14, అక్టోబర్ 2023, శనివారం

Kanti masakalu


 

Gas⛽ regulator change


 

Water fountain


 

మహాలయము

 మహాలయము (బ్రహ్మలోక ప్రాప్తి)


భాద్రపద కృష్ణ (పాడ్యమి) ప్రతిపద మొదలుకొని (అమావాస్య) దర్శ పర్యంతము 15 దినములు. (తిథి అధికమైనచో 16, క్షయమయినచో 14 దినములు) మహాలయములు. దీనినే మహాలయపక్షమని వ్యవహారము.


 అశక్తుడైనచో పంచమిగాని, షష్టిగాని, అష్టమిగాని, ద్వాదశిగాని, ఏకాదశి గాని మొదలుకొని అమావాస్య వరకు చేయవలయును. ఇంకనూ అశక్తుడైనచో నిషిద్ధము గాని మరియొక దినమందు (ఒక్కమారే చేయుట) సకృన్మహాలయము చేయవలయును.


పాడ్యమి మొదలుకొని పక్ష మహాలయములు చేయువారు చతుర్దశిని విడువకూడదు. తక్కిన పంచమ్యాది (పంచమి, షష్టి, అష్టమి, దశమి, ఏకాదశి) దర్శాంత పక్షము లైదింటను చతుర్దశి విడచి మిగిలిన దినము లందు మహాలయములు చేయవలయును.


 సకృన్మహాలయమందును చతుర్దశి కూడదు. మరియు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి, శుక్రవారము, జన్మనక్షత్రము, దానికి దశమము 19వ నక్షత్రము, రోహిణి, మఖ, రేవతియు సకృన్మహాలయములకు నిషిద్ధములు.


 కొన్ని గ్రంథములలో సప్తమి, త్రయోదశి ఆదివారము, మంగళవారములు నిషేధమని యున్నది. పితృ మృత తిథియందు సకృన్మహాలయము చేయుచో దానికి నిషిద్ధము లేదు.


శ్లో॥ అశక్తః పితృ పక్షేషు కరో త్యేకదినే యతః నిషిద్ధేపి దినే కుర్యా త్పిండదానం యథావిథి ॥


తాత్పర్యము : అశక్తుడు పక్షమంతటికి ఒక్కరోజునే చేయును. కనుక నిషిద్ధ దినమందైననూ యథావిధి శ్రాద్ధము చేయవచ్చును. ఇది మృతతిథి విషయము. అట్టి సందర్భము రానిచో నిషేధము లేని దినమందు చేయవలయును. అపుడును ద్వాదశి, అమావాస్య, అష్టమి, భరణి, వ్యతీపాత వీనిలో ఒకటి సంభవించినచో మృతతిథి యైనను నిషేధము లేదు.


సన్యాసులకు మహాలయము అపరాహ్ణ వ్యాప్తి గల ద్వాదశియందు పిండదానముతో చేయవలెను. మరియొక తిథియందు చేయకూడదు. చతుర్దశి మృతతిథి అయిననూ ఆ దినమందు మహాలయము కూడదు. "శ్రాద్ధం శస్త్ర హతస్యైవ చతుర్దశ్యాం ప్రకీర్తిత" అను వచనము ప్రకారము చతుర్ధశి యందు శస్త్ర హతునకే శ్రాద్ధము చేయవలయును. ఇతర శ్రాధ్ధమేమియు చేయరాదు. పూర్ణిమయందు మృతి అయిన వానికి పూర్ణిమయందు మహాలయము చేయరాదు. కృష్ణపక్షమందు మహాలయము కావున, అందు పూర్ణిమ లేదు కావున, చతుర్దశి గాని, పూర్ణిమ యందుగాని మృతుడైన వానికి ద్వాదశి, అమావాస్య మొదలగు తిధులందు చేయవలెను.


శ్లో॥ ఆదౌ మధ్యేవసానే వా యత్ర కన్యాం వ్రజేద్రవి: 

సపక్ష స్సకల శ్రేష్ఠ స్సశ్శ్రాద్ధ ష్షోడశకం ప్రతి ॥


తాత్పర్యము : ఈ మహాలయ పక్షమందు మధ్యయందు గాని, అంతమున గాని సూర్యుడు కన్యారాశియందు ప్రవేశించినచో శ్రేష్ఠము. కాని నిమిత్తము కాదు.


అమావాస్యలోగా మంచిదినము లభించని ఎడల ఆశ్వయుజ శుక్ల పంచమిలోగా జరిపించ వచ్చును. అప్పుడును సంభవించనిచో వృశ్చిక సంక్రాంతి పర్యంతములో వ్యతీపాతాది పర్వదినమందు మహాలయము చేయవచ్చును.


మృతాహమనగ ఆబ్దిక శ్రాద్ధమును, మహాలయ శ్రాద్ధమును పక్వాన్నము

చేతనే చేయవలయును గాని అపక్వ (బియ్యము) తండులాదులచే చేయ కూడదు ఎందువలన అనగా


శ్లో॥ మహాలయే గయాశ్రాద్దే మాతా పిత్రో ర్మృతేహని కృతో ద్వాహో . పికుర్వీత పిండదానం యథావిథి ॥


తాత్పర్యము : మహాలయ శ్రాద్ధమును, గయా శ్రాద్ధమును, తల్లి, తండ్రుల ఆబ్దికమును వివాహితుడైననూ యథావిధిగా పిండదానము చేయవలయును.


ఈ మహాలయ శ్రాద్ధమందు పార్వణత్రయ ముద్దేశించి చేయ వలయును. పార్వణ త్రయమనగా


1. పితృ పితామహ, ప్రపితామహులు


2. మాతృ మాతామహ, మాతృ ప్రపితామహులు


3. సపత్నీక మాతా, మాతామహ, ప్రపితామహులు


ఈ పార్వణ త్రయమును భార్య మొదలగు నేకోద్దిష్ట పితృ గణ సహిత సర్వ పితృ దేవతల నుద్దేశించి చేయుట ఒక పక్షము. 


సపత్నిక పిత్రాది త్రయమనియు, సపత్నిక మాతామహాది త్రయ మనియు పార్వణ ద్వయముగ షడ్దైవతల మాత్రము ఉద్దేశించి చేయుట రెండవ పక్షము.


 షడ్దైవతలను ఏకోద్దిష్ట గణము నుద్దేశించి చేయుట మూడవ పక్షము, ఇందొక పక్షమున ప్రతిదినమును మహాలయము చేయునది. పంచమ్యా పక్షము లందుమా చేయునది. సకృన్మహాలయము చేయుచో సర్వ పితృదేవతల నుద్దేశించి చేయవలయును.


ఎట్లు అనగా:


"పితృ పితామహ ప్రపితామహానాం, మాతృ తత్సపత్నీ పితామహి తత్స పత్నీ ప్రపితామహీ తత్సపత్నీ నామస్మత్సాపత్న్య మాతు దితివా మాతా మహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం, సపత్నికానాం యధా నామ గోత్రాణాం వసు రుద్రాదిత్య రూపాణాం పార్వణ విధినా పత్న్యాః పుత్రస్య కన్యాయా: పితృవ్యస్య మాతులస్య భ్రాతుః పితృష్వసు: మాతృష్వ సురాత్మ భగిన్యా: పితృవ్య పుత్రస్య జామాతు ర్భాగి నేయస్య శ్వశురస్య శ్వశ్ర్వా ఆచార్యస్య ఉపాధ్యాయస్య గురోః సఖ్యుశ్శిష్యస్యై తేషాం యధానామ గోత్రాణాం పురుష విషయే సపత్నికానాం, స్త్రీ విషయే సభర్తృక పాపత్యా నామేకోద్దిష్ట విధినా మహాలయా పరపక్ష శ్రాద్ధం. సకృన్మహాలయ పరపక్ష శ్రాద్ధం వా సదైవం సద్యః కరిష్యే" అని మహాలయము చేయవలయును.


పైన యుద్దేశించిన వారిలో ఎవ్వరైన జీవించియున్న ఎడల వారిని విడిచి అన్యుల నుద్దేశింపవలయును. మాతామహాదుల స్త్రీలు జీవించి యున్నచో 'సపత్నీకానాం' అను శబ్దమును విడువవలెను. భర్త జీవించి యున్నచో స్త్రీకి 'సభర్తృక' శబ్ద ఉచ్చారణమక్కరలేదు.                            శ్లో॥ మహాలయే గయా శ్రాద్ధే వృద్దౌ చా న్వష్ట కాసు చ నవదైవ తమ త్రేష్టం శేషం షాట్పౌరుషం విదుః అన్వష్టకాసువృద్ధౌచ ప్రతి సంవత్సరే తథా మహాలయే గంగాయాం చ సపిండీ కరణాత్పురా మాతు శ్శ్రాద్ధం పృథక్కార్య మన్యత్ర పతినా సహ ॥


తాత్పర్యము : మహాలయము, గయా శ్రాద్ధము, నాందీ శ్రాద్ధము, అన్వష్టకా శ్రాద్ధములు. వీటియందు మీద చెప్పినటుల తొమ్మండుగురు పితృదేవతలు, తక్కిన శ్రాద్ధములందు నలుగురు ఉండవలయును. మరియు ప్రత్యాబ్దిక మందును, సపిండీకరణమునకు ముందు చేయు శ్రాద్ధమందును మాతృశ్రాద్ధము వేరుగా చేయవలయును. తక్కిన శ్రాద్ధములు తండ్రితో కలిపి చేయవచ్చును.


కొందరు మాతా మాహాదులతో వారి భార్యలను కలుపక వేరుగ నుద్దేశించి పారణ చతుష్టయమని అనుచున్నారు. అప్పుడు 12 పితృ దేవతలని సిద్దించును. ఇట్లు మహాలయమందు ఉద్దేశించిన దేవతలనే గంగాతీర్ణ శ్రాద్ధమందు నిత్య తర్పణమందును ఉద్దేశింపవలయును.


మహాలయమందు విశ్వేదేవులు 'ధురీ విలోచనులు' అనబడుదురు. ఇచ్చట విభవము కలిగినచో విశ్వదేవతలకు ఇద్దరు విప్రులను, మూడు పార్వణములకు ఒక్కొక్కదానికి ముగ్గురు చొప్పున తొమ్మిదిమందిని, భార్యా మొదలగు ఏకోదిష్ట గణములలో ప్రతిదేవత కొక్కొక్క బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. అశక్తుడైనచో విశ్వదేవుల కొకరిని, పార్వణ త్రయమునకు ముగ్గురను, ఏకోదిష్ణ గణమంతటికిని ఒక బ్రాహ్మణుని, ఇట్లు అయిదుగురను నిమంత్రించునది.


విశ్వదేవులకిద్దరు విప్రులను నియమించుకొని నప్పుడు పితృ పార్వణము లకు తొమ్మిదిమంది కావలయును. కాని ముగ్గురు కాకూడదు. ఇట్లు తొమ్మిది మందిని పార్వణములకు నియమించునప్పుడు, విశ్వదేవులకు ఒక్కరిని నిమంత్రించరాదు. ఇంకనూ అశక్తుడైనచో పారణ ద్వయమునకు ఒక బ్రాహ్మణుని నియమించవచ్చును. మహాలయ అంతమున విష్ణువు నిమిత్తము ఒక బ్రాహ్మణుని నియమించవలెను.


కౌస్తుభమందు జీవన్మాతృకుడైనచో సపత్నీమాతకు ఏకోద్దిష్టమే గాని పార్వణ మక్కరలేదని యున్నది. సవతి తల్లు అనేకమంది అయినచో సర్వ మాతల నుద్దేశించి ఒక్క బ్రాహ్మణుని నియమించవలయును. పిండము ఒక్కటియే అర్ఘ్యపాత్రము వేరువేరుగ ఈయవలయును. తన తల్లిని కూడ కలిపినచో తనతల్లితో పాటు సవతి తల్లులందరికినీ ఒక బ్రాహ్మణుని నిమంత్రించి అర్ఘ్యము, పిండము చేసిన పార్వణము అగును కాని ప్రత్యేకముగ ఉద్దేశింప అవసరము లేదు. లేదా సపత్నీమాత లందరకును ఏకోద్దిష్టమైననూ చేయవచ్చును. లేక ఒక సపత్నీ మాతకైననూ ప్రత్యేకముగ ఏకోద్దిష్టమైననూ చేయవచ్చును.


మహాలయమందు పార్వణ త్రయము నిమిత్తమే. యగ్నౌకరణము గాని ఏకోద్దిష్టము గాని అక్కరలేదు కాని చేసిననూ తప్పు లేదు. కాని చేయు నప్పుడు ఏకోద్దిష్ట గణార్ధమై యగ్నౌకరణాంతము (మట్టిపాత్ర) పృధక్పాత్ర యందు గ్రహింప వలయును. మహాలయమందు సర్వ పార్వణములకును ఏకోద్దిష్టమునకును, పిండదాన ముత్తరణమగు సకృదాచ్చిన్న బర్హిసు ఏకముగానే గ్రహించవలయును. (అమావాస్యలలో)దర్శాదులలో ప్రతి పార్వణమునకు భిన్నముగానే అది యుండును. తక్కిన శ్రాద్ధప్రయోగమును అనేక మాతలగుచో అభ్యంజనాది మంత్రము శ్రాద్ధ సాగరమందు గాని తమతమ గృహ్య సూత్రమున గాని తెలుసుకొనవలయును,


సకృన్మహాలయము చేయునప్పుడు శ్రాద్ధాంగమయిన తిల తర్పణము పరదినమందే, సర్వ పితౄద్దేశము చేసి ప్రాతస్సంధ్యకు పూర్వమే గాని, అనంతరము గాని బ్రహ్మ యజ్ఞాంగ తర్పణము గాక వేరుగా చేయవలెను. ప్రతిపదాది, పంచమ్యాది పక్షముల యందు విప్రుల విసర్జించిన పిమ్మట శ్రాద్దపూజితులైన పితల నుద్దేశించి అప్పుడే తర్పణము చేయవలెను.


భార్య రజస్వలయైనచో మహాలయ శ్రాద్ధము కూడదు. కాలాంతర మందు చేయవచ్చును. అమావాస్య యందు రజో దోషమైననూ ఆశ్వియుజ శుక్లపంచమి లోగా జరుపవచ్చును. ప్రతిపదాది పక్షములలో ప్రారంభ దినమందు పాకము కాకముందు పత్ని రజస్వల అయినచో ఉత్తరోత్తర పక్షము స్వీకరింపవలయును. ప్రారంభమైన పిదప రజస్వల యైనచో


ఆమెను గృహాంతరమందు నిరోధించి మహాలయము జరిపింప వలెను. ఇట్లు విధవస్త్రీ భర్తకు చేయునప్పుడును ఇదే విధముగా చేయవలెను.


"మమ భర్తృ పితృ పితామహ ప్రపితామహానాం, మమ భర్తృ మాతృ పితామహీ ప్రపితా మహీనాం, మమ పితృ పితామహ ప్రపితామహానాం, మమ మాతృ పితామహి ప్రపితామహీనాం, మమ మాతామహి మాతృ పితామహ మాతృ ప్రితామహానాం, మమ మాతామహి మాతృ పితామహి మాతృ ప్రపితామహీనాం తృప్త్యర్ధం సకృన్మహాలయా పరపక్ష శ్రాద్ధం కరిష్యే" అని స్వయముగ సంకల్పించి యవి కృతముగ తక్కిన ప్రయోగ మంతయు బ్రాహ్మణునిచే చేయించవలయును.


బ్రాహ్మణుడు "---- నామ్న్యా యజమానాయా భర్తృ పితృ పితామహ, ప్రపితామహ" అని ఉచ్చరించుచు క్రియను చేయించవలెను. ఆశక్తి అయినచో "భర్త్రాదిత్రయము, స్వపిత్రాదిత్రయము, స్వ మాత్రాదిత్రయము, స్వమాతామహాది త్రయము సపత్నిక అని పార్వణ చతుష్టయమునకే యుద్దేశించి చేయవలెను.  ఇంకనూ ఆశక్తి అయినచో "స్వ భర్త్రాది స్వయం పిత్రాదిత్రయం" అని పార్వణద్వయమునే ఉద్దేశించవలెను.


మహాలయము జీవత్పితృకుడు సహితము తండ్రి సన్యసించినను పాతిత్యాది దోష యుక్తుడైననూ తండ్రియొక్క పిత్రాదుల నందరినీ ఉద్దేశించి పిండ దానములు లేకుండగ సంకల్ప విధిచే శ్రాద్ధము చేయవలెను.


 శ్లో॥ వృద్ధౌ తీర్ధే చ సన్యస్తే తా తేచ పతితే సతి   యేభ్య ఏవ సితా దద్యాత్తే భ్యో దద్యా త్స్వయం సుతాః ॥ 


తాత్పర్యము : నాందీ శ్రాద్ధాదులందును, తీర్ధ శ్రాద్దమందును, తండ్రి సన్యసించినను, పతితుడైనను, తండ్రియొక్క పిత్రాదుల నుద్దేశించి కొడుకు శ్రాద్ధము చేయునది.


శ్లో ll ముండనం పిండదానం చ ప్రేతకర్మచ సర్వశః న జీవ త్పితృకః కుర్యాద్గుర్విణీ పతిరేవచ ॥


తాత్పర్యము : క్షౌరము, పిండదానము సర్వ విధములైన ప్రేత కర్మలు జీవత్పితృకుడును, గర్భిణీపతియు చేయకూడదు.


పిండ దానాది విస్తారము చేయుట కశక్తుడైనచో సంకల్ప విధి చేయ వచ్చును. కాని సంకల్పవిధి యందు అర్ఘ్య దానము, సమంత్రకావాహనము, అగ్నౌకరణము, పిండదానము, స్వధావాచన సంకల్పము, ఓం స్వధేత్యాధికమైన స్వధావాచన ప్రయోగము చేయకూడదు.


అనేక బ్రాహ్మణులు లభించనిచో దేవస్థానమందు సాలగ్రామాది దేవతామూర్తిని స్థాపించి శ్రాద్ధము చేయవలెను. బొత్తిగ బ్రాహ్మణుడు లభించనిచో దర్భల చేత వటువును చేసి శ్రాద్ధము. తల్లితండ్రుల మృతి యందు ప్రథమాబ్దమున మహాలయము (చేయవచ్చును లేక మానవచ్చును) వైకల్పికము. మలమాసమందు మహాలయము చేయకూడదు. ఈ మహాలయ పక్షమందు (తల్లితండ్రుల ఆబ్దికము) ప్రత్యాబ్దికము ప్రాప్తించినచో మృతవిధి యందు వార్షిక శ్రాద్ధము చేసి మరియొక దినమందు మహాలయము జరిపింపవలయును. (అమావాస్య) దర్శయందు ప్రత్యాబ్దిక మైనచో పూర్వము వార్షికమున అనంతరమున సకృన్మహాలయమును. తదనంతరమున దర్శ శ్రాద్ధమును భిన్నభిన్న పాకములచే చేయవలెను. సకృన్మహాలయము మాత్రము వచ్చిననూ పూర్వము మహాలయము తదనంతరమున దర్శ శ్రాద్ధము చేయునది. మృతతిథి యందు సకృన్మహాలయమను పక్షమున దర్శకువలె ఆ తిథి అపరాహ్ణ వ్యాప్తి కావలయును.


- ధర్మసింధు

⚜ శ్రీ మంగళ మహాదేవ బిర్లా కానన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 208






⚜ ఢిల్లీ : శివాజీ మార్గ్, రంగపురి


⚜ శ్రీ మంగళ మహాదేవ బిర్లా కానన్ ఆలయం



💠 మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఆలయం ఢిల్లీలో  ఒక ప్రసిద్ధ శివాలయం మరియూ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది.


 💠అది న్యూఢిల్లీలోని రంగపురి శివాజీ మార్గ్‌ పరిస్థితి.  మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఆలయం శివుడు మరియు ఇతర దేవతల భారీ విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది.  

ఇది సుమారు 200 ఎకరాల స్థలంలో నిర్మించబడింది, ఇక్కడ అపారమైన శాంతి భావన కలుగుతుంది.


💠 మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఆలయంలో శివుని యొక్క భారీ విగ్రహం, ఇది సుమారు 100 అడుగుల ఎత్తు ఉంటుంది.  ఈ ఆలయంలో శివుడు కాకుండా పార్వతి, కార్తికేయ, నంది, సీతా రాముడు, రాధా కృష్ణ మరియు గణేష్ విగ్రహం కూడా ఉన్నాయి.  

ఈ విగ్రహాలన్నీ విశాలమైనవి మరియు కాంస్య విగ్రహం.  

దీని కారణంగా ఆలయం చాలా అందంగా మరియు అద్భుతంగా కనిపిస్తుంది.  

ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మానసిక ప్రశాంతత, హృదయానికి ప్రశాంతత చేకూరుతుంది.


💠 ఈ స్థలం యొక్క పరిశుభ్రత మరియు నిర్వహణ అత్యున్నతమైనది. 

ఎవరైనా మాట్లాడటం మీరు చాలా అరుదుగా వింటారు కాబట్టి ఈ ప్రదేశం నుండి శాంతిని అనుభవించవచ్చు. ఎడమ వైపున ఉన్న తోటలో గేటు దగ్గర ఒక చిన్న శివలింగం ఉంది.


💠 ఇక్కడ ప్రజలు ప్రార్థనలు చేస్తూ, పూజలు చేస్తూ ఉంటారు, కానీ మీరు దగ్గరికి వెళ్లేకొద్దీ, సందడి చేసే శబ్దం మరియు శివలింగంపై పదుల సంఖ్యలో తేనెటీగలు గుంపులుగా తిరుగుతున్న దృశ్యం మిమ్మల్ని వెంటనే భయపెడుతుంది! అయినప్పటికీ, ఇప్పటివరకు ఈ ప్రదేశంలో భక్తులను కందిరీగలు గాయపరచిన దాఖలాలు లేవు. నిజంగ విచిత్రమైన విషయం కదా


💠 1960లో పారిశ్రామికవేత్త దివంగత జి.డి బిర్లా నిర్మించిన పార్క్. ఇది దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్ సమీపంలో ఉంది మరియు నగరంలో అతను నిర్మించిన రెండు పార్కుల్లో ఇది ఒకటి.  

ఈ ఉద్యానవనం 1980 నుండి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యానవన శాఖచే అభివృద్ధి చేయబడింది మరియు నిర్వహించబడుతుంది. 

ఈ ఉద్యానవనానికి  మంగళ్ మహాదేవ్ (శివుడు') అని పేరు పెట్టారు.

 

💠 మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఢిల్లీలోని నైరుతి ప్రాంతంలో ఉన్న ఒక తోట.  ఇది ప్రసిద్ధ తుగ్లకాబాద్ కోటకు సమీపంలో ఉంది మరియు నగరంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.  

ఈ గార్డెన్ 2011 సంవత్సరంలో ప్రజల కోసం తెరవబడింది మరియు దీనిని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) నిర్వహిస్తుంది.  ఇది మొత్తం 6.5 హెక్టార్ల (16.2 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది.  


💠 ఉద్యానవనం రెండు భాగాలుగా విభజించబడింది, అవి 'బిర్లా కానన్' ప్రధాన ఉద్యానవనం మరియు 'మంగల్ మహాదేవ్' బిర్లా కానన్ లోపల ఒక చిన్న తోట.  

మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి గొప్ప ప్రదేశం. 

 

💠 ఢిల్లీలోని మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ భారతదేశంలోని ఇతర దేవాలయాల్లోనూ ఆచరించే శివుని ఆరాధననే అనుసరిస్తారు.  కొన్ని ఆచారాలు క్రింది విధంగా ఉన్నాయి: -


💠 శివునికి 'పంచామృతం' సమర్పించడంతో ప్రారంభమవుతుంది.  -‘పంచామృతం’ సమర్పించిన తర్వాత, శివుని అభిషేకం నిర్వహిస్తారు.  

ఇందులో నీరు, పాలు, నెయ్యి, తేనె మరియు ఇతర ద్రవ పదార్ధాల సమర్పణ ఉంటుంది. 


💠 ఢిల్లీలోని మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ వారానికి ఏడు రోజులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంటుంది.  


💠 ఈ గమ్యస్థానానికి సమీప మెట్రో స్టేషన్ రాజీవ్ చౌక్ (నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్). 

 ఇక్కడ నుండి, ఇది సుమారుగా 4.4 కిమీ దూరంలో ఉంది.

గొప్ప లు సాధించలేనప్పుడు

 *1959*(గొప్ప పద్యం🙂)

*కం*

గొప్పలు సాధించనపుడు

గొప్పగ తమసంతునెల్ల గుర్తించుగతిన్

గొప్పగ యత్నించగ మన

గొప్పదనము సార్థకమగు గొప్పగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గొప్ప లు సాధించలేనప్పుడు తమ సంతానము గొప్పగా గుర్తింపు పొందే విధంగా గట్టి ప్రయత్నం చేయగా మన గొప్పదనం సార్థకమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సిద్దాంతి గారి సలహా..*

 *సిద్దాంతి గారి సలహా..*


"నమస్కారమండీ..నా పేరు మంగళగౌరీ..మేము రాబోయే శని ఆదివారాల్లో మొగిలిచెర్ల వచ్చి..అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..శనివారం ఉదయానికి అక్కడికి వస్తామండీ..మంగళవారం ఉదయం తిరిగి వెళ్లిపోతాము..ఆ క్షేత్రం లో మొత్తం మూడు రోజులు నిద్ర చేయాలని అనుకున్నాము..మాతోపాటు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు..వాళ్ళకొఱకు ఏదైనా బస ఏర్పాటు చేయగలరా?..నేనూ మావారూ మా పిల్లలిద్దరూ అందరమూ స్వామివారి సన్నిధిలో పడుకుంటాము.." అని ఆవిడ నన్ను అడిగారు..మా సిబ్బందిని విచారిస్తే..ఒక గది ఖాళీ ఉందని చెప్పారు..ఆ మాటే ఆవిడతో చెప్పి..గదిని వారి కొఱకు అట్టి పెట్టాము..


ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక కారు లో మంగళగౌరి గారి తన సంసారం తో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..తనను తాను పరిచయం చేసుకొని..తమ కొఱకు కేటాయించిన గది వద్దకు వెళ్లిపోయారు..మరో గంట తరువాత..మంగళగౌరి గారు తన భర్త, పిల్లలు తో కలిసి మందిరం లోపల నేను కూర్చున్న చోటుకి వచ్చి.."ప్రసాద్ గారూ..స్వామివారి పల్లకీసేవ సాయంత్రం అని చెప్పారు..ఈలోపల మేము మాలకొండకు వెళ్లి..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వస్తాము..మధ్యాహ్నం మీతో మాట్లాడాలి..మీకు వీలవుతుందా?.." అని అడిగారు.."మీరు ముందు మాలకొండకు వెళ్ళిరండి..ఇక్కడికి వచ్చిన భక్తుల తో మాట్లాడటానికి కూడా తీరిక లేనంతగా నేను లేను..నేను ఇక్కడ ఉన్నదే మీలాంటి వారి సందేహాలు తీర్చడానికి.." అన్నాను..మంగళగౌరి గారు మాలకొండకు వెళ్లి, మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకు తిరిగి వచ్చారు..


ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..తన భర్త, పిల్లలతో కలిసి నావద్దకు వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చామండీ..మా వారు పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారండీ..ఉద్యోగరీత్యా తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి..నెలలో కనీసం ఇరవై రోజులు అలా తిరుగుతూనే వుంటారు..ఇంటిని, పిల్లలనూ నేనే చూసుకోవాలి..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు..ఇప్పుడు సమస్య ఏమిటంటే..మా అబ్బాయి తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..నెలలో పది పదిహేను రోజులు నీరసంగా ఉంటున్నాడు..డాక్టర్ల కు చూపించాము..ఏవేవో పరీక్షలు చేశారు..లోపల జబ్బేమీ లేదు..బలానికి మందులు వాడండి..అని చెప్పారు..వీడేమో మనిషి తగ్గిపోతున్నాడు..నాకు బెంగ పట్టుకున్నది..మా వారితో చర్చించాను..మా సిద్దాంతి గారిని సలహా ఆడిగాము..ఆయన వీడి జాతక చక్రం చూసి..గ్రహదోషం ఉన్నది..నివారణ కొఱకు ఇక్కడికి వెళ్ళమని చెప్పారు..ఆయనే మమ్మల్ని ఈ క్షేత్రం లో  మూడు రాత్రులు నిద్రలు చేయమని చెప్పారు..వారు మాతో చెప్పేదాకా ఇక్కడ ఇలాంటి అవధూత మందిరం వున్నదని మాకు తెలీదు..ఆ తరువాత మీతో ఫోన్ లో మాట్లాడాము.." అన్నారు.."సరేనమ్మా..మీ సిద్దాంతి గారు చెప్పిన విధంగా నే ఇక్కడ వుండండి.." అన్నాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..శనివారం రాత్రి, ఆదివారం రాత్రి కూడా ఆ దంపతులు తమ పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..సోమవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ అనంతరం అర్చకస్వాములు భక్తులకు తీర్ధం ఇవ్వసాగారు..ఈ కుటుంబం కూడా స్వామివారి తీర్ధాన్ని స్వీకరించారు..ఆ తరువాత పది పదిహేను నిమిషాల కు ఆ పిల్లవాడు స్వామివారి మంటపం లోనే ఒక ప్రక్కగా పడుకున్నాడు..కొద్దిసేపటి తరువాత..ఉన్నట్టుండిఆ అబ్బాయి మెలికలు తిరిగిపోతూ..ఆ మంటపం అంతా పొర్లాసాగాడు..ఇదంతా చూస్తున్న మంగళ గౌరి గారు బాగా భయపడి పోయారు..ఆ అబ్బాయి తండ్రి మాత్రం ..పిల్లవాడిని పట్టుకొని వున్నారు..దాదాపుగా రెండు గంటల సేపు అలా జరిగిన తరువాత..ఆ పిల్లవాడు సొమ్మసిల్లి పడుకొని నిద్ర పోయాడు..


"అమ్మా ఇక మీరు భయపడకండి..అబ్బాయి తెప్పరిల్లుతాడు..కోలుకుంటాడు.."అని మా అర్చకస్వామి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి..స్వామివారి తీర్ధాన్ని అబ్బాయి నోట్లో పోశారు..మరో అరగంట తరువాత..ఆ అబ్బాయి కళ్ళు తెరచి చూసాడు..ఆరోజు మధ్యాహ్నం నాటికి ఆ పిల్లవాడి ముఖం లో నైరాశ్యం పోయింది..ఉషారుగా వున్నాడు..మంగళగౌరి గారి భర్తగారు తమ సిద్దాంతి గారితో ఫోన్ లో ఇక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు..మరో రెండు రోజుల పాటు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి సన్నిధిలోనే వుండమని ఆయన సలహా ఇచ్చారు..బుధవారం వరకూ మంగళగౌరి గారి కుటుంబం స్వామివారి మందిరం వద్దే వున్నారు..రోజూ రెండుపూటలా స్వామివారి సమాధి దర్శించుకున్నారు..గురువారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వాళ్ళ ఊరు వెళ్లారు..


మరో నెలరోజుల తరువాత మంగళగౌరి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..మా వాడు పూర్తిగా కోలుకున్నాదండీ..కాలేజీకి వెళుతున్నాడు..చక్కగా చదువుకుంటూ వున్నాడు..త్వరలో మళ్లీ వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళతాము..మా సిద్దాంతి గారు కూడా మాతో వస్తామంటున్నారు..వారినీ తీసుకొని వస్తాము.." అన్నారు..


గత నెలలో మంగళగౌరి గారి కుమారుడు ఒక్కడే మొగిలిచెర్ల కు శ్రీ స్వామివారి దర్శనం కోసం వచ్చాడు.."నాకు జీవితాన్ని ఈ స్వామివారే ప్రసాదించారు అంకుల్..ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ..నా కాళ్ళమీద నేను నిలబడటానికి ఈ స్వామివారే కారణం..వీలున్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళుతుంటాను..మా సిద్దాంతి గారి సలహా..స్వామివారి తీర్ధం..ఈరెండూ నేను మర్చిపోలేను.." అని భక్తి గా చెప్పాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

సనాతనధర్మానికి శత్రువు హిందువే.

 సనాతనధర్మానికి శత్రువు హిందువే.


దైవం మాట ఎత్తితే చాలు టైం లేదు అంటాడు. 

అన్యమతస్థులకు ఎక్కడి నుండి వస్తుంది టైం?

నీకంటే కూడా గొడ్డు చాకిరి చేస్తారు. కానీ పిల్లలకి చిన్ననాటి నుండే మతబోధ చేస్తారు. మనం చేయం. 


పోనీ చేసేవారిని సపోర్ట్ చేస్తారా అంటే అదీ ఉండదు. నీకెందుకు అంటారు. పిల్లలు ఈ విషయం మీద ఏదన్నా మాట్లాడితే ఈ వయస్సులో దేనికి నీకు అంటారు. టైం ఉండదు. చిన్నప్పుడు నేర్పక, వయస్సు లో చేయక ఎప్పుడు చేస్తారు?


అందుకే హిందువులలో ఉన్నవారు కన్వర్ట్ అవుతారు కానీ అన్యమతస్థులలో కన్వర్షన్ చాలా తక్కువ. మనవాళ్ళు 1000 మంది వెళితే అవతలివారిలో మహా అయితే ఓ 10మంది ఉంటారు..


ధర్మాన్ని ఎవరో వచ్చి నిలబెడతారు. ఎవరో వచ్చి కాపాడతారు అని యువతని సనాతనాధర్మానికి దూరం చేసేశారు. దేవుడంటే కోరికలు తీర్చేవాడుగా చేశారు. దేవాలయాలు ఈ బలహీనతలని కేవలం పూజలు, 2నిముషాలు దండ పెట్టి దర్శనాలు అంటూ పరిమతి  చేసినంము.పిల్లలకి గాని, యువతకి కానీ ధర్మం చెప్పేవారు లేరు. బోధించేవారు అసలే లేరు. ఒకరిద్దరు ఏదన్నా బోధిద్దామని ప్రయత్నిస్తే భాషాజ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పట్టి వారిని అవమానిస్తున్నారు. 


మనం మాత్రం సంపాదించాలి. మేడలు కట్టాలి. ధర్మం మాత్రం బోధించకూడదు. అదేమంటే వీటికే సమయం లేదు.

అన్యమతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పిల్లలకి నేర్పుతున్నారు. మనకి ఎందుకు సమయం ఉండదో మరి..ధన్యవాదములు.🙏👍

పద్యం చదవండి..

 *"ఈ క్రింది పద్యం చదవండి..!"*


  *"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"*

*"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"*


భావం


*"మనమే = మనం అందరమూ....,"*


 *"మనమని = శాశ్వతం కాదని"*

,

 *"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"*


*"మనుమని మనుమని మనుమని"* = 

*"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"*


*"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"*


*"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"*


*"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"*


*"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"*


*"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"*


*"మౌనమే = మౌనంగా"*


 *"మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"*


*"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"*


*"ఎంతో లోతైన  జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా  మోక్ష పదమైన మకారంతో  మలిచారు."*


 *" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం  మినహా..!!"*


*శివాయ గురవే నమః!!*

🙏

ఆలోచనాలోచనాలు

 %%% ఆలోచనాలోచనాలు %%%                                    ----౦0 శ్రమ -- సోమరితనం  0౦----                                 ***** శరీరయాత్రాపిచతే, నప్రసిద్ధ్యేన కర్మణా!--- భగవద్గీత. ( ఏ పని చెయ్యకుండా కూర్చుంటే దేహయాత్ర కూడా సాగదు, ఓ అర్జునా!)                        ***** సర్వమాత్యయికం కార్యం, శృణుయాన్నాతి పాతయేత్! కృచ్ఛ్రసాధ్యమతికాస్త మసాధ్యం వా విజాయతే!!  (చెయ్యాల్సిన పనిని వాయిదా వెయ్యకుండా వెంటనే పూర్తి చెయ్యాలి, తప్ప తాత్సారం చెయ్యకూడదు. జాగుసేత వలన ఆ కార్యం అసాధ్యం అయ్యే ప్రమాదం ఉంది.)         ***** సోమరిపోతుకు చదువు రాదు. విద్యలేనివానికి ధనమెక్కడిది? ధనహీనునకు మిత్రులెక్కడ? మిత్రులు లేనివానికి సుఖం ఎక్కడిది? ( అలసస్య కుతో విద్యా? --- తెలుగు అనువాదం.                          ***** సోమరిపోతు తన కుటుంబానికే కాదు; ఈ లోకానికి కూడా బరువు చేటు;                                   ***** మంచి పనులను చెయ్యడానికి బద్ధకించకండి. ఆలస్యం అనర్థాలకు మూలం. ఆనకట్టలు లేని నదుల నీళ్ళు ఉప్పుసముద్రం పాలేకదా?                                      ***** జీవితంలో ఎన్నడూ తప్పులు, పొరబాట్లు చెయ్యనివారు మరణించిన వారే కదా! గత నాలుగు వేల సంవత్సరాలుగా ఒక్క తప్పుకూడా చెయ్యని ఒక వ్యక్తిని నేను ఇటీవలే చూచాను. అతడెవరోకాదు. ఈజిప్ట్ పిరమిడ్లలో విశ్రాంతి తీసుకొంటున్న మమ్మీ!( శవం.)                                    ***** కృషి చెయ్యకుండా ఎవరూ, దేనినీ సాధించలేరు. చివరకు వరాలిచ్చే దేవతలు కూడా (రాక్షసుల సహాయంతో) పాలసముద్రాన్ని అనంతకాలం మథించిన అనంతరమే అమృతాన్ని పొందారు.                             ***** సోమరితనం వచ్చి వ్యక్తి భుజాలపై కూర్చుంటే, చిప్ప పట్టుకొని అడుక్కుతినేదాకా అది క్రిందికి దిగదు.                       ***** జీవిస్తున్న మనిషి తనకుతాను కట్టుకొంటున్న సమాథినే లోకం "" సోమరితనం"" అనే అందమైన పేరుతో పిలుస్తూఉంటుంది.                ***** సోమరితనం ద్వారా సులువుగా జరిగే పనులు జటిలమవుతాయి. శ్రమించడం ద్వారా జటిలమైన పనులు సులువుగా నెరవేరుతాయి.    ***** తేనెతుట్టెలో పనిచేసే తేనెటీగలు శ్రమను వినోదంగా పరిగణిస్తాయి. తినికూర్చొని, సంతానోత్పత్తి మాత్రమే చెయ్యగలిగిన " మగ ఈగలు" కరువు కాలంలో చంపివేయబడతాయి.           ***** శ్రమించడం ద్వారా , శరీరం ఆరోగ్యాన్ని, మనస్సు నిర్మలత్వాన్ని, హృదయం సంతృప్తిని, జేబులు నోట్లకట్టలను పొందుతాయి.                           ***** మీలోని ప్రతిభ బంగారం అయితే, మీరు ఇష్టపడే శ్రమ దానిని మీరు ధరించే అందమైన ఆభరణంగా మారుస్తుంది.     ***** సోమరితనం కాపురానికి రాగానే అప్పటి వరకు మీకు తోడుగా ఉన్నటువంటి " ఆనందం" విడాకులు తీసుకొంటుంది. ఇది ప్రకృతి ఏర్పరచిన నియమం.                                ***** పనిచేసే వ్యక్తిని ఒక దయ్యమే బాధిస్తుంది. అది "పని దయ్యం." శ్రమించని వ్యక్తిని పదివేల దయ్యాలు బాధిస్తూవుంటాయి.                ***** మిమ్మల్ని సోమరితనం మోసగించడానికి అవకాశం ఇవ్వకండి. మీరు దానికి " నేడు" ను మాత్రమే ఇచ్చారనుకోండి. అది "రేపు" ను కూడా వాడుకొనేంత నేర్పరి.             ***** సోమరితనం, దరిద్రం అక్కాచెల్లెళ్ళు. వాటిమధ్య పరుగుపందెం ఏర్పాటుచేస్తే, దరిద్రం ముందు వెళ్ళి, చెల్లెలు సోమరితనానికి " ఆహ్వానం" పలుకుతుంది.          ***** లోకంలో అన్ని జాతుల వారు, మతాలవారు, భాషలవారు, ప్రాంతాలవారు తమతమ సంఘాలను ఏర్పరచుకొని బలంగా, దృఢంగా ఉంటారు, ఒక్క సోమరిపోతులు తప్ప. ఎందుకంటే వారు సంఘంగా ఏర్పడాలంటే ఉన్నచోటునుండి , ఎంతోకొంత కదలాలి కదా! అది వారితో అయ్యేపని కాదు.                                     ***** శ్రమలోనే ఆరోగ్యం ఇమిడివుంటుంది. " రన్నింగ్ లో ఉన్న వాహనపు బాటరీ" దానంతట అదే ఛార్జ్ అవుతూవుంటుంది. షెడ్ లో ఉన్న కొత్త కారైనా తిరగకపోతే బాటరీ దానంతట అదే "డౌన్" అవుతుంది. మనిషి లో దాగివున్న "" శక్తియుక్తులు'" కూడా ఇటువంటివే! కాబట్టి " సోమరితనానికి" వీడ్కోలు పలికి, "శ్రమశక్తి" ని ఆహ్వానిద్దాం.                    తేది 14--10--2023, శనివారం, శుభోదయం.

_అక్టోబరు 14, 2023_*

 శుభోదయం... నేటి పంచాంగం   *ఓం శ్రీ గురుభ్యోనమః* 

  *_అక్టోబరు 14, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *అమావాస్య* 

రా10.28

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం : *హస్త* సా4.41

యోగం: *ఐంద్రం* ఉ11.45

కరణం: *చతుష్పాత్* ఉ9.45

నాగవ* రా10.28

వర్జ్యం: *రా1.14-2.57*

దుర్ముహూర్తము: *ఉ5.56-7.29*

అమృతకాలం: *ఉ11.09-11.54*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *కన్య*

చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *5.55*

సూర్యాస్తమయం: *5.38*

సర్వే జనాః సుఖినోభవంతు*

*మహాలయ అమావాస్య **

Kerala former


 

Skin diseases


 

Zip striching


 

Eternal water flower


 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

రెండేళ్ళ తరవాత మళ్ళీ గర్భం ధరించాను. సర్వశుభలక్షణ సంయుతుడై మళ్ళీ మగపిల్లవాడే

జన్మించాడు. ఇతడికి సుధన్వుడని పేరు పెట్టారు.

ఇలా నాకు మొత్తం పన్నెండుమంది మగపిల్లలు కలిగారు. వాళ్ళ ఆలనాపాలనలతో నేను

పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయాను. ఆ తరవాత మరో ఎనిమిదిమందిని ప్రసవించాను. నా గార్హస్థ్య

జీవితం పరిపూర్ణంగా చరితార్థమయ్యిందని సంబరపడ్డాను. ఎంతగానో మురిసిపోయాను.

యుక్తవయస్సులు రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాము. కోడళ్ళతో

మనుమలూ మనుమరాండ్రతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచింది. ఒక్కొక్కసారి వీళ్ళకి

చిన్నచిన్న అనారోగ్యాలు చెయ్యడం దానికి నేను విలవిలలాడిపోవడం, మరొకప్పుడు వీళ్ళలో వీళ్ళు

కలహించుకోవడం, నేను బాధపడటం. కోడళ్ళ తగువులు. మనుమళ్ళ గిల్లికజ్జాలు. మనుమరాండ్ర

ఆటపాటలూ, సుఖదుఃఖాల సమ్మిశ్రంగా సాగుతున్న సంసారమహార్ణవంలో నిండా మునిగిపోయాను.

పూర్వపు విజ్ఞానమూ శాస్త్రజ్ఞానమూ అంతా మరుగున పడిపోయింది. స్త్రీస్వభావంతో ఇంటి

పనుల్లో తలమునిగిపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రులు మహాబలశాలులు.

నా కోడళ్ళు గుణవంతురాండ్రు. నా మనమలూ మనమరాండ్రూ ఆరోగ్యవంతులు. ఈ లోకంలో నాకన్నా

ధన్యురాలెవరు? ఇలాంటి ఆలోచనలతో అహంకరించానే తప్ప, అయ్యో! నేను నారదుణ్ణి కదా,

భగవంతుడు వంచించాడు. ఇలా ఆడదానినై సంసారకూపంలో పడిపోయానుగదా అని ఏనాడూ

విచారించలేదు. అటువంటి ఆలోచనే రాలేదనలు. కృష్ణద్వైపాయనా! నేను మహారాజ్ఞిని. శుభాచారను.

బహుపుత్రవతిని పతివ్రతను. పరమధన్యురాలనుకదా అనుకుంటూ సంసారసమ్మోహమే పొందాను.

నారదో ఽహం భగవతా వంచితో మాయయా కిల |

న కదాచి న్మయాప్యేవం చింతితం మనసా కిల ॥

రాజపత్నీ శుభాచారా బహుపుత్రా పతివ్రతా |

ధన్యాహం కీల సంసారే కృష్ణైవం మోహితస్త్యహమ్ ॥ (29 - 39, 40

మహాభారతములో - ఆది పర్వము* *ద్వితీయాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *23*


*సర్పయాగము*


*జనమేజయునకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమైయ్యాడు. కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అన్నారు. ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్విక్కులను రప్పించి సర్పయాగానికి ఏర్పాట్లు చేసాడు. ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో  సర్పయాగం మంచిదే కాని ఈ యాగం పూర్తికాదు. మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు. అయినా జనమేజయుడు ఆగకుండా సర్పయాగం ఆరంభించాడు.*


*యాగం మొదలైంది. పాములన్ని యాగంలోపడి మరణిస్తున్నాయి. తక్షకుడు ఇది చూసి కలత చెందాడు. ఇంద్రుని వద్దకు శరణు వేడాడు. ఇంద్రునికి బ్రహ్మ దేవుడు కొన్ని పాములకు అభయం ఇచ్చిన సంగతి తెలుసు. కనుక తక్షకా నీకేమి భయం లేదు అని చెప్పాడు. తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు అర్ధం చేసుకుని ఋత్విక్కులు ఇంద్రునితో సహా తక్షకుని యాగానికి ఆహ్వానిచారు. ఇంద్రుడు భయపడి  తక్షకా నీవు నీ దారిన వెళ్ళు. ఇక నేను నిన్ను రక్షించ లేను అన్నాడు. పెద్ద పాములన్నీ సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలితో అమ్మా పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి. ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఊంది. నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తీకుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. కనుక ఆస్తీకుని పంపి ఈ యాగాన్ని ఆపించు  అన్నాడు. అది విన్న జరత్కారువు ఆస్తీకుని పిలిచి "కుమారా నీ మేనమామ మాట విన్నావు కదా నీవు వెళ్ళి సర్పయాగాన్ని నిలుపు అని కోరింది.*


*ఆస్తీకుడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తీకుడు బయలు దేరి వెళ్ళి జనమేజయునితో జనమేజయా నీ పూర్వీకులైన రఘువు, మాంధాత, దశరధుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి అయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది. సర్వ శాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించ బడుతుంది. వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు. ఆ స్తుతికి సంతోష పడి జనమేజయుడు ఆస్తీకునితో మహాత్మా ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు.  ఆస్తీకుడు జనమేజయా ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు అన్నాడు. గొప్ప తపస్వి అయిన ఆస్తీకుడు కోరాడు కనుక జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు. ఆస్తీకుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు.*

⚜ శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్

 🕉 మన గుడి : నెం 206






⚜ ఢిల్లీ : ఝాన్డే వాలన్


⚜ శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్ 



💠 ఆది శక్తి మా జందెవాలి మా దుర్గా దేవి అవతారం.  

సృష్టిలో నైతిక క్రమాన్ని మరియు ధర్మాన్ని కాపాడే పరమాత్మ శక్తిని ఆమె సూచిస్తుంది.  ఆమె ఎరుపు రంగును ధరించి, అనేక ఆయుధాలను పట్టుకుని, తన వాహనం (పులి)పై ప్రయాణిస్తుంది, ఇవన్నీ ఆమె అపారమైన మరియు అపరిమితమైన శక్తిని సూచిస్తాయి, ఇది ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది.


💠 ఝండేవాలన్ మాత ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉండేదని, మాతరణి యొక్క గొప్ప భక్తుడైన బద్రీ భగత్ ఆమె గురించి కలలు కన్నాడని మరియు ఆమె ఈ విగ్రహం గురించి అతనికి చెప్పిందని చెబుతారు.  

ఈ ప్రదేశంలో బద్రీ భగత్ అమ్మవారి విగ్రహాన్ని తవ్వినప్పుడు, విగ్రహం భూమిలో కనిపించింది, అయితే దురదృష్టవశాత్తు తల్లి విగ్రహం త్రవ్వినప్పుడు చేతులు విరిగిపోయాయి.

హిందూ గ్రంధాల ప్రకారం, విరిగిన విగ్రహాన్ని పూజించడం నిషేధించబడింది, అందుకే వెండి చేతులు తయారు చేయబడ్డాయి. 

ఇది ఇప్పటికీ ఆలయ గుహలో సురక్షితంగా ఉంచబడింది.



💠 దీని తరువాత అదే స్థలంలో ఝండేవాలన్ ఆలయం నిర్మించబడింది మరియు దీనిని శ్రీ బద్రీ భగత్ ఝండే వాలా మందిర్ అని కూడా పిలుస్తారు.  

ఇక్కడికి కుల, హోదా అనే తేడా లేకుండా అందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు.


💠 అది కొండ ప్రాంతం కాబట్టి గుడి ఆవరణలో పెద్ద పెద్ద జెండాలు అప్పట్లో పెట్టారు  తద్వారా ఆలయాన్ని చాలా దూరం నుండి చూడవచ్చు అని.

ఆ రోజులలో భక్తులు మా ఆది శక్తికి ప్రార్థన జెండాలను అధిక సంఖ్యలో సమర్పించారు కనుక దీనిని ఝండేవాలన్ దేవాలయం అంటారు.


💠 ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, ఆలయ పవిత్ర వాతావరణం ఒక వ్యక్తిలో పవిత్రతను నింపుతుంది. అందమైన శిల్పకళతో, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయాన్ని పువ్వులు, దీపాలతో అలంకరించి, భారీ సంఖ్యలో జనాలతో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. 


💠 ఇందులో మా జందెవాలి విగ్రహం మరియు సరస్వతి మరియు కాళీ విగ్రహం ఇతర దేవుళ్ళతో పాటు ఉన్నాయి. ఇది కాకుండా, ఆలయం యొక్క దిగువ స్థాయికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో శివపూజ చేయడం కోసం మంత్రముగ్ధులను చేసే శివ మందిరం కూడా ఉంది


💠 ఆలయం అద్భుతంగా చెక్కబడింది మరియు కొన్ని స్తంభాలు బంగారంతో చెక్కబడ్డాయి.  

ఈ కాంప్లెక్స్‌లో మా ఆది శక్తితో పాటు అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి.


💠 గుహలో రెండు దీపాలు 8 దశాబ్దాలుగా వెలుగుతున్నాయి.  ఆలయంలో నవరాత్రులలో ప్రతిరోజూ భారీ అన్నదానం నిర్వహిస్తారు.  నవరాత్రి సమయంలో వేలాది మంది ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 అన్ని ప్రధాన పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు 'బద్రీ భగత్ ఝండేవాల్ మందిర్ సొసైటీ' ద్వారా ఆలయంలో నిర్వహించబడతాయి.

ముఖ్యంగా దుర్గాపూజ మరియు నవరాత్రి పండుగలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 ఆలయ సమయం : 

ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:00 వరకు (పండుగల సమయంలో సమయాలు మారవచ్చు)


మంగళ ఆరతి- 5:30 AM

శృంగార్ ఆరతి- 9:30 AM

భోగ్ ఆరతి- 12:00 మధ్యాహ్నం

సాయంత్రం ఆరతి- 7:30 PM

రాత్రి ఆరతి- 10:00


💠 ఎలా చేరుకోవాలి ?

బ్లూ లైన్‌లో ఉన్న ఝండేవాలన్ మెట్రో స్టేషన్‌లో దిగాలి.  ఆలయం 5-10 నిమిషాల నడక దూరంలో ఉంది.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

రెండేళ్ళ తరవాత మళ్ళీ గర్భం ధరించాను. సర్వశుభలక్షణ సంయుతుడై మళ్ళీ మగపిల్లవాడే

జన్మించాడు. ఇతడికి సుధన్వుడని పేరు పెట్టారు.

ఇలా నాకు మొత్తం పన్నెండుమంది మగపిల్లలు కలిగారు. వాళ్ళ ఆలనాపాలనలతో నేను

పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయాను. ఆ తరవాత మరో ఎనిమిదిమందిని ప్రసవించాను. నా గార్హస్థ్య

జీవితం పరిపూర్ణంగా చరితార్థమయ్యిందని సంబరపడ్డాను. ఎంతగానో మురిసిపోయాను.

యుక్తవయస్సులు రాగానే అందరికీ యథాక్రమంగా వివాహాలు జరిపించాము. కోడళ్ళతో

మనుమలూ మనుమరాండ్రతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచింది. ఒక్కొక్కసారి వీళ్ళకి

చిన్నచిన్న అనారోగ్యాలు చెయ్యడం దానికి నేను విలవిలలాడిపోవడం, మరొకప్పుడు వీళ్ళలో వీళ్ళు

కలహించుకోవడం, నేను బాధపడటం. కోడళ్ళ తగువులు. మనుమళ్ళ గిల్లికజ్జాలు. మనుమరాండ్ర

ఆటపాటలూ, సుఖదుఃఖాల సమ్మిశ్రంగా సాగుతున్న సంసారమహార్ణవంలో నిండా మునిగిపోయాను.

పూర్వపు విజ్ఞానమూ శాస్త్రజ్ఞానమూ అంతా మరుగున పడిపోయింది. స్త్రీస్వభావంతో ఇంటి

పనుల్లో తలమునిగిపోయాను. నాలో ఒక అహంకారం బయలుదేరింది. నా పుత్రులు మహాబలశాలులు.

నా కోడళ్ళు గుణవంతురాండ్రు. నా మనమలూ మనమరాండ్రూ ఆరోగ్యవంతులు. ఈ లోకంలో నాకన్నా

ధన్యురాలెవరు? ఇలాంటి ఆలోచనలతో అహంకరించానే తప్ప, అయ్యో! నేను నారదుణ్ణి కదా,

భగవంతుడు వంచించాడు. ఇలా ఆడదానినై సంసారకూపంలో పడిపోయానుగదా అని ఏనాడూ

విచారించలేదు. అటువంటి ఆలోచనే రాలేదనలు. కృష్ణద్వైపాయనా! నేను మహారాజ్ఞిని. శుభాచారను.

బహుపుత్రవతిని పతివ్రతను. పరమధన్యురాలనుకదా అనుకుంటూ సంసారసమ్మోహమే పొందాను.

నారదో ఽహం భగవతా వంచితో మాయయా కిల |

న కదాచి న్మయాప్యేవం చింతితం మనసా కిల ॥

రాజపత్నీ శుభాచారా బహుపుత్రా పతివ్రతా |

ధన్యాహం కీల సంసారే కృష్ణైవం మోహితస్త్యహమ్ ॥ (29 - 39, 40

14-10-2023* *రాశి ఫలితాలు

 *శని వారం*

 *స్థిర వాసరః*

  *14-10-2023*

   *రాశి ఫలితాలు*

*మేషం*

ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో  కార్యజయం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

*వృషభం*

చేపట్టిన  పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. ఇంటా బయట  యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*మిధునం*

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.   ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలొ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

*కర్కాటకం*

కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణ ఉత్సాహంగా ఉంటుంది. 

*సింహం*

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

*కన్య*

ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధస్తారు. 

*తుల*

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. 

*వృశ్చికం*

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయట పడ గలుగుతారు.

*ధనస్సు*

సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

*మకరం*

కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన  పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహపరుస్తాయి. 

*కుంభం*

ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలొ అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

*మీనం*

 దైవ సేవా  కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.  పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి.  ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

🕉️

గొప్పలు సాధించనపుడు

 *1959*(గొప్ప పద్యం🙂)

*కం*

గొప్పలు సాధించనపుడు

గొప్పగ తమసంతునెల్ల గుర్తించుగతిన్

గొప్పగ యత్నించగ మన

గొప్పదనము సార్థకమగు గొప్పగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గొప్ప లు సాధించలేనప్పుడు తమ సంతానము గొప్పగా గుర్తింపు పొందే విధంగా గట్టి ప్రయత్నం చేయగా మన గొప్పదనం సార్థకమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Natural remedy for good eyesight

Good natural remedy for Eye sight 

చమత్కార శ్లోకం

 ఒక చమత్కార శ్లోకం


వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః

వాసోవిహీనం విజహాతి లక్ష్మీః

పీతాంబరం వీక్ష్య దదౌ స్వపుత్రీం

దిగంబరం వీక్ష్య విషం సముద్రః

Purvikula vastuvulu

 https://youtu.be/vKJeqOutCgw?si=8T1wUKPoOLiZX-i6


Cheating


 

Atimutra vyadhi


 

Yalakulu


 

Glass water bottle Tirupati


 

Sivaalayam


 

Circuses


 

Snake coughing


 

Pump

 https://youtube.com/shorts/TJaQJFBBm5w?si=q5AIoX_TQzbhWgJ4


Balloon


 

Crow


 

Mechanical pedaling


 

Low pressure pump

 


Fan making

 https://youtube.com/shorts/Hx7HRYEq0VU?si=2rLxttjxRm7Tur0G


Water flow


 

విదురనీతి

 విదురనీతి


విదుర ఉవాచ = విదురుడు పలికెను.


శ్లో)అతీతాయాం చ శర్వర్యాముదితే సూర్యమండలే

ఆథౌ జగామ తం దేశం సుధన్వా రాజ సత్తమ॥ 


అ)రాజశ్రేష్ఠా! ఆ రాత్రి గడిచి మరునాడు సూర్యోదయం కాగానే సుధన్వుడు ఆప్రదేశానికి వచ్చినాడు

ఉద్ధవగీత

 ఉద్ధవగీత

శ్లో)ఉపగాయన్ గృణన్ నృత్యన్ కర్మాణ్యభినయన్మమే | మత్కధాః శ్రావయన్ శృణ్వన్ ముహూర్తం క్షణికో భవేత్ ॥


అ)అనంతరము నా కథలను గానము చేయుచు, కీర్తించుచు, అన్యులకు వినిపించుచు, తాను స్వయముగా వినుచు, నా కర్మల నభినయించుచు,నృత్యము చేయుచు.క్షణకాలముఉత్సవమగ్నుడుకావలెను

పితృదేవతలు-సంక్షిప్త చరిత్ర

 *పితృదేవతలు-సంక్షిప్త చరిత్ర, బ్రహ్మదత్తుని కథ-(శ్రీ హరివంశం పురాణము, పితృకల్పము)*

 

     *శ్రాద్ధ సమయంలో తప్పక ఈ కథను స్మరించడం లేదా పారాయణము చేయాలని శాస్త్రం* . 


            *బ్రహ్మదత్తుని పూర్వజన్మ వృత్తాంతము* 


    శ్రాద్ధం వల్ల కీర్తి, యోగము ఐహిక సుఖములు కలుగుతాయి.


        *బ్రహ్మదత్తుడు* తన ఏడు జన్మలకు ముందు తన పితరులకు పెట్టిన శ్రాద్ధం వల్ల పొందిన గొప్ప ఫలితం తెలియజేసే కథను శ్రీమార్కండేయుడు భీష్మునికి తెలియజేసాడు. పూర్వం భరద్వాజుని పుత్రులు యోగులయ్యారు. కానీ కొంత కాలం తర్వాత చెడు పనులు,దుష్టసహవాసం వల్ల యోగభ్రష్టులయ్యారు. తరువాతి  జన్మలో  కౌశిక వంశంలో విశ్వామిత్రునికి ఏడుగురు పుత్రులుగా జన్మించారు. వారు వాగ్దుష్టుడు, క్రోధనుడు, హింస్రదుడు, పిషూణుడు, కలి, కసృమ, పితృవర్తి.  తండ్రి మరణిచాక గర్గముని ఆశ్రమం లో  గర్గుని శిష్యులుగా చేరారు.   ఒకనాడు గురువుగారు ఆజ్ఞ ఇవ్వగా ఆవులను మేపటానికి అడవికి తీసుకెళ్ళారు. దారితప్పి తిండి లేక నాలుగు రోజులపాటు పస్తులున్నారు. తీవ్రమైన ఆకలిబాధను తట్టుకోలేక వారికి చెడుబుద్ధి ప్రాప్తించి వారు మంచో, చెడో తెలియక ఆవును చంపి తిందామని అనుకుంటారు. అందులో పితృవర్తి, ఇలా గోహత్య చేయడం తప్పు. కానీ పితృశ్రాద్ధం చేసి గోవును  సమర్పించి ఆహరం స్వీకరిద్దాము అంటాడు. అందుకు అందరూ అంగీకరించి శాస్త్రోక్తంగా శ్రాద్ధమును నిర్వహిస్తారు. తరువాత ఆశ్రమం చేరి గురువైన గర్గుని దగ్గర ఆవును పులి తినేసిందని అబద్ధం చెపుతారు.  కొద్దికాలం గడిచాక వారు మరణిస్తారు.   


       " *సప్తవ్యాధా దశార్ణేషు"*  

                  గోహత్య కారణంగా వారు మరుజన్మలో కిరాతకునికి దశార్ణదేశంలో ఏడుగురు పుత్రులుగా పుట్టారు. వారి పేర్లు: నిర్వైరుడు,నిర్వృత్తి,శాంత, నిర్మన్యు , కృతి, వైద్యసోమ, నృవర్తి.  ఏడుమందికి పూర్వజన్మలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం చేత వారికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఏ మాత్రం హింస చేయకుండా ఉండేవారు. తల్లిదండ్రుల సేవ చేసేవారు. ధర్మాత్ములు అయ్యారు.  యోగాభ్యాసంతో ప్రాణాలు విడిచారు.


     " *మృగాకాలంజరే గిరౌ"* 


         తరువాతి జన్మలో కాలంజర అనే పర్వతం దగ్గర ఏడు జింకలుగా పుట్టారు. వారి పేర్లు ఉన్ముఖ, నిత్యవిత్రస్త, దబ్ధకరణి , విలోచన, పండిత, భస్మర, నాది. వీరు ఈ జన్మలో కూడా  యోగ ఉపాసన చేసి ఆయుష్షు తీరాక జింకగా దేహం చాలించారు. 

.  

       "చక్రవాకా శరద్వీపే"

           తరువాతి జన్మలో శరద్వీపంలో ఏడుగురు చక్రవాక పక్షులుగా జన్మించారు. వారి పేర్లు నిస్పృహ, నిర్మమ, క్షాంత, నిర్ద్వంధ,  నిష్పరిగ్రహ, నిరృతి, నిభృత. ఈ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి వలన తమ తప్పు తెలుసుకుని ఆహారనియమాలు పాటించి యోగాభ్యాసం చేసి  శరీరాన్ని విడిచిపెట్టారు.  


