17, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *17.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.17 (పదిహేడవ శ్లోకము)*


*ఐరావతం గజేంద్రాణాం యాదసాం వరుణం ప్రభుమ్|*


*తపతాం ద్యుమతాం సూర్యం మనుష్యాణాం చ భూపతిమ్॥12827॥*


*16.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ఉచ్చైఃశ్రవాస్తురంగాణాం ధాతూనామస్మి కాంచనమ్|*


*యమః సంయమతాం చాహం సర్పాణామస్మి వాసుకిః॥12828॥*


*16.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*నాగేంద్రాణామనంతోఽహం మృగేంద్రః శృంగిదంష్ట్రిణామ్|*


*ఆశ్రమాణామహం తుర్యో వర్ణానాం ప్రథమోఽనఘ॥12829॥*


నేను గజరాజులలో ఐరావతమును. జలచరములకు ప్రభుడైన వరుణుడను. తపింపజేయువాడు, ప్రకాశమును ఇచ్చువాడు ఐన సూర్యుడను నేను. మానవులలో మహారాజును. అశ్వములలో ఉచ్చైశ్రవమును, ధాతువులలో బంగారమును, శాసించువారిలో యముడను, సర్పములలో వాసుకిని. నాగేంద్రులలో అనంతుడను, ఆదిశేషుడను. కొమ్ములు, కోఱలుగల ప్రాణులలో మృగరాజైన సింహమును, చతురాశ్రములలో నేను సన్న్యాసాశ్రమమును. నాలుగు వర్ణములవారిలో బ్రాహ్మణుడను నేనే.


*16.20 (ఇరువదియవ శ్లోకము)*


*తీర్థానాం స్రోతసాం గంగా సముద్రః సరసామహమ్|*


*ఆయుధానాం ధనురహం త్రిపురఘ్నో ధనుష్మతామ్॥12830॥*


*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ధిష్ణ్యానామస్మ్యహం మేరుర్గహనానాం హిమాలయః|*


*వనస్పతీనామశ్వత్థ ఓషధీనామహం యవః॥12831॥*


*16.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*పురోధసాం వసిష్ఠోఽహం బ్రహ్మిష్ఠానాం బృహస్పతిః|*


*స్కందోఽహం సర్వసేనాన్యామగ్రణ్యాం భగవానజః ॥12832॥*


*16.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోఽహం వ్రతానామవిహింసనమ్|*


*వాయ్వగ్న్యర్కాంబువాగాత్మా శుచీనామప్యహం శుచిః॥12833॥*


పవిత్ర నదులలో గంగానదిని, జలాశయములలో సముద్రమును, ఆయుధములలో ధనుస్సును, ధనుర్ధారులలో త్రిపురారియైన శంకరుడను, నివాసస్థానములలో మేరు పర్వతమును, దుర్గమప్రదేశములలో హిమాలయమును, వనస్పతులలో రావిచెట్టును (అశ్వత్థవృక్షమును). ధాన్యములలో యవధాన్యమును, పురోహితులలో వసిష్ఠుడను. వేదవేత్తలలో బృహస్పతిని. సేనాధిపతులలో కుమారస్వామిని, సన్మార్గప్రవర్తకులలో బ్రహ్మదేవుడను, పంచమహాయజ్ఞములలో బ్రహ్మయజ్ఞమును (స్వాధ్యాయ యజ్ఞమును), వ్రతములలో అహింసావ్రతమును, శుద్ధమొనర్చు పదార్థములలో నిత్య శుద్ధములైన వాయువు, అగ్ని, సూర్యుడు, జలము, వాక్కు, ఆత్మను నేనే.


*16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యోగానామాత్మసంరోధో మంత్రోఽస్మి విజిగీషతామ్|*


*ఆన్వీక్షికీ కౌశలానాం వికల్పః ఖ్యాతివాదినామ్॥12834॥*


*16.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*స్త్రీణాం తు శతరూపాహం పుంసాం స్వాయంభువో మనుః|*


*నారాయణో మునీనాం చ కుమారో బ్రహ్మచారిణామ్॥12834॥*


యోగములలో మనస్సును నిరోధింపగల సమాధియోగమును నేను. శత్రువులను జయింపగోరువారి గోప్యయంత్రాంగమును (వ్యూహరచనను) నేను. ఆత్మానాత్మవివేక చర్చయందు నేను బ్రహ్మవిద్యను. పరస్పరవాద వివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు వాదమును నేను. పురుషులలో స్వాయంభువ మనువును, స్త్రీలలో ఆయన భార్యయైన శతరూపను నేను. మునులలో నారాయణమహర్షిని, బ్రహ్మచారులలో (జితేంద్రియులలో) సనత్కుమారుడను నేను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం

 *17.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.17 (పదిహేడవ శ్లోకము)*


*ఐరావతం గజేంద్రాణాం యాదసాం వరుణం ప్రభుమ్|*


*తపతాం ద్యుమతాం సూర్యం మనుష్యాణాం చ భూపతిమ్॥12827॥*


*16.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ఉచ్చైఃశ్రవాస్తురంగాణాం ధాతూనామస్మి కాంచనమ్|*


*యమః సంయమతాం చాహం సర్పాణామస్మి వాసుకిః॥12828॥*


*16.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*నాగేంద్రాణామనంతోఽహం మృగేంద్రః శృంగిదంష్ట్రిణామ్|*


*ఆశ్రమాణామహం తుర్యో వర్ణానాం ప్రథమోఽనఘ॥12829॥*


నేను గజరాజులలో ఐరావతమును. జలచరములకు ప్రభుడైన వరుణుడను. తపింపజేయువాడు, ప్రకాశమును ఇచ్చువాడు ఐన సూర్యుడను నేను. మానవులలో మహారాజును. అశ్వములలో ఉచ్చైశ్రవమును, ధాతువులలో బంగారమును, శాసించువారిలో యముడను, సర్పములలో వాసుకిని. నాగేంద్రులలో అనంతుడను, ఆదిశేషుడను. కొమ్ములు, కోఱలుగల ప్రాణులలో మృగరాజైన సింహమును, చతురాశ్రములలో నేను సన్న్యాసాశ్రమమును. నాలుగు వర్ణములవారిలో బ్రాహ్మణుడను నేనే.


*16.20 (ఇరువదియవ శ్లోకము)*


*తీర్థానాం స్రోతసాం గంగా సముద్రః సరసామహమ్|*


*ఆయుధానాం ధనురహం త్రిపురఘ్నో ధనుష్మతామ్॥12830॥*


*16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ధిష్ణ్యానామస్మ్యహం మేరుర్గహనానాం హిమాలయః|*


*వనస్పతీనామశ్వత్థ ఓషధీనామహం యవః॥12831॥*


*16.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*పురోధసాం వసిష్ఠోఽహం బ్రహ్మిష్ఠానాం బృహస్పతిః|*


*స్కందోఽహం సర్వసేనాన్యామగ్రణ్యాం భగవానజః ॥12832॥*


*16.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోఽహం వ్రతానామవిహింసనమ్|*


*వాయ్వగ్న్యర్కాంబువాగాత్మా శుచీనామప్యహం శుచిః॥12833॥*


పవిత్ర నదులలో గంగానదిని, జలాశయములలో సముద్రమును, ఆయుధములలో ధనుస్సును, ధనుర్ధారులలో త్రిపురారియైన శంకరుడను, నివాసస్థానములలో మేరు పర్వతమును, దుర్గమప్రదేశములలో హిమాలయమును, వనస్పతులలో రావిచెట్టును (అశ్వత్థవృక్షమును). ధాన్యములలో యవధాన్యమును, పురోహితులలో వసిష్ఠుడను. వేదవేత్తలలో బృహస్పతిని. సేనాధిపతులలో కుమారస్వామిని, సన్మార్గప్రవర్తకులలో బ్రహ్మదేవుడను, పంచమహాయజ్ఞములలో బ్రహ్మయజ్ఞమును (స్వాధ్యాయ యజ్ఞమును), వ్రతములలో అహింసావ్రతమును, శుద్ధమొనర్చు పదార్థములలో నిత్య శుద్ధములైన వాయువు, అగ్ని, సూర్యుడు, జలము, వాక్కు, ఆత్మను నేనే.


*16.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యోగానామాత్మసంరోధో మంత్రోఽస్మి విజిగీషతామ్|*


*ఆన్వీక్షికీ కౌశలానాం వికల్పః ఖ్యాతివాదినామ్॥12834॥*


*16.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*స్త్రీణాం తు శతరూపాహం పుంసాం స్వాయంభువో మనుః|*


*నారాయణో మునీనాం చ కుమారో బ్రహ్మచారిణామ్॥12834॥*


యోగములలో మనస్సును నిరోధింపగల సమాధియోగమును నేను. శత్రువులను జయింపగోరువారి గోప్యయంత్రాంగమును (వ్యూహరచనను) నేను. ఆత్మానాత్మవివేక చర్చయందు నేను బ్రహ్మవిద్యను. పరస్పరవాద వివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు వాదమును నేను. పురుషులలో స్వాయంభువ మనువును, స్త్రీలలో ఆయన భార్యయైన శతరూపను నేను. మునులలో నారాయణమహర్షిని, బ్రహ్మచారులలో (జితేంద్రియులలో) సనత్కుమారుడను నేను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

మృత్యుదారుకుఠారికా

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

              🌷🌷🌷

*మృత్యుదారుకుఠారికా- శ్రీమాత*

              🌷🌷🌷

ఆశ్వయిజ మాసమంటేనే… శాక్తేయంగా ఉంటుంది జనజీవితం! బతుకమ్మ సంబరాలు, సద్దులు, దసరా నవరాత్రుల సంరంభాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు, నవావరణార్చనలు, శ్రీవిద్యోపాసన, సంగీతకచేరీలు, నాట్యప్రదర్శనలు… ఏంటో గాలిలో ఒకలాంటి ఉత్సాహపు, ఉత్సవపు ఎనర్జీ అణువణువునా ప్రసరిస్తూ…. బద్దకంగా పక్కమీద దొర్లుతున్న పిల్లవాడి… దుప్పటిలాగి, నిద్రలేపే తల్లిలా… ఆ అమ్మవారు కూడా.. మన సుషుప్తినుండి జాగృతం చేస్తున్నట్టే ఉంటుంది! అలాంటి ఆశ్వయుజ శుద్ధ అష్టమినాడు…బ్రాహ్మీ ముహూర్తానే పరిమళ ఇంటి తలుపులు … దబదబా బాదింది అమ్మవారు… వాళ్ళ పక్కింటి బాలా త్రిపుర సుందరి రూపంలో! 


తాలారా స్నానం చేసిన కురులు …జారుముడి వేసి, ఎర్రని మడిపట్టుచీర, పచ్చని మోము ఛాయను మరింత ఇనుమడింప చేస్తూ… పసుపు పూసిన మోముమీద.. మెరిసే అరుణోదయపు బొట్టు… మిగిలిన మంగళ చిహ్నాలతో…. కళ్ళెదురుగా… పరదేవతలా నిలబడ్డ ఆ పిల్లను చూసి.. పరిమళకు ఒక్క క్షణం..అయోమయం, మైకం కమ్ముకున్నట్టు అయిపోయింది! 


“ పరిమళ పిన్నీ! మీతో పెద్ద పని పడింది ! అందరూ దగా చేసేసారు. వంటావిడ రాత్రి వాట్సప్ మెసేజ్ పెట్టిందిట! నేను చూడలేదు! ఏదో సూతకం వచ్చి.. రాలేదట! మా అమ్మ, చెల్లి రావడం లేదు. మా ఆడపడుచులు పదకొండింటికి కానీ రాలేరట. ఈరోజు ఇంత పూజ పెట్టుకున్నా! చంటిపిల్ల చంక దిగడం లేదు. డెభ్భై మందికి పైగా వస్తారు. భోజనాలని చెప్పేసా! ఇక బ్రహ్మగారు, శిష్యులు వచ్చి… శ్రీచక్ర రచన మొదలుపెడతారు. వాళ్ళకు అన్నీ అందించాలి. అమ్మవారికి అలంకరణ చెయ్యాలి. ఆ పారాయణ భక్తబృందం వారే ఏభైమంది వస్తున్నారు. మీరు మడి కట్టుకోక తప్పదు పిన్నీ! ఏదో ఒకటి మీకు తోచింది… ఓ రెండు, మూడు ప్రసాదాలు చేసి, పుణ్యం కట్టుకోండి. బయట కేటరింగ్ తిండి ఎవరూ తినరట. ప్లీజ్ పిన్నీ ప్లీజ్! “…మడిలో ఉండడంతో… చేతులు పట్టుకోలేదు … కానీ… కళ్ళు నిండుకుండ లయిపోయాయి సుందరికి! 


      “ సరే!”…. అందో , లేదో కూడా తెలియదు… ఈ లోపునే … పెద్ద పెద్ద పేకేజ్ పెట్లతో… సామానూ, కూరలూ… తోసుకుంటూ గుమ్మంలో పెట్టేసాడు , సుందరీ వాళ్ళాయన విజయకుమార్! వెళ్ళిపోతూ… సుందరి..” పిన్నీ! మడిగా చెయ్యాలి, మర్చిపోకండే!”… అని చెప్పి… పరిగెట్టుకు పోయింది. ఆ సంభారాలు చూసేసరికి.. ఏభైఐదేళ్ళ పరిమళకు ఏమీ పాలుపోలేదు. అసలు గత పదిరోజులుగా ఆమెకు ఆరోగ్యం బాలేదు. కుడిచెయ్యి… మొదళ్ళ నుండి పీకేస్తోంది! పిల్లలు ఇద్దరూ…అమెరికాలో స్థిరపడిపోవడంతో… ఇంట్లో ఆయనకు, తనకు గుజ్జనగూళ్ళ వంటలే! ఏదో నెలకో రెండుసార్లు… కాస్త భారీగా ఒకటి, రెండు ఐటెమ్స్ చేసుకుని… వృద్ధాశ్రమానికో, పిల్లల హోమ్ కో వెళ్ళడం తప్పా… ఇంత బృహద్ పాకశాస్త్ర ప్రావీణ్యం … తనకు ఇసుమింత కూడా లేదు! దిగులుగా… ఆ వంటపాత్రల కేసి చూస్తూ… చేష్టలుడిగి కూర్చుంది పరిమళ! 


     సుందరీ వాళ్ళు, పరిమళ వాళ్ళ పక్క ఫ్లాటు కొనుక్కుని, దిగినప్పటి నుండి ఎప్పుడూ ఏదో ఒక హడావిడే! విపరీతమైన దైవభక్తో, లేక నిష్టాగరిష్ట సాంప్రదాయ కుటుంబ నేపధ్యమో లేక… జీవితపు తొలిదశల్లోనే అందలాలు అందిపుచ్చుకున్న దర్పమో…కారణం తెలీదు కానీ…ఆ ఇంట ఎప్పుడూ ఉత్సవ వాతావరణం ఉండవలసిందే! ఏడాదిలో పన్నెండు నెలలూ…శుభతిధులే ఆ భార్యాభర్తలకు…హోమాలు, యజ్ఞాలూ, పూజలూ, వ్రతాలూ, పారాయణలు, అభిషేకాలంటూ….ఏదో ఒక కార్యక్రమం తలపెట్టి, బంధుమిత్రులను అందరినీ.. వాటిల్లో భాగస్థులను చెయ్యడం భలే వేడుక! ఇంతా చేసి…సుందరికి ముప్ఫైయేళ్ళు, విజయకుమార్ కు ముప్ఫై ఐదు! వాళ్ళకు రెండేళ్ళ పిల్ల ఆద్య! 


             ఒక దశాబ్దకాలం అమెరికాలో ఉండి, రెండేళ్ళ క్రితమే వచ్చేసారు ఇండియా. అతను పెట్టిన సాఫ్ట్ వేర్ కంపెనీ… అనతికాలంలోనే…అఖండ విజయం సాధించడం…అంతా దైవకృపే అని నమ్మే…భక్తిపరులు! ఏ గడ్డ మీదున్నా సనాతనధర్మమే…మూలమంత్రం వాళ్ళకు! బాల్యం నుండీ మహానగరాల్లోనే ఉన్న పరిమళకు వయసుంది కానీ, పెద్దగా… పద్ధతులు, పూజాపునస్కారాలు తక్కువే అని చెప్పాలి. ఆవిడకు ఇల్లంతా కళాత్మకంగా పెట్టుకోవడం, బాల్కనీల్లో హరితవనాలూ, బోన్సాయి మొక్కలూ, స్నేహితులతో కిట్టీపార్టీలు, కళాఖండాల సేకరణ…హిందూస్థానీ సంగీతం… ఇవే రుచులూ-అభిరుచులూ! 


         అలాంటి ఆవిడ సీదాసాదా జీవితంలోకి ఝుంఝూమారుతంలా “ పిన్నీ”…అంటూ.. చొచ్చుకొచ్చింది ఈ సుందరి. పరిమళ చేత శ్రావణశుక్రవారాలు… వరలక్ష్మిని నిలబెట్టించింది! పాలవెల్లిలు కట్టించింది, కార్తీకమాసం శివాలయాలు తిప్పించింది, క్షీరాబ్ది ద్వాదశిని ఉసిరి, తులసికి …దీపాలు పెట్టించింది… ఆఖరికి తిరుపతి యాత్ర కూడా చేయించింది. మొదట్లో…సుందరి సాగదీసుకునే మాటలు, చాదస్తపు ఆచారాలూ… పరిమళకు కాస్త చిరాగ్గా అనిపించేవి. అయితే సుందరిలోని నిష్కల్మషమైన ప్రేమ, ఆత్మీయత… ఆమెను కట్టి పడేసాయి. సుందరి.. పరిమళకు , ఆమె ఆచార లేమిని ప్రశ్నించదు. జడ్జ్ చెయ్యదు. “సరదాగా చెయ్యి పిన్నీ!”…. అంటూ మెల్లగా ఆధ్యాత్మిక బాట పట్టిస్తుంది. అంతే! . దానికి పరిమళకు ఏ ఆక్షేపణలూ లేవు. ఆమె నాస్తికురాలయితే కాదు కదా! తన శక్తికి, ఆసక్తికి మించి.. ఆమె ఎలాగూ చెయ్యదు! 


              ఇంతలో…ఈ హడావిడికి లేచిన పరిమళ భర్త…చుట్టూ కూరగాయల బుట్టలు పెట్టుకుని శాకాంబరీదేవిలా కూర్చున్న భార్య నుండి , పరిస్థితి గ్రహించి…” చూడు పరిమీ! బెంగపడిపోకు! నేనూ ఓ చెయ్యి వేస్తా! చేసేద్దాం. ఆ పిల్ల పెద్ద కార్యక్రమం పెట్టుకుంది. మన గౌతమికే ఆ అవసరం వస్తే… మనం సాయం చెయ్యమా? లే! నాకు తెలుసులే! మడిగా ఎలా చెయ్యాలో! “.।.. అంటూ భార్యకు ధైర్యం చెప్పీ, లేవదీసారు! వాచ్ మేన్ భార్యకు …కాల్ చేసి.. వంటిళ్ళు , స్టవ్ లూ కడగడానికి పిలిచారు! భర్త కళ్ళలో కొత్త ఉత్సాహం, హుషారూ..ఆమెకు కొత్తకాదు. పెద్ద ఉమ్మడికుటుంబంలో… సాంప్రదాయాలూ, కుటుంబ అనుబంధాల మధ్య పెరిగాడాయన! గోదావరి రుచులూ, మర్యాదలూ అంటూ పాకులాడే కుటుంబం ఆయనది. పరిమళ కుటుంబ నేపధ్యం పూర్తిగా విభిన్నం! చదువులు, కొలువుల మధ్య..ఢిల్లీలో డిఫెన్స్ వాతావరణంలో పెరిగిన నేపధ్యం పరిమళది! అయినా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు ఏ లోటూ లేదు. ఇద్దరి కుటుంబాలనూ.. కలుపుకున్న కొత్త సంస్కారం ఇద్దరిలో! 


        తలారా స్నానం చేసి, తడీపొడిగా ఉన్న పట్టుచీర కట్టుకుని…వంటింటి బాల్కనీ తలుపు తెరవగానే…చల్లనిగాలి, కొత్తగా పూసిన పూల పరిమళాలను మోసుకొచ్చి…ఒంటికి తాకింది. చిన్నగా వణికింది పరిమళ. అంతలోనే సాంత్వనగా, ఆలంబనగా అనిపించింది. 


కేశవరావు గారు ఫోన్లో… అక్కగారిని లేపి..వంటలకు కొలతలు, పద్ధతులూ అడుగుతున్నారు! చకచకా మినప్పప్పు నానబెట్టేసింది! పులిహారకు బియ్యం ఎసర్లు పెట్టేసారు! అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకులతో… ఘనంగా జీడిపప్పు, పల్లీలు, పోపు దినుసులతో పులిహార పోవు చేసి, చింతపండు మగ్గులో ఉప్పు, పసుపు, బెల్లంతో మగ్గబెట్టి… ఆరబెట్టిన పులిహారలో కలిపేసారు! పైన దట్టంగా నూపొడి, మెంతిపొడి… వేసి… పైన ఓ నాలుగు నిమ్మ కాయలు పిండి…ఘాటుగా ఘుమఘుమల పులిహార కలిపేసారు! ఊరుతూ ఉండమ్మా… అరి అరిటాకు కప్పేసారు! పులుసులకు, కూరలకు, పచ్చళ్ళకూ పోపులు వేయించి పక్కన పెట్టారు , కొన్ని పొళ్ళు కొట్టారు! పెద్ద గుమ్మిడికాయ, ఆనపకాయలు, ములక్కాడలు, బెండ, తెల్లొంకాయ, చిలగడ దుంపలు , బచ్చలి కాడలు..పచ్చిమిరప వైనంగా ముక్కలు కోసి…. పెద్ద డెగిసాలో…చింతపండురసం, ముప్పావు కేజీ బెల్లం, ఉప్పు, పసుపు , ఇంగువలతో … పదునుగా ఉడికించి, బియ్యంపిండి, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపతో కొట్టిన పిండినీటితో చిక్కబరచి…పోపులు వేసి…పొర్లించారు! నాలుగు పక్షాలుగా కోసిన పదిహేను కేజీల లేతొంకాయల్లో మెంతికారం కూరి… ఓ కేజీ నూనెలో ఆ పళంగా వేసేసి…. మగ్గమని చెప్పి… మూత పడేసారు! ఇరవై లీటర్ల చిక్కటి పాలతో…దోరగా నేతిలో వేపిన పెసరపప్పు, ఎండుకొబ్బరి, విరివిగా వాడిన డ్రైఫ్రూట్స్ తో… ఏలకులు, పచ్చకర్పూరపు ఘుమఘుమలతో…పాతబియ్యంతో….కొత్తబెల్లంతో..చక్కెరపొంగలి ఘమఘమలాడి పోయింది! 


