14, డిసెంబర్ 2021, మంగళవారం

Swiss Time Bank*

 *Swiss Time Bank*


A student studying in Switzerland observes:


While studying in Switzerland, I rented a house near the school.


The landlady Kristina is a 67-year-old single  old lady who had worked as a teacher in a secondary school before she retired.


Switzerland's pension is very good, enough to not worry her about food and shelter in her later years.


However, she actually found "work" - to take care of an 87-year-old single old man.


I asked if she was working for money.


Her answer surprised me:

“I do not work for money, but I put my time in the ‘time bank’, and when I cannot move in my old age, I could withdraw it.”


The first time I heard about this concept of "time bank", I was very 

curious and asked the landlady more.


*The original “Time Bank” was an old-age pension program developed by the Swiss Federal Ministry of Social Security. People saved the 'time' taking care of the elderly when they were younger, and when they were old, ill or needed care could withdraw it.*


Applicants must be healthy, good at communicating and full of love. Everyday they have to look after the elderly who need help.


Their service hours will be deposited into the personal 'time' accounts of the social security system.


She went to work twice a week, spending two hours each time helping the elderly, shopping, cleaning their room, taking them out to sunbathe, chatting with them.


According to the agreement, after one year of her service, *"Time Bank”* will calculate her working hours and issue her a “time bank card”.


When she needs someone to take care of her, she can use her “time bank card” to “time to withdraw “time and time interest”. After the information verification, “Time Bank” will assign other volunteers to take care of her at the hospital or her home.


One day, I was in school and the landlady called and said she fell 

off the stool when she was wiping the window. 


I quickly took leave and sent her to the hospital for treatment.


The landlady broke her ankle and needed to stay in bed for a while.


While I was preparing to apply for a home to take care of her, the landlady told me that I need not worry about her.


She had already submitted a withdrawal request to the “Time Bank”.


Sure enough, in less than two hours "Time Bank" sent a nursing worker to come and care for the landlady.


In the following month, the care worker took care of the landlady everyday, chatted with her and made delicious meals for her.


Under the meticulous care of the carer, the landlady soon recovered her health.


After recovering, the landlady went back to "work". She said that she intends to save more time in the "time bank" while she is still healthy.


Today, in Switzerland, the use of "time banks" to support old age has become a common practice.


The Swiss government also passed legislation to support the "Time Bank" pension scheme.


📯📯📯📯📯📯

*What a Beautiful  concept. Hope it gets adapted all over the world too!*

భగవద్గీత లో

 *భగవద్గీత  లో ఇష్టమైన శ్లోకాలు..*


భగవద్గీత  లో భక్తి జ్ఞాన వైరాగ్య సంబంధమైన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 


వీటికి తోడు జీవితంలో సాధారణంగా ఎదురయ్యే కష్టాలు ఇబ్బందులు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నకు సూటిగా కాకుండా కాకున్నా కాస్త చుట్టూ తిరిగి వచ్చేటట్లు గా జవాబులు ఉంటాయి. మనకు అప్పటి మన పరిస్థితులకు ఏదో ఒక శ్లోకం సరిగ్గా సరిపడేది ఉంటుంది. ఎవరికైనా తమకు పనికివచ్చే శ్లోక మే ఇష్టమైన శ్లోకం అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే భగవద్గీతలో ప్రతి శ్లోకమూ గొప్పదే.


నాకు సంబంధించినంత వరకు జీవితంలో చాలా సందర్భాల్లో చాలా శ్లోకాలు ఉపయోగపడ్డాయి. ఎక్కువ భాగం మనకు వచ్చే సందేహాలకు జవాబులు దొరకడం మన బాధలకు ఊరట మనశ్శాంతి కలగడం ఈ శ్లోకాలవల్ల జరుగుతుంటుంది. అంతేకానీ, సుందరాకాండ పారాయణము, సత్యనారాయణ వ్రతము మొదలైన వాటి లాగా భగవద్గీత శ్లోకాలు వల్ల డబ్బులు రావడం కష్టాలు తీరడం వంటి ఉపయోగాలు అంత ప్రసిద్ధంగా ఎవరూ చెప్పలేదు. 


 మనశ్శాంతి కోసమో సందేహ నివారణ కోసమో భక్తి జ్ఞాన వైరాగ్యా ల కోసమో భగవద్గీత ను ఉపయోగించుకోవాలి అనుకుంటే మొదట మొత్తం పుస్తకాన్ని చదివి   ఏ అధ్యాయములో ఏమి ఉందో కొద్దిగా అవగాహన చేసుకొని ఉండాలి. అప్పుడు మనకు పనికి వచ్చే శ్లోకాన్ని గుర్తుపట్టవచ్చు. 


 సంస్కృత భాషలో పరమ చరమ అని రెండు పదాలు ఉన్నాయి.దానికి మించి  దానికి పైన మరి ఏమీ లేకపోతే అది పరమ అవుతుంది. పరమేశ్వరుడు అంటే అతడిని అదుపాజ్ఞల్లో పెట్టేవాడు మరి ఎవరు ఉండరు. అందరికంటే పైన ఉండేవాడు అతనే అని అర్థము. అలాగే చరమ అంటే ఆఖరిది. కొస ముక్క. అంత దాకా చెప్పిన దాని సారమంతా దానిలో ఉంటుంది అని అర్థము.


 వైష్ణవులు మూడు శ్లోకాలను చరమ శ్లోకాలు గా భావిస్తారు. మొదటిది రామాయణంలో  ఉంది. రెండవది భగవద్గీతలో ఉంది. మూడవది వరాహ పురాణంలో ఉంది.


1.


సకృదేవ  ప్రపన్నాయ తవాస్మితీ చ యాచతే |

అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ౹౹ - రామాయణము.


2.


సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ౹

అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ౹౹ - భగవద్గీత.


3.


స్తితే మనసి సుస్వస్తే శరీరే సతి యో నరః |

ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపం చ మా మజం

త థా స్తాం మ్రియమానం తు కష్ట పాషాణ సన్నిభం 

అహం స్మరామి మద్భక్తం నయామి పరమామ్ గతిమ్౹౹ ౼ వరాహ పురాణము.


ఇవి కాక సీతా  చరమ శ్లోకం అని శ్రీరంగ చరమ లోకమని, ఇంకా బోలెడు శ్లోకాలు చలామణిలో ఉన్నాయి.


భగవంతుడిని నమ్మి ఆయనను శరణు పొందడమే వైష్ణవ మతం లో ప్రధానమైన అంశం. వాళ్లు ఎంతో పవిత్రంగా భావించే ద్వయ మంత్రానికి అర్థం కూడా ఇదే. ద్వయ మంత్రం కానీ శరణాగతి గాని జీవుడి వైపు నుంచి చేసేవి. దీనికి ఆధారము భగవంతుడు "నన్ను శరణు అన్నవాడిని నేను ఉద్దరిస్తాను" అని ఇచ్చిన వాగ్దాన మే. ఆ వాగ్దాన ఉన్న శ్లోకాలే చరమ శ్లోకాలు. అది భగవద్గీతలో అ.18 శ్లో. 66 సర్వ ధర్మాన్ పరిత్యజ్య అని ఉన్నది. చాలామంది దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.


*పవని నాగ ప్రదీప్.*

మార్గశీర్ష శుద్ధ ఏకాదశి

 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి #గీతాజయంతి గా ఆచరిస్తున్నాము. లౌకిక భాషలో చెప్పాలంటే ఆరోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థము. కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో 


”ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ: మామాకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” ప్రశ్నించాడు.


యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన, ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సంరద్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆరోజు గీతలోకమునకు వెలువడినది. అందువలన గీతాజయన్తిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము.భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. 


‘గీతా సుగీతాకర్తవ్యా కిమన్యై: శాస్త్రసంగ్రహై: 

యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిర్గతా’ 


అనునది గీతా ప్రశస్తి.


 ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు, ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు, ఆ గీత పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడినది అని భావము. అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశమును ఎందుకు చేశాడు అంటే ఇలా చె ప్తున్నారు.


ఆస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మధియాకులం పార్ధం

ప్రపన్న ముద్ధిశ్య గీతా శాస్త్రం ప్రవర్తితమ్‌ 


అని అనగా ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరుణ చూపుచున్నాడు అర్జునుడు. ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో విపరీత జ్ఞానముతో అనగా ఒక దాన్ని ఇంకోదానిగా భావించి కలత చెందిన బుద్ధితో నున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ”శిష్యస్తేహం శాధిమాల త్వాం ప్రపన్నం” అని శరణు వేడ గా గీతాశాస్త్రమును ప్రవర్తింపచేసినాడు.గీతా శాస్త్రమును ప్రధానముగా బోధించు తత్త్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు. శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము. శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసి నవారిగా భావించుట మమకారము. సంసారమనే సర్పాన్నికి అహంకారమమకారములు రెండు కోరలు. రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయజాలదు. అహంకారమమకారములను వదిలివేస్తే సంసారమును చేయజాలము. చేయుచున్నది నేను కాదు, భగవానుడు చేయించుచున్నాడు.


ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దాణే అర్జున తిష్ఠతి భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా


 అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. 


ప్రతిప్రాణి హృదయమున పరమాత్మ ఉన్నాడు. తన సంకల్పముతో సకల భూతములను యంత్రములపై ఉన్నవానిని త్రిప్పుచున్నాడు. ఇట్లు అందరి చేత అన్ని పనులను చేయించువాడతడే అన్ని ఫలితములను పొందువాడు అతడే. అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోనే అధికారము, ఫలముల యందు కాదు అన్నాడు. అన్ని పనులు చేయుచున్నది శరీరము కదా. శరీరమునకే ఫలము ఉండదు తృప్తి, సంతోషము, అనుభూతి, మనస్సునకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయుట లేదే. పని చేస్తున్నదానికి ఫలితం రావటం లేదు. ఫలితం పొందుచున్నవి పని చేయుట లేదు, ఇది యదార్ధజ్ఞానము. ఇది కలిగిన నాడు శోకము, దు:ఖము, సంతోషము కలుగవు. అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ. అతను చేయిస్తున్నాడు, దీనికి మన శరీరము సాధనము. స్పూన్‌ గరిటెలాగా. గరిట పాయసంలో తిప్పినా పప్పులో తిప్పినా కూరగాయితో తిప్పినా తిరగటమే దాని పని కాని ఇది తియ్యగా ఉంది ఇది కారంగా ఉన్నది అనదే. పాయసంలో గరిటలా సంసారంలో జీవుడు తిరుగుచున్నాడు, అతనికి కష్టము లేదు సుఖము లేదని తెలియాలి. నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలికాదు. పని నీవు చేయాలి ఫలమును నాకర్పించాలి. ఫలము నాకర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు. స్వర్గము, నరకము నీకు రాదు. నాలోకమే పరమపదమే లభిస్తుంది. స్వార్థాన్ని వదిలిపట్టి పరార్థాన్ని, పరమార్థాన్ని భావించిన నాడు సుఖదు:ఖాలు, రాగద్వేషాలు, ఆశాపాశాలు, లాభనష్టాలు యేమీ ఉండవు. ఇవేమీకానపుడు సంతోషం యెందుకు ? విచారం యెందుకు? స్థిర చిత్తముతో, స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణువేడుము. ఫలాన్ని ఇచ్చేవాణ్ణి, పనిచేయించేవాణ్ణి నేనే నీ యోగక్షేమములను నేను వహిస్తాను. ఇది గీతాసారము.


గీతము సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక్క‌ని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది అందరిలోను పరమాత్మ ఉన్నాడు అని తెలిసిననాడు ఎవరినీ ద్వేషించజాలవు. అందరినీ ప్రేమిస్తావు. ఇదియే విశ్వప్రేమ, లోకకళ్యాణము. గీతను అర్థముతో చదువువారు. వీలుకాకుంటే ఒక మూలమే చదవండి. గాంధీజీ విజయానికి అహింసా మార్గానికి ఆధారం గీతే. వివేకానందుని విశ్వ విజయానికి మూలము గీతయే. వల్లభాయ్‌ పటేల్‌ను ఉక్కు మనిషిని చేసింది, లాల్‌ బహుదూర్‌ శాస్త్రిని జైజవాన్‌ జైకిసాన్‌ అనిపించినది గీతయే. అహింసామార్గం శాంతి మార్గానికి నిర్వచనం చెపునది గీతయే. రాజేంద్రప్రసాద్‌ భారత ప్రథమ రాష్ట్రపతి జేబులో గీతయే ఉండేది. జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి రోజూ ఒక శ్లోకమైనా చదువుతాము. గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి. ఇదే భారతీయ గీతకు చేయు నిజమైన నిస్వార్థమైన ఆరాధన. అలా చేద్దాం చేయిద్దాం.


భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజును #గీతాజయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజుగా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.


గీకారం త్యాగరూపం స్యాత్

తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం

జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:


గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం.


సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్


ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 


మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. 


అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.


వాసాంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృర్ణోతి నరో పరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా

న్యన్యాని సంయాతి నవాని దేహీ


చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబత్తలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః


ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు.


కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి


అర్జునా! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగాకుండుగాక.

 

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్


ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి, అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

సాదు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.


కృష్ణుడంటాడు..


"ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..." అని, 


అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.


నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.


గీతాజయంతి రోజున భగవద్గీత పుస్తక పఠనం, దానం విశేష ఫలాన్ని ఇస్తుంది.. 


        🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏

ఓం శాంతి శాంతి శ్శాంతి:

 ఏ ప్రార్థన చివరిలోనయిన మనం


‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం.


ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.


ఓం శాంతి: (ఆధ్యాత్మిక తాపం చల్లారుగాక)


ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లారుగాక)


ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లారుగాక)


1. ఆధ్యాత్మిక తాపం అంటె, శరీరానికి సంబంధించి నటువంటి వివిధ రకాలయిన రుగ్మతలు (రోగాలు మొదలైనవి) తొలగాలని


2. అధి భౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.


3. అధి దైవికతాపం అంటే, దైవవశంవల్ల కలిగే బాధలు – యక్షులు, రాక్షసులు మొదలైనవారివల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు – ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడమన్నమాట.


 *‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’* అని మూడుసార్లు చెప్పడంలో ఇంత అర్థం దాగివుంది.


సనాతన_హిందూ_ధర్మం

మోక్షద’ ఏకాదశి

 మార్గశుద్ధ ఏకాదశి, గీతాజయంతి.


ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని పిలుస్తున్నాము. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతాజయంతి. ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. వైఖానసుడు అన్నరాజు తన తండ్రి ‘నరమం’లో బాధలను పొందుతున్నట్లు కల గంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట.


ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.


ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి. ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.


ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!

భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!! అని మంత్రము ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.

తలరాత మార్చే గీత*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *మన తలరాత మార్చే గీత* 

                 ➖➖➖✍️


*మన లోపల ఒకడు ఉన్నాడు.... అసలైన వాడు.*


*కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు..*


*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..!*


*ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..*


*ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..*


*" కామ ఏష క్రోధ ఏష రజో*

  *గుణ సముద్భవహ "* 


*ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..*


*కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.


*ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.*


*మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*


*అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*


*బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం..... ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం..... ఇంకా Ground floor లోనే ఉన్నాం.*


*ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*


*ఆ floor పేరు ‘సత్వ గుణం..’*


*ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......*


*ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*


*అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*...... 


*వాడు...*

*మంచి దొంగ.....వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు మీకు Third floor కు దారి చూపిస్తాడు... ఆ floor పేరు శుద్ధ సాత్వికం.... ఇదే చివరిది..... ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది.... ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..*


*అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*


*చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక Lift* ఉంది.


*ఆ Lift పేరే "భగవద్గీత".*


*గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.*


*పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..*. 


*కృష్ణం వందే జగద్గురుం*!

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*గీతా జయంతి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నేడు…


              *గీతా జయంతి*

                 ➖➖➖✍️


*గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.* ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం *మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు* జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.


*గీకారం త్యాగరూపం స్యాత్*

*తకారమ్ తత్వబోధకమ్*

*గీతా వాక్య మిదమ్* *తత్వం*

*జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*



*గీత* అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. *"గీ"* అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. *"త"* అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ , బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ *రహస్యాన్నే గీతాశాస్త్రము* ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము *మార్గశిర శుద్ధ ఏకాదశి.* ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి.


*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*

*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||*

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన *బ్రహ్మవిద్య భగవద్గీత.* అందుకే అంటారు , *సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా , అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా , ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి , ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే , మరోపక్క లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట.* అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి , ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో , అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు , మన *వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.* అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

 

*వాసాంసి జీర్ణాని యథా విహాయ*

*నవాని గృర్ణోతి నరో పరాణి*

*తథా శరీరాణి విహాయ జీర్ణా*

*న్యన్యాని సంయాతి నవాని దేహీ*

చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.


*నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః*

*న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః*


ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు , నీరు తడుపజాలదు , గాలి ఎండింపజాలదు.


*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన*

*మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి*


అర్జునా ! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగకుండుగాక.


*యదా యదా హాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత*

*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్*


ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి , అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో , అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.


*పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్*

*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే*


సాదు , సజ్జనులను సంరక్షించటం కోసం , దుర్మార్గులను వినాశం చేయడానికి , ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.

 

*కృష్ణుడంటాడు "ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..."* అని , అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని , ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు , చెడు లక్షణాలను , చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.

 

నిజమైన దేవుడు ఆయనను నమ్మినా , నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు , ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం , ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు , అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా , కొద్దిగా గంగాజలం త్రాగినా , కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.✍️


. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

గీతా జయంతి

 ॐ గీతా జయంతి శుభాకాంక్షలు 

                        సందేశం - 1 


    భగవానుని ముఖతః, ఉపనిషత్సారమైన "గీత" అవతరించిన మార్గశిర శుక్ల ఏకాదశి ఈ రోజే! ఇదే "గీతా జయంతి". 

    శ్రీకృష్ణుని రూపంలో భగవానుడు,అర్జునుని రూపంలో ఉన్న నరునికి చేసిన బోధయే "భగవద్గీత". 

     చాలా మందిలో ఇది ఒక మతగ్రంథము అనే అపోహ కనిపిస్తూంటుంది. 

    "భగవద్గీత" అనేది - క్రీస్తు అందిచ్చిన బైబిల్, ప్రవక్త ఇచ్చిన ఖురాన్ వంటి గ్రంథం కాదు. 

    సకల మానవాళికీ సంపూర్ణ విజ్ఞానం భగవద్గీత ద్వారా అందుతుంది. 

    తద్వారా మానవుడు తన మనోవాక్కాయకర్మలతో భూమిమీదే దైవత్వాన్ని పొందే వీలుంది. 

    సమాజపరంగా యజ్ఞాలవలన 

వర్షాలు కురుస్తాయని చెప్పడం, వాతావరణ కాలుష్య తొలగింపు వంటి అనేక వైజ్ఞానిక అంశాలని అద్భుతంగా అందిస్తుంది భగవద్గీత. 

       అన్నిటికన్నా ముఖ్యమైనది కర్తవ్య నిర్వహణ. అర్జునునికి యుద్ధవిధి నొక్కి చెబుతూ, తద్వారా సకల మానవులకీ ఆలోచన - మాట - చేతల కర్తవ్యబోధ చేసే విజ్ఞాన సర్వస్వమే భగవద్గీత.


        భగవద్గీతకి సంబంధించి మచ్చుకి కొన్ని విషయాలు పరిశీలిద్దాం. 


1.దైవ - రాక్షస లక్షణాలు 

  (దైవాసుర సంపద్విభాగ యోగము) 


    పదహారవ అధ్యాయాన్ని చూస్తే, మంచి - చెడులకి సంబంధించి విషయాలు వివరంగా తెలుస్తాయి. 

    తద్వారా మనలోని రాక్షసత్వాన్ని తొలగించుకొని, దైవత్వాన్ని పొందే అవకాశం కలుగూతుంది. 


2. సత్త్వ రజస్తమో గుణాలు 

   (గుణత్రయ విభాగ యోగము) 


    రజో గుణము సృష్టికి కారణము.

    సత్త్వ గుణము స్థితికి/అస్తిత్వానికి కారణము. 

    తమో గుణము లయమునకు కారణము. 

     ఇవి మానవులకే కాక జంతువులకు కూడా వర్తిస్తాయి. 

     మతపరంగా కాక సకల జీవరాశికీ వర్తించే ఈ త్రిగుణాల వివరణాత్మక సందేశం భగవద్గీతలో అద్భుతంగా వివరింప బడింది. 


3. లోకంలో భగవచ్ఛక్తి 

   (విభూతి యోగము) 

    అంతటా, అన్నిటా నిండియున్న దైవీశక్తి ఉదాహరణలతో తెలుపబడింది. 

    సర్వ జీవులలో ఆ "నేను" అనే దైవీభావమును యోగమూర్తిగా ధ్యానము చేయాలి. 

     అప్పుడు ఆత్మభావనతో పరమాత్మ తత్త్వం అవగతమవుతుంది. 

     ప్రహ్లాదుడు అన్నిటా ఒకటే అయి ఉన్న దైవశక్తిని చూచి అసలైన వైష్ణవుడయ్యాడు. 


          ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

*కఫలంర్మ తప్పదు

 *కఫలంర్మ  తప్పదు*


🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏


*కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు*.

మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.


పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.


తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.

 ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.


అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.


తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.


అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు. 


అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని అన్నాడా కశ్యపుడు.


అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. 


కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి 

ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. 


చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. 


వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 


ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.


*ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.*


*మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.*

ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. 

అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.

*పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా*.


ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి. 

కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.

ఏమిటి ఆ పాప కర్మ?  

ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. 

*మంచివారితో మహాత్ములతో చెలగాడటం*.

కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.


రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, *కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.*

 

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! *మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది*. 


మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.

నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.

*మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది*.

కర్మ బలీయమైనది.


గోవిందా, నారాయణా, రామా,శివా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం. *ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా?* నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.


మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.

గురు అనుగ్రహం వున్నదా? 

గురు దృష్టి వున్నదా? 

శుభగ్రహ దృష్టి వున్నదా? 

వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.

పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.


*"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."*

*"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది"* .


పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ.

కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.


తాతముత్తాతలు చేసిన *పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది*.

ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.

ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.


*మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము*.

వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.

మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది. 


సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా! 

కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ

చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.

*అదే కర్మఫలం, కాల మహిమ*.


*కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు.* దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి.

తక్షకుడు విషనాగు అంటే *ప్రారబ్దకర్మ*. దానిని కూడా జయించింది *మంత్రశాస్త్రం*. 

కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే, మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.

అంటే *మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది* అని మనం తెలుసుకోవాలి.


మంత్రం ప్రాణం పోస్తుంది. 

కానీ ఆ *మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!*


🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి