3, మార్చి 2021, బుధవారం

తేనె గురించి సంపూర్ణ వివరణ - 4 .

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 4 . 


 *   పౌత్రికం అనెడి తేనె  - 


        ఇది నల్లని తేనెటీగల వలన చెట్ల తొఱ్ఱలలో పెట్టబడును. ఉష్ణం కలిగించును. విదాహమును పుట్టించును . వేడిని పుట్టించి విరేచనం కలిగించును. విషము , ఛర్థి , పిత్తము , వాతములను పోగొట్టి మిక్కిలి హితము చేయును . 


 *  పౌష్పికము అనెడి తేనె  - 


       ఇది పచ్చగా ఉండును . విషహరము . 


 *  భ్రామరము అనెడి తేనె  - 


        దీనిని చిన్న ఈగలు సమకూర్చును.  రూపమునకు ఇది తెల్లగా , జిగటగా , తియ్యగా ఉండును . పిత్తమును పెంచును. అనారోగ్యము కలిగించును. వాత శరీరం కలవారు వాడవచ్చు . 


  *  మాక్షికం అనెడి తేనె  - 


        మంచి గంధపు చెట్ల నుంచి తీసినట్టి తేనె దీనికి "కిట్ని " అను పేరు కలదు. కొంచెం చేదు , వెగటు కలిగి రుచికరంగానే ఉండును . ఉష్ణమును , అగ్నిదీపనము ఇచ్చును . వాతము , మేహము , క్షయ , కుష్ఠు , నేత్రరోగములు , ఛర్థి , ఉపిరిగొట్టు నొప్పి మొదలైన వానిని , విషదోషములను పోగొట్టును . వ్రణములను మాన్పును తేనెలన్నింటిలో మిక్కిలి శ్రేష్ఠమైనది . 


  *  సౌషిరము అనెడి తేనె  -  


        నురుగు రంగులో ఉండును . రుచిగా ఉండును. శ్వాస , కాస రోగ హరమై పథ్యకారిగా ఉండును . 


  *  క్షాద్రం అనెడి తేనె  - 


         ఇది పింగళ వర్ణముగా ఉండే ఈగలతో ఏర్పరచబడును. మలబద్దకం కలిగించును . అగ్నిమాంద్యం కలుగ చేయును . మేహమును హరించును . వీర్యవర్ధకము , చలువని ఇచ్చును . బలాన్ని కలిగించును. ఆరోగ్యకరం . 


                              సమాప్తము 


 మరింత విలువైన సమాచారం నేను రచించిన గ్రంథముల యందు ఇవ్వడం జరిగింది. 

    

  

     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మాఘ పురాణం*_🚩 🚩 _*16 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*16 వ అధ్యాయము*_🚩


       *శనివారం*

*ఫిబ్రవరి 27, 2021*


🕉️🌞🕉️🌞🕉️🌞🕉️🌞


*విద్యాధరపుత్రిక కథ*


🕉️☘☘☘☘☘☘🕉️


రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ "నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి, పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై, సద్గుణాన్వితయై, కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును, ఆనందమును కలిగించు, 

ఈమెను, యెవరికోయిచ్చి, అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను, అల్లుని కూడ, నా యింటనే యుంచుకొందునని,  నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రాక్షసుడు, దేవీ భక్తుడు. ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను. ఆ రాక్షసుడు, విద్యాధర పుత్రికను చూచినంతనే, ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు, మిక్కిలి శక్తిమంతుడు, శివుని తపముచే మెప్పించి, శివుని శూలమును, కోరి పొందెను. శివుడును, వానికి, శూలము  నిచ్చుచు, "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో, నీవు మరణింతువని" చెప్పి, యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు," నన్ను మించిన శత్రువెవ్వడు, నా ఆయుధము, శత్రువునెట్లు చేరును? "అని తలచి, వర గర్వితుడై, యెవరిని లెక్కచేయక, ప్రవర్తించుచుండెను.


అట్టి రాక్షసుడు, విద్యాధర పుత్రికను చూచి, "సుందరీ! నన్ను వరించుమని యడిగెను. ఆమెయు, నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును, విద్యాధరుని వద్దకు పోయి, వాని కుమార్తె నిచ్చి, వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు, వానికి, తన కుమార్తె నిచ్చి, వివాహము చేయుటకు, తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక, మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి, సురక్షితముగ, సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున, ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని, విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి, తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా, బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత, మంచి ముహూర్తమున్నది. అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు, అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో, ఎనిమిది మాసముల తరువాత, శుభముహూర్తమున, నిన్ను వివాహమాడుదును, ఈ లోపున, నిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా, ఆమె,  యేమియు, మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా, ''నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము, సాయంకాలమున, శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు, శివలింగమెచటనున్నదో, చూపుమని అడిగెను. ఆ రాక్షసుడు, పాతాళములో వున్న, హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు, రాక్షసుని అనుమతితో, శివ సందర్శనమునకై, ప్రతి సోమవారము, పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె, పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు, త్రిలోకసంచారియగు, నారద మహర్షియు, హటకేశ్వరుని దర్శింప వచ్చి, యామెను జూచెను. ఆశ్చర్యపడి, 'అమ్మాయి! నీవిచటనున్నావేమని' అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు, తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.


నారదుడామె చెప్పినదంతయును వినెను. "అమ్మాయీ! భయపడకుము. విష్ణుభక్తుడై, నీకు భర్తయగు వానిని, నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ, మానస సరోవరము కలదు. మాఘమాసమున, నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో, శ్రీమన్నారాయణుని పూజించి, ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు, కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.


విద్యాధర పుత్రికయు, నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి, స్నానము చేసి, పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును, వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు, సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న, శ్రీమహావిష్ణు భక్తుడగు, హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు, సర్వకాల సర్వా వస్థలయందును, శ్రీమహావిష్ణువును, స్మరించుచుండును. అందరియందును, శ్రీమన్నారాయణునే, దర్శించును. వారిని, హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు, వస్తువును, స్వీకరించును. దామోదరాయనుచు, భుజించును, కేశవాయనుచు, నిద్రించును. నరసింహాయని, స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు, తిరుగును, ఏపని చేయుచున్నను, యెవరితో మాటలాడుచున్నను, యేదో ఒక విధముగ, శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు, నారదమహర్షి వెళ్లెను.


హరిద్రధుడును, నారదమహర్షిని జూచి యెదురువచ్చి, గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి, అనేక ఉపచారములతో, పూజించెను. నారదుడును, "రాజా! విద్యాధర కన్యనొక దానిని ,వరగర్వితుడైన రాక్షసుడొకడు, బలాత్కారముగ నపహరించి, సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక, త్రిలోకసుందరి, సద్గుణశీల, నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని, వాని శూలముతోనే, సంహరింపవలయును. అని, వానికి తగినరీతిలో వివరించి, నారదుడచట నుండి, లోక సంచారార్థము పోయెను. హరిద్రధుడును, సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ, సముద్రము6 వానికి, తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును6 ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున, రాక్షసుడింట లేడు. అతడు  వివాహ ముహూర్తమునకై, బ్రహ్మ వద్దకు పోయెను. అతడు  పోవుచు, శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును, గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి, తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి, యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి, హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు, హరిద్రధుడు, చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు, శివుని శూలమును ప్రయోగించి, రాక్షసుని సంహరించెను. ఆ రాజు, రాక్షసుని సంహరించి, విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు, నారదుని మాటను, స్మృతికి తెచ్చుకొనెను, వానిని, భర్తగా వరించెను. హరిద్రధుడును, ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును, విష్ణుభక్తులై, విష్ణుపూజను, మాఘమాస స్నానమును, మానక, చేయుచుండిరి. చిరకాలము, సుఖశాంతులతో, శుభలాభములతో, జీవితమును గడిపి, శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి," అని వశిష్టుడు, మాఘస్నాన మహిమను, దిలీపునకు వివరించెను.


*పదహారవ అధ్యాయము*  

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం*_🚩 🚩 _*15 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*15 వ అధ్యాయము*_🚩


       *శుక్రవారం*

*ఫిబ్రవరి 26, 2021*


🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*జ్ఞానశర్మకథ - మాఘపూర్ణిమ*


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


గృత్నృమదుడు జహ్నువుతో, నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు, శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు, శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి, "ఓయీ! నీవు మరల నారాకను గోరి తపమచరించితివి యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమ"ని యడిగెను. అప్పుడా విప్రుడు, '"స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి, యీ బాలుడు, పండ్రెండు సంవత్సరముల తరువాత, మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి, తపమాచరించితినని, శ్రీహరికి విన్నవించెను.


అప్పుడు శ్రీహరి, 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు, పండ్రెండవ సంవత్సరమున, గండము కలుగుటకు, కారణమును వినుము. నీ భార్య, పూర్వ జన్మమున చేసిన దోషమే, యిప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ, మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును, నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానశర్మ, ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి, పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన, నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో, మాఘ వ్రతము నాచరించినందున, యీ జన్మయందును, విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను, గత జన్మలో, నీ భార్య, మాఘపూర్ణిమనాడు చేయవలసిన, పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను, రెండు దోషముల వలన, పండ్రెండు సంవత్సరముల తరువాత, గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి, గంగోదక బిందువులతో, నీ పుత్రుని తడుపుము. ఇందువలన, గండదోషముపోయి, నీ పుత్రుడు చిరంజీవియగును.

ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివారికి, వారి సంతానమునకు, ఆపదలు కల్గును, అధిక పుణ్యములని, గత జన్మలలో చేసిన వారికి, మాఘమాస వ్రతము నాచరింపవలయునని, సంకల్పము కలుగును. మాఘస్నానము, సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు, దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి, ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము, కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రతము, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు, వీరు మాత్రమే, బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను, పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ, కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ, అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే, మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే, మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున, గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి, శ్రీహరి అంతర్హితుడయ్యెనుl.


బ్రాహ్మణుడును, శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా, మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును, శ్రీహరి దయ వలన, గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము, తొలగెను. బ్రాహ్మణుడును, ఆ బాలునకు, మూడవ సంవత్సరమున, చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు, చేయదగిన సంస్కారములను చేసి, విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున, మృత్యుదోషము, శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్యా, పుత్రుడు, అందరును, సుఖ సంతోషములతో, కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు, పుత్రుని గృహస్థుని చేసి, యోగ మహిమచే ,శరీరమును విడిచి, శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది, మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి, పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును, అన్ని వర్గముల వారును ఆచరించి, యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది, సంసార సముద్రమును తరించి, పరలోకసౌఖ్యమును గూడ, పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని, గృత్నృమద మహర్షి, జహ్నుమునికి వివరించెను


*పదిహేనవ అధ్యాయము*  

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మూడు‘గొప్ప’లున్న మనీషి*

 *మూడు‘గొప్ప’లున్న మనీషి*


(ముళ్లపూడి వెంకటరమణ వర్థంతి ఈరోజు - 28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011)


ముళ్లపూడి వెంకట రమణ గురించి చెప్పాలంటే మూడు ‘గొప్ప’లను చెప్పాలి. గొప్ప రచయిత, గొప్ప చిత్ర నిర్మాత, గొప్ప వ్యక్తి! ఆయన రచన శైలి ఎవరిదీ కాదు - ఆయనదే. ఎవరైనా ఆయన శైలిని అనుకరించవలసిందేగాని, ఆయన ఎవరినీ అనుకరించలేదు. కథ రాసినా, ఆత్మకథ రాసినా, నాలుగు వాక్యాలు రాసినా, సినిమా వార్తలు రాసినా, సినిమా సమీక్షలు రాసినా, సినిమా సంభాషణలు రాసినా - ఏది రాసినా ఆయన శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది అనితర సాధ్యం. ఆయనకి గురువులెవరూ లేరు. అంతా స్వానుభవమే, సృయంకృషే.


*నిక్కర్లతో పరిచయం..*

1948 ‘బాల’ పత్రికలో సీరయల్‌ కథ రాశారు రమణ. బాపు అప్పుడు ఆ సీరియల్‌కి బొమ్మలు వేశారో లేదోగాని, విడిగా ‘బాల’లో కార్టూన్‌లు వేసేవారు. నేనూ ‘బాల’లో ఏదో రాస్తూ ఉండేవాడిని. అప్పుడే వాళ్లంటే అభిమానం ఏర్పడింది. ఆ సంవత్సరంలోనే మద్రాసు వెళ్లినప్పుడు, ‘బాల’ ఆఫీసులో బాపు చిరునామా అడిగి, ఆయన ఇంటికి వెళ్తే ఇద్దరూ కలిశారు. అందరమూ నిక్కర్లతో ఉన్నవాళ్లమే. అదీ పరిచయం. తర్వాతే లేఖలు... 1953-54 సంవత్సరాల్లో బాలకృష్ణా రోడ్డులో ఉన్న మేడమీద గదుల్లోని ఒక గదిలో రమణ, అజంతా ఉండేవారు. ఒక చిన్న ‘కొట్టుగది’లో నేను. ఏదో డబ్బింగ్‌ సినిమాకి డైలాగులు కాపీ చేస్తూ కనిపించేవారు రమణ. నేనేదో నా ప్రయత్నాలు చేస్తుండేవాడిని. సిగరెట్లు కాలుస్తూ రెండో ఆట సినిమాలకి నడిచివెళ్లి, నడిచివస్తూ వుండేవాళ్లం. అనవసరపు మాట, వృథా ప్రసంగం ఏదీ ఉండేది కాదు. ఆయన ఆలోచనలు మాత్రం ఆలోచించదగ్గవిగా ఉండేవి. ‘టీ తాగుదామా’ అని అడిగితే - ‘నా దగ్గర అణాయే మిగిలింది, మీరు తాగండి’ అని అణా ఇచ్చి టీ తాగించిన ఔదార్యం అప్పట్నుంచే ఉంది - ఎప్పటికీ తగ్గలేదు సరికదా, పెరుగుతూ వచ్చింది. ఆఫీసు నుంచి ఇంటికి: 1956లో ‘ఆనందవాణి’లో నాకు ఉద్యోగం వచ్చింది. వాళ్ల ఆఫీసులోనే మకాం. పక్కనే ఆంధ్రపత్రిక ఆఫీసు. రమణ ఆంధ్రపత్రిక విక్లీలో ఉద్యోగం. అప్పటికే ఆయన ‘బోల్డు’ కథలు రాయకపోయినా, రాసినవి ముత్యాలు, రత్నాలూ. నా కథలు రెండు మూడు వీక్లీలో అచ్చుపడ్డాయి. ఉద్యోగంలో చేరిన మర్నాడే పత్రిక ఆఫీసుకు వెళ్లి రమణనీ, ఆయన ద్వారా నండూరి రామమోహనరావునీ (వీక్లీ ఇన్‌చార్జ్‌) కలిశాను. నా విషయం చెప్పాను. ఇద్దరం కిందికి దిగాం. కాఫీ తాగాం. నేను డబ్బులు తీస్తూ ‘నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వలగలను’’ అంటే ‘‘నేను ఇంకా ఇవ్వగలను’’ అని రమణే ఇచ్చేశారు. నాతోపాటు ‘ఆనందవాణి’కి వచ్చి ‘ఎక్కడ మీరుండడం?’ అని అడిగారు. ఆఫీసులోనే ఒక మూలువున్న పెట్టెబేడా చూపించాను. ‘‘ఏడిసినట్టుంది. ఎలా ఉంటారు? మా ఇంటికి వచ్చేయండి. మా అమ్మా వాళ్లెవరూ లేరు. ప్రస్తుతం, నేను మా తమ్ముడే వుంటున్నాం. వాళ్లూ వచ్చాక చూసుకుందాం పదండి’ అన్నారు. ఓడియన్‌ టాకీస్‌ పక్క వీధిలో ఉండేవారు రమణ. నా మకాం అక్కడికి మారింది. తమ్ముడు రామచంద్రుడు కూడా అలాంటివాడే. ‘ఈ పూట భోజనానికి హోటల్‌కి వెళ్లకండి. అన్నం కూడా పెట్టేస్తాను’ అనేవాడాయన. ఏ రాత్రికో రమణ వచ్చేవారు. కథల మీద, రచనల మీద సినిమాల మీద చర్చలు. నన్ను ప్రెస్‌ క్లబ్‌కి తీసుకెళ్లారోసారి. అక్కడ శ్రీశ్రీ ఉన్నారు. నన్ను పరిచయం చేశారు. ‘‘ఇంకో కాళిదాసు బాధితుడన్నమాట’’ అన్నారు శ్రీశ్రీ. ‘ఆనందవాణి’ అధిపతి కాళిదాసు. శ్రీశ్రీ కొంత కాలం అక్కడ పనిచేశారు. అదీ వ్యాఖ్యానం..


*అదీ ఔదార్యం..*

రమణ చేతికి గడియారం కట్టుకున్నట్టు ఎన్నడూ చూడలేదు. బహుశా కట్టుకుంటే చేతికి కట్టుబడదేమో?.. చేతికి ఎముక లేదు గనక. ఒకసారి హోటలుకెళ్లి బయటకొస్తున్నపుడు హోటలు వాడిచ్చిన చిల్లర చేతినిండా ఉంది. ఓ బిచ్చగాడు చెయ్యజాస్తే మొత్తం అంతా వాడి చేతిలోకి వేసేశారు. ‘‘ఇంకా ఉన్నారు అందరికీ సర్దవచ్చుగదా’’ అన్నాను. ‘‘ఎవడికీ ఏమీరాదు ఒకడైనా ఓ పూట అన్నం తిటాడు గదా’’ అన్నారు. (అప్పుడు 8 అణాలు, లేదా పది అణాలు).


*పెంచిన పారితోషికం..*

ఆ ఔదార్యం ఆయన చిత్ర నిర్మాత అయినప్పుడు కూడా అలాగే ఉంది. ఏ నిర్మాత అయినా ‘పారితోషికం ఎంత తీసుకుంటారు?’ అని అడిగితే, మనం చెప్పినప్పుడు ‘అమ్మో-అంత ఇవ్వలేను’ అని బేరం ఆడి తగ్గించడం ఆనవాయితీ. ‘అందాల రాముడు’ సినిమా ముందు ‘ఎలా ఉంది మీ రేటు?’ అని అడిగారు నిర్మాత రమణ. ‘ఐదువేలూ..అలా ఉంది’ అన్నాను. ‘‘అబ్బేబ్బే...అదేంటి? పెరగాలి. సాక్షి రంగారావు, మాడా ఇంకా తక్కిన వాళ్లూ అందరికీ కాస్త పెంచే ఇస్తాను. పెద్దవాళ్లందరికీ ఎలాగూ అడిగింది ఇచ్చేస్తాం. మీలాంటి వాళ్ల దగ్గరే బేరాలు. ఆరువేలు రాస్తాను. సుబ్బరంగా పుచ్చుకుని, ఇటు తర్వాత వాళ్లకి కూడా ఈ ఎమౌంటే చెప్పండి’ అన్నారు ఆ నిర్మాత.


*దక్షత గల నిర్మాత..*

చిత్ర నిర్మాతల లెక్కల్లో రమణని ఎవరూ లెక్కవేయరు. ఎంతసేపూ రచయితల జాబితాలోనే వేస్తారు. ‘నిర్మాత’గా ఆయన పేరు 15-20 చిత్రాల మీద ఉంటుంది. నందనా ఫిలిమ్స్‌ (సాక్షి), శ్రీరామచిత్ర, కల్పనా చిత్ర పేర్ల మీద వచ్చిన సినిమాలకి నిర్మాత ఆయనే. దక్షత గల నిర్మాత. పథకం గల నిర్మాత. ఆర్భాటం లేని నిర్మాత. తన షూటింగ్స్‌లో ఎవరూ ఇబ్బంది పడకూడదు, పెట్టకూడదు, అడిగిందల్లా ఇచ్చేవారు. అవుట్‌డ్డోర్‌లో షూటింగ్‌లంటే, అక్కడ షామియానాలూ, కుర్చీలూ, బల్లలూ ఉండాల్సిందే నాలుగైదు రోజులు షూటింగ్‌యినా దూరంగా మరుగుదొడ్లు కట్టించేసేవారు - స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి తెర గదులూ, కాఫీలు, టిఫిన్లు, భోజనాలూ సరేసరి! ఓసారి షూటింగ్‌లో నేను ప్రొడక్షన్‌ బాయ్‌ని పిలిచి కాఫీ అడిగాను. ఆ అడగడం విన్నారు రమణ. ఆ అబ్బాయిని పిలిచి, ‘ఎవరూ కాఫీ కావాలని అడక్కూడదు. మనమే ‘కాఫీ కావాలా?’ అని అడుగుతూ ఉండాలి. చిన్నవాళ్లయినా పెద్దవాళ్లయినా సరే వాళ్లుగా అడిగితే మన కంపెనీకి నామోషి’ అని బోధ చేశారు! అన్నీ పక్కా ఏర్పాట్లు, ఉన్నంతలో సౌకర్యాలు. నేను దాదాపు ఐదు వందల సినిమాల్లో వేశాను. ఓ రెండు వందల సినిమాలకి అవుడ్డోర్లు వెళ్లాను. కానీ ‘అందాల రాముడు’ సినిమా అవుట్‌డ్డోరు మాత్రం - మహా గొప్పది.


*వాణిశ్రీ బాకీ..*

‘గోరంతదీపం’ సినిమా బాగా నడవలేదు. రావలసిన సొమ్ము రాలేదు. వాణిశ్రీ నాయిక. ఆమెకి ఓ ఇరవైవేలో, పాతిక వేలో బాకీపడ్డారు. సినిమా బాగా ఆడలేదు గనక, ఆమె కూడా అడగలేదు. ఆమె మరిచేపోయిందిగాని, రమణ మరచిపోలేదు. రెండేళ్ల తర్వాత ఆ బ్యాలెన్స్‌ పంపితే, ఆమె దిగ్గుబోయింది. ‘‘ఏమిటి - ఎందుకు?’’ అంది. ‘‘మీకు బాకీగదా’’ అన్నాడు నిర్మాత. ‘‘ఎందుకు? ఎప్పుడో అయిపోయిందిగదా. సినిమా కూడా బాగా నడవలేదు నష్టం కదా’’ అంది ఆ తార. ‘‘కావచ్చునమ్మా. కానీ, మా బాకీల లిస్టులో మీ పేరు అలా ఉండిపోతుంది. ఆ మచ్చ ఉండకూడాదు కదా. అంచేత, మీరు మరచిపోయినా, ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది గనక తీసుకోండి’’ అన్నది ఆ నిర్మాత సహృదయం! ‘పెళ్లిపుస్తకం’ సినిమాకి నా కథ తీసుకున్నప్పుడు, ‘‘ఎంత? మీరెప్పుడూ ఎవరికీ కథలు అమ్మలేదు నేనెప్పుడూ ఎవరి కథ కొనలేదు. అంచేత రెండూ కొత్తే. ఏంచేద్దాం?’’ అని అడిగితే, ‘‘మీ ఇష్టం మీరెంత ఇస్తే అంత అంతే’’ అన్నాను. చిరునవ్వేశారు. అవుట్‌డ్డోర్‌ షూటింగ్స్‌లో అందరికంటే ముందు లేచి, కొందరిని లేపి, మరికొందర్ని లేపించేవారు ఆయన. బాపు లోకేషన్‌లో అందరికంటే ముందుంటారు. అంచేత ‘అందరూ సిద్దమయ్యేరా లేదా’ అని రమణ అలా అలా తిరుగుతూ పర్యవేక్షించేవారు - మేనేజర్లు వేరే వున్నా. ‘నిశ్శబ్ద నిర్మాత’ అని ఆయనకి పేరు.


*మరువలేని ప్రోత్సాహం..*

నేను దర్శకత్వ శాఖలో చేరాను. ‘‘ఏమిటి మీ లక్ష్యం? రచయిత కావాలనా? దర్శకుడు అవుదామనా? నటుడు అవుదామనా?’ అని మూడు ప్రశ్నలు వేశారు. ‘‘ఏమో! విధి ఎటు నడిపిస్తుందో ఉత్సాహం కొద్ది, బతుకు దారిలో చేరాను’’ అన్నాను. ‘‘మీరు నటించడం చూశాను నాటకాల్లో, సహజత్వం ఉంది. నటుడిగా ప్రయత్నించండి’’ అని సలహా ఇచ్చింది రమణే. ఆయనకి తొలిసారి సినిమా రచయిత అకాశం వచ్చినప్పుడు అన్నారు. ‘‘ఇందులో మీకు వేషం చెప్పాను. ఆదుర్తి మీకూ తెలుసుకదా’ అని, ‘దాగుడుమూతలు’లో 10, 12 దృశ్యాల్లో వచ్చే డాక్టర్‌ వేషం ఇప్పించారు రమణ. నటుడిగా ప్రయత్నిద్దాం అనుకున్నప్పుడు వచ్చిన తొలిచిత్రం ‘ప్రేమించిచూడు’ పాత్రా ఆయన చలవే. నేను తరచుగా చెప్పే ‘మాస్టారు’ ధోరణితో ఆ పాత్రని దిద్ది, నాచేత వేయించమని పుల్లయ్యతో చెప్పిన ‘ప్రొత్సాహి’ రమణ. అంతే! ఆ పాత్రలో నేను అడక్కుండానే చాలా పాత్రలు రావడం ఆరంభించాయి.


*ఆ శక్తి స్వశక్తే..*

సినిమా రచనలో కొత్తదనం తెచ్చారు రమణ. అవన్నీ ఉదాహరణలు అనవసరం, అందరికీ తెలుసు. ‘సినిమాలకి రాయాలంటే అంతకుముందు నాటకాలు రాసిన అనుభవం ఉండాలి’ అంటారు రమణ. కొన్ని రేడియో నాటకాలు రాశారుగాని, రంగస్థల నాటికలు, నాటకాలూ రాయలేదు. మరి, అంత గొప్ప సినిమా డైలాగులు ఎలా రాశారు? హాస్యం, వ్యంగ్యం, విషాదం అన్నీ సమపాళ్లలో రాయగలిగిన ఆ శక్తి స్వశక్తి. సంస్కృతాంధ్రాంగ్లాల్లో ఆయన పండితుడు కాదు. ‘సీతాకల్యాణం’, ‘సంపూర్ణరామాయణం’, ‘శ్రీరామరాజ్యం’, ‘శ్రీనాథుడు’ ఎలా రాశారు మరి? అద్భుతమైన ప్రజ్ఞ, స్క్రీన్‌ప్లే రాయడంలోనూ అంతే! ‘‘నేను డైలాగ్‌ రైటర్నే కానీ, సినిమాల్లో సాధ్యమైనంత వరకూ డైలాగులు తక్కువగా ఉండాలి’ అన్నారు ఒకసారి. ‘దాగుడుమూతలు’కి ముందే వచ్చిన ‘మూగమనసు’లో చాలా రమణవి చాలా డైలాగులున్నాయి. ఆయన రాసే పాత్రల సృష్టీ అలాగే ఉంటుంది. కాంట్రాక్టరు, తీతా, అప్పారావు, ఆమ్యామ్యా బాబాయ్‌ (పెళ్లిపుస్తకంలో నా పాత్ర) ఇలా ఎన్నో అన్నీ నిలబడిపోయే పాత్రలు. రమణ రాసిన స్క్రిప్టు మీద బాపుకి విశేషమైన భక్తి. ఒక్కక్షరం తప్పు పలికినా, మార్చినా, బాపు ఒప్పుకోరు. ఇద్దరు కూచుని స్క్రీన్‌ప్లే చర్చించుకున్నాకే. డైలాగులు (రమణ మాషలో డై‘లాగులు’ తొడుగుతూన్నాను) రాస్తే. అంతే!


*ఆ ధోరణి ఆయనదే..*

కథారచయితగా రాసినవన్నీ గొప్పవే. ఆ శైలే వేరు. వెండితెర నవలలు రాశారు కొన్ని సినిమాలకి. ఆ ధోరణే వేరు. అలాంటి రచనల ధోరణికి ఆయనే ఆద్యుడు. అనుసరణీయుడూ. ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో హింది సినిమా వార్తలు రాసేవారు. క్రింద ‘టచ్‌స్టన్‌’ అని పేరుండేది. ఆ పంపినవాడు తెలుగువాడేనా అనుకుంటాం. కాదు అది రమణ అనువాద శైలి. యస్‌.పార్థసారథి పేరుతో రాసినవీ ఆయనవే. ఒక ‘రాజకీయ బేతాళ’, ‘పంచవింశతి’, ‘రాధాగోపాలం’ ‘జనతా ఎక్స్‌ప్రెస్‌’, ‘కోతి కొమ్మచ్చి’ ఎన్ని పుస్తకాలు చెబుతాయో రమణ కలం బలం గురించి. ప్రతికల్లో కథలు రాయడం మొదలుపెట్టి సినిమా సమీక్షలు రాసి, రేడియో నాటకలు రాసి, సినిమా రచయితగా స్థిరపడి, నిర్మాతగా ఎదిగి అన్నింటా తన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేసిన ముళ్లపూడి వెంకటరమణ ఎందరికో ఆత్మియుడు, బంధువు, మిత్రుడు.


👉 సౌజన్యం: బహుముఖ ప్రతిభాశాలి రావి కొండలరావు

కరోనా హెచ్చరిక:

 *కరోనా హెచ్చరిక:

ప్రజా ప్రయోజనాల రీత్యా జారీ చేయబడింది. 

కరోనా వైరస్ వ్యాప్తి  ఇప్పుడు  2 వ దశలో  ఉందని, సోకిన 3 రోజులలోనే   తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

*దయచేసి మీ పనులు అన్ని పక్కన పెట్టి 2 నిముషాలు ఈ అత్యవసర కరోనా మెసేజ్ చదవండి..*

ఇంతకు ముందు కరోనా వైరస్ వేరు. ఇప్పుడు అది మారిన తీరు వేరు.. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది..

మరియు 60 ఏళ్ళు దాటిన వారికి తీవ్రం గాను, యుక్త మధ్య వయస్సు వారికి స్వల్పం గాను ప్రభావాన్ని చూపేది.కానీ world హెల్త్ organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితి లోకి చేరుకుంది.ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో  మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ  మరలి రాని లోకాలకు తీసుకెళ్లి పోతూ ఉంది..

రోజూ కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అయిన వాళ్ళని, అందర్నీ  దిగ్భ్రాంతికి గురి చేసి మూడే మూడు రోజుల్లో మృత్యు ఒడి లోకి జరుకుని  తీవ్ర దుఃఖాన్ని మిగుల్చు తున్నారు.. 

కరోనా వెరీ డేంజర్ స్టేజ్ లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే..  కరోనా సోకిన 1,2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే  ట్రీట్మెంట్ చేసినా బతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటూ ఉంది.. 

*ఏముంది కరోనా పోయింది లే.. ఎక్కువ కేసులు లేవు లే.. సి-విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాం లే.. మన వరకూ రాదులే.. దేవుడున్నాడు లే అని మాస్క్ లు లేకుండా, సామజిక దూరం పాటించకుండా, sanitisation చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మూడే రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్లి పోవడం గ్యారంటీ..* 

ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకుని నిలబడి తనని తాను మరింత ప్రమాదకర వైరస్ గా రూపు దిద్దుకుంది. 

కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ లు అన్ని పక్కన పెట్టి   C, D, జింక్ లాంటి మల్టీ విటమిన్ లు తీసుకుంటూ, *మాస్క్ లు, హ్యాండ్ sanitisation లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ..*  అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగ వలెను..లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడ లేడు..


కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి,14 రోజుల కరోనా నుండి అత్యంత ప్రమాద కారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ ని నిశితంగా గమనిస్తూ పై సూచనలు జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకో వలసిందిగా కోరుచున్నాము. 


ఈ మెసేజ్ ని 10 మందికి పంపి మీ పక్క వారు కూడా పాటించేలా జాగ్రత్త పడండి.. 


ఎందుకంటే, ఈ కరోనా వ్యాపించేది పక్క మనిషి నుండే అనే విషయాన్ని మర్చి పోవద్దు.. ఒక్కోసారి పనికి రాని చెత్త విషయాలను షేర్ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాం.

ఈ ఒక్కసారికి  ఈ విలువైన msg ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చెయ్యండి.. 


*గుర్తుంచుకోండి.. ఇప్పుడు ఉన్నది 14 రోజుల కరోనా కాదు.. 3 రోజుల కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు..*🙏

ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

             *నేటి కధ:*


*ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు* 

        🌷🌷🌷

ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది.  మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది.  క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది.  ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.


అది ఒక దీపం.  దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.


ఆమె  ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది.   కానీ, ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దయ్యాలకూ, భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని "ఎవరు నువ్వు?"  అని అడిగింది.


"నేనొక భూతాన్ని!  బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు!  నా వివరాలు తర్వాత చెబుతాను.  ముందు నీ విషయం చెప్పు!  నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు?  నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను" అన్నదా భూతం.


"చెబితే నష్టమేమిటి?  దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది" అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది. 


"నా మనస్సు కు సుఖమనేదే లేదు.  నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు.  ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే!  అని అడ్జెస్ట్ అయ్యాను.  కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు.  నా మాట లెక్క చేయడు.  నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు.  నాకు విలువ ఇవ్వడం లేదు.  ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు. చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు.  దీంతో నా మనస్సులో భరించలేని ఒంటరితనం ఏర్పడి విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను.  నిజానికి ఇది ఆవేశంతోనో, దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు.  నిరాశా, నిర్లిప్తితతో తీసుకున్న నిర్ణయం .


ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది.

"నిజమే! మీరంతా సామాజిక జీవులు.  మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి.  సహకారం ఉండాలి.  ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం. 


*మరి అలా జరగనప్పుడు ఏం చెయ్యాలి?* 


ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. 


అసలు నిన్ను  అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?


నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను  అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా?  అని ఆలోచించు!  వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!


 ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. 


సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది. 


మరిప్పుడు ఎలా?  నీ కర్మ ఇంతే  అనుకుందామా?  కానేకాదు.  ఇప్పుడిలా ప్రశ్నించుకో! 


నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?

ఇది కూడా నిజమే! 


ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి  వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'. 


ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు.  అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో  అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకో లేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం?   


ఇంకేం చేస్తాం?  మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము. 


"నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు"


దీన్నే మరోలా చదువుదాం 


"నేను ఎవరికీ అర్థం కావట్లేదు "

ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా! 

మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది.  రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది.  అవును!  మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి.  ఇదీ అంతే!


నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని. 


ఇప్పుడు రెండే దారులు. 


ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి.  నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి. 


*ఇక రెండోది.* 


నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి.  నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి.  నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి.  సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి.  వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు.  ఈ నైపుణ్యాలు ఉంటేనే  లోకానికి కనబడతావు.  సమాజం నిన్ను గుర్తిస్తుంది.


నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదావేసుకో! 

ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు. అంతేకాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు!

నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు!  ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది.


*చివరగా మరొక్క మాట!* 


ఇతరుల విలువనూ, గౌరవాన్ని కోరుతున్న నువ్వు, స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో! 


అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.


భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ " ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.

అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం !అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానం లో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.


ఆరు నెలలు గడిచిపోయాయి.


ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది.  అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి, "ఏం జరిగింది?" అని అడిగింది.


"ఏం చెప్పాలి?  ఒకటా? రెండా? అన్నీ మార్పులే!" అంది నవ్వుతూ.


ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది.


ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటు ను అరగంట కు కుదించాను.

అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ, నా పనులు తెమిలేవి కావు.

ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం  మిగులుతుంది కూడా!


డైరీ రాయడం ప్రారంభించాను. నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.


మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిల్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.


ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్‌ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్షన్ పడుతూ పిల్లలను కూడా టెన్షన్ పెడుతూ గట్టిగా అరుస్తూ  నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.


నాకు తెలియకుండానే పిల్లలకు కూడా "టెన్షన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను." అన్న విషయాన్ని గమనించలేకపోయాను.


"నీకు తెలుసా!  గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."


ఇప్పుడు  నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.


ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను.  రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను.  వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తా, పిల్లలను నిద్ర లేపుతున్నాను.


నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.


అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.


రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను, నా భర్తా, పిల్లలలో దర్శించలేనా?


కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో, నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా?


అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.


నా భర్త కు "రాధ"నయ్యాను.


అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను. అంతకు ముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు, మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.


ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.


నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక.  కానీ, చాలా భయపడేదాన్ని.  ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషు లో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను.  మా ఆఫీసుమీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.


నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది.  కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.


చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను.  ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను.  ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు!  కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.


నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు.  అతనొక జర్నలిస్టు.  తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు.  ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.  అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు.  నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను ఆవేశంతో రగిలిపోయేదాన్ని.


గతంలో "నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే  విషయం గొడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి " గుర్తుకువస్తుంది.


ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల? అని ఆలోచించేదాన్ని.  కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తితకు గుర్తని ఇప్పుడు నాకర్థమౌతుంది. ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు.  క్రమంగా అతడు అర్థమౌతున్నాకొద్దీ, అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.


అతను  నాపట్ల ఆసక్తి చూపాలంటే, అతనికిష్టమైన విషయాల్లో నేనూ  ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభించాను.


నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు.  నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి, అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.


ఇప్పుడు నాకు కుటుంబ సభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే!


నీకో విషయం చెప్పనా?  మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.


ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఉసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు.  మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని.  వాళ్ళవల్ల నా సమయమూ, మనస్సూ రెండూ చెడిపోయేవి.  అలా వచ్చేవారికి "కొంచం కూరగాయలు తరిగి పెట్టవా? బోళ్ళు కడగడంలో హెల్ప్ చెయ్యవా?" అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు.  నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.


ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది.  నేనే అందరిని అర్థం చేసుకోగలను.


మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? 


ప్రధానమంత్రి  స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను.  ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.  నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.


ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను.  నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.


"ఉద్ధరేదాత్మనాత్మానం" అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి ....ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యు !' అంటే వెళ్లి పోశాను. ' శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో! " అంటే వెళ్లి పెట్టుకున్నాను.

నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను.మార్పు బయటనుంచి వస్తుందని ఎదిరిచూశాను. 

మార్పు లోపలినుంచే వస్తుందని ..మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.


ఇదంతా నీవల్లే! 


నా ఆత్మహత్య ను తప్పించావు.

నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.

నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా,గౌరవం రావడానికి కారణమయ్యావు. 

ముఖ్యంగా "నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు."

ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.


నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తుంది.


సరే!  "నా సంగతి అలా ఉండనీ!  నీ వివరాలు చెప్పు" అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ.


ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో  ఇలా చెప్పసాగింది.


" నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను.  చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.


నేనున్న స్థితి ఎలాంటిదంటే,


ఆకలౌతుంది కానీ, తినలేను.

నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను.  అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను.  దుర్భరంగా, పరమ యాతనగా ఉంటుంది.


ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేెళ్ళా పడి విముక్తి కలిగించుమని పార్థించాను.


నా ప్రార్థన విన్న అతడు ...

 

" ఆత్మహత్య మహా పాపం." 


నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు.  నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.


1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )


2. నీ మాటలు ఒక వ్యక్తి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి. ( జ్ఞానదానం)


3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )


అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపం లో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.


ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడం లోనే ఉంది గొప్పంతా!

నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు.  నేను చేసిందేమీ లేదు.

నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది.నీకే నా  హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం "సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా" బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.


"ఒకరికి సహాయం చేయడం లోనే మన మేలు కూడా ఉందన్న" క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి  బయలుదేరింది.

          ** స్వస్తి **

(ఓపికగా చదివిన వారికి ధన్యవాదములతో)


 *సమస్త లోకా సుఖినోభవంతు!* 


(రసజ్ఙభారతి సౌజన్యంతో-

శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.)

*Distinction between Cheque and Bill of exchange*

 1. A Bill of exchange may be drawn on any person. A cheque is always drawn on a banker.



2. A Bill of exchange may be payable on demand, or on the expiry of a certain period or at sight. 

Cheque is always payable on demand. 

3. A grace of three days is allowed in case of time bills. No grace is allowed on cheques.

4. A cheque doesn't require any stamp. Bill of exchange l is ordinarily

stamped.

5. A cheque may be crossed. Bill may not be crossed.

మొగలిచెర్ల

 *ధన్యజీవి..*


"దిగంబరిగా ఉంటూ..కఠోర తపస్సు ఆచరిస్తూ..తనను మనస్ఫూర్తిగా విశ్వసించిన వాళ్లకు జ్ఞాన బోధ చేస్తూ..తన మరణాన్ని ముందుగానే తెలుసుకొని..మోక్షప్రాప్తికి కపాలమోక్షమే మార్గమని తలచి..వైశాఖ శుద్ధ సప్తమి నాటి రాత్రి ఆ పరమాత్మలో ఐక్యం చెందిన అవధూత మందిరం వద్ద ఉన్నాము..మరి కొద్దిసేపటిలో ఆ దిగంబర అవధూత సమాధిని దర్శించబోతున్నాము..మీయొక్క మనసులోని కోరికలను స్వామివారి సమాధి వద్ద కోరుకోండి..పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఈ స్వామిని నమ్మిన వారి కోర్కెలు నెరవేరుతాయని తెలుసుకోండి.." అంటూ తనతో పాటు వచ్చిన భక్తులకు చెపుతున్నారు ఆవిడ..ఆవిడను ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు..మొగిలిచెర్ల లాంటి మారుమూల పల్లెటూరులో ఉన్న ఈ క్షేత్రం గురించి..ఇక్కడ సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి గురించి అన్ని విషయాలు వర్ణించి మరీ తన తోటి వచ్చిన వారికి చెపుతోంది..ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా నాలో కలిగింది..


ఆ వచ్చిన యాత్రీకులు సుమారు యాభై మంది దాకా వున్నారు..కృష్ణాజిల్లా నుంచి ఒక ప్రత్యేక బస్సు మాట్లాడుకుని..ఒంగోలు, నెల్లూరు పరిసర ప్రాంతాలలో ఉన్న ఆలయాలు అవధూతల మందిరాలు దర్శిస్తూ..మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ యాభై మందితో కలిసి వచ్చిన ఆవిడ..మిగిలిన వారికి ఈ క్షేత్రం గురించి విడమరిచి చెపుతున్నది..ఆవిడ వయసు దాదాపు డెబ్భై ఏళ్ళు వుంటాయేమో..ఏమాత్రం తడబాటు లేకుండా..స్వామివారి గురించి చక్కగా చెపుతున్నది..


అందరూ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చున్నారు..అప్పటికి సమయం ఉదయం పది గంటలు..అంతవరకూ స్వామివారి గురించి మాట్లాడుతున్న ఆవిడ వద్దకు వెళ్లి..నన్ను నేను పరిచయం చేసుకొని.."అమ్మా..మీరు ఈ స్వామివారి గురించి మీతోటి వాళ్ళతో చెప్పడం నేను విన్నాను..మీరెప్పుడైనా ఈ క్షేత్రానికి వచ్చారా?..మీకు ఇంత వివరంగా ఎలా తెలుసు?..మీరు ఈ ప్రాంతం వారేనా?..మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసి ఉండలేదు..మీరేమీ అనుకోకుండా నా సందేహాలు తీరుస్తారా?.." అని అడిగాను..


"మీరు శ్రీధరరావు, ప్రభావతి గార్ల కుమారుడా?..చాలా సంతోషంగా ఉంది నాయనా..నా పేరు సుభద్ర..మీ తల్లిదండ్రులు నాకు పరిచయం..శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులం..మాస్టారు గారు 1980 లోనో..82 లోనో ఈ మందిరాన్ని దర్శించుకున్నారు..వారు మాకు ఈ స్వామివారి గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు..అప్పట్లో నేను మా తల్లిదండ్రులతో కలిసి ఇక్కడకు రెండు మూడు సార్లు వచ్చాను..మీ అమ్మా నాన్న గార్లతో కూడా అప్పుడే పరిచయం కలిగింది..మేము ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ..మీ అమ్మగారు మాకు భోజనం వండి వడ్డించే వారు..మీ అమ్మా నాన్న గార్ల ద్వారా ఈ స్వామివారి గురించి  పూర్తిగా తెలుసుకున్నాను..నన్ను నోరారా సుభద్రా అని పిలిచేవారు..నాకు వివాహం జరిగి ఐదేళ్ల కు కూడా సంతానం కలుగక పోతే..అమ్మా నువ్వొక్కసారి నీ భర్త తో కలిసి మొగిలిచెర్ల లోని స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయమ్మా..ఫలితం ఉంటుంది..అని మీ అమ్మగారు ఒంగోలు వచ్చినప్పుడు చెప్పారు..ఆమె మాట విని..మా ఆయనను ఒప్పించి ఇక్కడికి వచ్చి మూడు రాత్రులు నిద్ర చేసాము..సంవత్సరం కల్లా అమ్మాయి పుట్టింది..మరో రెండేళ్లకు అబ్బాయి పుట్టాడు..నన్ను సాక్షాత్తూ ఈ స్వామివారు ఆశీర్వదించారు..అప్పుడప్పుడూ వస్తున్నాను గానీ..ఏదో నా పాటికి నేను వచ్చి దర్శనం చేసుకొని వెళుతూ ఉండేదాన్ని..మీ అమ్మా నాన్న అనారోగ్యం తో వున్నప్పుడు కూడా నేను వచ్చి వెళ్ళాను..వాళ్ళను చూసి వెళ్ళాను..ఎటొచ్చీ..నీతో నాకు పరిచయం కలుగలేదు..ఇన్నాళ్లకు నువ్వే పలకరించుకున్నావు..అదే చాలు నాయనా.." అన్నారు..


మా సిబ్బందికి చెప్పి..అందరికీ భోజన ఏర్పాటు చేయమని చెప్పాను..(అప్పటికి మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అన్నదానం మొదలు కాలేదు..ఇలా ఎవరన్నా వస్తే..అప్పటికప్పుడు వండించే వాళ్ళం..) సుభద్ర గారూ..మిగిలిన యాత్రీకులు అందరూ భోజనాలు చేసి మళ్లీ వచ్చి మంటపం లో కూర్చున్నారు.."స్వామివారి జీవిత చరిత్రను మీ అమ్మగారు వ్రాసారు నాయనా..మాస్టారు గారి ఆధ్వర్యంలో సాయిబాబా అనే పత్రిక ఉండేది..అందులో మొదటిసారి ప్రచురించారు..మాస్టారు గారే దానిని పుస్తకరూపం లో కూడా తీసుకొచ్చారు..ఆ పుస్తకం తాలూకు రెండు కాపీలు నా వద్ద భద్రంగా ఉన్నాయి..ఇప్పటికీ పారాయణం చేస్తూ వున్నాను..నా ఊపిరి ఉన్నంత వరకూ ఓపిక చేసుకొని అప్పుడప్పుడూ వస్తుంటాను నాయనా..ఈరోజు నేనెవరో తెలియక పోయినా..ఆప్యాయంగా పలకరించావు..చాలా సంతోషం గా ఉంది.." అని చెప్పారు..ఆరోజు మధ్యాహ్నం అందరితో పాటు బస్సెక్కి వెళ్లిపోయారు..ఆ తరువాత కూడా మూడు సార్లు సుభద్ర గారు స్వామివారి మందిరానికి వచ్చారు..అత్యంత భక్తితో స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మూడేళ్ల క్రితం సుభద్ర గారు పరమపదించారని వాళ్ళ కుమారుడు తెలిపారు..ఆఖరి రోజు కూడా ఆవిడ స్వామివారి చరిత్రను పారాయణం చేశారని అతను చెప్పాడు..


పరిపూర్ణ జీవితాన్ని పొందిన సుభద్ర గారు ధన్యజీవి!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).