           " *సరసి మానసే"* 


             ఆ  తరువాతి జన్మలో ఏడుగురు హంసలుగా జన్మించారు. వారు సుమన, సుచివాక్, శుద్ధ, పంచమ, చిత్రదర్శి, సునేత్ర, స్వతంత్ర.  అవన్నీ  మానససరోవరం దగ్గర  తపస్సు చేసుకొంటుండగా, ఆ సరోవరానికి వచ్చిన కాంపిల్య దేశ రాజు  అతని మంత్రుల భోగాలు చూసి మూడు హంసలు మాత్రం ఆశ పొందాయి.  తరువాత పశ్చాత్తాప పడ్డాయి. మూడు హంసలు ఎలాగైనా మమ్మలని మరుజన్మలో  మాయనుండి కాపాడమని మిగిలిన నాలుగు హంసలను వేడుకుంటాయి.    తరువాతి జన్మలో ఆ  మూడు హంసలు  ఒకరు  బ్రహ్మదత్తుడు అనే రాజుగా ఇద్దరు  కండరీక, పాంచాల అనే మంత్రులు గా పుట్టారు.  ఈ జన్మలో కూడా సకల విద్యలను నేర్చుకొన్నారు. వారికి పూర్వజన్మ స్మృతి లేదు.  దేవలముని పుత్రిక సన్నతిని బ్రహ్మదత్తుడు వివాహం చేసుకొన్నాడు. రాజు,మంత్రులు సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ కాలం గడిపారు. 

 ఒకసారి అంతఃపురంలో ఉండగా ఒక మగచీమ, ఆడచీమతో మాట్లాడుతున్న సంభాషణ చూసి బ్రహ్మదత్తుడు నవ్వాడు. ఆ విద్య గురించి ఎవ్వరికైనా చెబితే మరణిస్తావని ఋషి తెలియచేస్తాడు. అందుకే ఆ సంభాషణ గురించి సన్నతికి చెప్పలేదు. అయినా సన్నతి నీకు మరణం వచ్చినా పర్లేదు వాటి సంభాషణ చెప్పాల్సిందే అని పట్టుపట్టింది. ఇంత కఠినమైన భార్యను  చూసి బ్రహ్మదత్తునికి వైరాగ్యం వచ్చి అడవికి మంత్రులతో సహితంగా తపస్సు  చేసుకోడానికి వెళతాడు .     


     " *తేఽభిజాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః"* 


     హంసలుగా ఉన్న మిగిలిన నలుగురు యోగాభ్యాసంతో తమ దేహత్యాగం చేసి కురుక్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణునికి  పుత్రులుగా పుట్టి పూర్తి వైరాగ్యంతో ఉంటారు. వారు తపస్సు చేయదలచి ఇల్లు విడుస్తుండగా వారి తండ్రిగారి పోషణనిమిత్తం తమ తండ్రిని రాజుగారి దగ్గరకు పంపుతూ ఈ రెండు శ్లోకాలు రాజు,మంత్రులు ఉండగా వారి ఎదుట చదవమని చెప్తారు . తపస్సు చేయడానికి వెళ్ళిన బ్రహ్మదత్తుడు విష్ణుదర్శనం చేసుకొని మంత్రులతో సహా తిరిగి రాజ్యానికి విచ్చేస్తారు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు రాజు మరియు మంత్రుల ఎదుట 


శ్లో౹౹ 1. *సప్తవ్యాధా దశార్ణేషు మృగాకాలంజరే గిరౌ | చక్రవాకా శరద్వీపే హంసాః సరసి మానసే* ||

   2. *తేఽభిజాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః | ప్రస్థితా దీర్ఘమధ్వానం యూయం కిం అవసీధత* ||


             "ఓ మహారాజా! దశార్ణదేశంలో ఏడుగురు కిరాతులు, కాలంజన పర్వతమందు ఏడుమృగాలు, శరద్వీపంలో ఏడు పక్షులు, మానససరోవరం లో ఏడు హంసలై పుట్టాయి. వాటి నుండి మేము నలుగురం కురుక్షేత్రంలో ఒక వేద పండితునికి పుట్టి చాలా దూరం వెళ్ళి మిమ్మల్ని వెతికాము. చాలా కష్టపడి చూచాము". అని చదవగానే వారికి పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చి రాజు, మంత్రులు మూర్ఛపోతారు.  తరువాత బ్రాహ్మణులకి తగిన ధనం ఇచ్చి, సన్మానం చేసి పంపిస్తారు. 


    రాజు  అంతఃపురం వెళ్ళి తన భార్య సన్నతి దగ్గర నీవే నన్ను కఠిన మాటలతో  తిరస్కరించకపోతే నేను విష్ణుదర్శనం అయ్యేది కాదు అంటాడు. అప్పుడు సన్నతి, ఓ రాజా మీరు లౌకిక విషయలు, సుఖభోగాలకు అలవాటుపడి ఆ పరమాత్మను మరచిపోతున్నారు. అందుకే ఆ విధంగా కఠినంగా వ్యవహరించాను. ఆ శ్లోకాలు, చీమల సంభాషణ కూడా నాకు తెలుసు అంటుంది. ఆశ్చర్యపడిన బ్రహ్మదత్తుడు నీవు ఎవరు అని ప్రశ్నిస్తాడు. రాజా మీరు ఏడుగురు గర్గ శిష్యులుగా ఉన్నప్పుడు అడవిలో ఆకలితో ఉన్నప్పుడు చంపి శ్రాద్ధం పెట్టిన గోవును నేను అంటుంది. బ్రహ్మదత్తుడు ఆశ్చ్ర్యపోతాడు.   గోవు అజాతశత్రువు. గోవును హింసించినా, బాధించిన మాత్రు వాత్సల్యం తో ప్రేమిస్తుంది. సృష్టిలో ఇంతకన్న గొప్ప జంతువు ఉండదు. అప్పుడు సన్నతి ఓ రాజా,  మిమ్మల్ని తరింపచేయడానికి మీ భార్యగా ఈ జన్మలో మీకు కలిగాను. తరువాత ఆ ఏడుగురు యోగాభ్యాసం చేసి శరీరం విడిచిపెట్టారు. గోహత్య, గోహింసకు పరిహారం లేదు. అయినా భక్తితో శ్రాద్ధం పెట్టిన పుణ్యంచేత వారు జ్ఞానం పొంది యోగాభ్యాసం తో  సద్గతులు పొందగలిగారు.   


            ఈ కథను విన్నా, పారాయణం చేసినా పశుపక్ష్యాది జన్మలు పొందరు. అంత్యకాలంలో యోగాభ్యాసం చేసి తరిస్తారు. పితృదేవతల అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది.

భక్తిసుధ


 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


        *_-శ్లోకమ్-_*


*_బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాజ్ఞిర్వికల్పంపునః_*

*_మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రియచిత్రీకృతం_*

*_మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవయస్వేచ్ఛయా_*

*_తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే......_*


*_దక్షిణాముర్తి స్తోత్రమ్-2 -_*


*వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-74

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-74🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

తిరుమల యాత్రకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి

భక్తులారా ! భాగవతోత్తములారా!

శక్తి సామర్ద్యములు గల స్త్రీ పురుషులు ఆబాలగోపాలము గోవింద నామోచ్చారణం చేస్తూ కాలినడకతో కొండనెక్కి వెళ్ళండి అవసరమైతే తిరిగివచ్చేటప్పుడు బస్లో రావచ్చును.


స్నానంచేసి భారతీయ సంప్రదాయంప్రకారం శుచి శుభ్రములైన వస్త్రములను దరించి వారి వారి సంప్రదాయానుసారం బొట్టు పెట్టుకొని (శ్రీవేంకటేశ్వరుని సన్నిధానమున ఊర్థ్వ పుండ్రమును ధరించుట (నామము) సంప్రదాయము)

 శ్రద్ధా భక్తులతో సేవించండి.


స్వామివారిని సేవింపనిదే భుజింపకండి. ఆలస్యమగు పక్షమున శక్తిలేనిచో పండ్లు పాలు వంటివి తగుమాత్రం తీసికొనండి. 


ద్వజస్తంభం వద్ద నమస్కరించి మనస్సులో శ్రీహరి రూపాన్ని ధ్యానిస్తూ గోవింద నామం జపిస్తూ లోనికి వెళ్ళండి. 


ప్రధాన ద్వారం దగ్గరకురాగానే గరుడాళ్వార్లకు నమస్కరించండి. 


ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి అనుమతిని తీసికొని ఎదురుగాసేవ సాయించుచుండు స్వామివారి దివ్యమంగళ విగ్రహమును కండ్లు చెమర్చగా, శరీరం పులకరింపగా; గద్గదమగు కంఠముతో, పారవశ్యంతో దర్శించండి.


ధరించిన మణికాంతులచే ప్రకాశితమైన లక్ష్మీదేవికి నిత్యనివాసమైన వక్షస్థలము గలవాడను, అంజనాద్రికి నిధి వంటివాడును; అఖిలహేయ ప్రత్యనీకుడును; పరమపురుషుడునగు శ్రీనివాసుని కనులార సేవించండి


శ్రీవారి పాదారవిందములు; పీతాంబరం, శ్రీహస్తములు;వక్షస్థలమునగల శ్రీభూదేవులను శంఖచక్రములను, ముఖారవిందమును;రత్నఖచిత కిరీటమును దర్శించి తిరిగి పాదారవింద పర్యంతము సేవించండి. అంజలి ఘటించి ఈక్రింది శ్లోకాలను, పాశురాలను పఠించండి.


   పార్దాయ తత్సదృశ సారథినా త్వయైవ

   యౌదర్శితౌ స్వ చరణౌ శరణం వ్రజేతి

   భూయోపి మహ్య మిహతౌ కరర్శితౌతే

   శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే


   వినావేంకటేశం ననాథో ననాథ:

   సదావేంకటేశం స్మరామి స్మరామి

   హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

   ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ.


ఈ శ్లోకాలను అనుసంథానం చేయండి.


దివ్యప్రబన్దం వచ్చినవారు


 "అగలిగిల్లేన్ ఇఱైయుమెన్ఱు" "తాయేతన్దై యెన్ఱుమ్" 


అనే పాశురాలను అనుసంధానం చేయండి.


దర్శనం చేసికొని

తిరిగివచ్చునప్పుడు స్వామికి వెన్నుచూపరాదు.


 ఈ నియమాలను పాటించి ఈ చెప్పిన విధంగా స్వామిని దర్శిస్తే భగవదనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున ప్రతియొక్కరు తిరుమల యాత్ర చేయండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి.


స్వామివారి దర్శనము చేసుకొని, ప్రసాదాలు తీసుకొని, భక్తులు దిగువ తిరుపతికి వస్తే, అక్కడ దర్శించవలసిన వాటిలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయము ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని చేరి శ్రీకృష్ణ, శ్రీ ఆళ్వార్, శ్రీదేశికర్, శ్రీమణవాళమువి, శ్రీరామానుజ దేవాలయాలున్నాయి. శ్రీ గోవిందరాజస్వామికి ప్రతి సంవత్సరము వైశాఖమాసములో బ్రహ్మోత్సవాలు జరుపబడుతాయి. ఊరిమధ్య శ్రీకోదండరామస్వామి కోవెల వున్నది. ఇంకా నమ్మాళ్వార్, పెరియాళ్వార్, కపిలేశ్వర దేవాలయాలున్నాయి. తిరుపతికి మూడుమైళ్ళ దూరములో గల తిరుచానూరులో శ్రీవేంకటేశ్వరస్వామి పద్మావతి దేవుల ఆలయము, పద్మసరోవరము వున్నాయి. పద్మావతి దేవినే అలివేలు మంగతాయారు అని కూడా అంటారు. ఆ ఆలయానికి వెళ్ళి దర్శనము, పూజలు చేసుకొని భక్తులు తమ యాత్రను సంపూర్తి చేసుకొంటారుl.


పుణ్యభూమియైన భారతదేశములో యిది పరమపావనమైన పుణ్యక్షేత్రముఅయినందువల్లను, ఆపద మ్రొక్కులవాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టిv కాపాడడములో అపార కరుణామూర్తి అయినందువల్లను, ఈ యాత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్లను, నిత్యమూ వేలాది భక్తులు యీ కొండకు వస్తూ పోతూ వుంటారు. ఎన్నెన్నో కానుకలు, నిలువు దోపిళ్ళు సమర్పిస్తుంటారు. మ్రొక్కుబడులు చెల్లించుకొంటారు. 


వీరందరితో యీ క్షేత్రము నిత్య సత్య వైకుంఠములా దేదీప్యమానముగా వుంటుంది. ఈ విధముగా వచ్చే పోయే భక్తుల వల్ల దేవాలయానికి లక్షలాది ఆదాయం వస్తున్నదిl. ఆ ఆదాయంతో దేవాలయాధికారులు కేవలం యాత్రికుల కోసమే కాకుండా ఎన్నో ప్రజాహిత కార్యాలను కూడా నిర్వహిస్తున్నారు.


 భక్తులకు కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవము శ్రీవేంకటేశ్వరుడు. తిరుపతి యాత్ర చేసినవారికి నూతన ప్రాంతములు చూచిన వేడుక. భగవంతుని దర్శించుకొన్న ముక్తీ లభిస్తాయి.

శుభం భూయాత్.🙏🙏


అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !

దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!


కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!


*కాయేన వాచా మనసేంద్రియైర్వా*

*బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !*

*కరోమి యద్యత్సకలం పరస్మై*

6నారాయణాయేతి సమర్పయామి !*


        ------సంకలనకర్త:

  జొన్నలగడ్డ  మల్లిఖార్జున  శర్మ


ఈనాటి తో శ్రీ వేంకటేశ్వర  దివ్య చరిత్ర అన్ని భాగాలు సమాప్తమైనవి...


*కానీ గోవిందుని లీలలకు అంతం ఏమున్నది.... చదివినకొలదీ విన్నకొలదీ. ... తెలుసుకోవలసినది ఇంకా ఉంటూనే ఉంటుంది కదా....... రేపటి రోజు మంగళాశాసనం తో ముగిస్తు న్నాము*


*వినావేంకటేశం ననాధో ననాధః* 

 *సదావేంకటేశం స్మరామి* *స్మరామి* 🙏🙏🙏🙏


సర్వం శ్రీవేంకటేశ్వర చరణార


విందార్పణమస్తు...🙏


ఈ సందర్భంగా శ్రీనివాసుని లీలలను...తిరుమల కైంకర్యాలను...తిరుమల లో తీర్ధాలు...ఇతర దేవాలయాల గురించి...స్వామి వారి భక్తుల గురించి...మరెన్నో విశేషాలను మనకు సంకలనం చేసి అందించిన *శ్రీ జొన్నలగడ్డ* *మల్లికార్జున శర్మ* గారికి  అనేక ధన్యవాదాలతో....

నమస్సులు 🙏🙏🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 63*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 63*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*స్వయంగా నరేంద్రుడు* ( స్వామి వివేకానంద ) *ఇలా చెప్పాడు....*


ఒక్కో రోజు  ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేదని తెలుసుకొని, చేత చిల్లిగవ్వ లేకపోవడంతో, 'ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడని అమ్మతో చెప్పి, బయటకు వెళ్లిపోయే వాణ్ణి.  ఇంట్లో వారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తులతోనే గడిపేవాణ్ణి.  బయటి వారికి ఈ విషయాలు తెలుపడానికి అభిమానం అడ్డుపడేది. 


ఇంతకు ముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు  వచ్చి నా పాటలతో తమ ఆనందాన్ని ఇనుమడింపజేయమని కోరేవారు. వారి కోర్కెను తిరస్కరించలేక, కొన్ని సమయాలలో వారితోబాటు వెళ్లి నా పాటలతో వారిని సంతోషపరచేవాణ్ణి. కాని నా మనస్సులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాణ్ణి కాను.  


ఏ ఒకరిద్దరో అప్పుడప్పుడు ఆప్యాయంగా, 'ఈ రోజు నువ్వెందుకు నిరుత్సాహంగా, బలహీనంగా కనిపిస్తున్నావు? కారణం ఏమిటో దయచేసి చెప్పు' అని అడిగేవారు. వారిలో ఒక మిత్రుడు, ఇంకొక మిత్రుడి ద్వారా నా పరిస్థితి తెలుసుకొని, అజ్ఞాతంగా మా అమ్మకు ఉత్తరాలు వ్రాస్తూ, డబ్బు పంపసాగాడు. ఈ విధంగా అతడు నన్ను శాశ్వతంగా ఋణబద్ధుణ్ణి చేసివేశాడు."

 

"నా మిత్రులలో కొందరు వక్రమార్గంలో డబ్బు సంపాదించేవారు. నా స్థితి గురించి విన్న వారు ఈ తరుణాన్ని వినియోగించుకొని నన్ను తమ వైప లాగడానికి ప్రయత్నించారు. వారిలో కొందరు నా మాదిరి హఠాత్తుగా పరిస్థితులు తారుమారు కావడంతో పొట్ట గడపడానికై అవినీతి మార్గాల్లో వెళ్లిన వారు. వారు నిజంగానే నా పట్ల జాలి వహించారు. మహామాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. 


ధనవంతురాలైన ఒక స్త్రీ చాలాకాలంగా నా మీద కన్ను వేసింది. ప్రస్తుతం నా పరిస్థితిని సదవకాశంగా తీసుకొని ఆస్తితో పాటు తననూ స్వీకరించి దారిద్ర్యానికి స్వస్తి చెప్పమని కబురు పంపించింది!ఆ ప్రతిపాదనను జుగుప్పతో తిరస్కరించాను. మరో స్త్రీ కూడా నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. 


'అమ్మాయీ! ఒక గుప్పెడు బూడిద కాబోయే ఈ శారీరక సుఖం కోసం ఇంతదాకా ఏదేదో చేశావు! ఇదుగో మరణం నీ ముందే ఉంది. దానిని ప్రతిఘటించడానికి నువ్వు ఏదైనా చేసివున్నావా? తుచ్చమైన తలంపులను వదలిపెట్టు. భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించు' అని ఆమెకు హితవు చెప్పాను."🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *53వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *53వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*శనిగ్రహ జననం - 4*


సూర్యుడు లేని సమయం చూసుకుని , నారదుడు మందిరంలోకి వెళ్ళి ఛాయను కలుసుకున్నాడు. 


*"నేను నారదుణ్ణి ! నిన్ను చూస్తుంటే సాక్షాత్తుగా ఆ సంజ్ఞాదేవిని చూస్తున్నట్టే ఉంది. ఛాయాదేవీ !"*


ఛాయ ఆందోళనతో చూసింది. *"నేను... నేను...సంజ్ఞనే !"* అంది తొట్రుపాటుతో , 


*"నారాయణ ! మీ 'బింబ ప్రతిబింబాల' నాటకం నాకు తెలుసు ఛాయా ! నీ క్షేమం కోరి ఇలా వచ్చాను. సంజ్ఞ పథకంలో నువ్వు అమాయకంగా బలి అవుతున్నావు !"*


*"స్వామీ..."*


*"ఆ ! ఆమె బిడ్డల్ని ఎంత కాలం నీ బిడ్డలనుకుంటావు ? నువ్వు స్త్రీవి ! నీకూ నీ సంతతి ఉండాలి. సూర్యుడితో నువ్వు సాగిస్తున్న దాంపత్యం సార్థకం చెందాలంటే , ఆయన పనుపున , నీ కడుపున పిల్లలు పుట్టాలి. సంజ్ఞ బిడ్డలు సంజ్ఞ బిడ్డలే ! ఛాయ బిడ్డలవుతారా ?"*


*"సంజ్ఞ బిడ్డలు..."* ఛాయ సాలోనచగా అంది.


*"ఉంటారు ! ఎక్కడికి పోతారు ? పైగా నువ్వు సంతతిని పొందకూడదని సంజ్ఞ చెప్పలేదుగా ! సూర్య పత్నిగా నీ స్థానం పదిలం కావాలంటే నీకు , కనీసం ముగ్గురు నీ పిల్లలు కలగాలి. నీ భర్తను సంతాన భిక్ష అడుగు ! వస్తాను ! నారాయణ !"*


ఛాయ సాలోచనగా చూస్తూ ఉండిపోయింది.


*సంజ్ఞ బిడ్డలు సంజ్ఞ బిడ్డలే ! ఛాయ బిడ్డలవుతారా ?”* 


*"నీ స్థానం పదిలం కావాలంటే నీకూ కనీసం ముగ్గురు పిల్లలు కలగాలి !"*


*"నీ భర్తను సంతాన భిక్ష అడుగు !"*


*"నీ భర్తను సంతాన భిక్ష అడుగు !"*


నారదమహర్షి మాటలు ఛాయ గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి... సంజ్ఞగా తాను ఇక్కడ సాగిస్తున్న నాటకం నారదుడికి తెలుసు. ఆ మహానుభావుడికి తెలిసిన రహస్యమేదీ చాలా కాలం పాటు రహస్యంగా ఉండదు.


పదుగురికీ తెలిసిపోయి , తమ రహస్యం బట్టబయలైపోయేలోగా తను జాగ్రత్త పడాలి. తన నటన తెలిసిపోయాక , సూర్యుడు తనను మందిరం నుండి బహిష్కరిస్తే తన జీవితం ప్రశ్నార్థకమే. సూర్యుడు ఇక్కడ ఉండనివ్వడు. ఆ నారద మహర్షి చెప్పింది నిజమే. తనకూ సూర్యుడికీ ఏదో శాశ్వత బంధం తీగలు సాగాలి. ఆ బంధం సంతానమే ! సందేహం లేదు !


నిజం చెప్పుకోవాలంటే - సంజ్ఞ కోసం తను త్యాగం చేస్తోంది ! తన అనురాగాన్నీ , అందాన్నీ , అక్క బర్తకు అంకితం చేసింది. ఆమె భర్తకు అనుమానం రాకుండా నిత్యమూ ప్రణయాగ్ని పరీక్షకు గురి అవుతూ - తను 'ఛాయ' అనే సత్యాన్ని మరిచిపోయి, తన నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ , తన వారు కాని సంతానాన్ని తన వారుగా భావిస్తూ ఆ విధంగా తనను తాను మోసం చేసుకుంటోంది. తీవ్రంగా ఆలోచిస్తే తను ప్రమాదకరమైన జీవితం గడుపుతోంది. ఇది మహా సాహసం ! ఆ సాహసానికి ప్రతిఫలం ఉండాలి ! నిజమైన ప్రతిఫలం తనకు సంతానమే ! ఆ నారద మహర్షి రావడం మంచిదే అయ్యింది !


ఛాయ ఆలోచనల్లోంచి బైటపడింది. ఆలోచనల్ని చిలికి చిలికి నిర్ణయ నవనీతాన్ని వెలికి తీసింది ! ఛాయ తోటలోంచి మందిరంలోకి నడిచింది.


ఛాయ నిలువుటద్దం ముందు నిలబడి ముంగురుల్ని వేళ్ళతో సర్దుకుంది. సూర్యుడు చిరునవ్వుతో తన వైపు వస్తున్నాడు. ఛాయ అద్దంలో సూర్యుడి ప్రతిబింబాన్నే చూస్తూ తలలో తరుముకున్న పువ్వుల్ని ఒకసారి తడువుకుంది.


సూర్యుడి చేతులు ఆమె రెండు భుజాల మీద వాలాయి. తన తల మీద ప్రత్యక్షమై చిరునవ్వులు చిందిస్తున్న ఆయన అందమైన ముఖాన్ని ప్రతిబింబాన్ని చిరునవ్వుతో చూసింది ఛాయ.


*"సంజ్ఞ... నీ సౌందర్యం నన్నెప్పుడూ పారవశ్యమనే మైకంలో ఊయలలూగిస్తూ ఉంటుంది !"*


*"ఎప్పుడూ నన్ను మెచ్చుకోవడమే !"* ఛాయ నవ్వింది.


*"ఇప్పుడు నేను మెచ్చుకున్నది నిన్ను కాదు , నీ అందాన్ని !"* అద్దంలోంచి ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు సూర్యుడు. ఆయన గెడ్డం ఛాయ తలను సున్నితంగా నొక్కింది.


*"ఎప్పుడూ మెచ్చుకోవడమే ! ఇచ్చుకోవడమంటూ లేదు !"* ఛాయ అద్దంలోకి చూస్తూ నవ్వుతూ అంది.


*“నన్నే ఇచ్చుకున్నాక ఇవ్వడానికి మిగిలిందేముంది ?"* సూర్యుడు నవ్వాడు. 


ఛాయ చిలిపిగా నవ్వింది. *"మీరు మరిచిపోయారు ! గుర్తు చేయనా ? పుట్టింటి నుంచి వచ్చినప్పుడే , వచ్చినందుకే - మీరు నాకు బహుమతి ఇచ్చి ఉండాలి !”*


సూర్యుడు ఆమె భుజాలను సున్నితంగా నొక్కాడు. *"ఔను... ఇచ్చి ఉండాలి , లేకపోతే ఎప్పుడో అప్పుడు ఇచ్చి తీరాలి. ప్రస్తావన వచ్చింది కాబట్టి , ఇప్పుడే ఇచ్చి తీరాలి !"*


*"నిజంగా ?”* ఛాయ ప్రతిబింబాన్ని ప్రశ్నించింది.


*"నిజమో , కాదో అడిగి తెలుసుకో ! ఏది నువ్వు కోరే బహుమతి ?"* సూర్యుడు నవ్వుతూ అన్నాడు.


*"నేను కోరే బహుమతి - సంతతి !”*


సూర్యుడి ప్రతిబింబం ఆశ్చర్యంగా చూసింది. *"సంతతి... ఉన్నారుగా , సంజ్ఞా ! లేనిది అడుగు !"*


*"నాకు అదే కావాలి !"* ఛాయ నవ్వుతూ అంది.


సూర్యుడి చేతులు ఆమెను తన వైపు తిప్పుకున్నాయి. తల వాల్చి ఛాయ ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. ముఖం పైకెత్తి చూస్తున్న ఛాయ కళ్ళలో ఆశ జంట దీపాల్లా వెలుగుతోంది.


*"సంజ్ఞా ! నువ్వు దర్పణంలో ప్రతిబింబాన్ని అడిగావు. నేను నీ ప్రతిబింబానికి కాకుండా నీకే మాట ఇస్తున్నాను. నువ్వు కోరిన బహుమతి నీకు లభిస్తుంది !”*


ఛాయ చేతులు ఉద్రేకంతో సూర్యుడి చుట్టూ బిగుసుకున్నాయి. కళ్ళు అలాగే వెలుగుతూ చూస్తున్నాయి. ఆమె పగడాల పెదవులు కదిలాయి. *"ముగ్గురు ! ఇద్దరు పుత్రులూ ! ఒక పుత్రికా ! అనుగ్రహిస్తారుగా !”*


సూర్యుడు నవ్వాడు. *“నీ ముచ్చటను గ్రహించాను ! అనుగ్రహించకుండా ఎలా ఉంటాను ?"*


అద్దంలోంచి ఇద్దరి ప్రతిబింబాలు , ఒక్కటిగా , కదిలి అంతర్థానమైపోయాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 53*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 53*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా*

*విభాతి త్వన్నేత్ర త్రితయ మిద మీశానదయితే |*

 *పునస్ర్సష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్*

 *రజ స్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ ‖*


ఈశ్వరుడి ప్రియురాలా (ఈశానదయితే) 

కాటుక అలదుకొన్న(లీలాంజన తయా) నీ త్రినేత్రములు 

ఏ ఏ వర్ణములను వెలారుస్తున్నాయి? 

తెలుపు, నలుపు, ఎరుపు రంగులను కలిగి వున్నాయి. ఆరోగ్యవంతమైన కన్నులలో సన్నని ఎర్రజీర ఉండటం సహజం. అయితే ఇక్కడ ఈ వర్ణములు పగలు, రాత్రి, సంధ్యా సమయాలుగా, సత్త్వ రజస్తమో గుణాలకు ప్రతీకలుగా వాటిని నియంత్రించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సూచింపబడుతున్నాయి. 

ఈ త్రిమూర్తులను నీవే నియంత్రిస్తున్నానని చెప్పటానికన్నట్లుగా ఈ వర్ణములను నీ కళ్ళలో చూపిస్తున్నావు తల్లీ! 


ఆమె కన్నులనుండే సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి.  కనురెప్ప తెరిస్తే సృష్టి, మూస్తే లయ. ఆవిడ మాత్రం సాక్షీభూతురాలై చూస్తూ ఉంటుంది జగత్తును. *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* అని లలిత సహస్రనామాల్లో అమ్మవారి ఒక నామం.


సత్వ గుణం (బ్రహ్మ) 

*క* కారము గానూ, 

రజః గుణం (విష్ణు)

 *అ* అకారము గానూ,

 తమో గుణం (రుద్ర) 

*మ* కారము గానూ చెప్పబడుతాయి. 

ఈ మూడింటినీ 

క + అ +మ = కామ

 అమ్మవారు *అక్షి* (కన్ను) యందు ఉంచుకొని నియంత్రిస్తుంది కనుక ఆవిడ కామాక్షి.

శ్రీ కామాక్షై నమః🙏🏻.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పితృదేవతల కోసం తర్పణ

 మహాలయక్షము*


ఈనెల 30 నుంచి అక్టోబర్ 14 వరకు గల మహాలయపక్ష తర్పణం విధిగా చేయాలి!!



మీ పితృదేవతల కోసం కేవలం 15 ని.ల సమయం కూడా మీరు కేటాయించలేరా..???


దయచేసి మీ వంశాభివృద్ది కోసం కేటాయించుకోండి...🙏🙏🙏

పితృ తర్పణము, మీకు మీరే ఎలా చేసుకోవచ్చో తెలుసుకోండి...!!


ఆచమ్య:-....

ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభయ నమః| ఓం దామోదరాయ నమః |ఓం సంకర్షణాయ నమః |ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః| ఓం అనిరుద్దాయ నమః |ఓం పురుషోత్తమాయ నమ|| ఓం అధొక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః| ఓం జనార్దనాయనమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః ||


పవిత్రం దృత్వా || (దర్భ పవిత్రమును ధరించాలి)


ఓం పవిత్ర వంతః...... తత్సమాశత | (మంత్రం వచ్చిన వారు చదువుకోండి )


పునరాచమ్య || (మరల ఆచమనము చేయాలి )


*భూతోచ్చాటన ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | | అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి,

(సాధారణ తర్పణాలకు నీరు,ప్రత్యేక తర్పణాలకు తిలలు వాసన చూడాలి)


*ప్రాణా యామము (ముక్కు. బొటనవేలు,చిటికెన వేలుతొ పట్టుకొని)


ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః ఓం మహః ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓంతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సువరోమ్ || (అని మనసులో జపిస్తూ ప్రాణా యామము చేయాలి )


*సంకల్పం:-

 హైదరాబాద్లో ఉండే వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది.క్రింద ఉన్నవి మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారతాయి.కనుక సంకల్పాన్ని మిగతా ప్రదేశాల వారు మీ ప్రాంత పురోహితులని సంప్రదించగలరు)


మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, శ్రీ గోవింద గోవింద గోవింద | 


శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే|ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరోదక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య  వాయవ్య ప్రదేశే,కృిష్ణా 

గోదావర్యోర్మద్యదేశే| సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన - వ్యావహారిక చాంద్రమానేన -. శ్రీశోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే*.... *వర్షఋతౌ*.... *భాద్రపద మాసే కృష్ణపక్షే......తిదౌ........వాసరే.| శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిధౌ|


ప్రాచీనావీతి:- (యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)


*మహాలయము పితృణాం మాతామహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకా వాప్త్యర్దం కన్యాగతే సవితరి ఆషాడ్యాది పంచమాపరపక్షొ కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ద ప్రతినిధి సద్య, తిల తర్పణం కరిష్యే ||

సవ్యం:-


సవ్యమనగా ఎడమబుజము పైకి యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.


ప్రాచీనావీతి:- || మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను.


ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలుపరిచి వాటి పై పితృదేవతలను ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిమ్ ||" అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించవలెను. దక్షిణముఖముగా తిరిగి, ఎడమ మోకాలు క్రింద ఆన్చి తర్పణ విడువవలెను.


"స్వధానమిస్తర్పయామి' అన్నప్పుడల్లా మూడుసార్లు తిలోదకము పితృతీర్ధముగాఇవ్వవలెను. వారి భార్య కూడా లేనిట్లైతే సవిత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తకం అని చేర్చుకొనవచ్చును. 


క్రింద మొదటిఖాళీలో గోత్రమును, రెండవ చోట వారి పేరును చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు "అస్మత్" అను శబ్దాన్ని చేర్చ వలెను. బ్రాహ్మణులైతే శర్మాణం అన్నది పనికొస్తుంది. కానీ రాజులైతే వర్మాణాం .వైశ్యులైతే గుప్తం, ఇతరులు దాసం అని మార్చి పలకాలి.


(ప్రాచీనావీతి) అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి) దక్షిణాభిముఖో భూత్వా


1) పితరం..(తండ్రి పేరు చెప్పి) అస్మత్ .....గోత్రం, ..........శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి..3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


2) పితామహం..(తాత)అస్మత్ ...... గోత్రం, ....... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..


3)ప్రపితామహం.(ముత్తాత)అస్మత్ ......గోత్రం, .........శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాంస్వధానమస్తర్పయామి3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


7) సాపత్నిమాతరం (సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


9) మాతుః పితామహం (తల్లి గారి తాత)గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


10)మాతుఃప్రపితామహం(తల్లి యొక్క తాతగారి తండ్రి) గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..


13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి..


14) ఆత్మ పత్నీం (భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


15) సుతం (కుమారుడు)గోత్రం..శర్మాణం.. వసురూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


17) కనిష్ఠ భ్రాతరం (స్వంత చిన్నసోదరుడు)గోత్రం..శర్మాణం.. వసురూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీంవసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


25) ఆత్మ భగినీం (సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీంవసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


29)భాగినేయకం (మేనల్లుడు) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


31) పితృ భగినీం (మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


33)మాతృ భగినీం (తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ) గోత్రాం..దాయీం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


34) తద్భర్తారం (తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


35) జామాతరం (అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


36)స్నుషాం (కోడలు) గోత్రాం.దాయీం..వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


37)శ్వశురం (పిల్లనిచ్చిన మామ) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


38)శ్వశ్రూం (పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి


39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


41) ఆత్మ పత్నీం (భార్య) గోత్రాం...దాయీంవసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


42)గురుం .. గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి...


43)రిక్థినం .. గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....అని 3 మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి........


యే బాంధవాః యే బాంధవాః యేయే అన్య జన్మని బాంధవాః |తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా ||


ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః |తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ మతామహాదయః ||


అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం || (యజ్ణోపవీత నిష్పీడనం)


యజ్జోపవీతమును నివీతిగా (దండలాగా) మెడలో వేసుకుని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ ఈ క్రింది విధంగా చదువవలెను.


||శ్లొ|| యేకే దాస్మత కులే జాతాః ఆపుత్రా గోత్రిణొ మృతాః | తే గృహ్ణంతు మయాదత్తం సూత్ర నిప్పిడనొదకం ||


(నా కులములోను, గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరు గాక! ]

శ్రీరామ రామ రామ | | అనుచూ యజ్ఞోపవీతపు ముళ్లను కళ్లకద్దుకుని సవ్యము చేసుకొనవలెను. 


స్వస్థి...


మీ పితృదేవతల కోసం కేవలం 15 ని.ల సమయం కేటాయించండి.

ఈ పక్షము రోజుల్లో మీ సొంతవారి యొక్క చనిపోయిన తిథి నాడున లేదా 14వ తారీకున తిలతర్పణం చేస్తే మీకు,మీ కుటుంబాలకు, మీ వంశాభివృద్ధికి మంచిది,మీ పితృదేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి.

*సనాతన ధర్మో రక్షతి-రక్షితః*

పంచాంగం 14.10.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 14.10.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: అమావాస్య తిధి స్థిర వాసర: హస్త నక్షత్రం ఇంద్ర యోగ: చతుష్పాత్ తదుపరి నాగవం కరణం ఇది ఈరోజు పంచాంగం.


అమావాస్య  రాత్రి 11:22 వరకు.

హస్త సాయంత్రం 04:20 వరకు .

సూర్యోదయం : 06:12

సూర్యాస్తమయం : 05:51

వర్జ్యం : రాత్రి 12:56 నుండి 02:40 వరకు

దుర్ముహూర్తం : ఉదయం 06:12 నుండి 07:45 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు 


యమగండం : మద్యాహ్నం   01:30 నుండి 03:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

నేను గుడికి పోతున్న

 

రాము :అమ్మ నేను గుడికి పోతున్న నాకు కొన్ని డబ్బులు ఇవ్వు


అమ్మ : దేనికి ఎంత కావాలి??


రాము :

1.బండి పార్కింగ్ 

2. చెప్పుల టోకెన్

3. సేల్ ఫోన్ టోకెన్

4. లగేజ్ & లాకర్ టోకెన్ 

5. దర్శనం టికెట్ 

6.పూజ టికెట్ 

7.ప్రసాదం 

8.హారతి పళ్లెంలో 

హుండీలో 


మొత్తం : ఆస్తి అమ్మలి అనుకుంట అమ్మ 😭


అమ్మ అయితే వద్దు లేరా 1st కీ చూద్దాం నాన్నకు జీతం వచ్చాకా వెల్దువు గాని

కారణం:

హిందువులకు దేవదాయా శాఖ వుంది కాబట్టి.


హిందువులలో మార్పు రావాలంటే ఫస్ట్ హిందువులు ఏకమై దేవదాయా శాఖ ను రద్దు చేయించాలి మన గుడులపై మన పెత్తనం వుండేలా చేసుకోవాలి

🚩🚩జై శ్రీరామ్ జై గోమాత జైహింద్ 🚩🚩


   ఇట్లు: #మీ మిత్రుడు వినోద్ కుమార్

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - హస్త - స్థిర వాసరే* (14.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/BQQCVaRRKgQ?si=tREcRDlDusQGNg6Z



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శనివారం, అక్టోబరు 14, 2023

 🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం, అక్టోబరు 14, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:అమావాస్య రా10.28 వరకు  

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:హస్త సా4.41 వరకు

యోగం:ఐంద్రం ఉ11.45 వరకు

కరణం;చతుష్పాత్ ఉ9.45 వరకు తదుపరి నాగవ రా10.28వరకు 

వర్జ్యం:రా1.14 - 2.57

దుర్ముహూర్తము:ఉ5.56 - 7.29

అమృతకాలం:ఉ11.09 - 11.54

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:కన్య

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.55

సూర్యాస్తమయం: 5.38

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻🙏 మీ చన్నా శ్రీను🙏