27, మార్చి 2025, గురువారం

నవ వ్యాకరణాలు

 🙏నవ వ్యాకరణాలు🙏

సంస్కృత భాషకు ఉన్న తొమ్మిది వ్యాకరణములు వరుసగా:

ఐంద్రము, చంద్రము, కాశకృత్స్నము, కౌమారము, శాకటా యనము, సారస్వతము, ఆపిశలము, శాకలము, పాణినీయము.


అప్పటికే లభ్యమౌతున్న అసమగ్రంగా వున్న వ్యాకరణాలను సమీక్షించి మొట్టమొదటిసారిగా పాణిని సమగ్రమైన వ్యాకరణాన్ని తయారుచేశాడు. పాణిని రచించిన ఆ అష్టాధ్యాయి అనే వ్యాకరణానికి వరరుచిముని అనుబంధ సూ(త్రములను (వార్తికములను), పతంజలిముని మహాభాష్యమును రచించి పుష్టిని చేకూర్చారు. పాణిని అష్టాధ్యాయినిని తోసి రాజని అనగల స్థాయిలో మరొక వ్యాకరణమేదీ ఇంతవరకూ రాలేదు. 'సిద్ధాంత కౌముది' మంచి ఆదరణ పొందినప్పటికీ అది ఒక రకంగా పాణిని వ్యాకరణాన్ని మరో విధంగా చెప్పడం మాత్రమే. (బిందెలో ఉన్న నీటిని కూజాలో పోసినట్లు. ఆకారం వేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నా ద్రవ్యం మాత్రం అదే! అని వ్యాఖ్యానించారు కొంతమంది.)


నవవ్యాకరణముల సూచీని కొన్నిచోట్ల ఈ క్రిందివిదాలుగా కూడా చెప్పడం జరిగింది.


1 పాణినీయము, 2 కలాపము, 3 సుపద్మము, 4 సారస్వతము, 5 ప్రాతిశాఖ్య (కుమారవ్యాకరణము), 6 ఐంద్రము 7 వ్యాఘ్రభాతికము, 8 శాకటాయనము, 9 శాకల్యము.

1. శాక్త వ్యాకరణము, 2. శంభు వ్యాకరణము, 3. కుమార వ్యాకరణము, 4. ఇంద్ర వ్యాకరణము, 5. సూర్య వ్యాకరణము, 6. చంద్ర వ్యాకరణము, 7. స్మర వ్యాకరణము, 8. వాత్స్యాయన వ్యాకరణము, 9. అగస్త్య వ్యాకరణము.

హనుమంతుడు సూర్యుని నుండి నవవ్యాకరణములు నేర్చుకున్నాడని హనుమత్చరిత్రలో కనిపిస్తుంది. అయితే ఆ నవ వ్యాకరణములు ఏవి అనేదానిలో స్పష్టత లేదు.


ఈ వ్యాకరణాలలో కనిపించే ఇంద్ర, శంభు, కుమార, సూర్య, చంద్ర వంటి దేవతల పేర్లులా కనిపించేవి పాణిని కంటే ముందు తరాలలోను మరియు సమకాలికులుగాను జీవించిన వ్యాకరణ కర్తల పేర్లు మాత్రమే. కాబట్టి హనుమంతుడు వీటిని చదివాడు అని చెప్పడానికి వీలు లేదు.


నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ 

బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్ ৷৷


అంజనేయునికి వ్యాకరణంలోని సర్వ విషయాలు తెలుసునని వాల్మీకి రామాయణంలో సాక్షాత్తు రాముడే చెప్పివున్నాడు కాబట్టి, రచయితలు తమ తమ ఎరుకకు వచ్చిన తొమ్మది వ్యాకరణాల పేర్లను చేర్చి హనుమంతుడు 'నవ వ్యాకరణ పండితుడు' అని వ్రాయడం జరిగింది.


అతిప్రాచీనకాలములోనే ఐంద్రవ్యాకరణము, ఇతర వ్యాకరణములు లోపించిపోగా మనకు పాణిని, ఆ తరువాత వ్యాయబడిన వ్యాకరణములు మాత్రమే లబిస్తున్నాయి. అందుచేత ఆధునిక కాలంలో ఆ నవ వ్యాకరణములు చదివినవారు ఉండే అవకాశం లేదు.


సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అమ్మా పద్య దళమ్ములన్

 శా.అమ్మా పద్య దళమ్ములన్ గొనుము నే నర్థించెదన్నిన్ను చే

కొమ్మా పద్మ శతమ్ము రేఖలివి వాగ్రూపమ్ము లైనట్టి పు

ష్పమ్ముల్ గైకొన వేడెదన్ రఘుపతిన్ శాస్త్రాన్వయున్ భక్తినీ

సొమ్ముల్ గాగ నొసంగెదన్  భగవతీ శోభాప్రదా భారతీ!౹౹109


సామాజిక శతక పద్య హేళలో భాగంగా రచియించిన ఈ భారతీ శతకం సర్వమ్ శ్రీ వాసరేశ్వరీ  శ్రీమాతా జ్ఞాన సరస్వతీ మాతృ చరణారవిందార్పణ మస్తు

స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు


ఓం తత్సత్ పరబ్రహ్మణే నమః

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  - త్రయోదశి - శతభిషం -‌‌ గురు వాసరే* (27.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వడదెబ్బ - నివారణా యోగాలు .

 వడదెబ్బ  -  నివారణా యోగాలు  .


 *  ఉల్లిపాయరసం ని వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అవుతుంది.


 *  వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపిలో గాని , రుమాలులో గాని నడినెత్తిన ఉండునట్లు కట్టి నడిచిన వడదెబ్బ తగలదు. జేబులో నైనా ఉంచుకోవచ్చు.


 *  నీరుల్లిపాయ రసం రెండు కనతలకు , గుండెకి పూసిన వడ దెబ్బవలన కలిగిన బాధ హరించును. 


 *  వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరం పైన నీళ్లు చల్లుతూ , తలపైన మంచు గడ్డలను వుంచి త్రాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.


 *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు త్రాగుచుండిన వడదెబ్బ తగలదు.


 *  విశ్రాంతిగా పడుకోపెట్టి కాఫీ తాగుటకు ఇచ్చిన వడదెబ్బ నుండి తట్టుకొందురు.


 *  నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనెని వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారించును.


 *  వడగండ్లు పడినప్పుడు ఏరి విబూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడువేల్లకు వచ్చినంత మంచినీటిలో వేసి ఇచ్చిన ఎండదెబ్బ నివారణ అగును.


 *  నువ్వులనూనేలో చనుబాలు రంగరించి చెవులలో వేసి కొంచం వెచ్చటి నీళ్లలో నెయ్యివేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును . 


 *  తరవాణి తేటలో ఉప్పుని చేర్చి ఇవ్వవలెను.


 *  తాటి ముంజలు పంచదారతో ఇవ్వవలెను. 


 *  నాలుకకు పాత ఉసిరి పచ్చడి రాసి , పుల్లని ఆవు మజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసం ని త్రాగించ వలెను.


 *  చన్నీటితో స్నానం చేయవలెను . 


 *  వేడివేడి పల్చని గంజిలొ ఉప్పు వేసి త్రాగవలెను.


 *  నిమ్మ ఉప్పుని నోటిలో వేసుకోనిన నాలుకకు ఉట ఊరి వడదెబ్బ నివృత్తి అగును.


         తగు జగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి తప్పించుకోగలరు. ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలితే పైన చెప్పిన నివారణా ఉపాయాలు ఉపయొగించుకొని బయటపడగలరు. 


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

గురువారం🪷* *🌹27, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

     *🪷గురువారం🪷*

*🌹27, మార్చి, 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి       : త్రయోదశి* రా 11.03 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : శతభిషం* రా 12.34 వరకు ఉపరి *పూర్వాభాద్ర*


*యోగం  : సాధ్య* ఉ 09.25 ఉపరి *శుభ* రా 05.57 తె వరకు

*కరణం   : గరజి* సా 12.27 *వణజి* రా 11.03 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 09.00 & 11.00  - 12.00*

అమృత కాలం  : *సా 05.56 - 07.25*

అభిజిత్ కాలం  : *ప 11.49 - 12.37*


*వర్జ్యం              : ఉ 09.07 - 10.35*

*దుర్ముహూర్తం  : ఉ 10.11 - 10.59 మ 03.04 - 03.53*

*రాహు కాలం   : మ 01.44 - 03.16*

గుళికకాళం      : *ఉ 09.09 - 10.41*

యమగండం    : *ఉ 06.06 - 07.38*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.06* 

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.06 - 08.33*

సంగవ కాలం         :      *08.33 - 10.59*

మధ్యాహ్న కాలం    :      *10.59 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.19*

ప్రదోష కాలం         :  *సా 06.19 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.31- 05.18*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం*


*స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే* *బాలాంతైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః |*

*పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం దత్తాత్రేయం* *శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||*


    *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

       🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

       🌷🍃🌹🌹🍃🌷

       🌹🌷🌹🌹🌷🌹

నవ (తొమ్మిది) వ్యాకరణ శాస్త్రములు:

 నవ (తొమ్మిది) వ్యాకరణ శాస్త్రములు:


1.పాణినీయము,

2.కలాపము,

3.సుపద్మము

4.సారస్వతము,

5.ప్రాతిశాఖ్యము (కుమారము),

6.ఐంద్రము,

7.వ్యాఘ్రభౌతికము,

8.శాకటాయనము,

మఱియు 

9.శాకల్యము.


ఈ వ్యాకరణముల క్రమము లేదా నామ వైరూప్యత ఎవరి పరిశీలనలో లేదా పరిచయములో ఏమైనా ఉన్నౘో ఇదే సమూహములో తెలుపగలరు.

మెదడుకు

 Y🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏            🔥 *మెదడు కూడా కడుపు లాంటిదే.. కడుపులోకి ఎంత పంపానన్నది కాదు ముఖ్యం.. ఎంత జీర్ణమైనది అన్నదే ప్రధానం..అలాగే మెదడుకు ఎంత చెత్త ఆలోచనలు పంపుతున్నామో ఆలోచించలి..ప్రతీ సమస్యకి మూడు పరిస్కారములు ఉంటాయి.. మార్చుకోవడం, వదిలేయడం, భరించడం వీటిలో ఏదీ ఎంచుకుంటామో దానిపై మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది* 🔥 మౌనంగాఉండటం చేతగాని తనం కాదు.. పట్టించుకోకపోవడం పిరికి తనం కాదు.. ప్రతీ ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు..మూర్కులతో వాదన పెట్టుకోవద్దు.. ఎందుకంటే ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చాస్తారు.. ఆ తరువాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని వారి దారికి తెచ్చుకుని మిమ్మల్ని ఓడిస్తారు🔥నడిచే టపుడు ఎవరైనా ఎదురుగా వస్తే పక్కకు తప్పుకుంటారు.. అలాగే జీవితంలో ముందుకు వెలున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకొన్న వారు మీ ఎదురుగా వస్తే యుక్తిగా తప్పించుకొండి.. వారేమి చేసినా ఉండిపోవాలా అన్ని అనుకోకండి.. బురదలో రాయి వేసి వంటినిండా బురద వేసుకోవడం దేనికి..మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఎదిరిస్తే, వారు పది అడుగులు  వేసి ఎదిరిస్తారు.. ఎందుకంటే వారి లక్ష్యం మిమ్మల్ని వెనుకకు నెట్టడం..అందుకే మీ లక్ష్యం  చేరుకోవడం కోసం ప్రక్కకి తప్పుకున్నా తప్పు లేదు ఎందుకంటే ఆది బురద అని తెలుసు కాబట్టి🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్  ఏజన్సీస్ .D.న్.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 .9182075510* 🙏🙏🙏

ఆలోచనలు

 *ఆలోచనలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*'ఆలోచనల రూపమే మనం'* అంటాడు *బుద్ధుడు•* 


 మనసులో అమంగళ కరమైన ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, ముఖంలో అవే వికృత భావాలు ప్రస్ఫుటంగా ప్రకటితం అవుతుంటాయి. 


 *ముఖం - మనసుకు ప్రతీక* అంటారు పెద్దలు• ప్రశాంతమైన మోము కలిగినవారి మనసు *'తేటనీటి కొలను'•* 


 ఆలోచనలు -  వికసించిన పువ్వు చుట్టూరా తిరిగే *భ్రమరం* లా శుభాల చుట్టూ పరిభ్రమిస్తాయి. అశుభం వైపు పోకుండా మనసును సున్నితంగా పట్టి ఉంచుతాయి.


 మన సంప్రదాయంలో *దీవెన* కు విశేష స్థానం ఉంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధాప్య దశ దాకా వివిధ సందర్భాల్లో పెద్దల ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు. 


 *మంగళాశాసనం* అంటే మనసా వాచా ఒకరి భావబలం మనల్ని వెన్నంటి ఉండటం. ఆశీర్వాదబలం వెన్నుదన్నుగా ఉంటే విద్యార్థి నుంచి కార్యార్థి    వరకు... అందరికీ అన్నింటా సఫలమే!


 పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు, *'అన్నీ తామే, అంతా తామే'* అన్నట్లుగా...  కాస్త బెడిసి కొడితే... *'తమ చేతిలో ఏదీ లేదన్నట్లుగా'* మాట్లాడుతుంటారు కొందరు. 


 ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శ్రేయోతత్త్వాన్ని విడిచిపెట్టనివారు -  *విజయకాంక్ష* ఉన్నవారు. ఓటమికి వెరవనిది, కుంగిపోనిదీ వారే!


 *చదవడం* అంటే అందరికీ *పుస్తకమే* గుర్తుకు వస్తుంది. 


 ఒక లక్ష్యం ఏర్పరచుకుని, అనుక్షణం శ్రేయోభిలాషతో - ఎవరు తనతో కలిసివచ్చినా, రాకపోయినా దృఢంగా అడుగులేసుకుంటూ గమ్యం వైపు సాగిపోయేవారు మనకు ఎక్కడో అక్కడ అరుదుగా తారసపడతారు.  వారిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకుంటే, మన మనసులో  *'పుట్టినందుకు ఏదైనా సాధించాలి'* అనే తపనకు బీజం పడుతుంది. మన నిత్య కృషితో అది, ఏదో నాటికి మహావృక్షం అవుతుంది. మన కీర్తిని అజరామరం చేస్తుంది.


 మన ప్రమేయం లేకుండా చెయ్యి కదలదు, కాలు నడవదు. మరి *ఆలోచనలు మాత్రం కట్టు తెగిన కోడెల్లా, కట్ట తెగిన వరద నీటిలా ఇచ్ఛారీతిన ప్రవహిస్తే ఎలా?*  వాటికి కళ్లెం వేయాలి. మన ఆలోచనలు మనకు ఉపయోగపడాలి. చెరుపు చేయకూడదు. 


 *శరీరం మీద కాకుండా మనసుపై పెట్టే శ్రద్ధ మేలు చేస్తుంది. మనుషులను ఋషులుగా మాధవులుగా చేస్తుంది.*


 *హృదయం నవనీతం అయితే, నోటి నుంచి కర్ణపేయంగా వెలువడే మాటలు నలుగురికీ దగ్గరయ్యేలా చేస్తాయి.*


 *కీడెంచి మేలెంచమని* మన పూర్వులు చెప్పింది, జీవితంలో ఏమరుపాటును వదిలి అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడానికి. అంతేకాని - ఆ భావాన్నే అంటి పెట్టుకుని, నిత్యం శంకలతో కాలం గడుపుతూ, జీవితాన్ని వృథా చేసుకొమ్మని కాదు. 


 శ్రేయోదాయక ఆలోచనలు మనసును స్వచ్ఛమైన వేదికగా మారుస్తాయి. దానిపై కొలువుదీరడానికి అంతర్యామి ఉవ్విళ్లూరతాడన్నది సత్యం. 


 ఆధ్యాత్మికంగా ఉత్తమ ఆలోచనలకు ఉన్న గొప్ప శక్తి అది. ముముక్షువులు భగవదవతారంగా గుర్తింపు పొందడానికి అదే కారణం.

🙏లోకాః సమస్తా సుఖినోభవంతు🙏


               🌼శుభమస్తు🌺

అమ్మాయే_పుడుతుంది_అచ్చం_అమ్మ_లాగే_ఉంటుంది

 *అమ్మాయే_పుడుతుంది_అచ్చం_అమ్మ_లాగే_ఉంటుంది*


*`(ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది)`*


*ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు...*


*💁🏻‍♀️భార్య:*

*ఏం అనుకుంటున్నావ్... అబ్బాయి పుడతాడనా?అమ్మాయనా..??*


*💁🏻భర్త:*

*అబ్బాయనుకో... వాడికి లెక్కలు నేర్పుతాను... ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం... స్విమ్మింగ్ నేర్పుతా... చెట్లెక్కడం నేర్పుతా... అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా... ఇంకా...*


*💁🏻‍♀️భార్య:*

*చాలు చాలు! మరి అమ్మాయి పుడితే..!?*


*💁🏻భర్త:*

*అమ్మాయైతే ఏం నేర్పనవసరంలేదు.! అదే నాకు నేర్పుతుంది... నేనేం తినాలి... ఏం తినకూడదు... ఏం మాట్లాడాలి... ఏం మాట్లాడకూడదు... నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి... ఒక రకంగా మా అమ్మ లాగా అన్నమాట... ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది... నన్నెవరైనా బాధపెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు... ఎదురు తిరుగుంది... భర్త దగ్గర కూడా నాగురించి గొప్పగా చెప్తుంది... మా నాన్న నాకోసం అది చేసాడు... ఇది చేసాడు అనీ...*


*💁🏻‍♀️భార్య:*

*సో... అమ్మాయైతే ఇవన్నీ చేస్తుంది... అబ్బాయైతే చేయడంటారు అంతేగా..??*


*💁🏻భర్త:*

*కాదు... అబ్బాయైతే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు... అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయ్...*


*💁🏻‍♀️భార్య:*

*అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా..!* 


*💁🏻భర్త:*

*ఉండదు... కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం... అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు... Daughters are Angles... Born with unconditional love and care forever... అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు... కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే 'తులసి మొక్క'... కూతురంటే దించేసుకొవలసిన బరువు కాదు... నీ ఇంట్లో వెలసిన 'కల్పతరువు'... కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు... నీ కడుపున పుట్టిన మరో "అమ్మ"... కూతురంటే కష్టాలకు, కన్నీళ్ళకు వీలునామా కాదు... కల్మషం లేని 'ప్రేమ' కు చిరునామా... కళ్యాణమవగానే నిన్ను విడిచివెళ్ళినా... పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా... తన ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను... కొడుకులా కాటి వరకు తోడురాకపోయినా... అమ్మ అయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ... కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది... దేవతలు కొలువున్న కోవెల... కూతురిని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణిని కన్న మహారాజులా... Good luck my dear కూతుర్లని కన్న తల్లిదండ్రులారా.*

🙏🙏🙏 🪷💔🪷 🙏🙏🙏

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(87వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️ౌ☸️☸️

            *కృష్ణావతారం* 

        *చిన్ని కృష్ణుని లీలలు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఉన్నచోట ఉండవు. పరుగులుదీసి ప్రాణాలు తీస్తున్నావు. నిన్ను కదలకుండా ఉంచడం ఎలాగో నాకు బాగా తెలుసు. చూడేం ఏం చేస్తానో.’’ అన్నది యశోద.*


*దగ్గరలో ఉన్న తాడు అందుకున్నది. ఒక కొస కృష్ణుని మొలకు కట్టి, రెండో కొసను రోలుకి కట్టేందుకు ప్రయత్నించింది. తాడు చాలలేదు. ఇంట్లోకి వెళ్ళింది. తాళ్ళు తెచ్చింది. ఎన్నితాళ్లో! అన్ని తాళ్ళు కట్టినా రోలు అందడం లేదు. కృష్ణుడు కదలడం లేదు. ఉన్నచోటే ఉన్నాడు. రోలు కూడా అంతే! ఉన్నచోటే ఉన్నది. మరి తాడెందుకు సరిపోవట్లేదో! అంతుచిక్కలేదు యశోదకు.*


*కన్నీరు పెట్టుకుందామె. తల్లి అలా కన్నీరుపెట్టుకోవడం కృష్ణుడు చూడలేకపోయాడు. మాయను మటుమాయం చేశాడు. ఇప్పుడు తాడు సరిపోయింది. రెండో కొసను రోలుకు కట్టింది యశోద.*


*‘‘ఇప్పుడిక ఎలా పరుగుదీస్తావో చూస్తాను. ఉన్నచోట ఉండాల్సిందే! బుద్ధిగా కూర్చో.’’ అన్నది.*


*ఎవరో పిలిస్తే వెళ్ళిపోయింది.అమ్మ చెప్పినట్టుగా వింటే అల్లరికృష్ణుడు ఎందుకవుతాడు? వినడుగాక వినడు. రోలునీ, తాడునీ పదేపదే చూసి, రోలుని లాగుతూ, దోగాడుతూ అక్కణ్ణుంచి బయల్దేరాడు కృష్ణుడు.*


*రెండు పెద్దమద్దిచెట్ల దగ్గరగా వచ్చాడు. కవలపిల్లల్లా జంటగా పుట్టిన చెట్లవి. రోలు ఈడ్చుకుంటూ ఆ చెట్లమధ్యనుంచి వచ్చాడు. చెట్లమధ్య రోలు ఇరుక్కుంది. ముందుకు రావట్లేదు. లాగి చూశాడు కృష్ణుడు. రాలేదు. బలాన్నంతా ఉపయోగించాడు. గట్టిగా గుంజాడు. రోలు గట్టిగా అదమడంతో చెట్లు రెండూ వేళ్ళతో సహా విరిగిపడ్డాయి. విరిగిపడిన చెట్ల మధ్య నుంచి ఇద్దరు సిద్ధపురుషులు వెలిశారు.*


*దివ్యతేజస్సుతో వెలిగిపోతూ ప్రత్యక్షమయ్యారు. చేతులు జోడించి చిన్నికృష్ణునికి నమస్కరించారు. వేదమంత్రాలతో స్తుతించారతన్ని. కృష్ణుడప్పుడు దివ్యరూపంతో వారిని అనుగ్రహించాడు. కృష్ణుని చుట్టూ ప్రదక్షిణగా తిరిగి, సెలవంటూ ఆ సిద్ధపురుషులిద్దరూ ఆకాశానికి ఎగిసిపోయారు. ఉత్తరదిక్కుగా తరలిపోయారు*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (87)*


