ మిగిలిన స్థలానికి ఒక ప్రహరీ కట్టి, రెండు మారేడు చెట్లు తులసి చెట్టు నాటి వాటిని పోషించండి” అని స్వామివారు ఆదేశించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం చేస్తామని వారు స్వామివారితో విన్నవించుకున్నారు.


2003వ సంవత్సరంలో శ్రీకంఠన్ సన్యాసం స్వీకరించారు. వారు తిరువానైకోవిల్(జంబుకేశ్వరం) లోని శ్రీమఠం శాఖలో ఉంటూ అక్కడే సిద్ధి పొందారు. అక్కడి శ్రీమఠం తోటలోనే వారిని శరీరాన్ని ఉంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తిరువానైకోవిల్ శ్రీమఠం దేవాలయ పంచ ప్రాకారాలలోనే ఉండటం వల్ల ఇక్కడ ఖననం చెయ్యడం సరికాదని కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆక్షేపించారు.


వారికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఆంగరైలో ప్రహరీ నిర్మిచిన వ్యక్తీ సూచన మేరకు, పెద్దస్వామి ఆదేశానుసారం వారి పార్థివ దేహాన్ని అక్కడకు తీసుకుని వెళ్లి సన్యాస సంపరదాయం ప్రకారం సమాధి చేశారు.


2003లో దేహత్యాగం చేసే తన సన్యాస శిష్యుని కోసం 1986లోనే స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు పరమాచార్య స్వామివారు. ఇది కేవలం కాకతాళీయమా? లేక పరమాచార్య స్వామివారి దిర్ఘదృష్టికి నిదర్శనమా?


--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పరమాచార్య వారి హాస్య చతురత....

 పరమాచార్య వారి హాస్య చతురత....

ఒకసారి స్వామి వారి దర్శనానికి ఒక వృద్దుడు వచ్చాడు.

వృద్దుడు "స్వామి. నాకు మూడు రోజులుగా జ్వరం తగులుతున్నది. దాని వల్ల ఏ పని చేయలేక పోతున్నాను. తమరు దయతో నాకు ఈ బాధ నుండి విముక్తి ఇవ్వండి."

స్వామి నవ్వుతూ "సరిపోయింది. నాకూ మూడు రోజులుగా జ్వరం. ఎవరికీ చెప్పుకోలేక చూస్తున్నాను. అలా కూర్చోండి. మీకోసంగతి చెప్పాలి.ఒక ఊర్లో ఒక పూజారి ఉండేవాడు. అతనికి వాక్ శుద్ధి ఉన్నది. అతను జరగబోయేది ఖచ్చితంగా చెప్పేవాడు. అతనికి ఆ ఊరి పోలీస్ మంచి మిత్రుడు.

ఒకరోజు గుడి తలుపులు తీసేసరికి ఆభరణాలు మాయమయినట్లు గుర్తించాడు. వెంటనే తన పోలీస్ మిత్రుడికి ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు.అదే సమయంలో పోలీస్ కూడా పూజారిని వెతుక్కుంటూ గుడివైపు వస్తున్నాడు."ఆడబోయిన తీర్ధం ఎదురైందని "పూజారిని చూసి పోలీస్ అనుకుంటే,"వేదకబోయిన తీగ కాలికి తగిలిందని "పోలీస్ ను చూచిన పూజారి అనుకున్నాడు.

పూజారి "నువ్వెందుకు పరిగెత్తుకొని వస్తున్నావ్ "

పోలీస్ "నా సైకిల్ ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వు భవిష్యవాణి చెబుతావని వస్తున్నా "

పూజారి "అరె రామ. గుడిలో పూజ సామాగ్రి పోయిందని నీకు ఫిర్యాదు చేద్దామని వస్తున్నా."

ఇలా ఉంది మన పరిస్థితి

నువ్వు జ్వరం తగ్గాలని నా దగ్గరకు వచ్చావు. నాకూ మూడు రోజులుగా జ్వరం నేనెవరికీ చెప్పుకోవాలి."

అంటూ స్వామి నవ్వితే వృద్దుడూ శృతి కలిపాడు.

***జ్వరం సంగతి పక్కన పెడితే స్వామి వారి చతురత, సమయస్ఫూర్తి కి భక్తులు ఆనందించారు.

నేతాజీ జయంతి

 ॐ నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటూనే, గాంధీ, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, 

   "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించిన ధైర్యమూ, రాజీనామా చేసిన ఆయన త్యాగమూ మన యువతకు అలవడితే, 

   మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 

    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం. 

                జై హింద్

మాతృ భాష పరిరక్షింప బడవలెననిన

 47వ రోజు:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

47వ రోజు (23-01-2023):

వజ్రము : అక్షజము, గుండుఱాయి, తెలిమిన్న  దృఢాంగము, పోతుమానికము, భార్గవప్రియము, షట్కోణము, సూచూముఖము, హీరకము, హీరము 

ఆంగ్లము: Diamond