           కట్టర్ తో ఒకేలాగ ముక్కలు కొట్టేసి… దోసావకాయ ఆవఘాటుతో… ఎర్రగా నూనె, ఊటతో…ఊరిస్తూ… గిన్నెకెక్కింది. ఇరవై కొబ్బరి చిప్పలకు, ఆరు పుల్లమామిడి చేర్చి… మంచి ఇంగువ, మినప్పుప్పు పోపుతో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి… పచ్చబంగారంలా మెరిసిపోతోంది. ఎలాగూ గారెలు చేస్తున్నాం కనుకా… ఎర్రగా అల్లప్పచ్చడి కనిపించకపోతే… అమ్మవారు చిన్నబుచ్చుకుంటారని… కేశవరావు గారు…. ఓ కేజీ అల్లం బాగుచేసి… ధారాళంగా పులుపు బెల్లం పోపులతో అల్లప్చచ్చడి గ్రైండర్ లో బరబరలాడించి… కొబ్బరి పచ్చడి పక్కన కూర్చోపెడితే… పసుపుకుంకాల్లా… కలకలలాడిపోయాయి! తలో మూడేసి కేజీల బియ్యం కుక్కర్లు ఎక్కించి… పులగం, దధ్యోజనాలు కలిపారు. పక్కవీధిలోంచి పెరుగు బకెట్లు తెప్పించి…బరకపిండి, కాటుకలా రుబ్బిన పిండిలు కలిపి… మినపగారెలు వేసి… ఆవపెట్టి, పోపేసిన పెరుగులో… పీల్చుకుని పొంగిపోండి… అంటూ… ఇంత సన్నటి కొత్తిమీర, అల్లం, మిర్చి చల్లి….కుదురుగా… ఆకులు మూసారు. 


        ఆ వంటలు చెయ్యడం… ఏదో ఒక క్రతువులా ఉంది ఆ నడివయసు జంటకు. అలసట, ఆయాసం, ఒంట్లో కూర్చున్న రోగాలను ఎప్పుడో మర్చిపోయారు. ఏదో యజ్ఞం చేస్తున్నట్టు శ్రద్ధగా, భక్తితో… ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చేస్తున్నారు ఇద్దరూ! చిన్నసైజు బంతులంత బూరెలు వేసారు. కందాబచ్చలి కూర చేసారు. పిల్లల కోసం చప్పగారెలు, బజ్జీలూ వేసారు! కమ్మని పెరుగు సిద్ధం చేసారు! అమ్మవారు తాంబూల పూరిత ముఖి…కనుక తాంబూలాలు లేకపోతే ఎలాగా… అంటూ… వెండిపళ్ళెంలో… ఆకులూ, వక్కలూ, సున్నంతో పాటూ… భాషా కొట్లోంచి వంద మిఠాయి కిళ్ళీలు పురమాయించారు. పదకొండున్నరకల్లా….. వంటలన్నీ… తమ విశాలమయిన భోజనాల బల్ల ఎక్కించేసారు పరిమళా, కేశవరావుగారూ! 


        సుందరి పరిస్థితి ఎంత వ్యస్థత లేకుండా ఉందంటే…. పాపం వచ్చి పడుతున్న గుంపుల గుంపుల ఆహ్వానితులు, అనాహ్వానితులు, శ్రీవిద్యా భక్తబృందం వారూ.. ఓ పక్క… మరోపక్క… అమ్మా మీరు ఇరువురూ…పీటల మీద కూర్చోవాలి… అంటూ తొందర పెడుతున్న పురోహితులూ, వారి శిష్యులూ, మధ్యలో అవీ ఇవీ అందించడం…అష్టభుజాంకితలా… పనిచేస్తూ… ఆపసోపాలు పడుతోంది. ప్రసాదాలు… పరిమళకు అప్పగించి… అటుపక్కకు కూడా చూడలేనంత హడావిడి! ఇక్కడ పరిమళ ఎంత అలిసిపోయిందంటే… కనీసం చీర కూడా మార్చుకోలేనంత! అలాగే వెళ్ళి… అమ్మవారి దర్శనం, ఆ నవావరణ అలంకరణలు, దీపాలూ చూద్దామని బయలుదేరబోయింది. ఇంతలో విజయకుమార్ ఫోను! “ అత్తయ్యగారూ! ఇక్కడ పిల్లలు తెగ ఏడుపులూ, అల్లరులూ! మీ ఇంట్లో ఆడుకుంటారు. కాస్త కనిపెట్టి ఉంటారు కదా!”…. అంటూ పెట్టేసాడు. ఉస్సురనిపించింది పరిమళకు! 


         తీసి ఉన్న తలుపుల్లోంచి… ఒక్కరు కాదు, ఇద్దరు కాదు పన్నెండు మంది పిల్లలు….ఒకరొకరుగా అడుగుపెట్టారు…నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, బెరుగ్గా, గెంతుకుంటూ, ఆడుకుంటూ… అనేక చేష్టలతో! చక్కని జరీల పట్టులంగాలు, కాళ్ళకు గజ్జెలు, నడుములకు వడ్డాణాలు, జడలకు కుచ్చెలు, సూర్యచెంద్రులు, పాపిటబొట్లు…మెడలో హారాలు, నుదుటన దోసగింజ మెరుపుబొట్లు…..అలా ఘల్లుఘల్లున కాళ్ళ అందియలు మోగిస్తూ… కలహంస నడకలతో… ఇల్లంతా సంచరిస్తున్న ఆ బాలాంబల్ని చూసేసరికి…. ఆ దంపతులిద్దరికీ వెర్రి పరవశం వచ్చేసింది. వాళ్ళతో పాటూ వచ్చిన ముగ్గురు పని అమ్మాయిలూ… అందంగా ముస్తాబయ్యి… కళ్ళకు చలవగా ఉన్నారు. ఎన్ని అమ్మవారి పేర్లో మారుమోగుతున్నాయి ఆ గుంపులో! ఆద్య, ఆర్ణ, అపర్ణ, సహస్ర, పద్మిని, పార్వతి, హౌరి, మృదుల, యోగిని, యోగిత, భారతి…. పరిమళకు అవే తనకు సంప్రాప్తించిన మంత్రబీజాక్షరాలా అనిపించింది. 


       ఇల్లంతా వారి ఇష్టారాజ్యమయింది. దేవుడి గదిలో పసుపు కుంకుమలు చల్లేసారు. అందరి నెత్తినా అక్షతలు పోసారు. మొక్కల కున్న పూలన్నీ కోసి తలల్లో దోపుకున్నారు! అద్దాల ముందు ముస్తాబులయ్యారు! గంధాలు పూసారు. ఓ ఇద్దరు వీరభద్రుడూ, పోతరాజూ కూడా ఉండి… అక్కలకు పాలకొలను ఆడడంలో సాయం చేస్తున్నారు. కేశవరావు గారికి… తమింట పెళ్ళిళ్ళలో చేసే కామేశ్వరీ వ్రతం గుర్తుకొచ్చింది…ఏడేడు అక్కల్లూ… ఏమి చేసారు… అంటూ పాడుతూ..! గబగబా లేచి…. మూడు పెట్లలో దాచిన బొమ్మలన్నీ తెచ్చి… అక్కడ పెట్టారు. పరిమళ ఆశ్చర్యపోయింది ఆయన చేష్టకు. అవన్నీ తమ దేశవిదేశ పర్యటనల్లో కొనుక్కున్న అపురూపమైన బొమ్మలు! కూతురు గౌతమి చేత బొమ్మలకొలువు పెట్టించాలనే కోరిక తీరకుండానే… ఆ అమ్మాయి అండర్ గ్రాడ్ కే అమెరికా వెళ్ళిపోవడం, చివరకు ఒక అమెరికన్ ను పెళ్ళి చేసుకుని అక్కడే స్థిరపడిపోవడంతో… ఆ కోరిక అసంపూర్ణంగా ఉండిపోయింది. 


       సాఫ్ట్ టాయిస్ చంటిపిల్లల కిచ్చి… పెద్దపిల్లలంతా…. మహదానందంగా… ఒక బొమ్మల కొలువు పెట్టారు. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీకి ఆశ్చర్యపోయింది పరిమళ! అందమైన పూలకుండీలు, ఫ్లవర్ పాట్స్ ను అటూఇటూ పెట్టి… ఇంట్లో ఉన్న టీపాయిలన్నీ లాగి… మెట్లగా బొమ్మలమర్చారు. దీపాలు వెలిగించారు! రకరకాల పాటలు పాడారు. సారంగధరియా పాటకు నాట్యం చేసారు. వీళ్ళ హడావిడిలో… సుందరి ఇంట్లో పూజా, సామూహిక పారాయణం సంగతే మర్చిపోయారు వీళ్ళు! 


        ఇంతలో …. ఎవరో … కేటరర్ ఫోన్ చేసారు. ఎక్కడో అమ్మవారి గుడిలో సంతర్పణ కోసం వంటలున్నాయని, పంపించగలనని! పరిమళకు చివుక్కుమనిపించింది. అక్కడ వారికి పూర్తిగా సరిపడకుండా… ఇలా పక్కదారిన పంపిస్తాననడం! వంటలు సిద్ధం అయిపోయాయని… అవసరం అయితే చేస్తామని , చెప్పి పెట్టేసింది. వేడిగా అన్నం కుక్కర్లు ఎక్కించేసారు ఈ లోపల! 


      ఇంతలో ఎవరో పారాయణ బృందంలో ఒకామెకు… అమ్మవారు ఒంటిమీదకు వచ్చారట! కొబ్బరినీళ్ళు కావాలని…. పరిమళ ఫ్లాటు తలుపు కొట్టారు కొందరు ఆడవాళ్ళు! ఫ్రిజ్ లోంచి… కొబ్బరినీళ్ళ పాక్ లు తీసి ఇచ్చింది. సుందరి ఇంట్లోంచి… పెద్దపెద్ద గొంతుకులతో… “ అమ్మా! తల్లీ! శాంతించు!” అంటూ… అయిగిరి నందిని నందిత మేధిని”…. అంటూ చదువుతున్నారు అంతా! అది విని చిన్నగా నిట్టూర్చింది పరిమళ. తను పెరుగు తీసుకోడానికి తమ తలుపు తెరిచినపుడు… బృందంలో నాయకురాలు ఒక పెద్దామె… మిగిలిన వారితో… “ ఈరోజు రుక్మిణి వంతు!”…. అనడం గుర్తొచ్చింది. బుర్రలో ఎక్కువ సందేహాలకు తావులేకుండా…. పిల్లలు ఆకళ్ళని మొదలు పెట్టారు. పనిపిల్లలు చిన్నపిల్లలకు వెంట తెచ్చిన డబ్బాల్లోంచి తినిపిస్తున్నారు! పిల్లలు డైనింగ్ పూమ్ లోకి వెళ్ళ కుండా తలుపుల వేయాల్సి వచ్చినందుకు బాధగా ఉంది ఆ దంపతులకు! సుందరి ఇంట్లో… పూజ ఆలస్యం అయిపోతోంది. ఒంటి గంటయింది. ఇంకా మహానైవేధ్యానికి పిలుపు రాలేదు. కేశవరావుగారు… ఇంక లాభం లేదని సుందరీ వాళ్ళింటికి వెళ్ళారు. మూడువేల చదరపు అడుగుల ఇళ్ళు అవన్నీ! ఎక్కడా సూదిమొన ఆన్చడానికి లేనట్టు… అన్ని గదులు క్రిక్కిరిసిపోయాయి! గొప్ప లయబద్ధంగా అమ్మవారి స్థోత్రాలు, వేదమంత్రాలూ ధ్వనిస్తున్నాయి! చాలా తర్జనభర్జనల తరువాత… పూజ మధ్యలో మహానైవేధ్యం పెట్టేట్టు నిర్ణయం జరిగింది! 