*కుముదః కుందరః కుందః*

*పర్జన్యః పావనోనిలః ।*


*అమృతాంశః అమృతవపుః*

*సర్వజ్ఞః సర్వతోముఖః ॥* 


*ప్రతి పదార్థం:~*


*811) కుముద: - దుష్టులను సంహరించి భూమికి ఆనందము కలుగ చేయువాడు;  కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.*


*812) కుందర: -  భూమిని చీల్చుకు పోయినవాడు. హిరణ్యాక్షుని వెతుకుతూ వరాహరూపంలో భూమిని పెకిలించిన వాడు;*


*813) కుంద: - కశ్యప మహర్షికి భూమిని దానమిచ్చినవాడు; భక్తుల పాపములను శుభ్రపరిచి అవి తిరిగి రాకుండా చేసేవాడు.*


*814) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.*


*815) పావన: - గాలి,అగ్ని, నీరు వంటి రూపములలో పవిత్రీకరించువాడు.*


*816) అనిల: - మరెవరి ప్రేరణ లేకుండానే భక్తులకు దీవెనలు ప్రసాదించువాడు;  తన భక్తులకు తేలికగా అందుబాటులో ఉండేవాడు ; సదా జాగరూకుడు*


*817) అమృతాంశ: - అమృతమును సేవించిన వాడు; తన భక్తులచే తన గుణములనే అమృతమును ఆస్వాదింప చేయువాడు.*


*818) అమృతవపు: -‌అమృతం వంటి శరీరము కలవాడు; అమృతస్వరూపుడు శాశ్వతుడు.*


*819) సర్వజ్ఞ: - అంతా తెలిసినవాడు.*


*820) సర్వతోముఖ: - అన్ని దిక్కులా ముఖము కలవాడు; ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.*


*తాత్పర్యము:~*


*భూమికి ఆనందము కలిగించినవాడును, భూమిని చీల్చుకుని పోయినవాడును, మల్లెపూవు వలె సదా ప్రసస్నుడును, మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడును; గాలి,అగ్ని, నీరు వంటి రూపములలో పవిత్రీకరించువాడును, తన భక్తులకు తేలికగా అందుబాటులో ఉండేవాడు, అమృత స్వరూపుడును, నాశనము లేని శరీరము కలవాడును,సర్వము తెలిసిన వాడును, ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రవణం నక్షత్రం 3వ పాదం జాతకులు పై 87వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈ శ్లోకములో శుద్ధరూపుడయిన శంభునికి నమస్కరిస్తున్నారు. (ఇది ఒక గొప్ప శివ స్తుతి ).*


*శ్లోకము :   55*

           

*ఆద్యాయామిత తేజసే శ్రుతిపదై ర్వేద్యాయ సాధ్యాయతే*

                 

*విద్యానంద మయాత్మనే త్రిజగత స్సంరక్షణోద్యోగినే*

                 

*ధ్యేయా యాఖిల యోగిభి స్సుర గణై ర్గేయాయ మాయావినే*

                 

*సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శ్శంభవే !!*


*పదవిభాగం :~*


*ఆద్యాయ అమిత తేజసే = ప్రపంచమునకు మొదటి వాడు, మితిలేని తేజస్సు రూపము కలవాడు;*


*శ్రుతిపదైః వేద్యాయ = వేద వాక్యముల చేత తెలియ దగినవాడు*


*సాధ్యాయ =భక్తులను అనుగ్రహించుటకు ప్రతిమాది రూపమున ప్రతిష్టింపబడిన వాడు*


*తే = నీ కొరకు*


*విద్యానందమయాత్మనే = చిదానందమయమైన ఆత్మస్వరూపుడు*


*త్రిజగతః స్సంరక్షణ ఉద్యోగినే = ముల్లోకములను కాపాడుట ప్రవృత్తిగా కలవాడు*


*అఖిల యోగిభిః ధ్యేయాయ = యోగులందరి చేతను ధ్యానించబడువాడు*


*సురగణైః = దేవ గణములకు చేత*


*గేయాయ  = గానము చేయదగిన వాడు*


*మాయావినే =  మాయచే అనేక ఉపాధులను ధరించు వాడు*


*సమ్యక్తాండవ సంభ్రమాయ  = చక్కని తాండవ నృత్యమందు తొందర కలవాడు*


*జటినే = జడలు దాల్చిన వాడు*


*ఇయం = ఈ*


*నతిః  = నమస్కారము*


*శంభవే = సుఖకరుండు.*


*తాత్పర్యము :~*


*సర్వ లోకములకూ ఆద్యుడవునూ, అధిక తేజ స్సంపన్నుడవునూ, వేద వాక్యములచే తెలిసికొన దగిన వాడవునూ, తపో ధ్యానాది సాధనములచే సాధింప దగినవాడవునూ, ఙ్ఞానానంద స్వరూపుడవునూ, ముల్లోకములనూ రక్షించడానికి  నిత్యమూ యత్నించు వాడవునూ, సర్వ యోగులచే ధ్యానము చేయదగిన వాడవునూ, దేవతా సమూహములచే కీర్తింప దగిన వాడవునూ, మాయచే అనేక ఉపాధులను ధరించు వాడవునూ, యథా శాస్త్రముగా  తాండవ మొనర్చుట యందు ఆదరము గల వాడవునూ, జటాధారివియూ, శంభుడవూ అయిన నీకు , ఇదే నా నమస్కారం. ( ఇక్కడ శివుని గుణ స్వరూప మహిమలు చక్కగా వర్ణింప బడినవి).*


*వివరణ :~*


*ఈశ్వరుడు సృష్టికి ముందే ఉన్నవాడు. అమితమైన తేజస్సు కలవాడు. వేద వాక్యముల ద్వారా తెలిసికొనదగినవాడు. సాధ్యుడు, మంత్ర స్వరూపుడు లేదా సకల శ్రుతి స్మృతి విహితములైన సకలసాధనములకు లక్ష్యమైనవాడు. చిన్మయమూ, ఆనందమయమును అయిన స్వరూపం గలవాడు. ముల్లోకములనూ రక్షించడం యందు పూనిక గలవాడు. భక్తులూ, ఙ్ఞానులూ అనెడి సమస్త యోగుల ద్వారా ధ్యానింప దగినవాడు. సర్వ దేవతలచేత గానం చేయదగిన వాడు. మాయావి, జటాజూటం గలవాడు.  తాండవం చేయుట యందు సంబరం గలవాడు.  సుఖకరుడు  అటువంటి నీకు, ఇదే నా నమస్కారము.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

చామకూర కవితా చమత్కారము

 శు భో ద యం 🙏


పద్యసౌందర్యం!


చామకూర  కవితా చాతుర్యం!! 

                

  కవిత్వం చెప్పటంలో  కథాకథనంలో  ఒక విలక్షణమైన  చమత్కార  వైఖరి  చామకూర  వేంకట పతిలో కనిపిస్తుంది. 

చెప్పే విషయానికనుకూలమైన  భాషాప్రయోగంతో  అందులో విశిష్టమైన  చమత్కారంతో   అతనిప్రతిపద్యం  ఒక క్రొత్త  సోయగాన్ని  మనకు చవిచూపుతుంది.  సర్వజ్ఙుడైన  పరమేశ్వరుడు  గంగ కెందుకు ప్రాధాన్యమును ఇచ్చాడు. నెత్తిని యెందుకెక్కించు కొన్నాడు? అనేప్రశ్నలకు  సమాధానంగా  ఒక చక్కని పద్యం చెప్పాడు. విజయ విలాసం  లోని  మొదటి  యా

శ్వాసంలో గల  యీపద్యం  మీకోసం  ,  చిత్తగించండి!


          శా:  "  తాసైరింప  కపర్ణయుండగ , భవద్గర్భంబునందాల్చి ,  తే

                    జో సహ్యున్   శరజన్ముగాంచి , యల  నీహారక్షమాభృత్కుమా

                     రీ  సాపత్న్యము  గన్న ,  మోహపు  పురంధ్రీరత్నమౌదీవు ,కా

                      దే  సర్వజ్ఙుడు  నిన్నునేల  ,ఁ దలపై  కెక్కించుకో  జాహ్నవీ  !


            అర్జునుడు  సమయభంగ  మగుట  తీర్థయాత్రలకు  వెడలుచున్నాడు.   అతని  తొలి మజిలీ గంగాతీరం. గంగను  చూడగానే పరవశమైనాడు. చేతులు జోడించి యామెను ప్రార్ధింప  సాగినాడు. అందులో యీపద్యము  గణింపఁ దగనది.


                       అమ్మా!  గంగమ్మతల్లీ! పరమేశ్వరునకు  నీవంటేనే  యెక్కువ  ప్రేమమ్మా! లేకపోతే నెత్తిమీదెందుకు నిన్ను యెక్కించుకుంటాడు? అని యెదురుప్రశ్న వేస్తున్నాడు. అలా యెలా కుదురుతుందయ్యా? అవతల  సగం శరీరమై కూర్చున్న పార్వతిలేదా? అనే ప్రశ్న  రాకమానదని  కవికి  తెలుసు . దానికి యుక్తి యుక్తమైన  ఒక చక్కని కథ చెపుతున్నాడు.


          " శివుని  వీర్యం  ( కారణాంతరాలవలన) స్ఖలితం  కాగా  అగ్నితో  సమానమైన  ఆవీర్యాన్ని  పార్వతి గర్భంలో మోయలేకపోతే  నీవుగదా దానిని  మోసి తోజోరాసి యైన శరజన్మునకు (కుమారస్వామి)  జన్మము నొసగితివి. అందుచేతనేగదా నీవు పార్వతికి  సవతివైతివి . మొగవారికి  తమ వంశమును నిలిపిన యాడువారిపైననే  ప్రేమ మెండు. లేకున్న  సర్వజ్ఙుడు  (శివుడు) నిన్ను  నెత్తిపై  నెందుకు ధరించును.  అంటున్నాడు. ఎంత గొప్ప సమర్ధింపో చూడండి!


               పార్వతి  యేమీ తక్కువదికాదు . ఆమె అపర్ణ . శివుని పతిగా బడయుటకై  ఘోరమైన తపస్సు చేసినది. ఆమెనివసించు చెట్టుక్రింద  రాలిన యాకుల జాడ తెలిసెడిది గాదు. ఆరాలినయాకులే  ఆనెయాహారము. ఆమెయొనరించిన తపము ఆమె నపర్ణ బిరుదాంకితగా నొనర్చినవి.


                      మరియొకటి  పార్వతి "నీహార క్షమాభృత్కుమారి" యెంతపెద్ద సమాసమోచూడండి! హిమవత్పర్వత రాజ కుమారి  అంత  గొప్ప  భాగ్యవంతుల  యాడబడచు. 


                          ఆమె  తపస్వి,  , గొప్పవారింటి బిడ్డ. గంగయో సాధారణమైన  వనిత  ఆమెను లెక్కింపక  యీమెని శిరమున దాల్చుటయా? శివునకు యోచనలేదా? యనువారికి సమాధానముగా  పరమేశ్వరునకు  " సర్వజ్ఙుఁడు"- అనువిశేషణమును తగిలించి  విమర్శలకు  అవకాశమును లేకుండ చేసినాడు.


                  లోకమున  సంతతిగల  యాడుదానికిచ్చిన  విలువ  తక్కినవారికివ్వరుగదా! మరిశివుడు సర్వజ్ఙుఁడాయె ,అందుచేతనే నెత్తికెక్కించు కున్నాడని, చమత్కరించి  విషయమును రక్తి గట్టించినాడు. 


                   ఇదీ   చామకూర    కవితా  చమత్కారము!!!

                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

⚜ శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానం

 🕉 మన గుడి : నెం 1062


⚜ కేరళ : శబరిమల


⚜ శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానం



💠 అయ్యప్ప అంటే "హరిహరసుతుడు". 

 విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. "అయ్యా" - "అప్ప" కలిసి "అయ్యప్ప" అని అంటారు. 

అయ్యప్పని "మణికంఠుడు", "ధర్మశాస్త" అని కూడ అంటారు.


🔆 అయ్యప్పస్వామి జన్మ రహస్యం 


💠 అయ్యప్ప అనుచరులకు వచనమైన భూత్నాథోపాఖ్యానం ప్రకారం, అయ్యప్ప ఎలా జన్మించాడనే కథను సూత మహర్షి తన అనుచరులకు చెప్పాడు . 


💠 చాముండి మహిషాసురుడిని చంపిన తర్వాత, అతని సోదరి మహిషి దేవతల మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది . 

బ్రహ్మ మహిషికి ఒక వరం ఇచ్చాడు- ఇద్దరు మగవారికి జన్మించిన మానవుడు మాత్రమే ఆమెను చంపగలడు.


💠 దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువు నుండి సహాయం కోరారు. మోహిని అవతారం తీసుకున్న శివ విష్ణువుల కలయిక వల్ల మణికందన్ అనే కొడుకు పుట్టాడు.


💠 మణికందన్ దక్షిణ భారతదేశంలోని పంపా నది ఒడ్డున విడిచిపెట్టబడ్డాడు. సంతానం లేని పంథాలం వంశానికి చెందిన రాజశేఖర చక్రవర్తి ఈ బిడ్డను కనుగొన్నాడు. 

ఇంతలో, రాణి ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

 రాణికి మణికందన్ నచ్చలేదు మరియు అతనిని తొలగించడానికి ఒక పథకం వేసింది. పులి పాలు తాగితేనే వైద్యం అందుతుందని ఆమె తన అనారోగ్యం గురించి అబద్ధం చెప్పింది. 


💠 పన్నెండేళ్ల మణికందన్ తన తల్లి కోసం పులి పాలను వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్లి మహిషిని నాశనం చేశాడు. 

మహిషి మరణానికి దేవతలు సంతోషించారు. ఇంద్రుడు పులి రూపాన్ని ధరించాడు .

అతను ఆలయం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి అడవిలోకి బాణం విసిరాడు, ఆలయాన్ని నిర్మించమని వారిని ఆదేశించాడు, ఆపై దేవలోకానికి బయలుదేరాడు.


💠 అయ్యప్ప ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చారు. ఈ క్షేత్రాన్ని మణిమండపం అంటారు. శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడు మరియు ఆయన స్థాపించిన ఐదు శాస్తా ఆలయాలలో ఇది ఒకటి. 


🔆 శబరిమల ఆలయ ప్రాముఖ్యత


💠 అయ్యప్ప దీక్షాకాలంలో 40 రోజుల ఉపవాసం మరియు సంపూర్ణ బ్రహ్మచర్యం భక్తులకు అవసరం మరియు ప్రాపంచిక వ్యవహారాల నుండి స్వీయ నిగ్రహం కూడా అవసరం.

ఆలయం నుండి తిరిగి వచ్చే వరకు, భక్తులు క్షౌరము చేయరు మరియు వారి నుదిటికి గంధం పూస్తారు.

యాత్రికులు వారి నలుపు లేదా నీలం దుస్తులు, రుద్రాక్ష మాల ద్వారా గుర్తించబడతారు మరియు వారు మాంసం మరియు పొగాకును ఖచ్చితంగా నివారించాలి.


💠 ప్రధాన ఆలయానికి దారితీసే 18 పవిత్ర మెట్లు ఉన్నాయి మరియు అనేక నమ్మకాల ప్రకారం, మొదటి ఐదు మెట్లు ఇంద్రియ అవయవాలను సూచిస్తాయి, తదుపరి ఐదు రాగ్సాలను సూచిస్తాయి, మరో మూడు గుణాలను సూచిస్తాయి మరియు మిగిలిన రెండు విద్య మరియు అవిద్యలను సూచిస్తాయి. కొన్ని ఇతర నమ్మకాల ప్రకారం ఈ 18 మెట్లు పురాణాలను సూచిస్తాయి.


💠 ఈ ఆలయం 40 అడుగుల ఎత్తులో ఉన్న పీఠభూమిపై నిర్మించబడింది మరియు ఆలయ గోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది.

ఐదు లోహాల మిశ్రమం అయిన పంచలోహ మూలకాన్ని ఉపయోగించి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేశారు.


🔆 శబరిమల ఆలయంలో పండుగలు 


💠 నవంబర్ నుండి ఏప్రిల్ నెలలలో, ఆలయంలో వార్షిక ఉత్సవాలు జరుపుకుంటారు. 

మకర సంక్రాంతి పూజ మరియు మండల పూజ ఈ ఆలయంలో జరిగే రెండు ప్రధాన పూజలు.

 ఈ సమయంలో, గరిష్ట సంఖ్యలో ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు. మండలపూజ నవంబర్ 15న ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. 

తరువాత, జనవరి 14 న, మకరవిళక్కు లేదా మకర సంక్రాంతి పూజ ప్రారంభమవుతుంది, ఇది ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. 

ఏప్రిల్ 14న జరుపుకునే మహావిషువ సంక్రాంతి కూడా ఈ ఆలయంలో పూజలందుకుంటుంది. 

 

💠 ఈ ఆలయం 40 అడుగుల ఎత్తులో ఉన్న పీఠభూమిపై నిర్మించబడింది మరియు ఆలయ గోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది. పంచలోహ మూలకాన్ని ఉపయోగించి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేస్తారు.


💠 మకర విళక్కు : 

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ మకర విళక్కు.  

ఇది ఏడు రోజుల పండుగ, ఇది మకర సంక్రాంతి రోజున, సూర్యుడు వేసవి కాలం లో ఉన్న రోజున ప్రారంభమవుతుంది.  

పురాణాల ప్రకారం, ధర్మ శాస్తా విగ్రహం ఈ రోజున ఆలయంలో ప్రతిష్టించబడింది. మకర విళక్కు వార్షిక ఉత్సవాలు ఈ పవిత్ర ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.

  

💠 వేడుకల సమయంలో విగ్రహాన్ని అలంకరించే ఆభరణాలు మకర సంక్రాంతికి మూడు రోజుల ముందు పందళంలోని వలియ కోయిక్కల్ శాస్తా ఆలయం నుండి తీసుకువస్తారు.  


💠 ఈ పండుగలో మరో విశేషం ఏంటంటే.. లక్షలాది మంది వీక్షించేవారిపై చెరగని ముద్ర వేసే మకరజ్యోతి. 



💠 రైలు మార్గంలో యాత్రికులు రైలు ద్వారా కొట్టాయం & చెంగన్నూరు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో పంపా చేరుకోవచ్చు. 


రచన

©️ Santosh kumar

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత 

కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ (25)


న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ 

జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ (26)


అర్జునా.. అజ్ఞానులు ఫలితాలు ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోకకల్యాణం కోసం కర్తవ్యకర్మలు ఆచరించాలి. ఫలం కోరి కర్మలు చేసే పామరుల బుద్ధిని విజ్ఞులు వికలం చేయకూడదు. జ్ఞాని యోగిగా సమస్తకర్మలూ చక్కగా ఆచరిస్తూ ఇతరులు చేతకూడా చేయించాలి.

15-11-గీతా మకరందము

 15-11-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి


అవతారిక -  చిత్తశుద్ధిలేనివారు ప్రయత్నము సలిపినప్పటికిని ఆత్మను చూడజాలరని చెప్పుచున్నారు – 


యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ | 

యతన్తోఽప్యకృతాత్మానో

నైనం పశ్యన్త్యచేతసః || 


తాత్పర్యము:- (ఆత్మాసాక్షాత్కారమునకై) ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు (అనుభూత మొనర్చుకొనుచున్నారు). అట్లు  ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు.


వ్యాఖ్య:- అనేకులు భగవత్ప్రాప్తికై యత్నించుచున్నప్పటికిని అందులో కొందఱు సఫలురగుటకును, కొందఱు విఫలురగుటకును కారణమేమియో ఇచట తెలుపబడుచున్నది. చిత్తశుద్ధిగలిగి యత్నించువారు తప్పక సాఫల్యమును బొందగలరు. అనగా పరమాత్మను తమయందు సాక్షాత్కరించుకొనగలరు. కాని అదే ప్రయత్నము, అవే ధ్యానాదులు గావించుచున్నప్పటికిని, మలినచిత్తులు, సంస్కరింపబడని మనస్సు గలవారు, పరమాత్మను సాక్షాత్కరించుకొనజాలరు. కొందఱు శాస్త్రపాండిత్యము మున్నగునవి మాత్రము కలిగి హృదయపవిత్రతలేక ఆత్మాన్వేషణమునకై ఉపక్రమింతురు. మఱికొందఱు కేవలము వేషధారులుగ నున్నవారై ధ్యానాదులను చేయుచున్నట్లు  కనుపించుచుందురు. అట్టివారు ఇంద్రియనిగ్రహము లేని కారణముచేతను, చిత్తశుద్ధి లేనందువలనను ఆత్మను తమయందు గాంచజాలరని ఈ శ్లోకమున ఘంటాపథముగ చెప్పివేయబడినది. క్షేత్రమును బాగుగ దున్ని కలుపుతీసి, శుద్ధముచేసి, ఎరువుచల్లి ఆ పిదప విత్తనము వేసినచో చక్కగ పైరగును. అట్లుకాక, దున్నక, కలుపుతీయక వేసినను, లేక ఊషరక్షేత్రమునవేసినను ఆ విత్తనము మొలవదు. ఒకవేళ మొలచినను పెరగదు. ఒకవేళ పెరిగినను ఫలించదు. అట్లే సాధనచతుష్టయసంపత్తి మున్నగువానిద్వారా చిత్తమును మున్ముందు శుద్ధమొనర్చుకొనినచో, అత్తఱి ఆత్మవిచారణాధ్యానాదులచే అతిసులభముగ ఆత్మ యనుభూతము కాగలదు. అవి లేనివారు ఎంత ప్రయత్నించినను ఆత్మను చూడజాలరు.


 భగవద్దర్శనమునకై రెండు విషయములు ప్రతివారికి అత్యవసరములని ఇచ్చోట తెలుపబడినది. అవియేవి యనిన - (1) ప్రయత్నము (2) చిత్తశుద్ధి - ఈ రెండును గలవారికి పరమాత్మ తప్పక అనుభూతుడు కాగలడు. రెండును అవసరములే. “యతన్తః” - అని

చెప్పబడుటవలన పరమార్థమార్గమున ప్రయత్నము అత్యావశ్యకమని తేలుచున్నది. అయితే ఆ ప్రయత్నమునకు చిత్తశుద్ధియు తోడుగానున్నపుడు అది యింకను ప్రకాశించును. ఇచట "అచేతసః" అని చెప్పబడినదానికి అర్థము కేవలము మూఢులని అజ్ఞానులని, నాస్తికులని కాదు. ఏలయనిన ఆ యత్నించువారికి దైవమును పొందవలెనను తలంపుగలదు. ముముక్షుత్వము కలదు. లేకున్న వారు భగవత్ర్పాప్తికై అసలు ప్రయత్నమే చేయరుగదా! వీరు ప్రయత్నము చేయుచున్నారు. కాని వక్రమార్గమున, అపసవ్యపద్ధతిలో చేయుచున్నారు. అట్టివారు అనుభవజ్ఞులగు పెద్దల సాంగత్యముచేసినచో సత్యమార్గమును కనుగొని తరించగలరు. దైవమార్గమున ప్రయత్నము మంచిదేకాని దానికి చిత్తశుద్ధికూడ తోడైనచో ఇంకను రాణించును. బాగుగ ఫలించును. మోటుగా సాధనచేయుటవలన గొప్ప ప్రయోజనములు చేకూరవు; సాధనపద్ధతిని, సాధనరహస్యములను

భగవవత్ప్రోక్తములగు ఇట్టి వచనములవలనను, సద్గ్రంథములవలనను, మహాత్ముల సాంగత్యమువలనను తెలిసికొని ముముక్షువులు సక్రమపద్ధతిలో ధ్యానించి తరించవలయును.


ప్రశ్న:- పరమాత్మ యెచట గలడు?

ఉత్తరము:- తనయందే.

ప్రశ్న:- ఆతనిని ఎవరు చూడగలరు? 

ఉత్తరము:- చిత్తశుద్ధిగలిగి ధ్యానాది ప్రయత్నములను చేయువారు. 

ప్రశ్న:- ఎవరు చూడలేరు? 

ఉత్తరము:- చిత్తశుద్ధిలేక ప్రయత్నము చేయువారు.

ప్రశ్న:- కాబట్టి భగవద్దర్శనమున కేవి అవసరము?

ఉత్తరము:- (1) చిత్తశుద్ధి (2) ప్రయత్నము.

తిరుమల సర్వస్వం -190*

 *తిరుమల సర్వస్వం -190*

*శ్రీవారి ఆభరణాలు -2*

 *మొజాతినగలు* 


 బ్రహ్మోత్సవాల వంటి అత్యంత అరుదైన, విశేష ప్రాముఖ్యం కల సందర్భాలలో మాత్రమే శ్రీవారికి అలంకరింపబడే ప్రాచీనమైన నగలన్నీ ఈ వర్గానికి చెందుతాయి. ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క కళాఖండం ! నాటి దాతల అభిరుచికి, కళాకారులు పనితనానికి నిలువుటద్దం. వారి వారి నైపుణ్యాన్ని శ్రీవారిపైనున్న భక్తి విశ్వాసాలతో మేళవించి, దేవాలయ చరిత్రలో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న ఎన్నో ఆభూషణాలకు దక్షిణభారతదేశానికి చెందిన ఎందరో కళాకారులు ప్రాణం పోశారు. దేవస్థానానికి సంబంధించిన బొక్కసం (ట్రెజరీ) అధికారుల అధీనంలో ఉన్న కోశాగారంలో ఈ నగలను భద్రపరుస్తారు. వీటికి విశేషమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది.

2  ఈ మూడు తరగతులకు చెందిన ఆభరణాలకు పటిష్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు, తనిఖీలు, తరచుగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరుగు తుంటాయి.


 *కిలోలూ - క్వింటాళ్ళూ కాదు, ఏకంగా టన్నులే!!* 


 2016వ సంవత్సరంలో జరిగిన మదింపు ప్రకారం, తిరుమలేశునికి సుమారు 14 టన్నుల బరువైన ఆభరణాలు ఉండగా వాటిలో 124 ఆభరణాలు మూలమూర్తి అలంకరణకు, 383 ఆభరణాలను ఉత్సవమూర్తులకు ఉపయోగిస్తారు. 


 ఇవే కాకుండా రాఘోజీ సంస్థానంవారు, వెంకటగిరి సంస్థానం వారు స్వామివారికి సమర్పించుకున్న ఆభరణాలను వాటికున్న చారిత్రక ప్రాధాన్యతను బట్టి విడి విడిగా భద్రపరుస్తారు. శ్రీవారి ఆభరణాలను నమోదు చెయ్యడానికి మొత్తంగా 17 దస్త్రాలు (రిజిస్టర్లు) ఉన్నాయి. వీటితో పాటుగా తిరుమలలోని అనేక ఉపాలయాలలో, తి.తి.దే. ఆధ్వర్యంలోనున్న తిరుపతి పట్టణంలోని వివిధ ఆలయాలలో కూడా లెక్కలేనన్ని ఆభరణాలు ఉన్నాయి.


 *తిరుపతి లోనే దర్శించుకోవచ్చు!* 


 సామాన్య భక్తులు సైతం, తిరుపతి నుంచే చూసి తరించు కునేందుకు వీలుగా శ్రీవారి అమూల్యమైన, చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న ఆభరణాలను తిరుచానూరులో జరిగే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుండి సర్వలాంఛనాలతో; సంవత్సరానికొక్కటిగా తెచ్చి ఊరేగింపు జరిపే సాంప్రదాయాన్ని ఈ మధ్యనే తి.తి.దే. వారు ప్రవేశపెట్టారు.


 *ఆణివార ఆస్థానం* 


 విలువ కట్టడానికి సాధ్యంకాని విశేషమైన ఆభరణాలే కాకుండా స్వామివారి భక్తులు నిత్యం పరకామణిలో వేసే చిన్నపాటి ఆభరణాలు, బంగారు బిస్కెట్ లతో ఆ లక్ష్మీపతి కోశాగారం కిటకిటలాడుతుంటుంది. వీటి విలువను ఇదివరకు ఏడాదికోసారి జరిగే *'ఆణివార ఆస్థానం'* అనే సంవత్సరోత్సవ సందర్భంలో లెక్కగట్టే వారు. 'ఆణివార ఆస్థానం' అంటే, దేవాలయ అజమాయిషీ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి మహంతుమఠం వారికి దఖలు పడ్డ రోజుకు గుర్తుగా జరిపే వార్షికోత్సవం. అయితే, ప్రస్తుతం శ్రీవారి ఆలయ లెక్కల ముగింపు దినాన్ని సాధారణ ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా మార్పు చేశారు.


 *శ్రీవారి డాలర్లు* 


 రాళ్లు పొదగబడినవి కాకుండా, హుండీ ద్వారా వచ్చిన సాదా స్వర్ణాభరణాలను ముందుగా తిరుమలలో ఉన్న కోశాగారానికి, అక్కడ నుంచి నెలకొకసారి తిరుపతిలో ఉన్న తి.తి.దే. పరిపాలనా కార్యాలయ భవనానికి - భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య తరలిస్తారు. తదనంతరం వాటిని ముంబైలో ఉన్న ప్రభుత్వ టంకశాలకు తరలించి, 22 క్యారెట్లతో 5, 10 గ్రాముల బరువుండే శ్రీవారి బంగారు డాలర్లను తయారు చేసి, మళ్లీ వాటిని తిరుమల లోనే భక్తులకు విక్రయించి, తద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో ఉన్న తి.తి.దే. ఖాతాలకు జమ చేస్తారు. ఇలా ఖాతాల్లో జమ కాబడ్డ డిపాజిట్లు కొన్ని వేల కోట్లకు చేరుకుని, శ్రీవారు సాటిలేని శ్రీమంతులు అనిపించుకుంటున్నారు. మార్కెట్ ధరల ననుసరించి, ఏ రోజు బంగారం ధర ఆ రోజే నిర్ణయిస్తారు. అంతే తప్ప భక్తులు సమర్పించుకున్న శ్రీవారి ఆభరణాలను నేరుగా విక్రయించే సాంప్రదాయం లేదు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*329 వ రోజు*

. . కర్ణుడు పాండవులను జయించగలడు అని పొగిడే సుయోధనుడు ఇది చూసి ఎంత బాధ పడ్డాడో కదా ! అయినా సంజయా ! నాగులకు, దేవతకూ కూడా భయపడని భీమునికి కర్ణుడు ఒక లెక్కా! జరాసంధుని చంపిన భీమసేనుడిని పసి వారైన దుర్జయుడు, దుర్ముఖుడు ఎందుకు ఎదుర్కొన్నారు. భీముడేమి సాత్యకి తక్కువ వాడా! సుయోధనుడు సాత్యకిని మాత్రం ఎదుర్కొనగలడా ! మన వాళ్ళకు ఓటమి తప్పదని అనిపిస్తుంది " అని బాధపడ్డాడు. అది విన్న సంజయుడు " మహారాజా ! కావాలని విషం త్రాగి శరీరం బాధ పడుతుంది శోకించి ప్రయోజనం లేదు. మారు మాటాడక మిగిలిన విశేషాలు వినండి " అన్నాడు. " కర్ణుడు ఓడి పోవడం చూసిన నీ కుమారులు దుర్మర్షణుడు, దుర్మదుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు, ఒక్కుమ్మడిగా భీముని చుట్టుముట్టారు. వారి అండ చూసుకుని కర్ణుడు కూడా శరప్రయోగం చేయసాగాడు. భీముడు విజృంభించి నీ కుమారుల రథములు విరిచి వారిని తన శరములతో యమసదనానికి పంపాడు. అది చూసి కర్ణుడు భీమునిపై డబ్బై ఐదు బాణములు వేసాడు. భీముడు విజృంభించి నూట ఐదు బాణములను కర్ణుని శరీరంలో గుచ్చి కర్ణుని సారథిని చంపి, విల్లు విరిచాడు. కర్ణుడు భీమసేనుడిపై గదను విసిరాడు. భీముడు ఆ గదను ముక్కలు చేసాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమసేనుని కవచమును భేదించాడు. భీమసేనుడు కూడా కర్ణుని కవచమును కొట్టాడు. కర్ణుడు నేలపై నిలబడి యుద్ధం చేయడం చూసిన సుయోధనుడు తన సోదరులైన చిత్రుడు, విచిత్రుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు మొదలైన వారిని భీమసేనుడి పైకి పంపాడు. భీమసేనుడు వారి రథుములను అన్నింటినీ విరిచి, సారధులను చంపి వాడి అయిన బాణములతో నీ ఏడుగురు కుమారుల తలలను నరికాడు. ఈ వ్యవధిలో కర్ణుడు మరొక రథం ఎక్కి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరికి ఒకరు తీసి పోకుండా పోరుతున్నారు. ఇంతలో నీ కుమారులైన శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు మొదలైన వారు కర్ణుడికి రక్షణగా వచ్చి భీమసేనుడిని ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి భీముడి మీద శరవర్షం కురిపించారు. భీముడు పట్టరాని కోపంతో వారందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో యమసదనానికి పంపి విజయోత్సాహంతో సింహనాదం చేసాడు. భీముని చేతిలో తన తమ్ములు మరణించడం చూసి సుయోధనుడు ఎంతో బాధ పడ్డాడు " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు దుఃఖంతో " సంజయా ! ఆ నాడు జూదం జరుగుతున్నప్పుడు విదురుడు చెప్పిన మాటలు నిజమౌతున్నాయి. సుయోధనుడి కుయుక్తి కారణంగా నా కుమారుల దుర్మరణం గురించి వినవలసిన దుస్థితి దాపురించింది. శోకించడం తప్ప నాకు మిగిలినదేమిటి ఎవరిని అనుకుని ఏమి ప్రయోజనం " అన్నాడు.


*కర్ణుడు భీముని ఎదుర్కొనుట*

భీముడి సింహనాదం విన్న కర్ణుడు కోపంతో ఊగిపోయి తిరిగి భీమసేనుడి మీదకు విజృంభించాడు. కౌరవసేనలు భీమసేనుడిని కమ్ముకున్నాయి. భీమసేనుడు వారందరితో యుద్ధం చేస్తూ వారి రధములు విరుస్తూ, కేతనములను విరిచి, రధసారధులను రధాశ్వములను చంపుతూ, కౌరవసేనలను తెగనరకసాగాడు. వారి నెత్తురు కాలువలుగా ప్రవహిస్తుంది. చావగా మిగిలిన కౌరవ సేన భీముని ఎదుట పడకుండా తప్పించుకుంటున్నారు. భీముడికి కౌరవసైన్యంలో ఎదురులేక పోయింది. కర్ణుడు మాత్రమే ఎదురుగా ఉన్నాడు. కర్ణుని నుదిటి మీద వరుసగా బాణములు నాటాడు. కర్ణుడు తిరిగి భీముని మీద నూరు బాణములు ప్రయోగించాడు. భీముడు కోపించి కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమసేనుడి మీద శర పరంపర గుప్పిస్తున్నాడు. కర్ణుడు భీముని కేతనమును పడగొట్టి, విల్లు విరిచి, సారధిని కొట్టాడు. భీముడు కర్ణుని మీద శక్తి బాణము వేసాడు. కర్ణుడు తొమ్మిది బాణములు వేసి శక్తి ఆయుధమును త్రుంచాడు. భీముడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు భీముని డాలును విరుగకొట్టాడు. భీముడు తన కత్తితో కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు వేరే విల్లు తీసుకునే లోపు భీముడు కర్ణుడి రధము మీదకు లంఘించాడు. కర్ణుడు భయపడి తన రధము వెనుక దాక్కున్నాడు. భీముడు నలు దిక్కుల చూసి కర్ణుడు కానరాక రధము కిందకు చూసాడు. ఆ సమయంలో కర్ణుడు భీముని మీద బాణప్రయోగం చేసాడు. ఆ బాణముల ధాటికి ఆగలేని భీముడు పక్కన పడి ఉన్న శవముల గుట్టలో దూరాడు. భీముని దైన్య స్థితి చూసి కర్ణుడు అతడి మీద విల్లు పెట్టి విలాసంగా నిలబడి " ఓరి భీమసేనా! తిండిపోతా ! నీకు యుద్ధము ఎందుకురా కడుపు నిండా మింగి ఒక పక్క కూర్చొనకుండా నీకు యుద్ధమెందుకురా ! అడవిలో మృగముల మాదిరి ఆకులలములు, పచ్చి మాంసము తిన్న మీకు యుద్ధమెందుకు ఈ మిడిసి పాటు ఎందుకు అయినా నీ శక్తి తెలుసుకుని నీకు తగిన వాడితో యుద్ధం చెయ్యి కాని నాతో పెట్టుకోకు. కృష్ణార్జునుల వద్దకు వెళ్ళి తల దాచుకో పో " అని భీముని నిందించాడు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝   *సమ్పూర్ణ కుమ్భో నకరోతి శబ్దం*

          *అర్ధోఘటో ఘోషముపైతి  నూనమ్l*

          *విద్వాన్ కులీనో న కరోతి గర్వం*

          *మూఢాస్తు జల్పన్తి గుణైర్విహీనాఃll*


*తా𝕝𝕝నిండుగా నున్న కుండ తొణకదు.... దాని నుండి శబ్దం కల్గించలేము.. సగం నిండిన కుండ కుదురుగా ఉండదు....శబ్దం కలగజేస్తుంది....అట్లే ఉన్నతవిలువలు కల్గిన వంశంలో జన్మించిన విద్యావంతుడికి అహంకారం ఉండదు.... కేవలం గుణహీనులైన మూఢులు మాత్రమే మూర్ఖంగా ప్రవర్తింతురు..... నోటికిష్టం వచ్చినట్లు వాగెదరు*.....

                     

 ✍️🌹💐🪷🙏