31, మే 2021, సోమవారం

తెలివితేటలకు లోటు లేదు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.           అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..  


*భారత్ మాతా కీ జయ్*

Sringari


 

Happyest man


 

తల్లి ప్రేమ


 

Vaccine in China


 

Maanasika పవిత్రత


 

Prevention


 

Circus


 

Rugveda mantram


 

అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 2 . 


  

      హస్తనాడి గురించి మీకు అంతకు ముందు పోస్టు నందు వివరించాను. ఇప్పుడు మరింత విలువైన సమాచారం మీతో పంచుకుంటున్నాను . 


           ముందుగా ఆయుర్వేదం నందు నాడిని చూసే విధానం  గురించి తెలియచేస్తాను . వైద్యుడు నాడిని ఉదయమున పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి మూడువేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున చక్కగా నాడిని పరీక్షించవలెను . 


       పురుషులకు కుడిచేతి యందు , స్త్రీలకు ఎడమ చేతి యందు నాడిని పరీక్షించవలెను . దీనికి ప్రధాన కారణం పురుషులకు నాభి కూర్మము అధోముఖముగా , స్త్రీలకు నాభి కూర్మము ఊర్ధ్వ ముఖంగా ఉండును. ఈ బేధము చేతనే స్తీపురుషుల హస్తనాడులు బేధముగా ఉన్నవి. అనుభవము మరియు శాస్త్రము నందు చెప్పబడిన దాన్ని బట్టి చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరం రెండో చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 


             పాదనాడి పరీక్షించుట వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువుగా ఉండునా లేక తేలికగా ఉండునా మరియు జ్వరము విడిచి స్వస్థత చేకూరినదా వంటి విషయాలు తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను . 


      హస్తనాడి అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతిని ఆకలిగొనుటను , చెడిపోయిన వాతపిత్తకఫములను తెలియచేయును . అందుచే వైద్యులు ప్రధానముగా దీనినే పరీక్షించెదరు . 


           కంఠనాడి గాయములు , భయము మున్నగు బాహ్యాకారణముల చేత వచ్చు జ్వరమును , తృష్ణను , ఆయాసమును స్త్రీసంగమము , భయము , దుఃఖము , కోపము అనువాటిని ఈ కంఠనాడి తెలుపును . దీనిని పరీక్షించుటకు ప్రత్యేక నైపుణ్యత అవసరము . సామాన్యులు దీనిని పరీక్షించలేరు . 


       నాసా నాడి  చనిపోవుటయు , జీవించి ఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములను గురించి తెలియచేయును . 


           అప్పుడే స్నానము చేసినవారికి భుజించినవారికి , తలస్నానం చేసినవానికి , ఈదినవానికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవానికి నాడిని పరీక్షించిన బాగుగా తెలియదు . కావున అప్పుడు నాడిని చూడరాదు . 



      తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందించడం జరుగును. 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కొరోనా వైరస్ సృష్టికర్తలు

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


*కొరోనా వైరస్ సృష్టికర్తలు - ఒక మగ పిశాచం , ఒక ఆడ రాక్షసి* ? 


బయటపడుతున్న ఆశ్చర్యకరమైన నిజాలు ! 


ఈ వ్యాసాన్ని ఒక ముఖ్యమైన వ్యాసంగా నేను అనుకొంటున్నాను ఎందుకంటే ఇది మన చావు బ్రతుకులతో ముడిపడివున్న ఒక సమస్యపై వ్రాస్తున్న వ్యాసం , ప్రపంచం లో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఒక విపత్తుపై వ్రాస్తున్న వ్యాసం.


ఇది చదివినపుడు , ఇది మీకు నచ్చితే , మీరు ఇతరులతో ఈ విషయాలు చర్చించడానికి , వాళ్ళకు వివరించడానికి సులభంగా వుండాలని ఈ వ్యాసాన్ని ఒక నోట్సు లాగా చిన్న చిన్న పేరాలుగా / పాయింట్లుగా వ్రాస్తున్నాను. 


ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య *35, 47, 858.(~35.5 lakhs)*


అమెరికా లో మరణాల సంఖ్య 6 , 09 , 417. భారత్ లో ఈ సంఖ్య 3, 25 , 998. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 17, 06,09,  535.


ఇంతమందిని పొట్టనపెట్టుకొన్న ఈ కోవిడ్ మహమ్మారి ప్రకృతి లో సహజంగా వచ్చినది కాదు , *ఇద్దరు వ్యక్తులు ఒక చైనా  ప్రయోగశాలలో సృష్టించిన [man made] మహా ప్రళయం*.


ఆ ఇద్దరు వ్యక్తుల పాపిష్టి ముఖాలను క్రింద ఫోటోలో చూడవచ్చు.


*ఆమె పేరు Shi Zhangli [ షీ జంగ్ లీ - చైనా ] , అతని పేరు Peter Daszak [ పీటర్ దస్జాక్ - అమెరికా* ] 


ఈ కోవిడ్ వైరస్ ను మొదట నవంబరు - 2019 లో గుర్తించినపుడు ఇది  చైనా లోని Wet Market లో జంతువుల ద్వారా వచ్చిందని అన్నారు.


 [బ్రతికివున్న మూగ జంతువులను , పాములు , గబ్బిలాలు , కప్పలు మొదలగు ప్రాణులను , అప్పటికప్పుడు చంపి అమ్మే దుర్మార్గపు మార్కెట్లను wet markets అంటారు. ఇలా చేసే నీచ నికృష్ట దేశం ప్రపంచంలో చైనా ఒక్కటే అని అంటారు].


 ఈ వైరస్  2002 లో వచ్చిన SARS  లాంటిది అని దీనికి SARS-2  అని పేరు పెట్టారు.


 తరువాత WHO  వాళ్ళు  Novel Corona Virus అని అన్నారు , చివరికి CO అంటే Corona  అని , VI అంటే virus అని , D అంటే Disease అని చెప్పి , వచ్చిన ఏడాది 2019 కాబట్టి  *COVID - 19  అని నిర్ధారించారు*. 


*షి జంగ్ లీ* అనే ఆవిడ [ కింద ఫోటో లో చూడవచ్చు] చైనా లోని WIV [ Wuhan Institute of Virology ] లో శాస్త్రవేత్త , పరిశోధకురాలు.


ఆమె గబ్బిలాల [Bats]  మీద విశేషంగా రీసెర్చి చేస్తుంటారు. అందుకే ఆమెను Bat Lady  అని పిలుస్తుంటారు.


ఈ వైరస్ గబ్బిలాల వల్ల వచ్చిందని అని మొదట్లో తప్పుడు ప్రచారం చేసారు.


మనుషులు చేసిన ఘోరమైన పాపాన్ని , పాపం గబ్బిలాల మీదకు తోసారు.


 ఈ *జంగ్ లీ* , అలాగే ఇతర శాస్త్రవేత్తలు ప్రచారం చేసినట్టు ఈ వైరస్ ఊహాన్ లో గబ్బిలాల ద్వారా రావడానికి అవకాశం లేదు.


 *ఎందుకంటే ఊహాన్ లో గబ్బిలాలు లేవు*.


 "అవి వుండేది దక్షిణ చైనా

లోని Yunnan ప్రాంతంలో."


మన మనసులో ఒక ప్రశ్న పుట్టవచ్చు - Yunnan నుండి Wuhan  కు గబ్బిలాలు రావచ్చు కదా ? అని.


*రావు ఎందుకంటే రాలేవు ! ఎందుకు ?*.


 "యున్నాన్ ( Yunnan) కు ఊహాన్( Wuhan) కు మధ్య దూరం 1500 కి.మీ."


*గబ్బిలాలు 50 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఎగరవు అని వాటిని అధ్యయనం చేసిన సైంటిస్టులు చెపుతున్నారు.*


మరి అవి ఊహాన్ కు ఎలా వచ్చాయి ? అంటే ,  వాటిని తెచ్చారు.


*ఎవరు ?*.


" ఇంకెవరు ఈ Bat lady నే". 


ఎపుడు తెచ్చిందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.


 "2015 లో యున్నాన్( Yunnan) గుహలలోంచి వాటిని *జంగ్ లీ* ఊహాన్ ( Wuhan) కు తెచ్చింది."


*ఎన్ని తెచ్చింది ?*


 "100 గబ్బిలాలు తెచ్చింది".


2015 కు ముందు , ఆ తరువాత ఆమె యున్నాన్ (Yunnan ) గుహలకు అనేకమార్లు వెళ్ళిందని అఫిషియల్ రికార్డులు చూపిస్తున్నాయి.


 *గబ్బిలాలు తెచ్చి ఏమి చేసింది ?*.


అమెరికా లో North Carolina  రాష్ట్రంలోని *North Carolina State University* లో శాస్త్రవేత్త అయిన *Ralph S Baric* ను సంప్రదించింది.


"ఆయన ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టుల్లో ముఖ్యుడు".


 గబ్బిలాల లోకి , మనుషులు , ఇతర ప్రాణుల శరీరాల్లోకి ప్రవేశించే వైరస్ ను ఎలా జొప్పించాలి అనే విషయంలో ఈ *జంగ్ లీ* కి ఆయన పాఠాలు చెప్పాడు. 


*ఎలా ప్రవేశ పెడతారు ?*-

అనే ప్రశ్నకు చాలా వివరంగా చెప్పాల్సివుంటుంది.


*దాన్ని చిన్నగా టెక్నికల్ భాషలో చెపుతాను* :


"SARS -1 సూక్ష్మజీవి లోని *spike protein* ను తొలగించి దాని స్థానంలో గబ్బిలాలలోవుండే ఒక కణాన్ని ప్రవేశపెడతారు."


"ఇది మానవ శరీరంలోని సూక్ష్మ కణజాలాన్ని త్వరగా , వేగంగా  infect చేస్తుంది". 


*ఇంత ప్రమాదకరమైన పనిని ఎందుకు చేసారు ?*


"ఈ ప్రశ్నకు జంగ్ లీ , WIV వాళ్ళు తెలివైన జవాబు ఇచ్చారు."


 SARS-1 మహమ్మారి ఇంకోసారి భవిష్యత్తులో మరికొన్ని వ్యాధులకు దారి తీయకుండా వుండేందుకు , ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో తెలుసుకొనేందుకు ఈ ప్రయోగాలు చేసాము అని వారు అన్నారు.


*ఈ అంశాన్ని వైరాలజీ లో Gain of Function అంటారు*.


" ఇది వింటే వాళ్ళ పని తప్పు అనిపించదు కదా ?" 


*కాదు*.


"ఈ ప్రయోగాలు వారు చెపుతున్నట్టు 'ముందుముందు వచ్చే వ్యాధులకు సంబంధించింది' కాదు." 


*మరేమిటి ?*


"ఇది ప్రపంచం మీదకు దుష్ట చైనా ఎక్కుపెట్టిన విషపు బాణం."


*ఎలానో వ్యాసం చివరన చూద్దాం.*


   "మరి వ్యాసం మొదట్లో చెప్పిన *Peter Daszak* ఎవరు" ?


 *ఈ వ్యక్తి అమెరికాకు చెందిన వైరాలజిస్టు.*


"అమెరికా పొలిటీషియన్ల దగ్గర పరపతి ఎక్కువ వున్న వాడు."


ఈ మొత్తం ' పరిశోధనలకు '  అవసరమయ్యే లక్షలకొద్దీ డాలర్ల కాంట్రాక్టును ఈ *పీటర్* దక్కించుకొన్నాడు.


దాన్ని *జంగ్ లీ* కి సబ్ కాంట్రాక్ట్ చేసాడు. అత్యంత ఎక్కువ ఇన్ ఫెక్టివిటి వున్న కొరోనా వైరస్ ను ల్యాబ్ లో సృష్టించే ప్రయత్నంలో లీ కి అండ దండ ఈయనే !


డిశెంబరు 9 , 2019 న ఇచ్చిన ఇంటర్వ్యూ  లో '' *ఈ వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సినేట్ చేయలేం , ఇది untreatable  వైరస్* '' అని వెన్నులో వణుకు పుట్టించే సంగతులు బయటపెట్టాడు.


ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే *మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా తో* చాలా సన్నిహితంగా వుండేవాడు.


 2005 నుండి 2019 వరకూ US  National Institute of Health కు నిరాటంకంగా నిధులు అందాయి.


2009 నుండీ 2017 వరకూ [ *అంటే ఒబామా ప్రెసిడెంట్ గా వున్న సమయం* ] ఈ నిధులు మరింత ఎక్కువగా అందాయి.


 ఈ సంస్థ నుండి *జంగ్ లీ* కి నిధులు అందేలాగా *పీటర్* సహకరించాడు.


"తెలిసో , తెలియకో *ఒబామా* కూడా ఈ పాపం లో భాగం అయ్యాడు !"


 "ఆయనకు చైనా పట్ల వున్న ప్రేమ ఎంత పని చేసింది !". 


"కొరోన వైరస్ మొదలయ్యింది ఊహాన్ [ చైనా ] కదా , దీన్ని చైనీస్ వైరస్ , వూహాన్ వైరస్ అనకుండా WHO రాజ్యాంగం లో వున్న ఒక క్లాజ్ ను జంగ్ లీ , మరియు చైనా ప్రభుత్వంతెలివిగావాడుకొన్నాయి".