            పిల్లలంతా … వరసగా కూర్చుని… అరిటాకుల్లో వడ్డన చేస్తుంటే… ఆవురావురమని… అధరువులన్నీ మెచ్చుకుంటూ… భోంచేసారు. కిళ్ళీలు వేసుకున్నారు. అందర్నీ కుర్చీల్లో కూర్చోపెట్టి.. చక్కగా కాళ్ళకు పసుపులు రాసి, బొట్టు పెట్టి…మంచి గిఫ్ట్ బేగ్ లో… అప్పటికప్పుడు మనిషిని పంపి తెప్పించిన పట్టులంగాలు, అద్దాలగాజులూ, పెయింటింగ్ కిట్లు, బొట్లు, కాటుకా… పెట్టి.. చేతికిచ్చింది. అవి చూసి.. పిల్లల మొహాలూ, వాళ్ళ కోసం వచ్చున్న వాళ్ళ అమ్మల మొహాలూ వెలిగిపోయాయి! 


       ఇంతలో… సుందరి ఆడపడుచులు పరిగెట్టుకొచ్చారు. “ అత్తయ్యగారూ! వడ్డనలిక్కడే నండి. పంక్తి భోజనాలకు టైం చాలదు. బఫే పెట్టేద్దాం అంటూ…హడావిడి చేసారు. మరో పదినిమిషాల్లో… అతిధులంతా బిలబిలమంటూ… లోపలికి వచ్చేసి… పదార్ధాలన్నీ …. వడ్డింపించుకుని… ఇల్లంతా వ్యాపించి… భోజనాలు పూర్తి చేస్తున్నారు. పరిమళకు , కేశవరావుగారికీ ఎంతో తృప్తిగా ఉంది. కూతురు పెళ్ళి… అయినవాళ్ళ మధ్య, స్వదేశంలో ఎంతో ఘనంగా చెయ్యాలనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. సంబంధం కుదుర్చుకున్నారు. ఆఖరి నిమిషంలో… ఆ పెళ్ళి చేసుకోనని… అమెరికన్ డాక్టర్ కొలీగ్ ను పెళ్ళిచేసేసుకుని… తల్లితండ్రుల ఆశలన్నీ వమ్ము చేసింది గౌతమి! 


పరిమళ ఓ నిమిషం ఆలోచించింది. కూతురు పెళ్ళికోసం… పెట్టుబడుల కోసం తెప్పించిన ఉప్పాడచీరల కట్టలు .. బీరువాలోంచి తీసి బయట పెట్టింది. వచ్చిన వారందరికీ…ముత్తయుదువా, కాదా… అనే భేదం లేకుండా, బొట్టుపెట్టి… చీరలు చేతిలో పెట్టింది. అందరూ అమృతతుల్యమైన భోజనం, అతిథిమర్యాదతో సత్కరించారని పరమానంద భరితులై… తాంబూలం వేసుకుని, ఆశీర్వదించి సెలవు తీసుకున్నారు. పిల్లలంతా ముద్దులు పెట్టి, కౌగిలించుకుని, తమ బొమ్మల కొలువును మరోసారి వీక్షించుకుని ఇళ్ళ దారి పట్టారు! 


        సుందరి దంపతుల పూజలూ, హోమం, పూర్ణాహుతి అయ్యేటప్పటికి సాయంత్రం ఐదున్నర! అంత మందికి వండి, కడుపారా వడ్డించేసరికి పరిమళకు కడుపు నిండిపోయింది. కొబ్బరి నీరు తప్ప మారు ఆహారం లేదు. అప్పుడు పిలుపొచ్చింది ఆమెకు… అమ్మవారిని చూడడానికి!


సుందరి ఇంటి గుమ్మం దగ్గర నిలబడింది పరిమళ… భర్తతో పాటూ! చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచ… మందారకుసుమ ప్రియ… పద్మప్రియ, పద్మహస్త…పద్మిని… సరసిజనయని… అమ్మవారు… ఆ దీపకాంతిలో… హోమగుండపు ….అగ్నికీలలలో…ధగధ్ధగాయమానంగా … ప్రకాశిస్తోంది. కర్పూరచందనాగరుల సువాసనతో… ఆ దివ్యవరణంతా… నిండిపోయింది. పండితుల దీవెనలు తప్పా… వాతావరణమంతా… నిర్జనంగా, నిశ్చలంగా, నిరామయంగా తోచింది ఆమెకు. అంత దూరం నుండి… ఆ దయామృతసాగరి , మందస్మిత వదని…కరుణా కటాక్షాలు … తనపై అపారంగా కురుస్తున్నటు ఉన్నాయి. పరిమళ పరిసరాలను మర్చిపోయింది. ఆమె శరీరం జ్వాలాముఖిలా… ఉష్ణాన్ని చిమ్ముతోంది. మైకం ఆవహించి కళ్ళు మూతలు పడుతున్నాయి. అతికష్టం మీద ఆ జగన్మాత దివ్యసుందర విగ్రహానికి చేతులు జోడించి… ఆ గుమ్మంలో… రొమ్ముపట్టుకుని… భర్తచేతిలో కూలబడిపోయింది పరిమళ! 


            అక్కడ పూజకు భంగం కలగకుండా… భార్యను రెండు చేతులతో పొదువుకుని… ఇంట్లోకి తెచ్చి… గదిలో పడుకోపెట్టారు కేశవరావుగారు! పరిమళ పిన్నికి… బొట్టుపెట్టి, అమ్మవారి తాంబూలం ఇవ్వాలన్న ఆశపడ్డ సుందరి… పరిమళ కనిపించక, తన పెద్దాడపడుచుకు ఇచ్చేసింది! 


       పరిమళ జ్వరంతో పడిపోవడం ఎవరూ గమనించలేదు! డాక్టర్ వచ్చి, పరీక్షించి, అలసట వలన జ్వరం వచ్చిందని, ఆమె ఎర్రగా వాచిపోయిన కుడిచేతికి బహుశా సెల్యుటైటిస్ వచ్చి ఉండచ్చని…మర్నాడు పరీక్షలతో నిర్ధారించచ్చని ధైర్యం చెప్పి, రెండు ఇంజక్షన్లు చేసి వెళ్ళిపోయారు! 

పరిమళ మాత్రం ఇంకా స్పృహలోకి రావడం లేదు. ఆమె స్థితి డెలీరియస్ గా ఉంది! ఏవో కలలు, దృశ్యాలు, శబ్దాలు… హోరుగా కలిసిపోతూ! ఎక్కడో దట్టమైన కీకారణ్యమో, ఎత్తయిన శిఖరాగ్రాలు, పోటెత్తే జలనిధులు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు…తను సహాయం కోసం అరుస్తున్నట్టు… ! ఆమె ఒళ్ళు కుంపటిలా ఉంది. మెదడు బరువుగా వ్యాకోచిస్తున్న భావన. రొమ్ములోంచి…నిప్పుకణికె తో కాలుస్తున్న మంట! గట్టిగా అరుస్తోంది… ఒక తెల్లని గోడల గదిలో! తన కొంగంతా రక్తసిక్తమై! 


        ఏ గంట సేపో ఆ స్థితి! మెల్లగా ఒళ్ళు నీరికారిపోతున్నట్టు… వంటింటి నుంచి చల్లని గాలి సేదతీరుస్తున్నట్టు, తను ఒక దీపకాంతులతో వెలుగుతున్న … పూజాగృహంలో కూర్చున్నట్టు! పిల్లలంతా … “ యా దేవీ సర్వ భూతేషు శక్తిరూపేణ సంస్థితా… నమస్తస్తై నమస్తస్తై నమస్తస్తై నమో నమః!”…. అంటూ అపరాజితా స్థోత్రం చదువుతున్నారు. వేల మంది స్త్రీలు…” ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః”…. అంటూ అమ్మవారిని సహస్రనామాలతో స్థుతిస్థున్నారు. వారి మధ్యలో తను పరవశత్వంతో… “అమ్మా”… అంటూ అరుస్తూ పడిపోయింది. ఒక చల్లని తల్లి తనను ఒడిలోకి తీసుకుంది. ఆమె మోము క్రోధంతో సింధూరారుణ విగ్రహ లా ఉంది. తను గజగజా వణుకుతోంది. ఆమె నఖదిధీతి సంపన్న.. … వాడిగా ఉన్న గోళ్ళతో…తన రొమ్ము చీల్చింది. ఎర్రటి మందారపూలను బయటకు తీసింది. 


“ అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే; రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |�నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే “…. 


మిన్నులంటేట్టు ఎలుగెత్తి భజిస్తున్నారు! జనాలు! 

చల్లబడింది ఆ పరదేవత. రొప్పతోంది ఇంకా ఆవేశంతో! 


“దుర్లభా! దుర్గమా! దుర్గా!దుఃఖహంత్రీ! శుభప్రదా! భవరోగ చక్ర ప్రవర్తినీ! సర్వవ్యాధి ప్రశమనీ! సర్వమృత్యునివారిణీ! భాగ్యాబ్ది చంద్రికా భక్తచిత్త కేకి ఘనాఘనా… రోగపర్వతదంభోళిర్మృత్యుదారు కుఠారికా!”…. అంటూ తన భర్త ఆ పరదేవతను వేడుకుంటున్నాడు! 


యుద్ధం ముగిసినట్టుంది. అంతా శాంతి. ధవళకాంతిలో… ధవళ పద్మంలో…రజితకాంతులు వెలువరిస్తూ… శాంతికవచంలో రాజరాజేశ్వరీ దేవి… బాల రూపంలో… అభయముద్రనిస్తున్న అవ్యాజ కరుణామూర్తి… అజ్ఞానాన్ని అంతం చేసిన కాంతి దీపికలా!


        ఎంత సేపు తన్మయురాలై చూసిందో ఆ తల్లిని పరిమళ. దగ్గరకు వెళ్ళింది ఆర్తితో! ఎర్రని కుంకం అద్దింది. చల్లని గంధాన్ని చెంపలకు పూసింది. “ ఇంక వెళ్ళు”…. అంది ఆ బాలా త్రిపుర సుందరి. ఒక్కసారిగా … జాగృతిలోకి వచ్చింది పరిమళ. 


ఇల్లంతా అలుముకున్న మొగలిరేకుల, సన్నజాజుల సువాసన! ఒళ్ళంతా పాకిన ఉత్తేజం! నూతనోత్సాహం. లేచి హాల్లోకి వెళ్తూ… అద్దంలో చూసుకుంది. ఉదయమంతా పిల్లలంతా కలిపి అలదిన కుంకుమ, చందనాల కలగాపులగంలో… స్పష్టంగా గోచరిస్తున్న కుంకుమబొట్టు, చందనపు చారికలు! ఒళ్ళు పులకించి పోయింది పరిమళకు. ఎవరితో పంచుకోవాలని కూడా అనిపించలేదు…ఆ అనుభూతిని. ఆ తాదాత్మ్యతలో ఎంత సేపుందో తెలీదు… ! 


ఫోను రింగవుతుంటే లేచి వచ్చిన కేశవరావుగారు…హాల్లో కూర్చున్న భార్యను విచిత్రంగా చూస్తూ… ఫోన్ తెరిచారు! 


 “ కూతురు గౌతమి, అల్లుడు రాన్… భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో… చక్కగా హిందూ దేవాలయంలో… జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్న దృశ్యాల వీడియోలు పంపింది కూతురు. మరొక దృశ్యంలో… చక్కగా బృందగానంలో… మహిషాసుర మర్ధిని స్థోత్రం పాడుతూ!చాలా సంతృప్తిగా అనిపించింది..ఆ తండ్రిమనసు…..మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని కూతురు వదలనందుకు! అయితే ఇవేవీ పరిమళ మనసులో నమోదు కావడం లేదు! ఆమె ట్రాన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది! 


      మరో రెండురోజుల్లో ఆమె మామూలు మనిషయింది. భర్తతో తనను చూస్తున్న ఆంకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళింది. 


నెల్లాళ్ళ క్రితం శెనగబద్ద ప్రమాణంలో… రొమ్ములో వచ్చిన కేన్సర్ కణితి… మేలిగ్నంట్ గా మారి, రెండవదశ దాటి మూడవ దశ చివరకు మారడం,లివర్ కూ, ఓవరీస్ లో కూడా ఛాయామాత్రంగా కేన్సర్ కణాలు చేరడం…ఆమెకు ఎమర్జన్సీ ఆపరేషన్ కు డాక్టర్ ఇచ్చిన వ్యవధి దాటి అప్పుడే వారం రోజులవ్వడం… ఇవేవీ కేశవరావుకు తెలియదు. ఆమెతో పాటూ వెళ్ళిన సుందరికి మాత్రం తెలుసు! 


“ ఎందుకు చెప్పలేదు మా ఎవ్వరికీ”…. అని గద్దించిన భర్తతో… తాపీగా..” దసరాలయ్యాకా చేయించుకుందామని!”… అంది పరిమళ. “ ఎవరా నూరిపోసింది. ఆ సుందరే కదా!”… అంటూ రెట్టిస్తున్న భర్తతో…” తననేమీ అనద్దు. తను నా కోసమే ఆ హోమాలన్నీ చేసింది. జీవితంలో ఒక్కసారి ఆధ్యాత్మిక జీవనాన్ని చవి చూడాలని అనిపించింది. వలంటరీ రిటైర్మెంట్ తరువాత నాలో ఎన్నో శారీరిక మార్పులు, రుగ్మతలూ! ఆ ఆందోళనలో… కన్నబిడ్డలా నా చెయ్యి పట్టుకుని నడిపించింది సుందరి. తను నిజానికి నన్ను ఆపరేషన్ కు తొందరచేసింది. నాకన్నా ఎక్కువ ఆందోళన పడింది. ఎందుకో నాకే… జీవితంలో చివరిక్షణాలు దగ్గర పడ్డాయి అనిపించింది! నేను భగవంతుని నుండి తీసుకోవడమే కానీ ఎప్పుడూ…ఎలాంటి సేవా, అర్చనా చెయ్యలేదు. అందుకే దసరా పూజలు అయ్యాకా…విజయదశమి తర్వాతే మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా! “…. అంటూ తల వంచుకున్న ఆమె తలను …ఆర్తిగా గుండెకు పొదువుకుని కన్నీరు కార్చేడాయన! 


            **********************


ఆయన కన్నీరు వృధాపోలేదు! సుందరి పూజలు వ్యర్ధమవలేదు! పరిమళ విశ్వాసం వమ్ము అవలేదు. ఆమె రొమ్ముల్లో కానీ, శరీరంలో మరెక్కడా కానీ…ఎక్కడా కాన్సర్ ఛాయలు అత్యంత ఆధునిక పరీక్షా విధానాల్లో కూడా దొరకలేదు! అది ఒక బ్రహ్మరహస్యమని.. ఒక్క పరిమళకే తెలుసు. తనకే ఆ అద్భుతం ఎందుకు జరిగిందో మాత్రం తెలీదు! మెడికల్ హిస్టరీలో ఇదో మిరకిల్ అని డాక్టర్ అంటుంటే…ఈ చేతనాచేతన ప్రకృతిలో అద్భుతం కానిదేది? ఆ మిరకిల్స్ వెనకాల నున్న చిన్మయ చేతనామూర్తి అన్నిటికన్నా పెద్ద అద్భుతం కదా అనుకుంటుంది పరిమళ! 


తన అలౌకిక అనుభవాన్ని అభూతకల్పనగా…విమర్శించే అవకాశాన్ని ఆమె ఇతరులకు ఇవ్వదలుచుకోలేదు! 


కాలం ముందుకు నడుస్తోంది. సుందరి శ్రీమాతతో తన్మయ భక్తిలో… పరిమళ శ్రీమాతతో స్నేహభక్రితో… సాగిపోతూనే ఉన్నారు! ఎన్నో నవరాత్రులు కాలగమనంలో వస్తూ పోతూ ఉంటాయి. ఆ భక్తప్రియా, భక్తివశ్యా, భావనాగమ్య… మాత్రం కాలాతీతంగా… తనను నమ్మిన వారిని అనుగ్రహిస్తూనే ఉంటుంది! 


   శుభం భూయాత్


శ్రీ మాత్రే నమః! 


ధన్యవాదాలతో, దసరా శుభాకాంక్షలతో…..🙏

*ఓలేటి శశికళ.*

మాతృభాషలో

 శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.


    *యద్యపి బహునాధీషే*

        *తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*

    *స్వజనః శ్వజనో మా భూత్*

        *సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా (మన వాళ్ళు) 

అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా


, సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 


సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 


తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం -కళ్ళని -కల్లు ట

                               శిరీష-షిరీష ట

                                 వేళ-వేల ట

                                 కళ-కల ట

                               పళ్ళు-పల్లు ట

                               కాళ్ళు-కాల్లు ట

ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు.....వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


విదేశాలలో ఉన్న తెలుగు వారు ..చక్కటి భాషా

ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..


కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు -సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి


వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ సుద్ధి

వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది.

వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,

శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు 

నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై ,భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి🙏

శ్రీమద్భాగవతము

 *17.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2294(౨౨౯౪)*


*10.1-1429*


*క. అనిన విని "వీఁడె వీనిం*

*గొనిపొం" డని భక్తితోడ గురునందను ని*

*చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొలిపెను*

*ఘనదుర్జనదమను మహిషగమనున్ శమనున్.* 🌺



*_భావము: శ్రీకృష్ణుని ఆజ్ఞను శిరసావహిస్తూ, యమధర్మరాజు ఆ గురుపుత్రుని, "ఇడుగో తీసికెళ్ళండి", అని ఆయనకు భక్తితో ఒప్పచెప్పగా శ్రీకృష్ణుడు ఆ దుష్టశిక్షకుడు, మహిషవాహనుడగు యమధర్మరాజుకు సెలవిచ్చి పంపాడు._* 🙏



*_Meaning: Obeying the orders of Sri Krishna, YamaDharmaRaja handed over the boy to Him and Sri Krishna bid goodbye to Yama and left for His Guru’s place._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

అప్పట్లో అలా...

 *అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే*.---//- 


1980 - 90లలో జీవనం ఎలా వుండేది? తెలియాలంటే మాత్రం తప్పని సరిగా చదవాలి మరి.


డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటి తో పోల్చితే, అపుడు బాగా తక్కువ.


2000 కు ముందు వరుసగా 3, 4 ఏళ్లు కరువు వచ్చినా, బియ్యం, తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు.


విశాలమయిన ఇళ్ళు. అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు.


రోజూ ఇంటికి భిక్షానికి వచ్చి, పెట్టిన అన్నం, కూరా సంతోషంగా తీసుకుని వెళ్ళే వారు.


సంక్రాంతి వస్తుందంటే, పోటీలు పడి అమ్మాయిలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేశే వారు.


కేటరింగ్లు లేవు. ఏ శుభకార్యం జరిగినా, బంధువులు పది రోజులు ఉండి, తలా చెయ్యి వేసి, వంటల నుంచీ బట్టలు ఉతికే వరకు అన్నీ చేసే వారు.


పిల్లలకు స్వీట్స్, కారప్పూస అన్నీ ఇంటిలోనే తయారు చేసి, అత్తయ్యలు తెచ్చేవారు.


ఎందరో పిల్లలు బంధువుల ఇళ్ళల్లో ఉంటూ చదువుకునే వారు.


బంధువులు వస్తే రెండు మూడు వారాలు ఉండి వెళ్ళే వారు. వాళ్ళు వెళ్లి పోతుంటే పిల్లలు, వెంటపడి అపుడే వెళ్ళవద్దు అని ఏడిచేవారు. ఇపుడు బంధువులు వస్తున్నారంటే ఏడుస్తున్నారు.


ఎంత దూరమైనా ఊళ్ళో నడిచి లేక సైకిల్ పైనే వెళ్లే వాళ్ళం. ఇపుడు ఇంటి పక్క షాప్ కైనా, బండి తీయాల్సిందే.


సైకిల్ కు హెడ్ లైట్ లేక పొతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసే వారు. సైకిళ్లకు లైసెన్స్ లు కూడా ఉండేవట.


రిక్షా వాడు బాడుగకు పావలా తక్కువకు బేరమాడితే, ఇంకో పది పైసలు ఇప్పించండి బాబు అని బతిమాలే వాడు. ఇపుడు ఆటో వాడు, చెప్పిన రేట్ కు తక్కువ అడిగాం అనుకో, పడ తిట్టి పోకుండా ఉంటే మన అదృష్టం.


స్కూటర్, లునా, మోఫా ఉండేవి. స్కూటర్ అంటే బజాజ్ చేతక్. బుకింగ్ చేస్కుంటే, 1– 2 years తరువాత వచ్చేది.


ట్రైన్ రావడానికి కొంత ముందు స్టేషన్ కు వెళ్లి, రిజర్వేషన్ అప్పటికి అపుడే చేయించుకునే వారు, దొరుకుతుందో లేదో అని ఆందోళన లేకుండా!


సాయంత్రం ట్రైన్ లో వెళ్తుంటే, స్టేషన్ ల మధ్య గూళ్లకు చేరుకుంటున్న వేల కొద్దీ పక్షుల సందడి కనబడేది, వినబడేది. ఇపుడు ఏమీ లేదు. నిశ్శబ్ధం.


ట్రైన్, బస్ ల లో మనుషులు మాట కలిపి, తెలియని వారయినా కష్ట సుఖాలు చెప్పుకునే వారు. ఇపుడు తెలియని వారితో మాట్లాడితే, ప్రమాదమే!


కుటుంబంకి ఫ్యామిలీ డాక్టర్ ఉండే వారు. ఇన్ని కొత్త రోగాలు, స్పెషలిస్ట్ లు లేరు.


టెన్త్ లో 60% ఫస్ట్ క్లాస్ వచ్చినదంటే చాల గొప్ప.


ఇంటిలో నాయనమ్మ, తాతయ్యలు తప్పక ఉండే వారు.


కూల్ డ్రింక్ అంటే Gold Spot యే!


ప్రతి వేసవి సెలవులు తప్పక అమ్మమ్మ, తాతయ్య ల ఇంటికే. మధ్యాహ్నం చెట్లు ఎక్కడం, కాయలు కోయడం తప్పనిసరి.


నీళ్లు ఎక్కడ ఏ pump క్రిందనైనా త్రాగేసే వారు. వాటర్ ఫిల్టర్ లు లేవు.


వేసవిలో రోజూ సాయంత్రం 7 కు కరెంట్ పోయేది. కిరోసిన్ తో పని చేసే లాంతర్లు, ముగ్గు తో తోమి సిధ్ధం చేసే వారు.


గ్రామాల్లో ఎద్దుల బండ్లు పై సరదా సవారీ.


కోడి కూత తో నే నిద్ర లేవటం. అలారం లు లేవు.


అందరి ఇళ్ళలో నీటి బావులు, వేడి నీటికి బాయిలర్ లు లేక బొగ్గుల కుంపటి ఉండేవి.


ఏడు పెంకులాట, గిల్లీ దండా, దాగుడు మూతలు, గాలి పటాలు, గోళీకాయల ఆటలు, గల్లీ క్రికెట్, కోతి కొమ్మచ్చి, సైకిల్ పందేలు, ఇవే మన ఆటలు.


ఉత్తరాలు కార్డ్, ఇన్లాండ్ లెటర్స్ ప్రధాన సమాచార వారధి. అపుడపుడు ట్రంక్ కాల్ . Telegram వచ్చింది అంటే దడే…అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టి ఇచ్చే వారు.


Telephone, fridge, TV లు ఉన్నవారు గొప్ప ధనవంతుల కిందే లెక్క.


బంగారం 10 గ్రాములు సుమారు 4000, సాగర్ నగర్ లో MIG flat సుమారు 80,000. షేర్స్ 1992 జనవరి లో సెన్సెక్స్ 1001.


కాలేజీల్లో చదివే పిల్లలకు డబ్బులు పంపాలంటే, money ఆర్డర్ యే గతి. అది తెచ్చిన పోస్ట్ మాన్ కు 2 రూపాయలు బహుమానం!


ఇంటికి పిల్లలు ఉత్తరం రాసి పంపిస్తే, దానిని పోస్ట్ మాన్ యే చదివి, వారికి వినిపించే వారు.


సినిమాకు వెళ్ళడమే గొప్ప ఆటవిడుపు. సినిమా ప్రచారం గూడు రిక్షా, పాంఫ్లెట్లు, పోస్టర్లు.


ప్రసాద్ పెన్, అశోక్ పెన్, హీరో ఫౌంటైన్ పెన్ లు చాలా పేరు గాంచినవి. Reynolds ball పాయింట్ పెన్ అంటే క్రేజ్!


స్కూళ్లకు పిల్లల కోసం గూళ్ళ రిక్షాలు ఉండేవి. 5,6 తరగతులు కు వచ్చారంటే పిల్లలే నడిచి స్కూల్ కి వెళ్లి పోయేవారు. పికప్ డ్రాప్ లు లేవు.


దీపావళి కు పది నుంచి నెల రోజుల ముందే టపాసులు పేలుతుండేవి. తారాజువ్వలు, సిసిండ్రీలు పిల్లలే తయారు చేసుకునే వారు.


గుడులలో హరికథా కాలక్షేపం సర్వ సాధారణం.


Theater కు వెళ్తే, నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ టికెట్లు. Theater లోపల సిగరెట్లు బీడీలు కాల్చుతు సినిమాలు చూసే వారు. అలానే ట్రైన్స్, హోటల్స్, బస్ ల లో కూడా యధేచ్చగా…


సినిమా పాటలకు లిరిక్స్ పుస్తకాలు పావలకు అమ్మేవారు.


పౌరాణిక, కుటుంబ, సామాజిక, భక్తిరస చిత్రాలదే రాజ్యం.


పెద్దలకు వార్తా పత్రిక లు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్త, ప్రజా శక్తి. పిల్లలకు: చందమామ, బొమ్మరిల్లు, బాల జ్యోతి. గృహిణులకు: ఆంధ్ర భూమి, స్వాతి వారపత్రిక లు. యువకులకు: యువ, స్వాతి మాస పత్రికలు. పెద్దవారికి Readers Digest. ప్రభుత్వ ఉద్యోగార్థులకు Employment News Weekly.ఇలా!



వార్తలంటే రేడియో, సినిమా పాటలంటే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, అరగంట చిత్ర లహరి .సినిమా అంటే నెల కో, రెండు నెలలకో DD National లో వచ్చే తెలుగు సినిమా వచ్చేది.

దసరా, సంక్రాంతి పండక్కి ఫ్రెండ్స్ తో కలసి సరికొత్త సినిమాలు చూడటం అదోక గమ్మత్తైన సరదా. 

ఎవరైన ఫ్రెండ్స్ తను చూడని సినిమా చూసివుంటే వారితొ ఆ సినీమా కథ అడిగి మరీ చెప్పించు కోవడం మహా సరదా. 

👆ఇలా గమ్మత్తైన విషయాలు ఎన్నో, ఎన్నేనో..అప్పటి రోజులు గడిపిన వారికి మరుపురాని మధురానుభూతులు.ఆ పాత మధురాలు...తిరిగి రాని అమృత్సోవాలు.

 *వాక్సిన్స్---ఎంత వరకు పని చేస్తున్నాయి*


డా౹౹వేణు గోపాల రెడ్డి


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు200 కోట్లమందికి వాక్సిన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది వాక్సిన్స్ పై నమ్మకం కలిగుండాగా కొంతమంది మాత్రం వాక్సిన్స్ ని ఇప్పటికి నమ్మడం లేదు. వాక్సిన్స్ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ అని వారు ప్రచారం చేస్తున్నారు... అసలు నిజాలేమిటి


1. వాక్సిన్స్ ఎంతవరకు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన సమాచారం మేరకు వివిధ వాక్సిన్స్ సమర్ధత 80% నుండి 95%. ఏ వాక్సిన్ కూడా 100% పనిచేయడం లేదు. వ్యక్తుల వయసు, ప్రాంతం, ఇతర వ్యాధులు తదితరం వాక్సిన్ పనితీరుపై కీలక ప్రభావం చూపిస్తుంది. మొత్తం మీద వాక్సిన్స్ పనిచేస్తున్నాయి.


2. వేరియంట్ ల పై వాక్సిన్ పని తీరు ఎలా ఉంది.


వాక్సిన్స్ వాస్తవానికి వైల్డ్ స్ట్రైన్ స్పైక్ ప్రోటీన్ ఆధారంగా చేయబడ్డాయి. అప్పట్నుంచి వైరస్ చాలా mutate అవుతూ ఉంది. కొత్త వేరియంట్ రావడం జరిగింది...కొత్తవి ఇంకా రావచ్చు. ఇప్పుడున్న వాక్సిన్స్ వేరియంట్ మీద ప్రభావం తగ్గవచ్చు, కానీ అసలే పనిచేయవు అనేది నిజం కాదు. వేరియంట్ కు అనుగుణంగా వాక్సిన్స్ ని కూడా అప్డేట్ చేయనున్నారు. భవిష్యత్లో బూస్టర్ డోసులు అవసరం అవుతాయి కాబోలు.


3.వాక్సిన్ ఒక సారి తీసుకుంటే ఎంతకాలం రక్షణ ఉంటుంది.


ఇప్పటివరకు ఉన్న పరిశోధనల ప్రకారం వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి 8 నెలల నుండి ఒక సంవత్సరం వరకు రక్షణ ఉంటుంది. మళ్ళీ బూస్టర్ డోస్ అవసరమా అనే అంశంపై పరిశోధన జరుగుతుంది


4. వాక్సిన్స్ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయా


వాక్సిన్స్ వైరస్ ఒక వ్యక్తి నుండి వేరేవారికి వ్యాప్తి చెందే అవకాశాన్ని 74% తగ్గిస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి


5. వాక్సిన్ సురక్షితమేనా?


ఏ వాక్సిన్ కూడా 100% సురక్షితం కాదు. అన్ని వాక్సిన్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కరోన వాక్సిన్స్ లో 10 లక్షల మందికి 5 గురికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ గమనించడం జరిగింది. వైరస్ వల్ల జరిగే నష్టంతో పోలిస్తే ఇది కొన్ని వేల రెట్లు సురక్షితం


6. వాక్సిన్స్ వల్ల కోవిడ్ వ్యాప్తి తగ్గిందా


వాక్సిన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కరోన కేసుల వేగం తగ్గింది. ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం, icu చికిత్సలు తగ్గాయి. వైద్యావ్యవస్థ పై ఒత్తిడి తగ్గింది. మరణాల సంఖ్య తగ్గింది. వాక్సిన్స్ బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తున్నాయి.


అపోహాలు వీడండి....వాక్సిన్ తీసుకోండి.... అసలే థర్డ్ వేవ్ మేఘాలు కమ్ముకుంటున్నాయి


*కరోన నుండి రక్షణ ౼ దశ సూత్రాలు*


1. సమూహాలకు దూరంగా ఉండాలి


2. భౌతిక దూరం పాటించాలి


3. మాస్కు, వీలయితే డబుల్ మాస్కు, ఫేస్ షిల్డ్ ధరించాలి


4. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి


5. వాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి


6. వ్యాయామం రోజు చేయాలి....ఎండలో కనీసం 30 నిమిషాలు గడపాలి


7. నిద్ర నిండుగా 8 గంటలు ఉండేలా చూసుకోవాలి


8. పోషక ఆహారం తీసుకోవాలి


9. సానుకూలంగా ఆలోచించాలి


10. ఆరోగ్య జీవనశైలి అలవర్చుకోవాలి


Dr. A. Venu Gopala Reddy

MSc. PhD. Microbiology

Principal, TSMS, VEENAVANKA, KARIMNAGAR DIST

75697 62669


Please share

What is their contribution

 *forwarded from other group*


*Whoever wrote , it is wonderfully written*.


 I never understood one thing that what do these film actors or actresses do that they get 50 crores or 100 crores for each film?


 In a country where top scientists, doctors, engineers, professors, officers etc. get 10 lakh to 20 lakh rupees per year, in that country a film actor earns 10 crore to 100 crore rupees per year.  


What does he do after all?


 What is their contribution in the development of the country?  After all, what does he do that he earns so much in just one year that it might take 100 years for the top scientist of the country!


 Today, the three areas which have fascinated the new generation of the country are cinema, cricket and politics.


 The earning and prestige of the people belonging to these three fields is beyond all limits.


 These three areas are the ideals of modern youth, while their credibility is currently under question.


 So it is useless for the country and the society.


 Drugs and prostitution in Bollywood, match fixing in cricket, hooliganism and corruption in politics.  Money is the main reason behind all this and it is we who bring this money to them.


 We are doing our own harm by burning our own money.  This is the height of stupidity.


 Till 70-80 years back, famous actors used to get normal salary.


 Till 30-40 years ago, the earnings of cricketers were also not special.


 Till 30-40 years ago, there was not so much loot in politics.


 Slowly they started robbing us and we kept robbing ourselves happily.

 

 By getting caught in the clutches of these mafia, we are destroying the future of our children and our country.

 

Till 50 years back, movies were not made so vulgar and sloppy.  Cricketers and politicians were not so arrogant.  Today he has become our God (?).  Now there is a need to lift them from the head and slam them so that they can know their status.


 Once , when the then Vietnamese President Ho-Chi-Minh came to India, in a meeting with Indian ministers, he asked - "What do you guys do?"


 These people said - "We do politics."


 He could not understand this answer, so he asked again - "I mean, what is your profession?"


 These people said - "Politics is our profession."


 Ho-Chi Minh got a little annoyed and said - "Maybe you people do not understand my meaning. I do politics too, but by profession , I am a farmer and I do farming. Farming makes my livelihood. In the morning and evening I go to my fields.  I work. I do my responsibility for the country as President during the day."


 When Ho-Chi-Minh asked the same thing again, a member of the delegation shrugged and said - "Politics is our profession."


 It is clear that Indian leaders had no answer to this.  Later a survey revealed that the livelihood of more than 6 lakh people in India was supported by politics.  Today this number has reached in crores.


 Just a few months ago, when Europe was being devastated by Corona, the doctors were not getting even a little leave for several months in a row, then a Portuguese doctor said angrily - "Go to Ronaldo, to whom you would give millions of dollars to watch. I only get a few thousand dollars."


I firmly believe that in a country where the ideals of young students are not scientists, researchers, educationists, but actors, politicians and sportsmen, they may have their own economic progress, but the country will never progress.  


Socially, intellectually, culturally, strategically, the country will always remain backward.  The unity and integrity of such a country will always be in danger.


 The country in which the dominance of unnecessary and irrelevant sector continues to grow, that country will be weakening day by day.  The number of corrupt and anti-nationals will continue to increase in the country.  Honest people will be marginalized and nationalists will be forced to lead a difficult life.


We need to create an environment to groom and promote talented, honest, conscientious, social worker, belligerent, patriot citizens .🙏Jai Hind🇮🇳

సంస్కృత మహాభాగవతం*

 *17.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అహమాత్మోద్ధవామీషాం భూతానాం సుహృదీశ్వరః|*


*అహం సర్వాణి భూతాని తేషాం స్థిత్యుద్భవాప్యయః॥12819॥*


మహాత్మా! ఉద్ధవా! నేను సకలప్రాణులకు ఆత్మను. హితైషిని, సహృదయుడను. నియామకుడను. ఈ సమస్త ప్రాణులును, పదార్థములును నా రూపములే. వీటియొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారణము నేనే.


*16.10 (పదియవ శ్లోకము)*


*అహం గతిర్గతిమతాం కాలః కలయతామహమ్|*


*గుణానాం చాప్యహం సామ్యం గుణిన్యౌత్పత్తికో గుణః॥12820॥*


చైతన్యవంతమైన పదార్థములలో నేను పరమచైతన్యమును, గణించువారిలో నేను కాలమును. త్రిగుణములయొక్క సామ్యావస్థయైన ప్రకృతిని నేనే. గుణములు గలవారియొక్క స్వాభావిక గుణమును నేనే. 


*16.11 (పదకొండవ శ్లోకము)*


*గుణినామప్యహం సూత్రం మహతాం చ మహానహమ్|*


*సూక్ష్మాణామప్యహం జీవో దుర్జయానామహం మనః॥12821॥*


గుణములయందు సంక్షోభము కలుగునప్పుడు ఉత్పన్నమగు క్రియాశక్తియైన ప్రధాన సూత్రాత్మను నేను. జ్ఞానశక్తికి ప్రధానమైన మహత్తత్త్వమును నేను. సూక్ష్మ పదార్థములలో జీవుడను నేను. వశపరచుకొనుటకు అసాధ్యమైన మనస్సును నేను.


*16.12 (పండ్రె శ్లోకము)*


*హిరణ్యగర్భో వేదానాం మంత్రాణాం ప్రణవస్త్రివృత్|*


*అక్షరాణామకారోఽస్మి పదాని ఛందసామహమ్॥12822॥*


వేదములకు అభివ్యక్తి స్థానమైన హిరణ్యగర్భుడను నేను. మంత్రములలో *అ* కార, *ఉ* కార, *మ* కారములతో గూడిన ప్రణవమును నేను. అక్షరములలో *అ* కారమును - ఛందస్సులలో త్రిపదయైన గాయత్రిని.


*16.13 (పదమూడవ శ్లోకము)*


*ఇంద్రోఽహం సర్వదేవానాం వసూనామస్మి హవ్యవాట్|*


*ఆదిత్యానామహం విష్ణూ రుద్రాణాం నీలలోహితః॥12823॥*


*16.14 (పదునాలుగవ శ్లోకము)*


*బ్రహ్మర్షీణాం భృగురహం రాజర్షీణామహం మనుః|*


*దేవర్షీణాం నారదోఽహం హవిర్ధాన్యస్మి ధేనుషు॥12824॥*


*16.15 (పదిహేనవ శ్లోకము)*


*సిద్ధేశ్వరాణాం కపిలః సుపర్ణోఽహం పతత్రిణామ్|*


*ప్రజాపతీనాం దక్షోఽహం పితౄణామహమర్యమా॥12825॥*


నేనే సకల దేవతలలో ఇంద్రుడను, అష్టవసువులలో అగ్నిని, ద్వాదశ ఆదిత్యులలో విష్ణువును, ఏకాదశరుద్రులలో శంకరుడను. బ్రహ్మర్షులలో భృగువును. రాజర్షులలో మనువును. దేవర్షులలో నారదుడను. గోవులలో కామధేనువును. సిద్ధేశ్వరులలో (సిద్ధులలో) కపిలుడను. పక్షులలో గరుత్మంతుడను. ప్రజాపతులలో దక్షప్రజాపతిని. పితృదేవతలలో అర్యముడను నేనే.


*16.16 (పదహారవ శ్లోకము)*


*మాం విద్ధ్యుద్ధవ దైత్యానాం ప్రహ్లాదమసురేశ్వరమ్|*


*సోమం నక్షత్రౌషధీనాం ధనేశం యక్షరక్షసామ్॥12826॥*


పుణ్యపురుషా! ఉద్ధవా! దైత్యులలో అసురపతియైన ప్రహ్లాదునిగా నన్నెరుంగుము. నక్షత్రములకు అధిపతియు, ఓషధులకు పుష్టిని గూర్చువాడను అగు చంద్రుడను నేను. యక్షరాక్షసులలో ధనపతియైన కుబేరుడను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*460వ నామ మంత్రము* 17.10.2021


*ఓం నళిన్యై నమః* 


సుందరమైన పద్మములవలె కన్నులు, ముఖము, పాదద్వయము మొదలైన అవయవాలు కలిగి *నళినీ* యని అనబడు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నళినీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నళిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు శాంతిసౌఖ్యములతోను, సిరిసంపదలతోను, కీర్తిప్రతిష్టలతోను, సుందరమైన ముఖవర్చస్సుతోను అలరారుదురు.


జగన్మాత *అనవద్యాంగీ* యని ఏబదియవ నామ మంత్రములో కీర్తించబడినది. అనగా ఆ తల్లి దోషరహితమైన అంగములచే భాసిల్లుచున్నదని భావము. ఇక, ఈ నామ మంత్రములో *నళినీ* యని అనబడినది. అంటే దోషరహితమైన అంగసంపద (కాళ్ళు, చేతులు, ముఖము, కనులు మొదలైన అవయవములు) పద్మములై భాసిల్లుచున్నది. *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* (పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ, సౌకుమార్యాది లక్షణాలతో భాసిల్లు పాదముల జంట కలిగియున్మది అమ్మవారు) అని నలుబదియైదవ నామ మంత్రములో స్తుతింపబడినది ఆ తల్లి. గంగానదికి గల పండ్రెండు నామములలో *నళినీ* యను నామము గలదు గనుక, అమ్మవారు ఆ గంగాస్వరూపురాలై, *నళినీ* యను నామముతో ప్రసిద్ధిచెందినది. నలుడను మహారాజు శ్రీమాతను ఉపాసించి దేవీ తాదాత్మ్యమును పొందియుండుటచే, ఆ తల్లి *నళినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నళిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*459వ నామ మంత్రము* 17.10.2021


*ఓం సుముఖ్యై నమః*


ఆత్మజ్ఞాన సంపన్నతచే మరింత ముఖకాంతితో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా నహస్ర నామావళి యందలి *సుముఖీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం సుముఖ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులను శుభప్రదమైన ముఖకాంతితో పలువురిలో ఆకర్షితులుగను, వారు పలికిన పలుకులు జనరంజితమైనట్లుగను, విశేషమైన కీర్తిప్రతిష్టలతోబాటు, ధనధాన్యసమృద్ధిని పొందువారిగను ఆ తల్లి అనుగ్రహించును.