అదేమంటే '' ఏదైనా ఒక ప్రాంతంలో మొదలైన వైరస్ ను ఆ ప్రాంతం / దేశం పేరుతో గుర్తించడం , పిలవడం ఆ ప్రాంత / దేశ ప్రజలను అవమానించినట్టు అవుతుంది ''.


 అనే ఈ క్లాజును చూపి WHO ఈ వైరస్ ను *కోవిడ్ -19* గా పిలిచేలా *చైనా ' మ్యానేజ్* '  చేసింది.


"అంతేకాదు , ఈ పాపిష్టి పనిలో చైనా తప్పు ఏమీ లేదు అని ప్రపంచాన్ని నమ్మించేందుకు చైనా ప్రపంచ ప్రఖ్యాత దినపత్రికలు , చానెళ్ళకు  రచయితలకు  పెద్ద మొత్తంలోడబ్బులుకుమ్మరించింది."


 *భారత్ లో కూడా సుమారుగా 60 మందికి ఈ డబ్బులు అందినట్టు సమాచారం.*


"ప్రపంచ వ్యాప్తంగా ఇలా డబ్బులు అందుకొన్న వాళ్ళ పని ఏమంటే : *వాళ్ళ వాళ్ళ దేశాల ప్రభుత్వాలు కోవిడ్ ను నియంత్రించడంలో విఫలమయ్యాయని* , వున్నవి , లేనివి అన్నీ కలిపి *అర్ధ సత్యాలు , అసత్యాలను పేపర్లు , చానెళ్ళ ద్వారా ప్రచారం చేయడం*.


 [ *భారత్ లో అరుంధతీ రాయ్ , రాణా అయూబ్ , బర్ఖా దత్ లాంటి దేశ వ్యతిరేక , లెఫ్టిస్టు రచయితలు  ఈ వర్గం కిందకు వస్తారు*.]


"మన దేశంలో కోవిడ్ తో మరణించిన వారి శవాలను సామూహికంగా దహనం చేస్తున్న దృశ్యాలను ఈ వర్గం జర్నలిస్టులు ఫొటోలు తీసి *ఒక్కో ఫోటోను 80 వేలు , ఒక లక్ష రూపాయలకు*,  విదేశీ [ ప్రత్యేకించి అమెరికా , ఇంగ్లాండ్  కు] పత్రికలు , చానెళ్ళకు అమ్మిన విషయం *మనలో ఎంతమందికి తెలుసు* ?".


"మనకేం తెలుసు" అంటే -ఇంత పెద్ద దేశంలో , ఇంతటి భయంకర మహమ్మారిని , *అడుగడుగునా విమర్శలు గుప్పిస్తూ , అడ్డుపడుతున్న ప్రతిపక్షాల మధ్య*- ప్రభుత్వాలు సమస్యను హాండిల్ చేయడంలో జరిగిన ఒకటి రెండు తప్పులను- *భూతద్దంలో చూపించడం మాత్రం మనకు తెలుసు* !


"నేను గమనిస్తున్నాను , చాలా మంది నిష్పక్షపాతంగా  , నిజాయితీగా , లోతుగా అధ్యయనం చేసి కాకుండా  ' పాపులర్ ' కావాలని సోషియల్ మీడియా లో కనిపించాలనే కోరికతో మాట్లాడుతున్నట్టు , వ్రాస్తున్నట్టు వుంది."


 [ *అందరూ కాదు , చాలామంది*] 


మళ్ళీ వ్యాసం లోకొద్దాం. 


తాను దక్కించుకొన్న కాంట్రాక్ట్ ను *జంగ్ లీ* కి సబ్ కాంట్రాక్ట్ చేసినది ఎవరు ? - *పీటర్ దస్జాక్*.


*జంగ్ లీ* ని తెగ మెచ్చుకొన్నది ఎవరు ?  *పీటర్ దస్జాక్.*

 

ఊహాన్ లోని ల్యాబ్ నుండీ ఈ వైరస్ బయటికిపంపబడిందా , లేదా అని నిర్ధారించేందుకు WHO ఏర్పాటు నియమించిన కమిటీ లో ముఖ్యమైన సభ్యుడు ఎవరు ?- *పీటర్ దస్జాక్.* 


"ప్రాణాంతకమైన ఈ వైరస్ ను సృష్టించింది తామే అని *ప్రపంచానికి తెలిసింది కాబట్టి,  ఇబ్బందులొస్తాయని ఊహించి *చైనా ఊహాన్ లోని జంగ్ లీ ల్యాబ్ లను సీల్ చేసాము* అని చెప్పుకొంటోంది.


 "కానీ, ఇప్పటికే ఆమె వైరస్ ను సృష్టించడంలో విజయం సాధించింది కదా !"


 *ఇక ల్యాబ్ ను మూస్తే ఏమిటి ? మూయకపోతే ఏమిటి* ?  


*ఇపుడు అసలు విషయం.


ఇదంతా చైనా ఎందుకు చేసింది ? కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం యొక్క సైన్యం పేరు People's Liberation Army [ PLA ] 2015 నుండీ ఈ PLA  ఊహాన్లోని WIV తోకలిసి రహస్యంగా పనిచేస్తున్నదట.


*వీళ్ళ లక్ష్యం Bio weapons ను తయారుచేసుకోవడం*.


 "దేనికి ?".


 *మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే లాగా పరిస్థితులు కల్పించి* , ఆ యుద్ధమే వస్తే అందులో తాము గెలిచి *మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో వుంచుకోవాలని* కామ్రేడ్ల సామ్రాజ్యవాద రాక్షస ఆకాంక్ష.


 "ఎవరి చేత , ఎలా , ఎందుకు కొరోనా వైరస్ సృస్టించబడిందో తెలిసింది కదా ! "


*ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది చావుకు కారణమయ్యి ,  వేలాదిమందిని అనాథలను చేసిన పాపం వూరికేపోతుందా*?


 "కచ్చితంగా పోదు."


"నాకెందుకో నా ఇంట్యూషన్ చెపుతున్నట్టు అనిపిస్తోంది - భవిష్యత్తులో చైనా నాలుగైదు ముక్కలు అయ్యి [టిబెట్ స్వేచ్చను పొంది ]  , బలహీనపడి దెబ్బతింటుందేమోనని."


*ఆ శుభ ఘడియలను మీరూ , నేనూ చూస్తామా , లేదా చెప్పలేను*.


 "కానీ,జరగక మానదని నా నమ్మకం."


గమనిక - ఇదంతా [ చివరి పేరా కాకుండా ] నీవు చూసినట్టు వ్రాసావే అనేవాళ్ళు కూడా వుంటారు.


*అలా ఏమీ లేదండి.*


" Nature , Science , The NewYork Times లాంటి ప్రఖ్యాత పత్రికలకు ఎడిటర్ గా , Science Correspondent గా అనేక ఏళ్ళు పనిచేసిన Nicholas Wade అనే రచయిత May 5 , 2021  న Bulletin of Atomic Scientists  అనే పత్రికలో  The Origin of COVID - Did People or Nature - *open Pandora's Box at Wuhan* ? అనే అద్భుతమైన investigative వ్యాసం లోని అంశాలను ఈ వ్యాసానికి ఆధారం చేసుకొన్నాను.


 *ఆ గొప్ప వ్యాసాన్ని చదివాక ఇలాంటి జర్నలిస్టులు మన దేశంలో ఎందుకు లేరబ్బా అని బాధ కూడా కలిగింది.*.


In late 1960s, Brahmananda Reddy, the then CM of AP, told :" It is not enough if follow the rules of the Road, but you must also be vigilant to observe the *violators of the Road rules, because you would also be involved  as a victim in any road accident that ensues*".


So, it is not enough if you very keenly study about India, but you should also *study the intentions of the World about India*.



" All that glitters is not Gold. Sweet & pep talk is *not really sweet in taste*.


"Beware of the World around you & its real Intentions."


హరిః ఓమ్.

పాంచాలరాజు రాజ్యప్రాప్తి*

 _*వైశాఖ పురాణం - 20 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*పాంచాలరాజు రాజ్యప్రాప్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా ! వినుము.   శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.


పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు , గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము , కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.


వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. *"నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి , ఇంద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి ? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా ! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.


రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను ? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా ! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు , బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.


బాలురను , మృగములను , పక్షులను , బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.


నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు ఇద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు , యెండకు , దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.


అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.


నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతఃకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి , ధృష్టకేతువు , ధృష్టద్యుమ్నుడు , విజయుడు , చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.


రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.

నిజాయితీగల ప్రభుత్వాన్ని

 ప్రబీర్ బసు IAS అధికారి గారి పోస్ట్,


మొట్టమొదట, నేను ఎప్పుడూ 'రాజకీయ' సమస్యలపై వ్రాయను.  నేను వ్రాసేది కేవలం 'జాతీయ' సమస్యలపై మాత్రమే. ఉదాహరణకు, రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలా వద్దా అనే దానిపై నాకు అభిప్రాయం లేదు, నాకు కుతూహలం కూడా లేదు.  అదేవిధంగా, కాంగ్రెస్ కంటే బిజెపి మంచి పార్టీయా కాదా అన్నది లాంటి విషయాలపై నాకేమాత్రం ఆసక్తి ఉండదు.  


ఐఎఎస్‌లో 36 సంవత్సరాల సర్వీసు తరువాత కూడా నాకు ఒక్క ఎమ్మెల్యే, ఎంపి లేదా రాజకీయాల్లో పాల్గొన్న ఎవరైనా సన్నిహితులుగా లేదా పరిచాయస్తుడిగా ఎవరూ లేరు. 

కాబట్టి, గెలిచిన ఏ పార్టీ అయినా సరే నా దేశానికి మంచి చేస్తూ నిజాయితీగల ప్రభుత్వాన్ని నడుపుతున్నంతవరకు ఏ పార్టీ గెలుస్తుందో, ఓడిపోతుందో అన్నది నేను పట్టించుకోను.


ఇప్పుడు, ఇన్నేళ్ల తరువాత నేను గౌరవనీయులైన శ్రీ నరేంద్ర దామోదర్ మోడీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాను అనేది వివరిస్తాను:


 1. నా IAS అధికారిక సర్వీసు సేవ ప్రారంభమైనప్పటి నుండి నేను గమనించింది ఏంటంటే "ప్లానింగ్ కమిషన్" అనేది ఎటువంటి ఉపయోగకరమైన ప్రయోజనాలకు గానీ దేశానికి గానీ ఏవిధంగానూ ఉపయోగపడటం లేదని నేను గ్రహించాను. నేను దానిని రద్దు చేయాలనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా…... 

ఆ పని మన ప్రధాని మోడీ చేశారు.


 2. మా పన్ను వ్యవస్థ (Tax structure) ఏమాత్రం పనికిరాని, అక్కరకు రానిదని నేను ఎప్పుడూ భావిస్తూ వచ్చాను.  నన్ను బీహార్‌లో కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా నియమించినప్పుడు, దీని ప్రక్షాళన, సరిదిద్దాల్సిన అవసరం ఎంతగానో నాకు అర్థమైంది.  కొంత హేతుబద్ధీకరణ కోసం నేను స్వంతంగా సరిదిద్దడానికి ప్రయత్నించాను. కానీ అది కేవలం స్థానిక విధి విధానాలకు మాత్రమే పరిమితమై ఉండింది. వ్యాట్ system వచ్చినప్పుడు నేను  చాలా సంతోషించాను. కానీ జీఎస్టీ పన్ను విధానం అమలూజ్ దానివల్ల దేశానికి, ఆర్ధిక వ్యవస్ధకు జరిగే మేలు, పన్ను ఎగవేతదారుల కట్టడి నాకు స్వయానా తెలుసు కాబట్టి నేను దాని గొప్పదనం గ్రహించగలిగాను. ఆశ్చర్యకరంగా ఈ పని కూడా మోడీ గారే చేశారు. 


 3. మన దేశ భాగమైన జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని, నెహ్రూ నిర్ణయాన్ని నేను చిన్నతనం నుంచి కూడా ఎప్పటికీ జీర్ణించుకోలేకపోయాను. తరువాత నేను పెద్దయ్యాక ఈ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కథలు విన్నాను, అలాగే కాశ్మీరీ బ్రాహ్మణులపై ఈ నేతల ద్వారా జమ్మూ & కాశ్మీర్ లో జరిగిన దారుణ హింస.  జమ్మూ & కాశ్మీర్ ల్లో కోట్లాది రూపాయలు వేర్పాటు నేతల, ఖంగ్రెస్ నాయకుల, వారి తొత్తుల పాలయ్యాయి అనే విషయం IAS అధికారిగా నాకు ఈ నిజానిజాలన్నీ తెలుసు. కాబట్టి మోడీ గారు ఈ ప్రత్యేక హోదాను తొలగించినప్పుడు మరియు మా MEA సంస్థలు ఈ రగడ పై పాకిస్తాన్ మరియు చైనాల నోళ్లు మూసివేయడంలో ఎంత అత్యుత్తమమైన పని చేసిందో అనే వివరాలు తెలిసి నేను చాలా సంతోషించాను. అలాగే మొదటిసారిగా ఈ మనిషి మాటల మనిషి కాదు చేతల మనిషనీ, దమ్మున్న నాయకుడని నేను గ్రహించాను.


 4. పాకిస్తాన్ ఉగ్రతీవ్రవాదులను సరిహద్దులు దాటించి పంపించి, మన సైనిక జవాన్లను చంపిన ప్రతిసారీ అందరిలాగే నేను కూడా చాలా కోపంగా ఉండేవాణ్ణి. ఎందుకు మనం చాతగాని దద్దమ్మల్లా ఊరకుండిపోతున్నాం అని రగిలిపోతూ ఉండేవాణ్ణి. దాదాపు 70 ఏళ్ళ తరువాత మొదటిసారిగా కేవలం మోడీ అనే ఈ ప్రధాని  మాత్రమే ఆ పుందాకోర్ బాస్టర్డ్లకు యూరి (Uri) మరియు బాలకోట్ మిషన్ ల పరంగా ధీటైన జవాబిస్తూ మరచిపోలేని ఒక గుణపాఠం నేర్పించారు అలాగే కాశ్మీర్లోని సొరంగాల నుండి తరలి వస్తున్న ఈ తీవ్రవాద ముష్కర ఎలుకలను చంపడం కొనసాగించారు. కేవలం మోడీ యే ఈ చర్యలకు కారణమని నేను తెలుసుకుని చాలా సంతోషించాను. 


 5. నేను బెంగాల్ వాడిగా అనుభవించాను కాబట్టి ఘంటాపథంగా చెప్పగలను. చిన్నతనంలో బెంగాల్ విభజన మరియు అటుపై ఏర్పడిన తూర్పు పాకిస్తాన్‌లో ప్రజలపై మైనారిటీలపై జరిగిన దారుణ దాడుల వల్ల నేను, నా కుటుంబం మానసికంగా, శారీరకంగా చాలా కష్టాలు అనుభవించాం అలాగే  ఆర్థికంగా చాలా నష్టపోయాం. విభజన సమయాన్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మరియు ' ముక్కలై మిగిలున్న అసలైన భారత్' లోని కొన్ని భాగాలలో ముస్లిమేతరులు అప్పటికి ఇప్పటికీ కూడా చాలా దాయనీయమైన బతుకులు గడుపుతూండటం నన్ను చాలా కలచివేసింది. మన ప్రధాని సిఎఎ ను (CAA) తీసుకువచ్చారు మరియు భారతదేశం వారినందరిని భారతీయ కుటుంబంలోకి తిరిగి తీసుకువెళుతుందనే ప్రేమపూర్వక హామీని ఇచ్చింది. చివరికి ఒకే ఒక వ్యక్తి, కేవలం శ్రీ నరేంద్ర మోడీ మన భారత ప్రజల బాధలను, కష్టాలను అర్థం చేసుకున్నారు అలాగే దానికి వెసులుబాటును కూడా తీసుకు వచ్చారు. 


 6. మన రక్షణ విభాగ సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ పరికరాలు, ఆయుధాలను అప్‌గ్రేడ్ చేయడంలో వరుస ప్రభుత్వాల వైఫల్యాలు చూసి చాలా నిరుత్సాహంగా ఉంటూ ఆందోళన పడుతూ ఉండేవాణ్ణి. మన ప్రధాని మోదీ గారే రక్షణ శాఖ ని పునరుద్దరిస్తూ ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టటం జరిగింది. 

అంతే కాదు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా ల వద్ద మన సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, సొరంగాలు - మౌలిక సదుపాయాల రూప కల్పనపై ఆయన దృష్టి పెట్టటమే కాదు రక్షణ వ్యవస్థని బలీయం చేసి చూపారు. అంతకుముందు లా కాకుండా నేను ఇప్పుడు ఈ దేశంలో చాలా సురక్షితంగా ఉన్నానని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను, భావించగలుగుతున్నాను.  


 7. అమర్జిత్ అని నా మిత్రుడు మన ప్రధాని ప్రధాని గారి చేత చేయబడిన గ్రామీణాభివృద్ధి పనుల గురించి నాకు వివరించి చెప్పారు. అమర్జిత్ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే అతను గ్రామీణాభివృద్ధి కార్యదర్శి మరియు ఇప్పుడు పిఎంఓలో సలహాదారు.


 8. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు నీళ్ల కోసం మైళ్ళ తరబడి నడవడం సిగ్గుచేటుగా ఎప్పుడూ భావించేవాణ్ణి.  ఈ సమస్యను పరిష్కరించడానికి వాటర్ మిషన్ ప్రవేశపెట్టబడింది మరియు ఫలితాలు దేశమంతటా గ్రామీణుల మొహాల్లో ప్రతిబింబిస్తూ చూపిస్తున్నాయి.


 9. చాలా న్యూస్ ఛానెల్స్ మరియు న్యూస్ పేపర్లు ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా నిరంతరం విరుచుకుపడుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.... కానీ అతను ఏమాత్రం స్పందించడు.  షాహిన్‌బాగ్‌లో నిరసనకారులు రోడ్లను అడ్డుకున్నప్పుడు, రైతుల ఆందోళనలో ఎంతో సహనం ప్రదర్శించడం ఆయనలోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. 


 10. ఆయనకు సహాయం చేయడానికి వివిధ గవర్నమెంట్ విభాగాల్లో, శాఖల్లో ఆయన ఎంచుకున్న అధికారులు, డాక్టర్ పి.కె. మిశ్రా, భాస్కర్ ఖుల్బే, పికె సిన్హా, పిఎంఓ లో అమర్జిత్ సిన్హా, క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గువాబా, తన నీటి మిషన్ కోసం భరత్ లాల్, RBI గవర్నర్‌గా శక్తి కాంత్ దాస్, మరియు అనేక ఇతర కీలక పదవుల్లోని అధికారులు వారి సమగ్రత, తేజస్సు మరియు పంపిణీ సామర్థ్యానికి పేరు గాంచారు, అలాంటివారినే ఆయన నియమించుకున్నారు. ఇది అతని నైపుణ్యాన్ని, తీక్షణ బుద్దిని సూచిస్తోంది. 


 11. అతను తన మంత్రివర్గంలో అత్యుత్తమ మాజీ పౌర అధికారులను మంత్రులుగా ఎన్నుకున్నాడు. నా స్నేహితుడు ఆర్ కె సింగ్ పవర్ మరియు ఎంఎన్‌ఆర్‌ఇ (ప్రభుత్వ శాఖ) కి స్వతంత్ర బాధ్యత వహిస్తున్నారు.  ఆయన సహకారం అందరికీ కనిపిస్తుంది. వి జైశంకర్, తెలివైన కెరీర్ దౌత్యవేత్త మన విదేశాంగ మంత్రి. మరో కెరీర్ దౌత్యవేత్తను పౌర విమానయాన మంత్రిగా చేశారు.  కాబట్టి, అతను ప్రభుత్వాన్ని నడపడానికి ఉత్తమ ప్రతిభను ఎన్నుకోవడం లోనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 


 12. మన ప్రధాని గాల్వాన్ వద్ద చైనీస్ సైనికుల గూబలు గుయ్ మనేలా ఇచ్చిన చప్పుడుకి 1962 లో మన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నారు.  చైనా సైనికులు ఇప్పుడు భారత సైన్యాన్ని ఎదుర్కోవటానికి చాలా భయపడుతున్నారు. చైనా అధినేత క్సింగ్ వారి ఆర్మీ జనరల్‌ను మార్చినప్పుడు వారికి భారతదేశం చేతిలో జరిగిన తీవ్ర అవమానానికి మరింత రుజువు వచ్చి చేకూరింది.


 13. శ్రీ మోడీ నినాదం "నేను తినను, ఎవరిని తిననివ్వను" (न खाऊंगा न खाने दूँगा) అనే నినాదం ఇప్పుడు అందరి కళ్ళకు కనబడుతోంది. 1965 లో లాల్ బహదూర్ శాస్త్రిజీ, అటుపై వాజపేయి మమ్మల్ని విడిచిపెట్టిన తరువాత మళ్లీ నిజాయితీ, నిబద్ధత గల ప్రధానిని పొందడం కోసం మేము పౌర సేవకులగా దశాబ్దాలుగా ఎదురు చూశాము. మోడీ రాకతో మా ఎదురుచూపులకు అర్ధం దొరికింది. 


ఇప్పుడు నాకు చెప్పండి. నా దేశం కోసం నేను ఇన్నేళ్ళుగా కలలుగన్న ప్రతీది, ప్రతి ఒక్కటీ మన ఈ ప్రధాని చేత చేయబడుతుంటే, నేను ఇప్పుడు అతనిని ఇష్టపడి, నా మద్దతు ఇవ్వడంలో నే చేసిన నా తప్పు ఏమిటి?  


గత 20 సంవత్సరాలుగా మనము దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలు మాత్రమే తింటున్నాము. ఈ విషయం మనకు తెలిసింది ఎప్పుడూ ???? 🤔🤔🤔


మోడీ జీ 2 సంవత్సరాల క్రితం ఈ దిగుమతిని కట్ చేసి దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా మనకు తెలిసి వచ్చింది. ఇప్పుడు కరోనా కారణంగా పూర్తిగా ఆగిపోయింది .. 


అందుకే ఇప్పుడు రుడాలి, వ్యవసాయ ఉద్యమం అనేది ఒక పెద్ద సాకు.

2005 లో, మన్మోహన్ ప్రభుత్వం చేసుకున్న రహస్య ఒప్పందం ప్రకారం భారతదేశంలో పండిన పప్పుధాన్యాలను సబ్సిడీ చేయడం మానేసింది.


అటుపై రెండేళ్ల తరువాత, కెనడా, ఆస్ట్రేలియా మరియు నెదర్లాండ్స్ నుండి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వపు కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.


2005 లో, కెనడా ఒక పెద్ద పప్పుధాన్యాలు పండించే అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించింది, ఇందులో చాలా మంది పంజాబీ సిక్కులను రైతులుగా, పనివంతులుగా ఉంచారు… .ఈ సంస్థల్లో మొదట మేనేజర్లు గురుద్వారా నుంచి వారిని మార్చి తరువాత ఖలిస్తానీలు నిర్వాహకులుగా పెరిగారు.


దీనిద్వారా 2007 కల్లా కెనడాలో పప్పుధాన్యాల ఉత్పత్తి చాలా పెరిగిపోయి ఆఖరికి దీనిని "పసుపు విప్లవం" అని పిలిచే స్థాయికి చేరుకుంది. ఎందుకంటే వారి కస్టమర్లు మరి భారతదేశ పంజాబీ మండీల ఏజెంట్లు .. వీరిలో కొందరేమో కాంగ్రెస్ పంజాబీ కుటుంబాలు, మహారాజా పాటియాలా కుటుంబం మరియు బాదల్ కుటుంబం కూడా ఉన్నాయి.


నేడు, మోడీ తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ విధానపు చట్టం అనేది పాపం ఈ బ్రోకర్లందరి ఆదాయాన్ని భూమిపై చేసిన సర్జికల్ స్ట్రైక్ లాగా వీరందరినీ, వారి దోపిడీని నిరోధించింది.


మరి ఆలోచించండి, ఇప్పుడు భారతదేశం వారి మార్కెట్ కాకపోతే, కెనడా మరియు ఇతర దేశాలు వారి పొలాలపై [వారి వారి దేశాలలో .. పెట్టిన పెట్టుబడి డబ్బు .. ]

ఇది వృధా కావడమే కాకుండా నిరుద్యోగం మరియు భారతదేశంలో ఇంత భారీ మార్కెట్ వారి చేతుల్లోనుంచి చూస్తూ చూస్తూనే ఎలా జారిపోయింది.


ఈ మొత్తం పప్పుధాన్యాల, మండీ మార్కెట్ కుంభకోణంలో కాంగ్రెస్ అతిపెద్ద బ్రోకర్.

ఇలాగే మనం ఇదివరకే చూసాం…..

చైనాలో వాణిజ్యం, తయారీ కోసం సిడబ్ల్యుసి విపి మరియు సిసిపి విపి చైనాలో ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు మనం చూశాము.  


భారతీయ ఆర్థిక వ్యవస్థ, శ్రమ, ఉపాధి, వ్యాపారం అనే పెట్టుబడి లేని ఖర్చుతో భారత జాతీయ సంపదను దోచుకుంటూ ఖాంగ్రాస్ మరియు దాని చెంచాలు కొల్లగొట్టాలి. 


నరేగా అంటే, గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ act అనే పథకం కింద పేదలకు ఎంగిలి మెతుకులు విసిరారు.

(https://www.nrega.nic.in/netnrega/mgnrega_new/Nrega_home.aspx)


మోడీ వారి మోసాలలో ఒక్కోదాన్ని బహిర్గతం చేస్తున్నారు. వారి అక్రమ ఆదాయానికి ప్రతి తలుపు మూసివేస్తు గండి కొడుతున్నారు.  

ఇక్కడ రైతు చట్టం నిరోధక పేరు మీద జరుగుతున్న దుర్మార్గం అంతా కేవలం దాని గురించి మాత్రమే.


అందుకే కెనడా కూడా తమ పార్లమెంటులో మన ఈ రైతు చట్టం బిల్లుపై చర్చలు జరుపుతుంది మరియు అక్కడి ఖలీస్తానీ గ్రామస్తులను భారతదేశానికి పంపిస్తామని బిజెపిని, భారత దేశాన్ని తీవ్రంగా బెదిరిస్తోంది.  

ఖలీస్తానీ అనేదే కాంగ్రెస్ యొక్క సృష్టి మరియు మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఖాలిస్తాన్ పై చూపే ఆ వక్ర అభిమానం.


ఈ సందేశాన్ని భారతదేశంలోని ప్రతి పౌరుడికి అందించే ప్రయత్నం చేయండి.


ఎందుకంటే నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను

🙏🙏🙏


మేరా భారత్ మహాన్

జై భారత్, జై హింద్

Precations to be taken by apartment residents

 https://drive.google.com/file/d/17feu_Z5t2Hm3cRrSnc2sxkDkeStof1nZ/view?usp=drivesdk

Sandya vandanam

 https://drive.google.com/file/d/17Z7kmfM33PGth-RTxeb_Bo4z3P9BkY1b/view?usp=drivesdk

30, మే 2021, ఆదివారం

అష్టస్థాన పరీక్ష

 ఆయుర్వేదం నందు గల అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 


  మనుష్యునకు సంభవించు సమస్త వ్యాధులకు మొదట 8 స్థానములను పరీక్షించవలెను .  అవి 


 1 - నాడి , 2 - స్పర్శము ( తాకుడు ) , 3 - రూపము , 4 - శబ్దము , 5 - నేత్రములు , 6 - పురీషము , 7 - మూత్రము , 8 - జిహ్వ   


      ఇప్పుడు వీటి గురించి మీకు వివరిస్తాను.  


 * నాడి  - 


       దీనిని ఆంగ్లము నందు " pulse " అందురు. రోగమును గుర్తించుటకు ఈ నాడీ పరీక్ష అద్భుతముగా పనిచేయును . ఒకసారి గాలిని లోపలికి పీల్చి , బయటకి వదిలిన 4 సార్లు నాడీస్పందన కలుగును.  


        వయస్సుని అనుసరించి నాడీస్పందన తెలుసుకొనవలెను . 


  గర్భము నందలి పిండము నాడి స్పందన  150 నుంచి 130 వరకు ఉండును. 


  శిశువు పుట్టగానే  నాడీ స్పందన 140 నుంచి 130 వరకు ఉండును . 


 1 సంవత్సరం లోపున నాడీస్పందన 130 నుంచి 115 వరకు ఉండును. 


 2 సంవత్సరాల లోపున నాడీస్పందన 115 నుంచి 100 వరకు ఉండును. 


 3 సంవత్సరాల లోపున నాడీస్పందన 100 నుంచి 90 ఉండును. 


 7 సంవత్సరం నుండి 14 సంవత్సరం వరకు నాడీస్పందన 90 నుంచి 75 ఉండును.


 14 వ సంవత్సరం నుంచి 20 వ సంవత్సరం వరకు 85 నుండి 75 వరకు ఉండును . 


 21 సంవత్సరం నుండి 60 సంవత్సరం వరకు 75 నుంచి 65 వరకు ఉండును. 


 60 సంవత్సరాల పైన  85 నుంచి 75 వరకు నాడీస్పందన ఉండును. 


      రక్తక్షీణత , జీర్ణజ్వరము , దౌర్బల్యము , భోజనం చేసినపిమ్మట , మలవిసర్జన చేసిన తరువాత నాడీ క్షీణించును. జ్వరాదుల యందు నాడీపరీక్ష చేసినప్పుడు మరియు ఎంత వ్యాధి ఉన్నను , వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు. 


              ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . హస్తము , పాదము , కంఠము , నాస ఈ నాలుగు భాగముల యందు ఒకొక్క దాని యందు 2 చొప్పున మొత్తం 8 నాడీ స్థానములు ఉండును. రెండు చేతుల మణి బంధములు , రెండు పాదముల చీలమండల యందు , ముక్కుకి రెండు ప్రక్కలా , కంఠము కు రెండువైపులా నాడీపరిక్ష చేయవలెను . 


      హస్తనాడి శరీరం అంతయు వ్యాపించి వాత , పిత్త , కఫములను , రసరక్తములను మొదలగు విషయములకు బాధ్యతకారిగా ఉండును. ఇది మన బొటనవ్రేలి మూలము నందు 3 వేళ్లు కలిసి ఉండు చోట ధాన్యపు గింజ పరిమితిన చరించుచుండును. దీని ద్వారా మన ఉచ్చ్వాస , నిశ్చ్వాసముల గమనము బాగుగా తెలియును . 


          ఇది జీవసాక్షి అయ్యి శరీరం యొక్క ఆరోగ్య , అనారోగ్యములును సరైన కాలం తెలుపు గడియారం వలే స్పష్టముగా తెలియచేయును . మన ఉచ్చ్వాస , నిశ్చ్వాసములు శరీరం అంతయు వ్యాపించుచుండును. అట్లు వ్యాపించు సమయమున శరీరం నందు ఎటువంటి ఒడిదుడుకులు లేకున్న  నాడి సమముగా ఉండును ఎక్కడన్నా దోషము ఉండి ఉచ్చ్వాస , నిశ్చ్వాసములు ఒడిదుడుకులు ఎదురైనచో ఈ నాడి గమనం తేడావచ్చి నెమ్మదిగా జలగ , పాము వలే సంచరించును . లేదా తొందరగా , ఎగురుచూ సంచరించును. 


      తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

తెలుగు సామెతలు

 Dedicated to all Telugu lovers👍మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.


*Please Share all Telugu People*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక  

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.🙏

అందరూ సమానమే

 1. *ఆదివారం* గడవాలనే చింత లేదు.

2. *సోమవారం* వస్తుందనే భయం లేదు.

3. *డబ్బు* సంపాదించాలనే మోహము లేదు.

4. *ఖర్చు పెట్టే* ఆసక్తి లేదు.

5. *హోటల్ లో*  తినాలనే కోరిక లేదు.

6. బయట తిరిగే ఆలోచన లేదు.

7. *బంగారం వెండి* పై మోహము లేదు.

8. *కొత్త బట్టలు* ధరించాలనే ఆతృత లేదు.

9. *సుందరంగా తయారవ్వాలనే* చింత లేదు.


" *మనం మోక్ష ద్వారం చేరుకున్నామా?*" ఏమో కలియుగం సమాప్తమై *సత్య యుగం* వచ్చేసిందేమో*.."


* పూజా, వ్రతం, పరివారం జతలో, ఉపవాసం, రామాయణం మరియు మహా భారతం¶

* కాలుష్య రహిత వాతావరణం¶

*పరుగుతో నిండిన జీవనం* సమాప్తి¶

* సాధారణ జీవనం¶

* అందరూ రొట్టె:పప్పు తింటున్నారు¶

* అందరూ సమానమే..అనే భావన¶

* ఏ నౌకర్లు లేదు..ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు¶

* ఖరీదైన బట్టలు, ఆభరణాలు ధరించాలి అనే ఆశ లేదు¶

* ప్రజలు అపార దాన ధర్మాలు చేస్తున్నారు¶

* అహంకారం శాంతించింది..¶

*పిల్లలు అందరూ ఇంటికి వచ్చి తల్లి తండ్రుల తో కలిసి ఉంటున్నారు¶ 

మంచి మాటలు మాట్లాడు కుంటున్నారు               

*సర్వే జనా సుఖినోభవంతు*

సుదాముడి భక్తి.)

 *నీ పాద కమల సేవయు,*

*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*

*తాపార భూత దయయును,*

*తాపస మందార నాకు దయసేయ గదే.!!*


(పోతన భాగవతము .. దశమ స్కంధము .. సుదాముడి భక్తి.)


తెలుగు భాగవతం లో ప్రసిద్ధ పద్యాల లో ఇది ఒకటి. 


ఒక్కో భక్తుడు ఒక్కో కోరికతో భగవంతుడిని పూజిస్తారు. కొద్దిమంది విలక్షణ మైన కోరికలు కోరతారు. 


పాండవుల తల్లి కుంతీ దేవి కష్టాలు పడీ పడీ అవి అలవాటవడమే కాకుండా కష్టాలకు addiction కూడా వచ్చినట్లుంది. ఆమె కృష్ణుడిని "నిరంతరం నాకు కష్టాలు ఉండేటట్లు అనుగ్రహించ వయ్యా అని ప్రార్ధిస్తుంది. కష్టాలు లేనప్పుడు నేను దేవుడిని మరచి పోతున్నాను అందుకని దేవుడు నిరంతరం గుర్తుండాలని ఈ కోరిక కోరానని చెపుతుంది". తమాషా కోరిక. 


ఏదడిగినా ఇస్తాడని తెలిసి కూడా మొహమాటం అడ్డొచ్చి ఏదీ అడగ కుండా వెళ్ళిపోయిన వాడు కుచేలుడు. 


శివుడి లాగా విష్ణుమూర్తి సాధారణంగా అంత తొందరగా భక్తులను అనుగ్రహించడు. పరీక్షలు పెట్టీ పెట్టీ, భక్తుడి దుంప తెంచీ, వాడు ఆయన పెట్టే అన్ని  పరీక్షల్లో నెగ్గితే ఆఖరకు అనుగ్రహిస్తాడు. 


సుదాముడనే వాడు మధురా నగర వాసి. కుచేలుడికి కూడా సుదాముడనే పేరుంది. ఇతను వేరు. ఇతను ఇంకో కృష్ణ భక్తుడు.  వాడు  ఎంత తపస్సు చేశాడు ఎన్ని పూజలు చేసాడు అనే వివరాలు,  భాగవతం లో లేవు.  ఇతను మాలాకారుడు అంటే పూల మాలలు తయారు చేసేవాడు. కుబ్జ కథ కు సరిగ్గా ముందు ఇతని కధ వస్తుంది.  స్వయంగా కృష్ణుడే అతని ఇంటికి వెళతాడు. ఆయన ఆతిధ్యం తీసుకుని మాలలు తీసుకుని, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అంటే అప్పటికే సుదాముడి కి పరీక్షలూ తపస్సులూ అన్నీ పూర్తయినాయన్న మాట. సుదాముడు కూడా వచ్చినవాడు భగవంతుడని గుర్తు పడతాడు. ఈ సందర్భం లో ఆయన కోరిన కోరికే పైన వ్రాసిన పద్యం. ఈయన కోరిన కోరిక విలక్షణ మైనది.  వ్యాసుడి శ్లోకం కంటే పోతన తెలుగు పద్యం బావుంది. అందుకే ఇది వ్రాసాను. దీని అర్థం గమనించండి. 


*తాపస మందార* :: పారి జాతము, సంతానము, కల్ప వృక్షము, మందారము, హరి చందనము ఇవి ఐదూ స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టుకు పేర్లు. తెలుగులో మందారమంటే దాసాని చెట్టు, హరిచందనమంటే గంధం చెట్టు ఇలాగ ఉంటాయి. సంస్కృత సమాసాలలో మాత్రం స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. ఆశ్రిత పారిజాతమా భక్త మందారమా అంటే అదీ అర్ధము. నీకోసం తపించే (తపస్సు చేసే) వారి అన్ని కోరికలు తీర్చేవాడా అని అర్ధము. 


*నీ*:: భగవంతుడిని ఏకవచనం లో సంబోధించాలంటే ఆయన తనవాడు, తను ఆయన వాడిని అనే భావం పూర్తిగా వుండాలి. త్వమేవాహం అన్న స్థితి.  అది వున్న వాడే ఆవిధంగా భగవంతుడిని ఆత్మీయం గా ఏక వచనం లో పిలవ గలడు. అనన్యశరణత్వము, అనన్యా ర్హ శేషత్వము మొదలైన భావనలు ఉండడం. లేదా అలా పిలవడం ద్వారా ఆభావాలు అలవాటు చేసు కోడము అనుకోవాలి. 


*పాద కమల సేవయు*::  పాదాలను కవులు కమలాల తో పోలుస్తారు. Physical పోలిక ఉండదు. కావాలంటే బెంగుళూరు వంకాయలతో పోల్చుకోవచ్చు. కమలాల తో పోలికేమిటి. నిజానికి కోల ముఖం ఉన్న వాళ్ళను కూడా చంద్ర ముఖి అని పద్మ ముఖి అని పిలుస్తారు. ముఖం గుండ్రంగా ఉంటుందని కాదు. చంద్రుడి లోను, పద్మం లోనూ లక్ష్మీ కళ ఆకర్షణ ఉంటాయి. ఆగుణం తో పోలిక. ఆ పోలిక అనుభవించిన వాడికి దేవుడి పాదాలు వదల బుద్ధి కాదు. ముక్తులు చాలా రకాలు. అందులో సామీప్యం, సాలోక్యం అని రెండుంటాయి. విష్ణుమూర్తి పాదాలు చూస్తూ నిత్యం వాటిని సేవించాలంటే సామీప్య సాలోక్య ముక్తులు రెండూ ఉండాలి. సామీప్య సాలోక్య ముక్తులు రెండూ కావాలని లోపలి కోరిక.


*నీ పాదార్చకుల తోడి నెయ్యము* :: నీ భక్తులతో మాత్రమే సత్సంగత్వం కావాలి అని కోరిక. మన పక్క నుండేవాళ్ళు కూడా అదే కోరికతో వున్న వాళ్ళయితే మన భక్తి కి diversion కలగదు. భగవత్సేవ తో పాటు భాగవతుల సాంగత్యం కూడా కావాలి అని.


*నితాంతాపార భూత దయయును*:: అద్వేష్టీ సర్వ భూతానం .. భగవద్గీత గుర్తుంది కదా. ఆ శ్లోకాల కొసలో యోమే భక్తః సమే ప్రియః అని ఉంటుంది. భూతదయ కలగాలి దాని తరవాత దానివల్ల విష్ణుమూర్తికి తాను ఇష్టుడు కావాలి అని కోరిక. 


పద్యం అంతా ప్రధమ పురుష లో  (you)  నడుస్తుంది. భగవంతుడిని ఎదురుగా ఉన్నాడని భావించి మన మాట ఆయన వింటున్నాడనే నమ్మకంతో పలికే ప్రార్ధన ఇది. ఇందులో భగవంతుడు శివుడు రాముడు కృష్ణుడు అని ఏమీ ఉండదు. అమ్మవారి ముందు కూడా చెప్పుకోవచ్చు. స్తుతీ,  ప్రార్ధన,  సంకల్పమూ,  సంపూర్ణ శరణాగతీ అన్నీ ఈ పద్యం లో ఉన్నాయి. 


భగవంతుడు అడగలేదని కుచేలుడికి ఎగ గొట్టడు. అడిగింది కదా అని కుంతికి కష్టాలు ఇవ్వడు. ఎవరి కర్మఫలం వారికి తూచి సరిగ్గా ఇవ్వడం భగవంతుడి ప్రత్యేకత. ఈ కోరిక విని కృష్ణుడు నవ్వి  సుదాముడికి అడిగినవీ అడగనివీ అన్నీ ఇచ్చాడని భాగవతం లో ఉంది. 


మన కున్న కర్మ తాలూకు balance ఏమిటో మనకు తెలీదు. పోనీ నష్టం లేదు కనుక మనం కూడా సుదాముడు పద్ధతి లో ఓ application ఇస్తే సరిపోతుంది. మనం రోజూ పూజలో చదువు కోవచ్చు పిల్లలకు నేర్పించ వచ్చు... మంచి పద్యం... 


*పవని నాగ ప్రదీప్.*

*98480 54843*

విష్ణు తత్వము

 శం నో అగ్నిః శం వరుణః, శం నో విష్ణుః ఉరు క్రమః ఉరుగాయో అని కూడా శ శిం అయినది. పూర్ణము ౦ వలననే ఈ అనే విష్ణు తత్వము క్రమముగా అనగా వక సూత్ర పధ్దతిలో వ్యాప్తమై ఉరుగాయెూ క్షేత్రమును,భూమిని తెలుపుచున్నది. విష్ణువనే ఈశ తత్వం వ్యాప్తి వలన భూ లక్షణము. శం నో మిత్రః శం వరుణః. అగ్నిని మిత్ర సూర్యుడుగా విశ్వానికి మిత్రుడుకూడా పిలువబడును. ఎన్నో కోట్ల సంవత్సారాల కాల క్రితంనుండి యున్న శక్తిని మానవ రూపంలో ఎవరూ సృష్టించలేదు.దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించుటయే జీవ లక్షణము ఙ్ఞానం. శక్తి వ్యాప్తమై సూక్ష్మమని అది ఆది అంతము లేనిది. దేవతలకు అమృతత్వము కలదని అంటారు అది మనకు భౌతికంగా కనపడదు. మన శక్తి మృతము అనగా వేరు దేహమును ఆశ్రయించకుండా నుండుటయే అమృతం.దైవ శక్తి వక వేళ దేహమును ధరించినా తిరిగి దాని పపిధి తరువాత తిరిగి విడిచి మూల తత్వం లో లీనమగుదురు. యిదిగో యిదే ఋషి తత్వం.మృతముగానిది. దేహమునకు అమృత పూర్ణ మైన ఋక్కు లక్షణమును తెలియుటయే. తెలిసి దానిని ఏ దేహములోనికి ప్రవేశించకుండా యుండుట అమృతం. శం న ఓ ఓ జీవ రూప ౦ పూర్ణ శక్తి ఈ అనే శక్తియే మూలం. అది శ అనగా రాహు కేతు శక్తి. అవి వకటి ఏన్టీ క్లాక్ పద్దతిలో చలనము కలిగియుండును. కేతువు సవ్య గతిలో తిరుగును. వీటి శక్తియే మిగిలిన సమస్త ప్రపంచమునకు మూలము. రాహువు మాత్రమే మూల శక్తి కలిగి అమృత తత్వం కలిగియున్నట్లు దానిగురించి ఎక్కడా అది యిదియని దాని లక్షణము యిది యని వేదము యిత మిధ్దంగా తెలిపియుండలేదు. తెలియక పోవుట ఈశ యని తెలియుట విషు  విష్ణు యని వకటి నిర్గుణముగా  వేరొకటి సగుణముగా. సగుణము ప్రకాశించు తత్వమును తెలుపుచున్నది. నిర్గుణం ప్రకాశము లేనిది. దానినుండి సమస్తం తెలియాలి. క్రమముగా అనగా హవిస్సు ఉష రూప కాంతి వక క్రమ పద్దతి యనగా సూత్ర పరంగా వ్యాప్తి యని, అనగా శబ్ద శక్తిని వేద పరంగా క్రమ యని క్రమముగా యిప్పటికి వాడుకలో యున్నది. ఉదయం కాంతిలో లక్షణము పూర్తిగా తెలియదు  మధ్యాహ్న కాంతిలో తెలియుట అసంభవం. సాయంకాలం కాంతిలో ఉదయకాంతి మధ్యాహ్న కాంతి లక్షణములు మిశ్రమమై తెలియును. అది ప్రకృతియని సృష్టి యని తెలియుచున్నది. అనంతమైన ఙ్ఞానశక్తిని తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పండితులు..పరామర్శలు..*


*(నలభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి గురించి క్రమంగా జనబాహుళ్యానికి తెలియడం మొదలైంది..ఎవరో ఒక యోగి ఇలా మొగలిచెర్ల గ్రామ సమీపంలో ఆశ్రమం నిర్మించుకుంటున్నారనీ..అందుకు శ్రీధరరావు దంపతులతో పాటు మరికొందరు స హకారం అందిస్తున్నారనీ.. నలుగురూ అనుకోవడం కూడా ప్రారంభం అయింది..


శ్రీ స్వామివారు ఎన్నడూ మహిమలు చూపడానికి ఇష్టపడేవారు కాదు..ఎవరైనా ఆయనను సంప్రదిస్తే..చాలా తేలికగా.."ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు!.." అని చెప్పి పంపించేసేవారు..అలా కోరికలతో వచ్చిన వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడటానిక్కూడా ఒప్పుకునేవారు కాదు..ఎంత దగ్గర వాళ్ళైనా..తన ధ్యానం ముగిసిన తరువాతే..వారితో ముచ్చటించేవారు..మితాహారం, మితభాషణం..ఈ రెండింటినీ పాటించేవారు..


జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తరువాత ఒకరోజు మధ్యాహ్నం వేళ.. శ్రీధరరావు గారింటికి నెల్లూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు..అందులో ఒకాయన సంస్కృతాంధ్రములు రెండింటిలోనో పాండిత్యం కలవారు..ఆశువుగా ఛందోబద్ధంగా పద్యములు చెప్పగలరు..అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది..ఇక పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉంది..ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న వారు..ఇవన్నీ కాకుండా..శ్రీధరరావు దంపతులకు దూరపు చుట్టరికం కూడా ఉంది..(ప్రభావతి గారు ఆయనను బాబాయిగారూ అని పిలిచేవారు)..రెండవ వ్యక్తి ఈ పండితుడికి చేదోడుగా వచ్చాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను సాదరంగా ఆహ్వానించి..భోజనం పెట్టారు..భోజనం చేసిన తరువాత.. ఆ పెద్దాయన కుశలప్రశ్నల పరంపర ముగించి.."శ్రీధరా..ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారట గదా..ఆయనకు ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావుట!..మీ దంపతులు ఆయనకు పడి పడి మొక్కుతున్నారట..మనవాళ్ళు అనుకుంటుంటే విన్నాను..ఒకసారి మిమ్మల్ని చూసి, విషయం కనుక్కుని..ఆ స్వామిని కూడా చూసి..ఏపాటి వేదాంతం చెపుతాడో విని వెళ్లాలని వచ్చాను.."అన్నారు..


ఆయన మాటల్లో హేళన, వ్యంగ్యం ఎక్కువగా వినిపించాయి ఆ దంపతులకు..ప్రభావతి గారు వుండబట్టలేక.."ఏదోలే బాబాయిగారూ..మేము ఆయనను మహానుభావుడు అనుకుంటున్నాము..మా పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని..మా తృప్తి కోసం మేము చేస్తున్నాము.." అన్నారు..


"ఇప్పుడు వెళదామా..ఆయన్ను చూడాలని ఉంది.." అన్నారా వచ్చిన పండితుడు..శ్రీధరరావు గారు ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు..ప్రభావతి గారికి మాత్రం వీళ్ళను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లడం సుతరామూ ఇష్టం లేదు..అక్కడ  శ్రీ స్వామివారిని కించపరచినట్లు హేళనగా మాట్లాడితే..శ్రీ స్వామివారు నొచ్చుకుంటారేమో..తమ మీద చెడుగా భావిస్తారేమో నని ఆవిడ ఆలోచన..ఆమాటే మెల్లిగా శ్రీధరరావు గారితో ప్రక్కకు పిలచి అనేశారు కూడా..శ్రీధరరావు గారు మాత్రం నిబ్బరంగా.."నువ్వు అనుకున్నట్లు ఏమీ జరుగదు ప్రభావతీ..స్వామివారు అన్నీ సరి చేసుకోగలరు!.." అన్నారు..ప్రభావతి గారు లోపల పూజ గదిలోకి వెళ్లి..లక్ష్మీనరసింహ స్వామికి నమస్కారం చేసుకొని వచ్చి బండి ఎక్కారు..


మొగలిచెర్ల ఇంటి వద్ద నుంచి బండిలో.. శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకుంటున్న ఫకీరు మాన్యానికి దాదాపు ముప్పావు గంట ప్రయాణం..దారిలో తమకు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అయింది..తదనంతర పరిణామాలు అన్నీ క్లుప్తంగా శ్రీధరరావు గారు చెప్పారు..


అంతా విని.."బాగా తెలివిగల వాళ్ళం అని తలపోసేవారు కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తుంటారు..సరేలే..కాల మహిమ!.." అన్నారా పండితుడు సాలోచనగా..అంతటితో ఊరుకోలేదు..దొంగ స్వాములు..కుహనా యోగులు..ఇలా తనకు తెలిసిన వాళ్ళ గురించి..ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు..మొత్తంమీద శ్రీ స్వామివారిని నమ్మి ఈ దంపతులు తప్పు చేశారని తన వాదన ముగించాడు.. 

బండి ఫకీరు మాన్యం చేరింది..సమయం సాయంత్రం నాలుగు గంటలయింది..


బండి దిగి నలుగురూ శ్రీ స్వామివారు వున్న పూరిపాక దగ్గరకు వచ్చారు..ఆ సమయంలో శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని..నిటారుగా కూర్చుని..ధ్యానం చేసుకుంటున్నారు..తూర్పు ముఖంగా ఉన్న ఆ పాకలో ఉత్తరాభిముఖంగా శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారు పాక బైటనుంచే నమస్కారం చేసారు..ఈలోపల గొట్టిగుండాల గ్రామం నుంచి, ఆశ్రమ నిర్మాణం చేస్తున్న మీరాశెట్టి దంపతులు కూడా నడుచుకుంటూ అక్కడికి చేరారు..సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం నడచి వచ్చిన ఆ దంపతులు కూడా బైట నుంచే శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని..ఒక ప్రక్కగా నిలబడ్డారు..


ఒక అరగంట కాలం గడచిన తరువాత...శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి లేచారు..పూరిపాక బైటకు వచ్చి..అందరినీ చూసి.."మీరొచ్చి చాలా సమయం గడిచిందా?.." అన్నారు.."ఒక అరగంట అయిందని " శ్రీధరరావు గారు చెప్పారు..


"ఏమయ్యా..చాలా దూరం నుండి వచ్చినట్లున్నారే!..బాగున్నారా?.." అన్నారు పండితుల వారి వైపు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలా చూస్తూ..శ్రీ స్వామివారు అలా చనువుగా  పలకరించడం శ్రీధరరావు దంపతులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది..


పాండిత్యమూ..పరామర్శా.. రేపటి భాగంలో కూడా..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

29, మే 2021, శనివారం

ఒక్కరుపు అరిచాను

 వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ. 


ఎప్పుడు తెచ్చారు? ఎన్ని తెచ్చారు? ఒక్కొక్కరికీ ఎన్నేసొస్తాయి? వాటాలేసుకునేటప్పుడు ముందుగానే మంచివన్నీ చూసి తీసేసుకోవాలి. అసలే అయిదుగురం. పందార కలిశలనుకుంటా! భలే తియ్యటి వాసన గదంతా! గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడిలా మెరిసిపోతున్నాయి.


అప్పుడప్పుడు ఇంకా పండనివి తెచ్చేవారు. మునగపాక నుంచి వచ్చి రోజూ పాలుపోసే పైడమ్మని అడిగి ఎండుగడ్డి తెప్పించేవారు. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు. మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల ఆకలి చాలా దారుణమైన ఆకలి. వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే!


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది. నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు. అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి. అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి. 


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా! అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 


శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతఁవప్పుడు ఇరవయ్యొక్క రకాల పిండివంటలు వండినా విస్తట్లో ఓమూలగా క్షేత్రపాలకుడి పాత్రలో ఆవకాయ వుండాల్సిందే! 


ఇక భాద్రపదంలో వినాయక చవితికి ఉండ్రాళ్లలోకి కొబ్బరిపచ్చడీ, అల్లప్పచ్చడీ చేసినా సాయంత్రం మాత్రం పునఃపూజ తరవాత ఆవకాయ అద్దుకుంటూ ఉండ్రాళ్లు తినకపోతే వ్రతఫలం దక్కదుట! 


ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది. ఆ టైములో అర్జెంట్ ఆపరేషనన్నా వెళ్లబుద్ధి కాదు!


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు. ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి...‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!


అసలు వాణ్ణని ఏంలాభం? వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి!


వేసవి సెలవులప్పుడు తాడేపల్లిగూడెం వెళ్లేవాళ్లంకదా? అక్కడ ముగ్గురు మావయ్యలు, వాళ్లకి నలుగురేసి, అయిదుగురేసి పిల్లలు కదా!


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే జోగిరాజు మావయ్యనడిగి ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. అంతేగానీ పళ్లు తినొద్దంటే ఎలా?


కానీ పిర్రలమీద వస్తే మాత్రం చచ్చేచావే! నిక్కరేసుకోలేక పోయేవాళ్లం. అది పగిలేదాకా తువ్వాలు కట్టుకు తిరగాల్సొచ్చేది. ఆడపిల్లలు వెక్కిరిస్తారన్న బాధొకటి కురుపు కన్నా ఎక్కువ సలుపుతూ వుండేది.


దాసు మావయ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లి పెన్సిలిన్ ఇంజక్షన్ చేయిస్తాననేవాడు. ఆ భయంతో తినడం తగ్గించేవాళ్లం. లేకపోతే మనల్ని ఎవరాపగలరు?


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు. మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు. అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు మాజా తాగడం బెటరు. లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా! అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! తీపి జ్ఞాపకం కూడా!

మెదడు కి మేత

 మెదడు కి చిన్న మేత



❓❓❓❓❓❓❓

***********************

👇 కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి.  ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి .

***********************

1.salt ఉప్పు

2.free 

3.steel

4.swing ఊయల

5. potato 

6. Idea

7. relief

8. Run

9.  Both

10. Fasting 

11. Help 

12. Speech

13. teacher

14. Ring

15. Lump

16. Squirrel 

17. Anxiety 

18. Temperature 

19. Horse gram

20. Joint

21. Satellite 

22. Neglect 

23. Tsunami 

24. Escape 

25. Example

26. North 

27. Opinion 

28. Job

29. Rise

30. Production 

31. Water

32. Wash

33. park

34. Letter

35. Thunder 

36. Asthma 

37. Episode 

38. Movement 

39. Send off

40. Stomach

Fపిశాచత్వ విముక్తి*

 _*వైశాఖ పురాణం - 19 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*పిశాచత్వ విముక్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను , రాజా ! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు.


వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు.


ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు , తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో , తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును , వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా ! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి ?  కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము , ధ్యానము , మననము , ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము , విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని , విష్ణుకథగాని , సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము , మననము , స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు , చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము , చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు , నిరాశ్రయుడు యెండిన పెదవులు , నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను , జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని శిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వారి పాదములపై బడి దుఃఖించెను.



సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను.  ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు - సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా ! కావున శ్రీహరి కథల ప్రసంగము , శ్రవణము , ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు ఇహము , పరము , నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*

*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*

*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.

కాళీ గ్లాసు

 కాళీ గ్లాసు 


మనం రోజు చూస్తున్న ఒక సాధారణ విషయం. ఈ రోజుల్లో చాల పలచటి ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తున్నారు. వాటిని ఏదయినా విందులో వాడేటప్పుడు టేబులు మీద పెట్టి నీళ్లు పోస్తుంటే కాళీ గ్లాసులు గాలికి అటు ఇటు కదులుతూ కొంచం పెద్ద గాలి వస్తే టేబులు మీదినించి కింద అక్కడక్కడ పడుతూ వాటిలో నీళ్లు పోసే వారికి విసుకు కలిగిస్తాయి. అందుకే నీళ్లు పోసేవారు ఇంకొకడిని ఆ గ్లాసులు పట్టుకోమని చెప్పి వాటిలో నీళ్లు నింపటం నిత్యం మనం చూస్తూవున్న విషయం . 


అదే కొంత బరువు కలిగిన రాగి గ్లాసో లేక ఇత్తడి, కంచు లేక స్టీలు గ్లాసు అనుకోండి వాటిని టేబులు మీద పెట్టినవి పెట్టినచోట ఉండి వాటిలో నీరు నింపటం చాల సులువుగా అవుతుంది. 


ఇక విషయానికి వస్తే ప్రతి మనిషి ఒక కాళీ గ్లాసు లాంటి వారే దానిలొ నీరు నింపటం అంటే గురువుగారు చేసే జ్ఞాన బోధ. నింపటం అన్న మాట. ఎప్పుడైతే కాళీ గ్లాసు స్థిరంగా ఉండి  ఉంటే దానిలో నీరు నింపటం ఎలా అయితే సులువు అవుతుందో అదే విధంగా సాధకుని మనస్సు స్థిరంగా ఎటువంటి వత్తిడులకు లోనుకాకుంటే ఆ సాధకునికి గురువుగారు చేసే జ్ఞాన బోధ చక్కగా వంట పట్టి జ్ఞానిగా మారుతాడు. అదే ప్లాస్టిక్కు గ్లాసులాంటి చంచల మనస్సు కలవారికి జ్ఞానబోధ చేయుట బహు కష్టం. కాబట్టి ప్రతి వారు ఒక రాగి గ్లాసులాగా స్థిరంగా ఉంటే వారికి గురువులు చేసే తత్వ బోధ సులువుగా అర్ధమౌతుంది. కాబట్టి మనమందరం స్థిర మనస్కులుగా ఉంటే మనలో జ్ఞానం సులువుగా వికసిస్తుంది. 


ఓం తత్సత్.  


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ భార్గవ శర్మ.

జప / ధ్యానాలు

 జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి..




మానవునకు రోగం కలిగించేది ' పాపం ' . 

మానవునకు భోగం కలిగించేది ' పుణ్యం ' . 

మానవుని భవిష్యత్తు నిర్ణయించేది ' కర్మ ' .


మానవునకు లాభం కలిగించేది ' సేవ ' .

మానవునకు సంపాదన  నిలిపేది ' పొదుపు '

 మానవుని విలువ పెంచేది ' దానం ' . 


మానవునకు నష్టం కలిగించేది ' హింస ' . 

మానవునకు అశాంతి కలిగించేది ' ఆశ ' .

 మానవునకు శాంతి కలిగించేది ' తృప్తి ' .

 

మానవునకు దుఃఖం కలిగించేది ' కామం ' . మానవుని పతనం చేసేది ' అహంకారం ' . 

మానవునకు అందరిని దగ్గర చేసేది ' ప్రేమ ' 


మానవునకు అందరినీ దూరం చేసేది ' అసూయ ' .

మానవుని స్థితిని సూచించేది ' గుణం ' . 

మానవుని దైవంగా మార్చేది 

' దయ


మానవుని ఆత్మస్థితి తెలిపేది ' వాక్కు ' . 

మానవునకు విజయం చేకూర్చేది ' ధర్మం ' . 

మానవుని గొప్పవాడిగా చేసేది ' జ్ఞానం ' . 


మానవునకు ' ముక్తి'ని ఇచ్చేది  సత్యం ' .

 మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ' జపం / ధ్యానం ' .


*అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి.*

సమర్థుడికి

 🪔 *卐ॐ _సుభాషితమ్_ ॐ卐* 💎


శ్లో|| నాతః శ్రీమత్తరం కిఞ్చిత్ అన్యత్పథ్యతమం మతమ్ |ప్రభవిష్ణోర్యథా తాత క్షమా సర్వత్ర సర్వదా ||


తా|| "సమర్థుడికి అన్నిచోట్ల అన్నివేళలా సహనం కంటే శుభకరమైనది మరొకటి లేదు.

అది అన్నిటికంటే చాలా శ్రేయస్కరం".


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ)

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

)

              🌷🌷🌷

అవ్యాజ కరుణామూర్తి ( పాతకథ) 


" రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా

రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా"


అనునిత్యపఠనంగా అలరారే లలిత.. రాగబద్ధంగా సాగిపోతోంది గణపతి పెదవులపైన.  


తమకలవాటయిన తమదైన పరదేవతానామం తమ జీవనాడుల అమృతం పోస్తుంటే, ఆ అమృతపాన పునీతులైన ఆ పుష్పగుల్మాలన్నీ, అమ్మకు అంకితంగా తమ సుమహృదయాలను పరమానందంగా అర్పిస్తున్నాయి ఆ కెంజాయ సంజెవేళ! 


             రాజరాజేశ్వరి దేవతార్చనకు ముందురోజే సాయంత్రం మల్లెలూ, గులాబీలూ, సంపెంగెలూ, మరువం, ధవనం కోసి ఉంచుకుంటాడు. మందారాలూ, నందివర్ధనాలూ , పారిజాతాలూ మర్నాడు ఉదయమే తామూ తయారు! అంటాయి. ఆ పూబాలలను పలకరిస్తూ, సున్నితంగా వాటిని కొమ్మనుండి వేరుచేస్తాడు. 


అమ్మపొదుగు నుండి బొజ్జనిండా పాలుతాగిన తువ్వాయి లేలేత గడ్డిలో గెంతులేస్తోంది. చీకటిఛాయలు పరుచుకుంటున్న వేళ... దూరంగా పొదల్లో ఏదో అలజడి. పాము కాదు కదా! అటు పరుగెడుతున్న ఆవుదూడను సంభాళించడానికి వడివడిగా అడుగులేసాడు గణపతి. 


సన్నని ఆర్తనాదం. పొదల మాటున ఇద్దరు యువతులు. పెద్దింటి అమ్మాయిలేమో! దూరంగా పెద్ద కారు! ఏడుస్తున్న అమ్మాయి చేతిలో ఏదో మూట. " నావల్ల కాదు వదినా! నేను పాపాయిని తీసుకుని ఎక్కడికయినా పారిపోతా! నేను విడువలేక పోతున్నా".... హృదయవిదారకంగా ఏడుస్తోంది. పద్దెనిమిది వుంటాయో ఏమో! 


" లాభం లేదు లతా! తప్పుచేసినపుడు ఆలోచించలేదా ఇవన్నీ. ఎంత అజాగ్రత్త! ఐదునెలలకు కళ్లు తెరిచావ్! వాడేమో మీనాన్నకు భయపడి పారిపోయాడు. హాస్టల్ నుంచి నిన్ను తెచ్చి ఈవూళ్లో రహస్యంగా వుంచి, డెలివరీ పూర్తిచేసేటప్పటికి నాతల ప్రాణం తోకకొచ్చింది. మంత్రసాని ఏ పొరపాటు చేసినా నీ ప్రాణం మీదికొచ్చేది. మీ అన్నయ్యకు తెలిస్తే నా తల తెగుతుంది. ఇది మనవల్ల అయ్యేది కాదమ్మా. నాతల్లి కదూ! ఇక్కడ పెట్టేద్దాం బిడ్డను. ఆయుష్షుంటే బతుకుతుంది. ఎవరో ఆదరిస్తారు. నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది. నాకియ్యమ్మా బిడ్డను. "..... పాతికేళ్లుంటాయేమో వదినగారికి. ఆడపడుచుకు ధీటుగా పచ్చనిఛాయలో మెరిసిపోతోంది. ఆ ఇద్దరి వంటిమీద రవ్వల ధగధగలు వారి చెక్కిళ్లపై జాలువారుతున్న కన్నీటిని మరింత మెరిపిస్తున్నాయి. 


బిడ్డను అక్కడే ఓ మొగలిపొద మొదలులో పెట్టి , ఆడబిడ్డను లాక్కుపోయింది ఆమె. 


" అయ్యో! ఎంత అఘాయిత్యం!" ఆపడానికి పరుగుపెట్టి రోడ్డు మీదకొచ్చాడు గణపతి. 


కారెక్కబోతున్న ఆ నిర్భాగ్యమాతృమూర్తి , ఒక్కసారి తిరిగి, కన్నీళ్లతో నమస్కరించి వెళ్లిపోయింది. ఎంత అభ్యర్ధనో! ఎంత వేడుకోలో! ఆ పెద్దకళ్లల్లో! 


తెల్లారితే విజయదశమి. చేతిలో పొత్తిళ్లలో పాపాయి. కళ్లుమూసుకుని చిన్మయముద్రలో బాలాలీలావినోదినిలా! 


" రాజరాజేశ్వరీ దేవి"...... " నను పాలించగ నడచీ వచ్చితివా తల్లీ! పాదాల తలలనే పారిజాతములుంచి, మోదాన భాష్పాల ముద్దుపూసరులిచ్చి.... ఓ దేవి! నీమ్రోల ఒదిగి ఉన్నానమ్మా"! ..... ఏదో పరవశత్వం! ఏదో ఉన్మాదం! వివశత్వం బిడ్డను చూస్తుంటే! బాలాత్రిపురసుందరిని కళ్లారా చూస్తున్నట్టు! 


తన కుటీరానికి తెచ్చాడు. భార్యను పిలిచాడు. ప్రశ్నించే తెలివిలేని ఆ అమాయకురాలు అపురూపంగా బిడ్డను గుండెకు పొదువుకుంది. కుటీరానికి ఆనుకుని చిన్న మందిరంలో తాను ప్రాణప్రదంగా ప్రతిష్టించుకున్న శ్రీచక్రసహిత రాజరాజేశ్వరీదేవి పంచలోహవిగ్రహం పాదాల చెంత బిడ్డను పెట్టాడు. కళ్లువిప్పిన బిడ్డ కనులారా నవ్వింది. పెద్దపెట్టున ఏడ్చింది. " భావాభావ వివర్ధిని"


            బిడ్డనెలా పెంచాలన్న భయం లేదు ముప్ఫైయేళ్ల గణపతికి. పుష్కలంగా పాలిచ్చే గోవుంది. అమ్మవారు వుండనే ఉంది. పుష్కరకాలం క్రితం తనకు " వినిపించిన తల్లి" ఈరోజు కనిపించింది! " అమ్మా! నీ దయ! "


గణపతి సత్సాంప్రదాయ, సంపన్న కుటుంబంలో ఆరవకొడుకు. తాతతండ్రులు మంచిపేరున్న ప్లీడర్లు. చదువులో చురుకుగా ఉండే గణపతి చిన్నప్పటినుండి తాతగారితో పాటూ దేవతార్చనలో కూర్చుండేవాడు. పద్దెనిమిదో యేట ఉపనయనం జరిగింది. గాయత్రీ మహామంత్రోపదేశం తీసుకోగానే అతనికి బ్రహ్మానందం కలిగింది. 

ఆరోజు అర్ధరాత్రి ఇంట్లో చిరుగజ్జెల చప్పుడు. ఎంత మరలిద్దామన్నా మనసుకు గాలం వేస్తున్న మంజీరకింకిణీ నాదం! ఒంటిపై కొస్తున్న మైమరుపు! మొగలి, మల్లెలు , చందన సుగంధం. పిలుస్తున్న దివ్యకాంతిని అనుసరించి వెళ్లిన గణపతి , దేవుడిగది పక్కగదిలో చిన్న సందువాపెట్టి దగ్గర నియంత్రించబడ్డాడు. పెట్టె తెరవగానే గుప్పున సాంబ్రాణిధూపం. జీర్ణమైపోతున్న పట్టువస్త్రంలో చుట్టబడి శ్రీచక్ర మేరువు, అష్టభుజాంకిత, అఖిలాధారిణి రాజరాశేశ్వరీ దేవి దివ్యవిగ్రహం. 


గాయత్రితో ఆవహించిన మైమరుపు ఇప్పుడు అతని ఆత్మను ఆలింగనం చేసుకుని, అలౌకికమైన స్థితికి తీసుకుపోయింది. 


తమ పూర్వీకులు కొన్నితరాల క్రితం పూజించిన రాజేశ్వరీపీఠం అతన్ని వరించింది. 


కొన్నినెలలు అదే అలౌకికస్థితిలో, పరదేవతా ధ్యానంలో ఉన్మత్తుడయిపోయిన గణపతిని ఐహికస్థితికి తీసుకురావడం అసాధ్యమని గ్రహించిన అతని తాతగారు , కంచి గురుస్వాములచే శ్రీచక్రార్చన చేయించి, అమ్మవారిని ఆహ్వానించి, సద్గురువులచే మంత్రోపదేశం చేయించారు. అనంతరం కొద్దిగా బుద్ధిమాంద్యమున్న అతని మేనత్తకూతురుతో వివాహం జరిపించి, అతనికోరిక మీద ఆ చిన్న ఉపవనం, అమ్మవారి అర్చనకు ఏర్పాటు చేసారు. 


సన్యసించకపోయినా, అవధూతలా విరక్తితో, నిర్గుణ నిశ్చల మార్గంలో తపోధనంతో వెలిగిపోయే గణపతి జీవితంలోకి పెనుమార్పులా ఈ "బాల రాజరాజేశ్వరి" ! 


                స్వయాన వైష్ణవి, వైభవోపేత ఆతల్లి. ఆ పూరికుటీరానికి అష్టైశ్వర్యాలూ వచ్చి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. 


ఒకరోజు నామినేషన్ కు వెళుతూ ఆ కుటీరం దగ్గర దాహానికాగి, అమ్మవారికి దండం పెట్టుకున్న ఒక పెద్దమనిషిని ఏకంగా కీలకమంత్రిపదవి వరించడం , ఆ చిన్నమందిరం రూపురేఖల్నే మార్చేసింది. 

స్వయాన పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వాములు, యతీంద్రుల అధ్వర్యంలో రాజరాజేశ్వరీదేవి విగ్రహస్థాపన జరిగింది. 


ఆగమశాస్త్రానుసారం భూకర్షణ చేసి, అద్భుతమైన శిల్పకళతో, అందమైన పాలరాతి ఆలయం నిర్మింపచేసుకుంది తల్లి. 


ఆలయంతో పాటూ దినదినప్రవర్ధమానమైన రాజరాజేశ్వరికి అందరూ తల్లులే. అందరికీ అపురూపమే! పదిమంది పిల్లలున్న తల్లి కూడా మాతృభావన ఉప్పొంగి, ఆలింగనం చేసుకునే అద్వితీయ ఆకర్షణ ఆపిల్లది. 


ఆ శ్వేతపద్మాసని విద్యాధరి శారదాంబ పిల్లకు విద్యలు అలవోకగా కట్టిపెట్టింది. 


తనప్రమేయం లేకుండానే అఖండమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీరాజరాజేశ్వరీదేవి సంస్థానం పురోగమించడం గణపతి నిశ్చలభక్తికి ఏ ఆటంకం కలుగచేయలేదు. సాక్షీభూతుడిగా తన తపోనిష్ట సాగించుకుంటూ ఆయన తన కుటీరంలో తన శ్రీవిద్యోపాసనలో మహాయోగిలా తేజోవిరాజిల్లుతూ! 


అది ఇరవై ఒకటో విజయదశమి రాజరాజేశ్వరికి. ముగ్గురమ్మలూ పోటీపడి చేసిన ఆ పిల్ల పెళ్లి ప్రస్థావనా   , ప్రయత్నమూ గణపతిని కణ్వుణ్ణే చేసింది. 


ఆమె అకులా సమయాంతస్థ అయినా మానుషరూపిగా ఆమెకు తనకులంలో కాకుండా కులేతర వివాహం చెయ్యలేడు. పైగాఆమె చెయ్యికోరి వచ్చిన వారికి సంస్థానం మీద దురాశ అదనం! "అమ్మా! నీ దయ!" దీర్ఘంగా నిశ్వసించి విశ్రమించాడాయన నవమిరాత్రి. 


      పోటెత్తిన జనసంద్రసమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవికి శాంతికవచం ధరింపచేసి, పూర్ణాహుతి, అఖండ అన్నదానానంతరం.... రాత్రి పదింటికి అమ్మవారికి భార్యాపుత్రీ సమేతంగా మణిహారతులిచ్చి, మొట్టమొదటిసారిగా ఒకేఒక్క కోర్కె కోరాడు అమ్మను! 


                కార్తీకపౌర్ణమి! ప్రత్యూష శీతలపవనాలు హిమగిరితనయ చల్లనిచూపుల్లా ఉన్నాయి. పచ్చనిగరికెలమీద తుహిణకణాలపై లేత అరుణకిరణాలు వక్రీభవనం చెంది, లక్షల ఇంద్రధనుసులు ఆ వనమంతా! అతిసుకుమారంగా పారిజాతాలు ఏరుకుని మొగలిపొదవేపు కెళ్లాడు గణపతి. కేతకీ పుష్పం శివుడికి నిషిద్ధమైనా , ఆయన గణపతి కదా! అమ్మకు ఇష్టంగా ఒకరేకు పెడతాడు రాజరాజేశ్వరి వచ్చినప్పటినుండి. 


      సంస్థానాన్ని విస్తరించి, సంరక్షించే గణపతి అన్నలపిల్లలూ, ధర్మకర్తలూ ఆయన ప్రపంచాన్ని ఏమాత్రం స్పర్శించకుండా ఆయనకేది ప్రియమో ఆ తోటంతా అలాగే ఉంచారు. 


              మొగలిపొద దగ్గర ఇద్దరు స్త్రీలు! ప్రౌఢలు! ఆయన అక్కడకు చేరగానే " స్వామీ!" అని మంద్రంగా పిలిచింది ఆమె. 


ఆయనది సూక్ష్మబుద్ధి ! ఇట్టే కనిపెట్టాడు! 


" ఏమ్మా! జగన్మాతను నాకు వదిలి నువ్వు వెళ్లిపోయావా తల్లీ?" 


కన్నీరుమున్నీరే అయింది ఆ దొరలపిల్ల! 


" మీ జగన్మాత చెయ్యి పట్టుకోడానికే వచ్చాము స్వామీ!".... కొంత ఠీవి. మరింత వినయం! ఆమె వదిన! 


స్వామీ! నాపేరు శ్రీలలిత, ఈమె మా వదిన మణిదీప. ఆ కారు దగ్గరున్నాడే శైలేష్. మా అన్నకొడుకు. హైదరాబాద్ లో డాక్టర్ ! తన అంశను మోసిన గర్భంలో మరొకరికి స్థానం ఇవ్వలేదు ఆ తల్లి. వదిన పెద్దకొడుకు శైలేష్ ను నేనే పెంచుకున్నా! 


నా పాప మీదగ్గర సవ్యంగా పెరుగుతోందని తెలుసు. ఏమిచ్చి మీరు పెంచగలరు అని కూడా ఆలోచించలేదు. మీ ఋుణం ఎప్పటికీ తీరనిది. వైవాహికజీవితం అల్లకల్లోలమవుతుందని నా గతాన్ని పాతిపెట్టేసాను. కానీ అనుక్షణం నా పాపం వెంటాడుతూనే ఉంది. పాపను మీరు చూడకపోతే! ఆ వూహే భయంకరం! 


నా పాపభారంతో ఈ పవిత్రసన్నిధిలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యలేకపోయా! జీవనసహచరుడు అకాలమృత్యువు పాలయ్యారు. రెండేళ్లయ్యింది నా జీవితం నాచేతిలో కొచ్చి.  అందుకే ఈరోజు ధైర్యంచేసి మీకుమార్తెను నా దత్తపుత్రుడికి చేసుకోమని అర్ధించడానికి వచ్చా స్వామి. 


పిల్లాడు శాఖాహారి. దైవభక్తితో సవ్యంగా పెరిగినవాడు" ...... మాటలూ-దుఖం కలగలుపుగా మాట్లాడుతుంటే,  ఆమె కెంపుల కర్ణాభరణాలమెరుపులు ఆమె చెక్కిళ్ల దుఖపు ఎరుపులో ప్రతిఫలిస్తున్నాయి! 


" అరుణాం కరుణాతరంగితాక్షీం"..... అమ్మనామం ఆయన నోటంట అప్రయత్నంగా జాలువారింది. 


"రండమ్మ! మందిరంలోకి వెళ్దాం. అమ్మ సమక్షంలో పిల్లతో, ఆమె తల్లితో ఓ మాట చెప్పాలి కదా! 


" మరోమాట స్వామి! ఏతండ్రికి భయపడి నాబిడ్డను వదిలేసి వెళ్లిపోయానో, ఆయన్నే స్వయంగా అమ్మ తన కాళ్లదగ్గరకు తెప్పించుకుంది. అవునండి ! మినిస్టర్ మృత్యుంజయరావు గారు మా నాన్నగారు. ఆయనకు పాప విషయం ఏమీ తెలియదు. అంతా ఆ దేవి దయ"


ఆ తరువాత వచ్చిన మాఘమాసంలోనే రాజరాజేశ్వరీదేవి కల్యాణం తను మెచ్చిన శైలేష్ తో ఆదిత్యనారాయణుడు ప్రత్యక్షసాక్షిగా , ముక్కోటిదేవతల ఆశీస్సులతో శ్రీరాజరాజేశ్వరీ సుందరేశుల సమక్షంలో అంగరంగ వైభవంగా అయింది. 


పిల్లకు అప్పగింతలు పెట్టి పంపించేసారు అత్తవారింటికి. 

ఏడుస్తున్న భార్యతో

" పిచ్చిదానా! తల్లి విశ్వమాత! జగద్ధాత్రి! పుట్టిల్లేంటి? మెట్టినిల్లేంటి? ఆమే బంధాలనిస్తుంది. బంధమోచనీ ఆమే!"అంటూ ఓదార్చారు గణపతి స్వామి! 


ఆరోజు రాత్రి అమ్మవారికి ఒంటరిగా హారతిచ్చి, " కల్యాణీ జగతీకందా కరుణారససాగరా! పిల్లకల్యాణంతో నీవిచ్చిన బంధం ముగిసింది తల్లీ! రాజమ్మను చేర్చాలిసిన చోటికే చేర్చావు. నీలీలలు వర్ణించతరమా..!"అని కన్నీళ్లు పెట్టుకుని.... పిల్ల నీ సన్నిధిలోకి వచ్చింది కనుక నువ్వు చూసుకున్నావు, కానీ ఇలా ఎంతమంది పిల్లలు పురిటిగుడ్లుగా రాలిపోతున్నారో! ఎన్ని పసిబతుకులు ఛిద్రమైపోతున్నాయో! రక్షాకరీ! కాపాడుతల్లీ! నువ్వు కలికల్మషనాశినివి! దౌర్భాగ్యతూల వాతూలా! జరాధ్వాంత రవిప్రభవు! కటాక్షకింకరివి. రక్షించు తల్లీ పసిపిల్లలను! రక్షించు! మాతృరక్షణనుండి దూరం చెయ్యకమ్మా!" 


ఆ అవ్యాజకరుణామూర్తి , అన్నీ తానయిన కర్మసాక్షి అమ్మ ముఖారవిందంలో అదే మందహాసం. ఆ చూపుల్లో అదే కరుణ! " 


ఓలేటి శశికళ 

8-10-2019

సత్యం బ్రూయాత్

 జై శ్రీరామ్


సత్యం బ్రూయాత్

ప్రియం బ్రూయాత్

న బ్రూయాత్

సత్యమ్ అప్రియమ్

ప్రియం చ 

న అనృతం బ్రూయాత్

ఏషః ధర్మః సనాతనః


నాస్తి సత్యసమం బ్రహ్మ

నాస్తి సత్యసమః విష్ణుః

నాస్తి సత్యసమః శివః

నాస్తి సత్యసమం జగత్


సత్యమ్ అదః 

సత్యం ఇదం

సత్యాత్  సత్యమ్ ఉదచ్యతే

సత్యస్య సత్యమ్ ఆదాయ

సత్యమ్ ఏవ అవశిష్యతే


సత్యం బ్రహ్మా సత్యం విష్ణుః

సత్యదేవో మహేశ్వరః

సత్యం సాక్షాత్ పరం బ్రహ్మ

తస్మై శ్రీ సత్యాయ నమః


సత్యజ్యోతి నమస్తుభ్యం

సత్యదే సత్యరూపిణి

సత్యార్థం ప్రార్థయిష్యామి

సత్యం దదాతు  మే సదా


సత్యజ్ఞానం వాచయతు

సత్యమూర్తిం దర్శయతు

సత్యమార్గం ప్రేషయతు

సత్యే అస్మాన్ ప్రవేషయతు


యత్ యత్ సత్యం

తత్ తత్ వదేమ

యత్ యత్ అసత్యం

తత్ తత్ త్యజేమ


యే సత్యమార్గమ్ ఆశ్రయంతి

తే భవంతి యశస్వినః

యే అసత్యమార్గమ్ ఆశ్రయంతి

తే భవంతి అపయశస్వినః


సత్యం ధైర్యేణ వదేమ

సత్యం ధైర్యేణ ప్రసరేమ

సత్యం ధైర్యేణ ప్రచరేమ

తదర్థం సదా సంకల్పయేమ


నాస్తి సత్యసమం బ్రహ్మ

నాస్తి సత్యసమః విష్ణుః

నాస్తి సత్యసమః శివః

నాస్తి సత్యసమం జగత్


సత్యస్య ప్రియః నారాయణః

అతః సత్యనారాయణం భజే

వ్రతేషు ఉత్తమోత్తమం వ్రతం

సత్యనారాయణవ్రతమిహఖలు


సత్యమార్గం దర్శయేమ

సత్యమార్గమ్ ఉత్సాహయేమ 

సత్యమార్గం ప్రవిశేమ

జీవనం పవిత్రం కుర్యామ


సత్యమేవ జయతే

సత్యమేవ ఆశ్రియతే

సత్యమేవ ధార్యతే

సత్యమేవ శిష్యతే


సంభాషణ సంస్కృతమ్

(మాసపత్రికా)


జై శ్రీరామ్

అహల్యాబాయి_హోల్కర్_జయంతి

 #అహల్యాబాయి_హోల్కర్_జయంతి


"ఒక సాధారణ భారతీయ మహిళ అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పుడు అసమానమైన ప్రజ్ఞ కనబరుస్తూ వీరనారిగా రూపాంతరం చెందుతుంది అనడానికి అహల్యాబాయి హోల్కర్ జీవితం ఒక ఉదాహరణ. 


మహారాష్ట్రలోని చౌండి గ్రామంలో జన్మించిన అహల్యాబాయి హోల్కర్ మరాఠా సర్దార్ అయిన ఖండేరావు ని వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధంలో ఆమె భర్త మరణిస్తారు, భర్త మరణానంతరం అహల్యాబాయి మామ గారు యుద్ధ విద్యలు, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై ఆమెకు తర్ఫీదు ఇస్తారు. తర్వాత కొంత కాలానికి ఆమె మామ కూడా మరణిస్తారు, ఆ తర్వాత సంవత్సరం తన ఏకైక కుమారుడు కూడా మృతి చెందడంతో అహల్యాబాయి హోల్కర్ అనూహ్యంగా ఇండోర్ పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. 


ఆమె రాణి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆవిడ ఒక మహిళా సైన్యాన్ని తయారు చేయడంతోపాటు, యుద్ధంలో తన సేనలను ముందుండి నడిపేవారు. తన రాజ్య పరిధిలో లేని అనేక పుణ్యక్షేత్రాలలో ధర్మశాలలు నిర్మించారు. అంతేకాకుండా మహమ్మదీయుల దాడులలో ధ్వంసం కాబడ్డ ఎన్నో దేవాలయాలను ఆవిడ పునః ప్రతిష్ట చేశారు. ముఖ్యంగా సోమనాథ్ లోని ప్రముఖ సోమనాథేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం కాశీ క్షేత్రంలోని విశ్వనాథుని ఆలయం కూడా ఆవిడ నిర్మించినదే, ఇలా మన దేశంలో ఎన్నో తీర్థ క్షేత్రాల సందర్శించినప్పుడు ఆ మహనీయురాలు స్మరణకు రావడం అతి సహజం. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్లోని విమానాశ్రయానికి కూడా ""దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా"" నామకరణం చేశారు. ఇలాంటి మహనీయురాలు వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర చరణాలకు శతకోటి ప్రణామాలు తల్లి 🙏🙏🙏🙏

పూరి జగన్నాథ్ ఆలయంలోని వంట గది

 పూరి జగన్నాథ్ ఆలయంలోని  వంట గది ప్రతీరోజూ అక్షరాలా లక్ష మందికి  కడుపు నింపుతుంది...ఇది ప్రపంచం లోని అతిపెద్ద బహిరంగ పాకశాల...ఇక్కడ జరిగే విశేషమైన పనులు చూడటానికి మన రెండు కళ్లు చాలవు...


ఇక్కడ ప్రతీరోజూ 15000 మట్టి కుండల్లో వంటలు వండుతారు...ఒకరోజు వాడిన కుండలను ఇంకొరోజు మళ్లీ ఉపయోగించరు...ఏరోజు కారోజు కొత్త కుండలను వాడుతారు.... 


పదార్థాలు ఒక ప్రత్యేక పద్ధతిలో వండుతారు...7కుండలను ఒకదానిపై ఒకటి ఒక వరుసలో పేర్చి తాడుతో కట్టి వాటిని పొయ్యి పై ఉంచి వండుతారు...


ప్రతీరోజూ 56 రకాల పదార్థాలు వండి జగన్నాథ స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు... నైవేద్యంగా పెట్టిన ఈ అన్నీ రకాల పదార్థాలను స్వామి వారి మహా ప్రసాదంగా స్వీకరించి రోజూ మధ్యాహ్నం 2-3గంటల ప్రాంతంలో ఆలయం లోని ఆనంద బజార్ అనే ప్రాంగణంలో సందర్శకులకు,భక్తులకు వితరణ చేస్తారు...


ఒక్కరోజు కూడా కొంచం అయినా ఈ మహా ప్రసాదం ఎప్పుడూ వృథా కాదు...


కుల,మతాల కతీతంగా ప్రతీరోజూ లక్ష మందికి కడుపు నింపే ఒక్క మసీదు లేదా చర్చ్ అయినా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ...అందులోనూ ఎవరినీ మతోన్మాదులుగా మార్చకుండా...మతం మార్చకుండా...మన ఆలయాల విశిష్టత ఎంత చెప్పినా చాలదు...దేవుడిని కూడా తమ స్వార్థం కోసం మార్చుకునే గొఱ్ఱెలకు ఏం అర్థం అవుతుంది...సేవ,భక్తి, ఆధ్యాత్మికత లోని గొప్పదనం...


జై జగన్నాథ్...🙏🙏

people would not know this!

 99 % of 99 % of people would not know this!


Indian Medical Association Vs Medical Council of India


IMA Vs MCI

Difference of both?


Indian Medical Association an NGO created by Christian missionaries during British in India


Medical Council of India is a constitutional institution created by the Government of India


The Indian Medical Association was an NGO created by Christian missionaries in India during the British time whose job was to connect Christian doctors in India to promote Christianity in the pretext of medical help in the pretect of service in remote areas


Medical council of India is a constitutional institution created by Govt of India which works for the activities of medical hospitals etc across the country to confiscate or cancel doctors degree etc


Currently the President of the Indian Medical Association is Dr. Austin Jaya Lal who is associated with a Christian missionary


Now you know why IMA is after Ramdev?!


Indian Medical Association Vs Medical Council of India


IMA Vs MCI

Difference of both?


Indian Medical Association an NGO created by Christian missionaries during British in India


Medical Council of India is a constitutional institution created by the Government of India


The Indian Medical Association was an NGO created by Christian missionaries in India during the British time whose job was to connect Christian doctors in India to promote Christianity in the pretext of medical help in the pretect of service in remote areas


Medical council of India is a constitutional institution created by Govt of India which works for the activities of medical hospitals etc across the country to confiscate or cancel doctors degree etc


Currently the President of the Indian Medical Association is Dr. Austin Jaya Lal who is associated with a Christian missionary


Now you know why IMA is after Ramdev?

ధనం అంటే

 ధనం అంటే రూపము లేక వస్తువా శక్తి లక్షణమా లేక మరే దైనానా పరిశీలన. మహా భాగ్యం అనగా ఆరోగ్యమని వేద వచనం. అనారోగ్యం దాపురించిన  అనుభవించుటకు ఏమీ వుండదు. భాగ్యం అనగా పరిమితి అది ఏదైనా కానీ. మహా అనగా అనంతమైన శక్తి వలన ఆరోగ్యం. దీనిని ప్రకృతి వలననే వశపరచుకొనుట తల్లి గర్భం నుండే మూల సూత్రం. ధనం అనగా  అగ్ని, వాయువు, సూర్యశక్తి, వసు భూమి శక్తి ద్వారా సస్య శక్తి సృష్టి చైతన్య శక్తి, యింద్ర యింద్రియశక్తి,బృహస్పతిః,దైవ శక్తి,వరుణ శక్తి నీటి శక్తి, వీటి స్వరూపములు వాటి ద్వారా వచ్చు లక్షణ శక్తిని ధనమని అది శరీరములో ప్రకృతిలో సమ పాళ్ళలో వున్నట్లయితే ఆరోగ్యం. అదే మహా భాగ్యం. శుద్ద లక్ష్మీ మెూక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీః లక్ష్మీ వరలక్ష్మీ ఈశ చ సుప్రసన్న వరదా శుభాః.యిక్కడ మందుగా శుధ్దంతో స్వచఛ్చతో ప్రారంభం మెూక్షమని, తరువాతనే జయం అని అనగా శుధ్ద తత్వ ఙ్ఞానం తో కూడిన పునరావృత్తి రహితరహితే   మెూక్షమని లలితా సహస్రం వలన తెలియుచున్నది. అమ్మ సులువుగా మెూక్షమిస్తుందా? అయితే సృష్టి ఆగిపోవుట అమ్మకు యిష్టంలేదు. అది ధర్మ మార్గమున నడచుటయే తల్లి వుద్దేశ్యం. ధర్మ మార్గమే ప్రకృతి. అధర్మమార్గములో నడచిన తానే లయం చేయుటకు సృష్టించిన వారే లయమునకును కూడా అర్హత కలిగియుండును. పైన తెలిపిన ధనమునకు అర్ధం ప్రకృతి రూపమే శక్తియని ఆ చైతన్య శక్తియే ధనం.ధనం అనగా ఇ అనే శక్తి ++++......వృధ్దియగుట అనంతమగుటయే. అది ప్రకృతి లోనైనా లేక అట్టి ప్రకృతి కారణమైన దేహములోనైనా. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే  వుందాం.