అమ్మవారు ఆత్మజ్ఞానస్వరూపిణి. అందుచే ఆ తల్లి ముఖకాంతి మరింత అధికమై శోభస్కరమై యుండును. అమ్మ పరమాత్మ. అందుచే ఆ తల్లి ముఖకాంతి ఉదయించుచున్న అనంతకోటి సూర్యుల కాంతిని పోలియుండును *(ఉద్యద్భాను సహస్రాభా* - లలితా సహస్ర నామావళి యందలి ఆరవ నామ మంత్రము). ఇదే విషయం *అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా* యని లలితా సహస్ర నామావళి యందలి పదిహేనవ నామ మంత్రంలో చెప్పబడినది. అష్టమితిథి నాటి చంద్రుని మాదిరిగా ప్రకాశించే లలాటము కలిగి యున్నది అని భావము. అంతేనా! *ముఖచంద్ర కళంకాభి మృగనాభి విశేషకా* యని పదహారవ నామ మంత్రములో వివరింపబడినది. అనగా చంద్రుని బోలిన అందమైన ముఖంలో, చంద్రుని లోని మచ్చ మాదిరిగా కస్తూరి తిలకాన్ని ధరించినదట అమ్మవారు. ఇంకను *వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా* అని పదిహేడవ నామ మంత్రములో ఆ తల్లి స్తుతింపబడినది. అనగా మన్మథుని మాంగల్య గృహమును బోలిన వదనానికి గృహతోరణాల మాదిరిగా కనుబొమలు ప్రకాశిస్తున్నవి. అలాగే పదునెనిమిదవ నామ మంత్రములో *వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా* అనగా ముఖకాంతియొక్క ప్రవాహంలో ఆ తల్లి నయనములు చలించే మీనముల జంటను బోలి యున్నవట. వెరసి ఈ నామ మంత్రములో అమ్మవారు శుభకరమైన, మంగళకరమైన, జ్ఞానముచేత అధికముగ ప్రకాశించునదిగాను, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించునదిగాను, సర్వకాల సర్వావస్థలయందును భాసిల్లు ముఖపద్మము కలిగినదిగాను వేదములలో వివరింపబడినది. పరమేశ్వరి షోడశీ మంత్రాంగ దేవతయగు సుముఖీదేవి స్వరూపురాలగుటచే, ఆ తల్లి *సుముఖీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సుముఖ్యై నమః* అని యనవలెను. 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *16.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఉద్ధవ ఉవాచ*


*16.1 (ప్రథమ శ్లోకము)*


*త్వం బ్రహ్మ పరమం సాక్షాదనాద్యంతమపావృతమ్|*


*సర్వేషామపి భావానాం త్రాణస్థిత్యప్యయోద్భవః॥12811॥*


*16.2 (రెండవ శ్లోకము)*


*ఉచ్చావచేషు భూతేషు దుర్జ్ఞేయమకృతాత్మభిః|*


*ఉపాసతే త్వాం భగవన్ యాథాతథ్యేన బ్రాహ్మణాః॥12812॥*


*16.3 (మూడవ శ్లోకము)*


*యేషు యేషు చ భావేషు భక్త్యా త్వాం పరమర్షయః|*


*ఉపాసీనాః ప్రపద్యంతే సంసిద్ధిం తద్వదస్వ మే॥12813॥*


*ఉద్ధవుడు పలికెను* సర్వేశ్వరా! నీవు స్వయముగా పరబ్రహ్మస్వరూపుడవు. ఆద్యంతములు లేనివాడవు. ఆవరణ రహితుడవు (అపరిచ్ఛిన్నుడవు). అద్వితీయుడవు. సకలప్రాణుల యొక్క, పదార్థములయొక్క ఉత్పత్తి, స్థితి, రక్షణ, లయములకు నీవే కారణుడవు. ఉత్తమ-అధమ ప్రాణులయందు అంతర్యామిగా నీవే విలసిల్లుచుందువు. కానీ, మనస్సును, ఇంద్రియములను జయింపనివారు నిన్ను తెలిసికొనజాలరు. పరమపురుషా! నీ యథార్థస్థితిని ఎరింగిన జ్ఞానులు నిన్ను ఉపాసింతురు. మహర్షులు భక్తిశ్రద్ధలతో నీయొక్క ఏ రూపములను, విభూతులను ఉపాసించి సిద్ధిని పొందెదరో, వాటిని నాకు వివరింపుము.


*16.4 (నాలుగవ శ్లోకము)*


*గూఢశ్చరసి భూతాత్మా భూతానాం భూతభావన|*


*న త్వాం పశ్యంతి భూతాని పశ్యంతం మోహితాని తే॥12814॥*


సమస్త ప్రాణులకును జీవనదాతవైన ప్రభూ! నీవు సమస్త ప్రాణులయందును అంతర్యామిగా విలసిల్లుచుందువు. కానీ, వారిలో గూఢముగా నుండి నీ లీలలను నెఱపుచుందువు. సంపూర్ణ విశ్వమును ఒక్కసారిగా సాక్షాత్కరింపజేయునట్టి నిన్ను, నీ మాయచే మోహితులై వారు తెలిసికొనజాలరు.


*16.5 (ఐదవ శ్లోకము)*


*యాః కాశ్చ భూమౌ దివి వై రసాయామ్ విభూతయో దిక్షు మహావిభూతే|*


*తా మహ్యమాఖ్యాహ్యనుభావితాస్తే నమామి తే తీర్థపదాంఘ్రిపద్మమ్॥12815॥*


అచింత్య విభూతులకు ఆశ్రయుడవైన ప్రభూ! భూమి, స్వర్గము,పాతాళముల యందును, సకల దిక్కులయందును విరాజిల్లుచుండునట్టి నీ విభూతులనన్నింటిని కృపతో నాకు వివరింప ప్రార్థన. సకల తీర్థములను పవిత్రమొనర్చునట్టి నీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను.


*శ్రీభగవానువాచ*


*16.6 (ఆరవ శ్లోకము)*


*ఏవమేతదహం పృష్టః ప్రశ్నం ప్రశ్నవిదాం వర|*


*యుయుత్సునా వినశనే సపత్నైరర్జునేన వై॥12816॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! ప్రశ్నించే రహస్యవేత్తలలో నీవు మేటివి. పూర్వము కురుక్షేత్రమునందు కౌరవ పాండవులమధ్య యుద్ధము ప్రారంభము కానున్న సమయమున దాయాదులతో పోరాడుటకు ఉత్సాహపడుచున్న అర్జునుడుగూడ నన్ను ఇట్లే ప్రశ్నించి యుండెను.


*16.7 (ఏడవ శ్లోకము)*


*జ్ఞాత్వా జ్ఞాతివధం గర్హ్యమధర్మం రాజ్యహేతుకమ్|*


*తతో నివృత్తో హంతాఽహం హతోఽయమితి లౌకికః॥12817॥*


"రాజ్యప్రాప్తికై దాయాదులను వధించువాడను, వీరందరును వధింపబడువారు. ఇది యంతయు విచారకరము" అని అర్జునుడు సామాన్య మానవునివలె తలపోయుచు యుద్ధము నుండి నివృత్తుడయ్యెను.


*16.8 (ఎనిమిదవ శ్లోకము)*


*స తదా పురుషవ్యాఘ్రో యుక్త్యా మే ప్రతిబోధితః|*


*అభ్యభాషత మామేవం యథా త్వం రణమూర్ధని॥12818॥*


ఉద్ధవా! అప్పుడు నేను పురుషశ్రేష్ఠుడైన అర్జునునకు యుద్ధరంగమునందు యుక్తియుక్తముగా పెక్కు విధములుగా ఉపదేశించితిని. అంతట అతడు నీవలెనే నన్ను ప్రశ్నించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సీనియర్ సిటిజన్లకు మంచి వార్తలు

 సీనియర్ సిటిజన్లకు మంచి వార్తలు


 వేంకటేశ్వరుని ఉచిత దర్శనం

 సీనియర్ సిటిజన్‌ల కోసం @తిరుపతి.


 రెండు స్లాట్లు పరిష్కరించబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు.


 మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S 1 కౌంటర్‌లో నివేదించాలి

 వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు దాటుతుంది. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.


 మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది. మీరు లోపల కూర్చున్నప్పుడు - వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించబడుతుంది. ప్రతిదీ ఉచితం.


 మీరు రూ .20/-చెల్లించాల్సిన రెండు లడ్డూలను పొందుతారు. మరిన్ని లడ్డూల కోసం మీరు రూ. 25/- ప్రతి లడ్డూకి.


 టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది.


 దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి, ఎటువంటి ఒత్తిడి లేదా ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది.


 భగవంతుని దర్శనం తర్వాత మీరు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు.


 హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 ని సంప్రదించండి


 సమాచార మర్యాద: TTD.

 _________________________


 అందుకున్నట్లుగా ఫార్వార్డ్ చేయబడింది కానీ ఇది చాలా ముఖ్యమైన సర్క్యులర్, కాబట్టి దయచేసి శ్రీ సిటిజన్‌లకు మరియు అన్ని గ్రూపులకు పంపండి.🙏🌎🙏

సీతమ్మ మాటలు - అంతరార్థం

 ॐ సీతమ్మ మాటలు - అంతరార్థం 

          

    సీతమ్మ శ్రీరామునితో అరణ్యాలకి వెళ్ళడానికి స్వామిని ప్రాధేయపడుతున్నప్పుడు మధ్యలో అన్న మాటలు,   

    జీవుడు పరమాత్మతో కూడినపుడు, భౌతికంగా ఉండే ఆహారవ్యవహారాదులు ఎలాఉన్నా,  

     పరమాత్మతో కలసి ఉన్న ఆనందం వల్ల, అవి అత్యంత గొప్పవిగానే అనుభూతినిస్తాయి - అనేది అంతరార్థం. 


    Sita, while praying Rama to allow her to accompany with him to the forests, spoke a few words about the physical discomforts. 

    She says all those will be the most comforts if she stays with him. 


INNER MEANING 


    When the Individual Soul links to the Universal Soul,  

    the physical discomfots also will appear as the most comforts. 


ఆ శ్లోకాలు 


        కుశకాశశరేషీకా యే చ

        కణ్టకినో ద్రుమాః I

        తూలాజినసమస్పర్శా 

       మార్గే మమ సహ త్వయా ৷৷ అయోధ్యకాండ 30/12  

    

    వనములలో సంచరించుచున్నప్పుడు మార్గమునందుగల దర్భలు, ఱెల్లుగడ్ది, ముళ్ళదుబ్బులు, ముళ్ళచెట్లు సైతము 

    నీ సాహచర్యప్రభావమున 

    దూది, జింకచర్మము మున్నగువానివలె సుఖస్పర్శనే గూర్చును.  

    అవి నాకు ఏ మాత్రము బాధాకరములు గావు. 


    The white reeds, the kusha, the sara and the ishika grasses and thorny trees on the way 

     will feel as soft as cotton or as the skin of a black antelope. 


        మహావాతసముద్ధూతం 

        యన్మామపకరిష్యతి I 

        రజో రమణ! తన్మన్యే 

        పరార్థ్యమివ చన్దనమ్ ৷৷     

               - అయోధ్యకాండ 30/13  


 ప్రాణేశ్వరా!  

    సుడిగాలులకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడిన దుమ్ములకును నేనేమియు బాధపడను. 

    వాటిని నేను మేలైన చందనములవలె భావింతును.  


 O charming Rama! 

     I shall regard, the harmful dust raised by the stormy wind and settled on me, as the most excellent sandal powder. 


        శాద్వలేషు యథా శిశ్యే 

        వనాన్తే వనగోచర! I  

        కుథాస్తరణతల్పేషు కిం 

        స్యాత్సుఖతరం తతః ৷৷ 30/14  


నాథా!  

    నీతోగూడి వనమునందు పచ్చికబయళ్ళపై పరుండినను

    అవి నాకు చిత్రకంబళములతో గూడిన తల్పములకంటెను మిక్కిలి సుఖమునే గూర్చును.  


O rover of the forest! 

    I will feel happier when I sleep on the meadows (of tender green grass) on the outskirts of the forest than 

    when I sleep on the couch spread with carpets.  


        పత్రం మూలం ఫలం యత్త్వ - 

        మల్పం వా యది వా బహు I  

        దాస్యసి స్వయమాహృత్య 

        తన్మేమృతరసోపమమ్ ৷৷ 30/15 


స్వామీ!  

    నీవు స్వయముగా తెచ్చిన ఆకులు, కందమూలములు, పళ్ళు మొదలైనవి ఏవైనా, 

     కొంచెంగా అయినా సమృద్ధిగా అయినా 

     నాకు అవి అమృతతుల్యములే! 

    

    Whatever leaves or roots or fruits you collect with your own hands for me little or much, 

     they will be nectar to me. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం