7, ఏప్రిల్ 2021, బుధవారం

అచ్చమైన పొడుపు కథ.!

 అచ్చమైన పొడుపు కథ.!


ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

-

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

slave nation

 British officers who served in India were not given public posts/responsibilities when they returned to England.

 

The argument was that you have ruled over a slave nation which may have made a difference in your attitudes and behaviour. 


If you are given such a responsibility here, you will deal with the independent British nation in the same way.


Read the following event with this brief introduction...


A British woman whose husband was a civil service officer in Pakistan and India during the British rule, spent many years of her life in different parts of India. 


On her return, she wrote a beautiful book based on her memoirs.


The woman wrote that when my husband was the deputy commissioner of a district, my son was about four years old and my daughter was one year old.  We lived in a multi-acre residence allotted to the Deputy Commissioner.


Hundreds of people were busy serving DC's house and family. There would be parties every day, the big landlords of the district would be proud to invite us to their hunting programs, and whoever we went to would consider it an honour. 


Our luxuries were such that even the Queen and the royal family in Britain could hardly afford them.


During the train journey, a luxurious box adorned with Nawabi luxury was reserved for the family of the Deputy Commissioner. 


When we boarded the train, the white-clad driver would stand in front of us with both hands tied and asked permission to start the journey. The train would start running only after getting permission.


Once we boarded the train for the journey, according to tradition, the driver came and asked for permission. Before I could speak, my son was in a bad mood for some reason. He told the driver not to drive. The driver, while executing the order, said that the order was made, little sir. After a while, the whole staff, including the station master, gathered and begged my four-year-old son, but he refused to allow the train to run. 


Eventually, with great difficulty, I persuaded my son to run the train on the promise of several chocolates, and the journey began.


A few months later, she returned to the UK to visit friends and relatives. We arrived in London by ship, our destination was a county in Wales for which we had to travel by train. 


I sat my daughter and son on a station bench and went to get a ticket. It was too late because of the long queue, which made my son very upset.


When we got on the train, seeing the first-class seats instead of the luxurious compound, my son started to get angry again.


When the train started its journey on time, the son started screaming regularly. He was saying out loud, what a potato muscle driver he is. He has started running the train without our permission. I will tell Dad to put on his shoes.


It was difficult for me to explain to him that this is not his father's district, it is a free country. 


Even the Prime Minister and the King do not have the power to humiliate the people to satisfy their ego.



*P.S. Today it is clear that we have expelled the British. However, slavery could not be eradicated*.


*Even today, many deputy commissioners, SPs, ministers, advisers and politicians humiliate the people on the streets for hours just to satisfy their ego*. ‏

🙏🏻💐

పుల్లాపంతుల సోదరులు-*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*పుల్లాపంతుల సోదరులు-* 

ముక్కు తిమ్మనగారి తలనొప్పి

      (వింజమూరి వెంకట  

      అప్పారావుగారి పోస్టు)

                😡                          

           🌷🌷🌷

👉ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది.

అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్)

రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు.

అప్పటికి ఉపశమనమే తప్ప మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చేది.

ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను, అని తన పరివారంతో సహా కాశీకి ప్రయాణం కట్టారు. అలా వెడుతూ వెడుతూ మధ్యలో 

శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో 

వున్న 'బోదనంపాడు' అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు. అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము, యిక్కడెవరో బాధతో మూలుగుతున్నారు, మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు. మేము యిద్దరూ అన్నదమ్ములం. ఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న, సూరన్న. యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు, మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి.

మేము వారికి వైద్యం చేస్తాము అన్నారు.

సరే ఆశీనులు కండి అని సైగ చేస్తూ నాకీ శిరోవేదన చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా వుంది.

ఒక్కోసారి తల గోడకేసి బద్దలు కొట్టుకోవాలని పిస్తుంది. తలలో ఏదో తొలుస్తున్నట్టు బాధ, అన్నారు తిమ్మన.

మీరు సెలవిస్తే మేము మిమ్మల్ని పరీక్షిస్తాం. మాకున్న పరిజ్ఞానంతో, మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించ గలమని 

మా నమ్మకం. అన్నాడు పుల్లన్న. ఆయన వేదన సోదరులకు అర్థమైంది.

ఆర్యా! ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. గజరాజు కుంభస్థలం లోకి పాము ప్రవేశించినప్పుడు ఆ గజం ఎంతగా విల విల లాడి పోతుందో, అది ఎన్ని కొండల్ని ఢీకొంటుందో, అందుకు వెయ్యి రెట్లు వుంటుందీ శిరోవేదన. భరించడం ఎవరికైనా కష్టమే.

ఒకసారి చెయ్యి యివ్వండి నాడి పరీక్షిస్తాం. అన్నాడు సూరన్న.

తిమ్మన చెయ్యి అందించారు. సూరన్న, అతి జాగ్రత్తగా నాడి పరీక్ష చేశాడు. విషయం పుల్లన్నకు వైద్య పరి భాషలో వివరించాడు. ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజులు ఆ వైద్య సోదరులు తిమ్మన ముక్కులో చుక్కల పసరు పిండుతూ వచ్చారు. నాలుగో రోజు ఆ వైద్యానికి కావలిసిన 

పదార్థాలన్నీ ఒక జాబితా తయారు చేసి యిచ్చారు. అందులో విశేషంగా వైద్యానికి మాకు కావలిసిన వస్తువులేమీ లేవు. పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

"పుట్టెడు బియ్యమా? అంటూ వూరందరికీ సమారాధన చేస్తారా? ఏమి" అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.

కాదు అవసరం వుంది తెప్పించండి. అలాగే 20 మంది వంటవాళ్లు కూడా కావాలి అన్నారు వైద్య సోదరులు. "ఉప్పు,పప్పు కూరగాయలు కూడా తెప్పించండి. వండి వూళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి సరిపోతుంది దెప్పి పొడిచాడు" రాజవైద్యుడు. కాదు, కాదు 

మా వైద్యానికి ఇది చాలా అవసరం అన్నాడు పుల్లన్న.

ఏమి అవసరమో యేమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల 

నీళ్ళు త్రాగిస్తున్నారు.

మరుదినం గాలి కూడా చొరరాని దట్టమైన బాగా ఎత్తైన గుడిసె నొక దానిని నిర్మించారు. బయట వంటవాళ్ళతో పుట్టెడు బియ్యం వండిస్తున్నారు.

అనదరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిమ్మనను గుడిసె లోకి పిలుచుకొని వెళ్ళారు, సోదరులు. మిమ్మల్ని ఈ గుడిసె లో తలక్రిందులుగా వేలాడ దియ్యాల్సి వుంటుంది అన్నారు. తిమ్మనకు దిక్కు తోచలేదు. భయపడకండి, ఇది వైద్య ప్రక్రియలో భాగమే, అన్నారు వైద్య సోదరులు సరే వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా ఏదైతే అది అవుతుంది అని కానివ్వండి అన్నారు తిమ్మన. వెంటనే ఆయనకు లావు కంబళ్ళు శరీరమంతా చుట్టి తలకు ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించి ఆ గుడిసెకు ఒక మూలగా ఆయన్ను తలక్రిందులుగా వేలాడ దీశారు.

ఒక్కో వంటవాడు అప్పుడే హండాలలో వండి వార్చిన అన్నాన్ని గుడిసె లో గుమ్మరించారు, వారి సహాయకులు. గుడిసె అంతా ఆవిరి సెగలతో నిండిపోయింది.

తిమ్మన శరీరం ముక్కు పుటాల ద్వారా వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు 

నషాళానికి అంటాయి. రెండు క్షణాలలోనే ఆయన ముక్కు పుటాలనుంచి, రెండు విష క్రిములు గిజ గిజ లాడుతూ ఆ అన్నపు రాశి పై పడ్డాయి. వెంటనే స్మృతి తప్పిన ఆయన్ను క్రిందికి దించి బయటకు తీసుకొని వచ్చి శీతలోపచారాలు చేశారు.

క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు. రెండు వారాల్లో పూర్తిగా కోలుకునేలా మంచి మందు లిచ్చారు.

క్రమేపీ కవిగారి శిరోభారం తగ్గి రోగం నయమైంది. ఈ శుభ సమాచారాన్ని రాయలవారికి 

అండ జేశారు. రాయలు ఎంతో సంతోషించి రాజసభకు ఆహ్వానించి తీసుకొని రావలిసిందని తిమ్మనకు కి కబురు పంపారు.

పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి అప్పటికే విజయనగరం పరిసర ప్రాంతాలకు పాకిపోయింది.

ఆ వైద్యులను దర్శించు కోవడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. కాసేపటికి కృష్ణదేవరాయల వారూ వచ్చారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు.

"శ్రీ వేంకటగిరి వల్లభ

సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవి 

జీవితనాయక! కవితా 

ప్రావీణ్య ఫణీశ కృష్ణ రాయ మహీశా!

ప్రభూ మేము వైద్యులమేగానీ కవులము కాదు. అందుకే ముక్కు తిమ్మన గారి 

పద్యాన్నే ఒప్పజెప్పాం. అందుకు మమ్మల్ని మన్నించండి. వంశ పారంపర్యంగా వస్తున్న వైద్య వృత్తినే సేవాధర్మంగా భావించి మా బోదనంపాడు లోనే నిర్వహిస్తున్నాం. మా గ్రామం తమరి ఏలుబడిలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన దరిశి మండలంలో వుంది.

ఈ నాటికి ఆ గ్రామానికి ఖ్యాతి రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తూంది.

తిమ్మన గారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం మా పూర్వీకుల వల్ల మాకు లభించిన పుణ్య ఫలం. వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ మా వైద్య విద్య యిలాగే రాయలవారి అనుగ్రహం తో పదికాలాలపాటు శాశ్వత కీర్తి పొందాలని విన్నవించు కుంటున్నాము. అన్నారు,

పుల్లాపంతుల సోదరులు.

ప్రభువుల ఆజ్ఞతో తిమ్మన లేచి ప్రభూ శతాధిక వందనాలు.

"కాశ్యాన్తు మరణానురక్తి" అని నిశ్చయించుకొన్న నేను ఈ ఘన వైద్యుల చలువతో పునర్జన్మ ఎత్తాను వీళ్ళు నా పాలిట అశ్వినీ దేవతలే.

పర్వతము తేవలిసిన పని వుండేది కాదేమో. కుగ్రామం లో నిస్వార్థంగా 

వైద్యసేవల నందిస్తూ గ్రామములో వారినందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే వీరి ఋణం ఎలా తీర్చుకోగలం?రాయలవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించి నట్లుంటుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత రాయలవారి చిత్తం అన్నారు.

కవీశ్వరుల సూచన ఆమోదదాయకమే మరి వారి సమ్మతం మాకు సంతోషదాయకం అన్నారు రాయలవారు. సభలో కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

"ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలం లోనే వైద్యం చెయ్యాలి. మరో చోటుకు పోగూడదు. ధన సంపాదనకూ, స్వలాభాపేక్షకు లోనుకాకూడదు. మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తి ఆర్జించాలని మా పెద్దల ఆశయం. దీన్ని ప్రభువులు వేరుగా తలచరాదని ప్రార్థన" అన్నారా సోదరులు.

భేష్ ! మీ పూర్వీకుల ఆశయం మన్నింప దగిందే. వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం. అప్పుడే వైద్యానికి విలువ. మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును ఓ అగ్రహారంగా మీకు దాన శాసనంతో వ్రాయించి ఇస్తున్నాం. సంతోషమే కదా! అన్నారు రాయలు గంభీరంగా. సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తర్వాత వైద్య సోదరులను ఘనంగా సత్కరించారు, రాయలవారు. ఆశీర్వాద నవరత్న పద్యమాలికలతో ఆ సోదరులను మెప్పించి తన ఋణం తీర్చుకున్నారు తిమ్మన. ఆనాటి నుంచీ బోదనం పాడు అగ్రహారంలో పేరు నిల్పగల వైద్యులు 'మడుగుపట్టు చెలమ' అన్నట్టు ఖ్యాతి వహించారు.

అందుకే వేమన యిలా అన్నాడు.

మాటలాడ గల్గు మర్మము లెరిగిన 

పిన్న పెద్దతనము లెన్నవలదు 

పిన్నచేతి దివ్వె పెద్దగా వెలుగదా

విశ్వదాభిరామ వినురవేమ 

🤲

తక్కువవాడని ఎవరినీ హేళన చెయ్యరాదు. చిన్నవాడి చేతిలోని దీపముకూడా వెలుగు నిస్తుంది కదా! వేమన నోటినుండి ఈ ఆటవెలది రాక పూర్వమే ఈ నీతికి పట్టం గట్టే ఈ చారిత్రిక గాథకు తెలుగునేల వేదికైంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చిట్టికథ

 ✍️...  చిట్టికథ


     

       నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా...


కృష్ణాపురం లో భాగ్యరాజు,సోమరాజు మిత్రులు ఉండేవారు.


ఇద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు.


తిరుగు ప్రయాణంలో వారు ఒక అడవి మార్గాన వస్తూంటే వారికి ఒక గుట్ట మీద దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యోగి కనిపిస్తాడు.


ఇద్దరూ వెళ్లిఆ యోగికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు


.ఆ యోగి ఏ కళనున్నాడో ఆ ఇద్దరకు మేలు చేయదలిచాడు."భక్తులారా! ఈ గుట్టకు ఉత్తర దిక్కుగాఉన్న సరస్సులో స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి.తూర్పుదిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఆరోగ్యం సమకూరుతుంది.


స్నానం చేసే ముందు రెండునియమాలు పాటిస్తామని మనసులో ప్రమాణంచేసుకోవాలి.


ఒకటో నియమం - ఒక సరస్సులోమాత్రమే స్నానం చేయాలి. దురాశతో రెండు సరస్సుల్లో స్నానం చేస్తే ఏ ఫలితమూ దక్కదు.


రెండో నియమం - ఇక్కడ నేనున్నానన్న విషయంఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్పేరా ఈ వర ఫలితం దక్కదు అని చెప్పి తపస్సులో మునిగిపోతాడు యోగి.


అనుకోకుండా వచ్చిన అదృష్టానికి ఇద్దరు మిత్రులు ఆనందించారు. 


అంతా భగవంతుని లీల అనుకుంటూ గుట్ట దిగారు.


 భాగ్యరాజు " ఐశ్వర్యం కలిగితే అన్నీ సమకూర్చుకోవచ్చు.

ఉత్తర దిక్కు నున్న సరస్సు లో మునుగుదాం రా"అని సోమరాజు తో అన్నాడు.


 సోమరాజు అప్పుడు " ఆరోగ్యమే మహాభాగ్యం.దానిని మించిన భాగ్యం లేదని నా విశ్వాసం. తూర్పు దిక్కుకే పోదాం రా" అంటాడు ఇద్దరూ ఒక మాటకు రాలేకపోయారు.


 భాగ్యరాజు ఉత్తర సరస్సులోను సోమరాజు తూర్పు సరస్సులోను స్నానం చేసి ఇంటికి బయలుదేరారు. 


నగరం చేరాక భాగ్యరాజు ఏ పని చేసినాఅదృష్టం వరించేది.వ్యాపారంలో లాభాలు వచ్చిపడుతున్నాయి.

అంతా యోగి మహిమని యోగికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.


ఇక సోమరాజు విషయానికి వస్తే ఎప్పుడూ మంచం పట్టి మూలుగుతూ వుండే అతడి భార్య ఆరోగ్యంతో కళ కళ లాడి కనిపించింది. పిల్లలు పుష్టిగ తయారయ్యారు. సోమరాజుకు అపుడపుడువచ్చే అనారోగ్యం మాయమయింది.


 వైద్యులువద్దకు వెళ్ళే అవసరం రాలేదు. సోమరాజు యోగిని కృతజ్ఞతతో తలచుకున్నాడు.


కొంత కాలంగడిచింది. 


ఒకరోజు అంగడిలో ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. భాగ్యరాజు దిగులుగా కనిపించాడు.


ఏమలా ఉన్నావని అడిగాడు సోమరాజు. అప్పుడు భాగ్యరాజు యోగి ఇచ్చిన వరం ఎంచుకోవడంలో నేను పొరబడ్డాను.ఆరోగ్యంలేనప్పుడు ధనమెంత ఉన్నా ప్రయోజనం లేదు.రెండు ముద్దలు తిని అరిగించు కోలేకపోతున్నాను.జిహ్వచాపల్యాన్ని బలవంతంగా అణచుకుంటున్నాను.ఇంట్లో ఎవరికో ఒకరికిఅనారోగ్యం ఉంటూనే ఉంది. సంపాదనంతావైద్యానికే సరిపోతుంది. సుఖశాంతులు లేవు.ఈ పరిస్థితుల్లో ఉత్సాహం ఎలా వుంటుంది మిత్రమా? " అని బాధపడ్డాడు.


 సోమరాజు నుపట్టుకుని ఏడ్చాడు. 


సోమరాజు అప్పుడు "సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. దిగులు పడితే ప్రయోజనం లేదు."అని మిత్రుడిని ఓదార్చాడు.


🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️


 *వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।* 

 *ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥* 

వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము.


🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷🧘🏻‍♀️🌷

శ్రీరమణీయం* *-(137)*_

 _*శ్రీరమణీయం* *-(137)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నా ప్రమేయం లేకుండా నా శరీరంలో జరిగే పనులకు కర్త ఎవరు ?"*_


_*అది తెలుసుకునేందుకే ఆత్మవిచారణ ! ఆధ్యాత్మిక సాధనలోని కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలన్నీ ఆత్మవిచారణలో సమన్వయాన్ని పొందుతాయి. "యోగః కర్మసు కౌశలం" అనే ఉపదేశంలో 'కర్మలోని కౌశలమే యోగం' అనే అర్థం ఇమిడి ఉంది. కర్తవు నీవు కాదని గుర్తించటమే నిజమైన కౌశలం. అప్పుడే ఫలం కోసం ఎదురు చూడని పనులను మనం చేయగలుగుతాం. శరీరంతో చేసే పనులన్నీ మనవేనని భావిస్తూ కర్తృత్వాన్ని పెంచుకుంటాం. మన ప్రమేయం లేకుండా శరీరంలో జరిగే అనేక పనులకు మనం కర్తలం కాదు. ఆకలి, నిద్ర, శ్వాస, హృదయ స్పందన ఇవన్నీ మన ఆధీనంలో లేనప్పుడు శరీర క్రియలు మాత్రం మనవి ఎలా అవుతాయి ? ఇక్కడ కర్తృత్వమే అజ్ఞానంగా ఉంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే జ్ఞానం లేకుండా పోయింది అన్న మాట !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

Covid only in Nose

 *We trust when Tata's do it* Covid Three stages:


1. Covid only in Nose - recovery  time is half a day. (Steam inhaling), vitamin C. Usually no fever. Asymptomatic. 


2. Covid in Throat - sore Throat, recovery time 1 day (hot water gargle, warm water to drink, if having temp,  then Paracetamol. Vitamin C, Bcomplex. If severe then Antibiotics.


3. Covid in Lungs- coughing and breathlessness 4 to 5 days. (Vitamin C, B complex, hot water gargle, Oximeter, Paracetamol, Cylinder if severe, lot of liquid required, deep breathing exercise.


Stage when to approach hospital : 

Monitor the oxygen level. If it goes near 93 (normal 98-100) then you need oxygen cylinder. If available at home, then no hospital else admit.


*Stay healthy, Stay Safe!*


Tata Group has started good initiative, they are providing free Doctor's Consultation online through chats. This facility is started for you so that you need not to go out for doctors and you will be safe at home.


Below is the link, I request everyone to take benefit of this facility.


https://www.tatahealth.com/online-Doctor- consultation/general-physician


+91 74069 28123: 


Advice from inside isolation hospitals, we can do at home

Medicines that are taken in isolation hospitals


1. Vitamin C-1000


2. Vitamin E


3. sitting in the sunshine for 15-20 minutes.


4. Egg meal once ..


5. take a rest / sleep a minimum of 7-8 hours


6. drink 1.5 liters of warm water daily


7. All meals should be warm (not cold).


And that's all we do in the hospital to strengthen the immune system


Note that the pH of Corona Virus varies from 5.5 to 8.5


Therefore, all we have to do to eliminate the Virus is to consume more Alkaline foods above the acidity level of the virus.


Such as :


Bananas 

Green lemon - 9.9 pH

Yellow Lemon - 8.2 pH

Avocado - 15.6 pH

* Garlic - 13.2 pH

* Mango - 8.7 pH

* Tangerine - 8.5 pH

* Pineapple - 12.7 pH

* Watercress - 22.7 pH

* Oranges - 9.2 pH


How to know that you are infected with Corona Virus?


1. Itchy Throat

2. Dry Throat

3. Dry cough

4. High temperature

5. Shortness of breath

6. Loss of smell ....


And Lemon with warm water eliminates the virus in the beginning itself, before reaching the Lungs ...


Do not keep this information to yourself. Provide it to all.

పద్యములు చంధో బధ్ధముగా వ్రాయదలచు కున్నారా

 శ్రీ   వినాయక

మిత్రులార/తెలుగు భాషాభిమానులారా 

పిన్నలకు శుభ  అశీస్సులు, పెద్దలకు నంస్కారములు.   మన అంధ్ర రాష్ట్రములో మన మాతృభాష  అయిన తెలుగు కను మరుగు అవుతున్న  తరుణములో మన తెలుగు ఉనికిని కాపాడుటకు నా వంతుగా నేను స్వల్ప ప్రయత్నము చేయు చున్న వాడను.  

 

మీరు తెలుగు భాషాభి మానులా?   మీరు తెలుగు మాధ్యమములో  చదువు కున్నారా?   మీకు  తెలుగు అంటే  చాలా  మక్కువ గా ఉందా?  మీకు తెలుగులో  పద్యములు  చంధో బధ్ధముగా  వ్రాయదలచు కున్నారా  ?  అయితే ఇదిగో మీకు ఒక చక్కని  అవకాశము.


తెలుగు మొలకలు అను వాట్సప్ సమూహము ద్వారా  నేను  మన  తెలుగు రాష్ట్రములోను మరియు ఇతర రాష్ట్రములొని  తెలుగు భాషాభిమానులకు ఉచితముగ  2019  సెప్టెంబరు నుంచి ఉచితముగా  పద్యములు వ్రాయుట నేర్పుతున్నాను. ఇప్పటి వరకు  అరవై  మంది  పైగా తెలుగు ఉపాధ్యాయులు కూడా   నేర్చుకున్నారు  ఇది   పూర్తిగా  ఉచితము ఏమి డబ్బు కట్ట నవసరము లేదు   సుమారుగా 100 రోజుల ప్రణాళిక   ఈ  వంద రోజులలో  మీరు  చందోబధ్ధముగా  పద్యములు  వ్రాయుట మొదలు పెట్ట గలరు  .  ఇది  ఖచ్చితము.   ఇప్పటికి అయిదు జట్లు (బ్యాచిలు)  అయిపోయాయి.  ఆరవ  జట్టు   మే నుంచి మొదలు అగును.  మీరు నేర్చుకోదలచుకున్న నాకు  అభ్యర్ధన పత్రము వెంటనే పంప గలరు.  ఇప్పటి వరకు జరిగిన అయిదు జట్లలో  సుమారుగా  45  మంది  శతకములు వ్రాయు  స్ధాయికి వచ్చారు. 


పద్యములు నేర్చు కొనుటకు అర్హతలు



మీ  వయసు  కనీసము  20 సం దాటి  ఉండాలి

గరిష్ట వయో పరిమితి లేదు.  

పదవ తరగతి  వరకు తెలుగు మీడియములో  చదివి ఉండాలి. 

రోజు ఒక గంట కష్ట పడ గలగాలి 

వాట్సప్ మాధ్యమము ద్వారా  నేర్ప బడును.

ఒక నిర్ధిష్ట మైన సమయము  లేదు. 

మీరు ఉద్యొగస్తులు గాని ఏ  ఇతర వ్యాపకములు ఉన్న  వారైనా చేరవచ్చు

ఒక నిర్దిష్ట  సమయములో వాట్సప్  లో   ఖచ్చితముగా  ఉండవలసిన అవసరము లేదు 

నేను నేర్పు పాఠములు వాట్సప్ ద్వారా  మీకు ఖాళీగా  ఉన్న  సమయములో  చూసుకొనవచ్చు

కాని  రోజు ఖచ్చితముగా  ఒక గంట  కష్ట పడాలి

వారమున కొక సారి  జూమ్  ద్వారా  వీడియో  క్లాసులు ( సుమారుగా  ఒక గంటన్నర)నిర్వ హించ బదును 


మీరు  పై  నియమములు పాటించ దలచు కున్న   చక్కగా  పద్యములు నేర్చు కోవచ్చు.  మరొక మారు తెలుపుతున్నాను  ఇది  పూర్తిగా  ఉచితము.  దీనితో   బాటు  జత  పరచిన అభ్యర్ధన పత్రము  చూసి  దాని  ప్రకారము  స్వంత దస్తూర్తి తో  అభ్యర్ధన పత్రము వ్రాసి  ఒక పోటో  తీసి  నా  వాట్సప్  నెంబరుకు  పంప వలెను

ఒక సమూహమునకు  25 మంది  మాత్రమే అవకాశము ఉండును  ఆవశ్యక్యత ను బట్టి  కొందరికి  సడలింపు ఇవ్వ గలను.  మీ అభ్యర్ధన పత్రము నా  కార్యాలయములో నమోదు చెసుకొనుటకు మీరు వెంటనె అభ్యర్ధన పత్రము పంప వలెను 


ఆరవ  జట్టు   మే  ఒకటి నుంచి  మొదలు  అగును  మీ  అభ్యర్ధన పత్రములు చేఱుటకు  అఖరు తేది  15/4/21 మాత్రమే  తర్వాత వచ్చిన అభ్యర్ధన పత్రములు  సప్తమ జట్టు (బ్యాచి)కు  పరిగణించగలను.  


పూసపాటి కృష్ణ సూర్య కుమార్

చిత్ర బంధ కవి  గుంటూరు 

5/4/21

వ్యాక్సిన్ వల్ల ఉపయోగం

 *1.వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా? లేదా?*

జ.: ఉంది.

వ్యాక్సిన్ వేసుకోని వారికి కరోనా సోకితే... అది వారంలోపే తీవ్రంగా అవుతుంది. మరణం కూడా రావచ్చు. అదే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తీవ్రం అవ్వడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఈలోగా ఆస్పత్రిలో చేరిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అంతేకాదు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకితే... అది ఊపిరితిత్తులను చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఈలోగా చక్కటి ట్రీట్‌మెంట్ పొందవచ్చు.


*2.వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది? జ్వరం ఎందుకు వస్తుంది?*

జ.: వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే... అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే... మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. అవి బయటి నుంచి ఏ వైరస్‌లు, బ్యాక్టీరియాలూ రాకుండా అడ్డుకుంటాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు... బయటి నుంచి వచ్చే వ్యాక్సిన్ మూలకాలతో... యాంటీబాడీలు యుద్ధం చేస్తాయి. యుద్ధంలో గెలవడానికి అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. దాంతో... వేడి పుడుతుంది. దాన్నే మనం జ్వరం అంటారు. ఇలా వేడి పుట్టినప్పుడు... బాడీలో యాంటీబాడీల సంఖ్య బాగా పెరుగుతుంది. మనం జ్వరాన్ని పారాసిటమాల్ టాబ్లెట్‌తో తగ్గించుకున్నాక... ఆల్రెడీ పెరిగిన యాంటీబాడీలు అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఉండగా కరోనా వైరస్ బాడీలోకి వస్తే... వెంటనే దాడి చేసి చంపుతాయి. అందుకే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. తద్వారా యాంటీబాడీలను బాగా పెంచుకోవాలి.


*3.వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందా?*

జ.: దీనిపై స్పష్టత లేదు. కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వల్ల విదేశాల్లో కొంత మందికి రక్తం గడ్డకడుతోంది అనే ప్రచారంతో... కొంతమంది భారతీయులు ఆ వ్యాక్సిన్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఇండియాలో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా అలా జరగలేదు. కాబట్టి ఇండియాలో ఏ భయమూ లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.


*4.వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా సోకుతుందా?*

జ.: సోకుతుంది. అసలు వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ల ద్వారా కరోనా వెళ్లగలదు. తీరా లోపలికి వెళ్లాక... లోపల పెద్ద సంఖ్యలో (వ్యాక్సిన్ వేయించుకుంటే) యాంటీ బాడీలు ఉంటాయి. వాటిని చూడగానే కరోనా వైరస్ సగం చచ్చిపోతుంది. ఇక యుద్ధం చేశాక... పూర్తిగా చస్తుంది. ఆ యుద్ధం ఓ 12 రోజులు జరుగుతుంది. ఈలోగా మనం ఆస్పత్రికి వెళ్లి... మరింతగా యాంటీబాడీలను పెంచేసుకుంటే సరిపోతుంది


*5.వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న కరోనా సోకుతుందా?*

జ.: సోకుతుంది. 4వ ప్రశ్నలో చెప్పినట్లే జరుగుతుంది. ఐతే... 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యుద్ధం 5 లేదా 6 రోజుల్లోనే అయిపోతుంది. ఈ యుద్ధంలో కరోనా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.


*6.ఓవరాల్‌గా వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదా?*

జ.: అవును. మనం ఎలాంటి డౌట్లూ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడమే మంచిది. తద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. మన ద్వారా ఇతరులకు కరోనా సోకకుండా కాపాడినవాళ్లం అవుతాం.

worth knowing

 It is worth knowing the reason of getting infected even after taking two doses of corona vaccine.

▪️ The second dose is to be taken 28 days after the first dose of the corona vaccine.

▪️ The vaccine starts to form antibody immediately after entering the body.

▪️ When antibody is forming in our body, our immunity decreases a lot.

▪️ When we take second dose of vaccine after 28 days, our immunity decreases even more at that time.

▪️ 14 days after the second dose, when antibodies are completely formed in our body, our immunity starts to grow rapidly.

▪️ During this one and a half month, due to low immunity, the chances of corona virus entering our body is very high.

He gets infected with corona.

▪️ which makes it very risky to get out of the house during this month and a half.

▪️ Even after taking two doses of vaccine, you can become a victim of Corona.

▪️ After one and a half month, 100 to 200 times immunity power becomes in our body, after that you are safe.

▪️ Need to be careful and safe for one and a half month from the first dose.

That's why

▪️ Make sure to wear a mask

▪️ Get out of the house only if necessary

సమయానికి తగు* *మాటలాడెనే-2*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

నాకు నచ్చిన సమస్యలు ఎదురైనపుడు ఏ విధంగా ప్రవర్తించాలో, మాట్లాడాలో వివరించిన కథ.

           🌷🌷🌷

     *సమయానికి తగు* 

        *మాటలాడెనే-2* 

   *(చిట్టి కథే! నమ్మాలి)* 

                🌷🌷🌷

"సత్యవతి దొడ్డ! నువ్వు అర్జెంట్ గా రావాలి!  సుమ, వాళ్ళ అత్తగారు, వాదించుకుంటున్నారు!  మాకు భయం వేస్తోంది! ఆంటీ, అంకుల్ వాళ్ళ ఎం డి గారిని పిలవడానికి వెళ్లారట! వాళ్ళు ఈరోజే యు ఎస్ నుండి వచ్చారట! ఏమయినా కావాలంటే నిన్ను అడగమన్నారు!  రావాలి దొడ్డా!  ఆనంద్ సినిమాలోలా పెద్ద గొడవే అయ్యేటట్లు ఉంది!" పరుగులు పరుగుల్న వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలు కలగాపులగంగా చెప్పిన మాటల సారాంశం బుర్రకెక్కి, గాభరాగా లేచింది సత్యవతమ్మ, ఆ ఇంటి పెద్ద తోడికోడలు! 


"మరో రెండు గంటల్లో స్నాతకం భోజనాలు పెట్టుకుని ఇప్పుడు గొడవేంటి బాబోయ్", అనుకుంటూ, మొరాయిస్తున్న మోకాళ్లను సవరించుకుని, పెళ్లి కూతురు గదివైపు పరిగెట్టింది సత్యవతమ్మ! 


గులాబీ రంగు అంచు ఉన్న పసుపురంగు కంచిపట్టు చీర కట్టుకుని, సాంప్రదాయకమైన నగలన్నీ వేసుకుని, కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది సుమ! అసలే అందాలరాశి !దానిపై ఈ ఆభరణాల జిలుగులు!

      

పసుపు మీగడల తో పెట్టిన నలుగుల వలన మోములోకి వచ్చి చేరిన గులాబీ, చామంతి రంగులు, సహజమైన ఆ ఎర్రని పెదవుల పూసిన దానిమ్మ పువ్వులు, సంపెంగ పువ్వు వంటి ముక్కు, చంచరీకముల  గుంపును బ్రోలిన...నల్లని తలకట్టు, వెరసి, నడుస్తున్న నందనవనంలా ఉంది, సుమలత సౌందర్య శోభ! 


పెళ్లి కూతురి గదిలో వాతావరణం, కాస్త వేడిగానే అనిపించింది సత్యవతమ్మకు! పెళ్లి కూతురి మొహంలో, ఆమె చుట్టూ, పరివేష్టించిన పదిమంది ఆమె స్నేహితురాళ్ల మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆందోళన, అసహనం!  సుమకు ఇంచుక దూరంలో, నడుము మీద చేయి వేసుకుని, కాస్త ఠీవీ, దర్పం కనబరుస్తూ, ఆమెకు కాబోయే అత్తగారు, ఆడపడుచు! 

        

దొడ్డమ్మ ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది సుమకు, ఆమె మిత్రురాళ్లకు! 


"అమ్మయ్య! గట్టిగా కడిగేసి, మొహం వాచేలా చీవాట్లు పెట్టడానికి, ఒక పెద్ద మొహం కనిపించింది ఇప్పటికి", అన్న భావం వియ్యపురాలిలో! 


సత్యవతమ్మ, తన జీవితంలో ఇలాంటి దృశ్యాలు, కనీసం ఒక వంద పెళ్లిళ్లలో చూసి ఉంది!  ఇలాంటి సమయాల్లో సమస్యను చిటికలో పరిష్కరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య! చూద్దాం, ఈ సమస్యను ఆమె ఎలా పరిష్కరిస్తుందో! 


"అయ్యో అయ్యో ఏమిటర్రా మా వదిన గారిని, ఇంటి ఆడపడుచుని, ఇలా నిలబెట్టేసి మాట్లాడటమేనా! ఒసేవ్ రమ్య, నువ్వు వెళ్లి వెంటనే రెండు మంచికుర్చీలు పట్టుకుని రా!", అంటూ ఒక పిల్లకు పురమాయించింది సత్యవతమ్మ!  ఆ గదిలో అప్పటికే పది కుర్చీలు ఉండగా మళ్లీ కుర్చీలు తేవడం ఏమిటా? అనుకుంటూ అయోమయంగా బయటకు పరిగెట్టింది రమ్య!


అప్పటికే కాబోయే కోడలి మొండిపట్టు, తలబిరుసుతనానికి మొహం ఎర్రగా కందగడ్డలా చేసుకుని ఉన్న వియ్యపురాలు హైమావతిని, తల్లి బుర్ర లో సమస్యను చాకచక్యంగా ఎక్కించి, వినోదం చూస్తున్న ఆడపడుచు కౌసల్యను, సాదరంగా భుజాలు పట్టి  కుర్చీలో కూర్చో పెట్టింది సత్యవతమ్మ! ఏసీలు తిరుగుతున్నా, ఉక్కపోత గా ఉన్న ఆ గదిలో ముందు మనుషుల్ని చల్లపరచవలసిన అవసరాన్ని గమనించి, ఆమె "సీతా! నువ్వెళ్ళి, క్యాటరింగ్ వారికి చెప్పి, డజను లస్సీలు, కొబ్బరి నీరు, వెంటనే పట్టించుకునీ....ఇక్కడున్నట్టు రావాలి!" అంటూ తరిమింది మరో పిల్లను!"


అప్పటికే సత్యవతమ్మ చేస్తున్న హడావిడికి, కాస్త ప్రసన్నత వచ్చిచేరింది వియ్యపురాలి మొహంలో!" చూడండి పెద్ద వదిన గారు! అసలా మోటు నగలు, పాత కాలపు డిజైన్ పట్టుచీర, సరయిన మేకప్ లేకుండా, ఎవరయినా సుమను చూసి ఈ కాలపు పెళ్లి కూతురు అనుకోగలరా? మా వాళ్లంతా తనను చూడడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు! సరయిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా చేసుకోలేదు మనం!", కాస్త నిష్టూరంగా  దెప్పిపొడుస్తున్నట్టు మాట్లాడింది వియ్యపురాలు! 


    "ఏం చెప్పమంటావు హైమావతి!  దీనంతటికీ కారణం, దాని బామ్మగారు, దాని అమ్మమ్మ!  మా సుమలత ఉందే, దీనికి చిన్నప్పటినుండి పెద్దవాళ్ళు అంటే విపరీతమైన గౌరవం, ప్రేమ!  దీని ఆత్మీయతకు మురిసి ముక్కలై ముసలమ్మ లిద్దరూ, వారి నగల్లో సింహభాగం దీనికే కట్టబెట్టారు!  మిగిలిన మనవరాళ్లు మూతులు ముడిచినా, వాళ్లు లెక్కచేయకుండా ఈ పాత కాలపు నగలన్నీ దీనికే ఇచ్చారు!  అప్పటికి వీళ్ళమ్మ, 'అవన్నీ మార్చి, వేరే కొత్తవి చేయించుకో' అని కూడా అంది!  మా సుమమ్మ వింటే కదా!"


"అదంతా బాగానే ఉంది గాని వదినా, ఈ కాలం ఈ మోటు నగలు ఎవరు పెట్టుకుంటున్నారు?"


"నువ్వు అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం హైమా! కానీ ఈ కాలంలో మా సుమ లాగా, పాత తరం వారికి కూడా మన్నన, మర్యాద ఇచ్చే పిల్లల్ని ఎంత మందిని చూస్తున్నాం! బామ్మ ను గౌరవించే పిల్ల, తల్లిని గౌరవిస్తుంది!  తల్లిని గౌరవించే పిల్ల, అత్తగారిని గౌరవిస్తుంది! అవునా కాదా!"


ఇంకేమనగలదు హైమవతి !నీళ్లునానుస్తూ" అవుననుకోండి!" అంటుంటే, ఆమె కూతురు అందుకుంది" మా తమ్ముడు తన కాబోయే భార్య ను కాస్త మోడర్న్ గా చూడాలని అనుకుంటాడు కదా! ఈరోజుల్లో మామూలు ఫంక్షన్లకే బ్యూటీషియన్ లను తెప్పించుకుని చక్కగా తయారవుతున్నారు, సుమ ఇలాగ ఎలాంటి మేకప్ లేకుండా ఉండటం ఏం బాగుంటుంది?" అంటూ డాంబికంగా పలికింది కౌసల్య! 


అప్పటికే, ఇక్కడ ఏదో గొడవ అవుతోందని పసిగట్టి, సత్యవతమ్మ ఆడపడుచు, మరొక తోటి కోడలు కూడా వచ్చి చేరారు!  వాళ్లకు ఆ ఇంటి పెద్ద కోడలి #లౌక్యం మీద విపరీతమైన నమ్మకం, భరోసా! 


"అమ్మలు కౌసల్యా! మంచి ప్రశ్న వేశావు నువ్వు! ఒక్క మాట చెప్పు నాకు! నీ మెడలో ఈ నాలుగుపేటల పలకసర్లు పాతకాలంవి కాదా!  ఖచ్చితంగా మీ అమ్మమ్మో , అత్తగారో ఇచ్చినవా కాదా!? ఇష్టమో.. గౌరవమో.. వేసుకున్నావా లేదా!  ఇకపోతే మేకప్ అంటావా, నీ లాగా, మీ అమ్మ లాగా, మా సుమది కూడా సహజమైన సౌందర్యం! పెళ్లి కూతురు అంటే పచ్చని గౌరీదేవి లా ఉండాలి కానీ, రంగులేసిన బొమ్మలా కాదు కదమ్మా!  అలా అని మా సుమ పాత కాలపు, పాత చింతకాయ పచ్చడి కానేకాదు! అవసరమైతే భువనైక సుందరిలా తయారవ్వగలదు!  నువ్వే చూస్తావుగా ముందు ముందు!"


"హైమావతి! నీ నట్టింట్లో తిరిగే పిల్లను రేప్పొద్దున్న మీ వాళ్లంతా గుర్తుపట్టాలి కదా! సుమను ఇలా చూస్తేనే వాళ్ళ మనసులో ఆమె రూపం ముద్ర పడి ఉంటుంది! మేకప్పుదేం భాగ్యం తల్లి, బ్రహ్మాండంగా చేయిద్దాం! సాయంత్రం ఎదురు సన్నాహాలకల్లా, కొత్త నగలతో, కొత్త రూపంతో మా సుమను మీరు చూస్తారు కదా!  సుమ వద్దన్నా, ఇదిగో దాని చుట్టూ ఉన్న ఈ కోతిమూక ఊరుకుంటారా? సలక్షణంగా తమ స్నేహితురాలిని తయారు చేసి మరీ కూర్చోబెడతారు!  సరేనా బంగారం!" అంటూ కౌసల్య కేసి ఆప్యాయంగా నవ్వుతూ చూసింది సత్యవతమ్మ! 


అప్పటికే ఆమె మాటల మాయాజాలం లో తడిసి ముద్దయిపోయారు తల్లీ, కూతురు! 


"మీరెంత సవ్యంగా, సౌమ్యంగా చెప్పారు వదినా! మీ మాటలు వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉన్నాయో!  మమ్మల్ని అపార్థం చేసుకోకుండా, మీరు చెప్పిన రీతి చాలా నచ్చింది నాకు!  సుమలత కూడా ఇలాగే చెప్పి ఉంటే ఎంత బాగుండేది! "నాకు ఇవే ఇష్టం, ఇవే వేసుకుంటాను" అని అంత విసురుగా చెప్పక్కర్లేదు కదా!" హైమావతి మాటల్లో ఇదివరకటి నిష్ఠూరత లేదు! 


"ఏరా సుమా! అత్తగారితో,  ఆడపడుచు తో మాట్లాడే విధానం అలాగేనా? మీ అమ్మ నీకు ఎన్ని మంచి బుద్ధులు నేర్పించింది! మన ఇంట్లోనే ఎంతో బుద్ధిమంతురాలవు! మీ అమ్మ ఉమ్మడి కుటుంబంలో తలలో నాలుకలా, అందరి మెప్పు పొందిన కోడలు! మన ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటకు వెళ్తోందంటే, మన కుటుంబ గౌరవాన్ని, సంస్కారాన్ని కూడా పట్టుకు వెళ్తోంది, అని అర్థం!  నీ అత్త గారికి, నీ వదినకు వెంటనే క్షమాపణ అడుగు!" అంటూ కాస్త శాసిస్తున్నట్టు, కాస్త లాలిస్తున్నట్టు, బోధించింది సుమలతకు, సత్యవతమ్మ! 


ఇప్పటికే జరుగుతున్న గొడవకు బెదిరి పోయి ఉంది సుమలత! స్వతంత్ర భావాలున్న అమ్మాయి అయినప్పటికీ, ఉమ్మడి కుటుంబ విలువలు మెండుగా ఉన్నాయి ఆమెలో!  దొడ్డమ్మ అందించిన సంకేతాన్ని వెంటనే అందుకుంది ఆమె మేధస్సు!


 క్షణం ఆలస్యం చేయకుండా, అత్తగారిని కౌగిలించుకుని,

"క్షమించండి అత్తయ్యా, క్షమించు వదినా! ఈ కాసుల పేరు మా అమ్మమ్మ పొదుపు చేసి, ఏడాదికి ఒక కాసు సంపాదించుకుని, చేయించుకున్న హారం! అలాగే ఈ దండ వంకి, ఈ ఎర్రపొళ్ళ కంటె, పాపిడి బొట్టు, సూర్యచంద్రులు, చామంతి పువ్వు, మా బామ్మ నాకు ఇచ్చినవి!  ఈ వడ్డాణం మా పెద్ద మేనత్తది!  పెళ్లికూతురిని చెయ్యగానే, మా ఇంటి ఆడపిల్లలకు ఇది అలంకరించడం ఆనవాయితీ! ఈరోజు వారు ముగ్గురూ మా మధ్య లేరు!  వారి గౌరవార్థం, నేను ఈ నగలు వేసుకున్నాను!"  అంటూ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి, ఆమె కాటుక కన్నులలో చిన్నతడితో, తన మాటలను సమర్థించుకుంటూ, తన అంతరంగాన్ని వారి ముందు పరిచింది సుమలత! 


"అంతే అమ్మాయి హైమావతి! అంతకన్నా మరి ఇంకేమీ లేదు!  పెళ్లికి వాళ్ళ అమ్మ ఇచ్చే బాల తొడుగు ఎలాగూ ఉంటుంది!  మన కుటుంబాలు, సాంప్రదాయాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేసే కుటుంబాలు!  ఇంటి కోడలి సంస్కారం మీదే ఆ ఇంటి ప్రశాంతత ఆధారపడి ఉంటుంది!  మా అమ్మాయి చేసిన దాంట్లో తప్పు లేదు అనుకుంటే, ఇదిగో ఈ పన్నీరు బుడ్డి తీసుకుని, ఇద్దరూ దానిమీద పన్నీరు చిలకరించండి!" అంటూ, సర్వం హాస్యంగా తేల్చిపారేస్తూ, సత్యవతమ్మ కౌసల్య చేతిలో పన్నీరు బుడ్డి పెట్టింది! 


" మా మరదలు బంగారం !మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు,  అత్తయ్యగారు!" అనుకుంటూ కౌసల్య, చక్కని స్నేహస్ఫూర్తితో, సుమలత మీద, ఆమె స్నేహితురాళ్ళు మీద పన్నీరుజల్లు కురిపించింది! 


సత్యవతమ్మను ఆప్యాయంగా కావలించుకుని" వదినగారూ! 'మా అక్కయ్య లేనిదే, మా ఉమ్మడి కుటుంబమే లేదు' అని మా వియ్యపురాలు ఎందుకు అందో నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతోంది.  ఈ క్షణం నుండి, పెళ్లి,మనుగుడుపులు, మళ్ళీ మా కోడలు, అమెరికా విమానం ఎక్కే వరకు, మీరు సుమలతకు, మాకు తోడుగా ఉండవలసిందే!  మీ మాటల వలన, ఎంత పెద్ద  అపార్థం తప్పింది!  ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబాలలో ముందు ముందు చిచ్చులు రేపుతాయి!  ఈరోజు మీరు లౌక్యంతో ఈ సమస్యను, చేతిలోకి తీసుకుని ఉండకపోతే,  నేను చాలా ఇబ్బందిలో పడేదాన్ని!" మనస్ఫూర్తిగా అంటూ సుమలత తల మీద సున్నితంగా రాసి" శుభమస్తు తల్లి!" అని మనసారా దీవించి, నిష్క్రమించింది, హైమావతి కూతురితో పాటు! 


ఆ మాటల మిటారిని  నోరు తెరుచుకుని చూస్తున్న సుమలత, ఆమె స్నేహిత బృందాన్ని చూస్తూ "ఒసేవ్ అమ్మాయిలూ!  ఒక్కటి నేర్చుకోండి!  చదువులు కొలువులు చూసుకుని, తలబిరుసు తనంతో బంధాలను, తెగతెంపులు చేసుకోవడం కాదు జీవితం అంటే, నాలుగు మెట్లు దిగయినా సరే, తెలివిగా, లౌక్యం తో సమస్యను పరిష్కారం చేసుకోండి!  పెళ్లి తర్వాత జీవితంలో ఒక కొత్త ఇంట్లో మనకు నచ్చని ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది!  అది మన వ్యక్తిత్వానికి భంగం అనుకోకూడదు!  జీవితంలో నూతన అధ్యాయం అనుకోవాలి!  సర్దుకోవాలి! సరిపెట్టుకోవాలి!  ముందు చూపించిన లౌక్యమే, ముందు ముందు మీ ఆనందమయ జీవితానికి పునాది వేస్తుంది! అదే  మంగళప్రద జీవితానికి సూత్రము!" ‌ అంటూ ముగిసిందో లేదో, " దొడ్డా! యు ఆర్ ఆసం! యు ఆర్ ఎ వండర్! యు ఆర్ మేజిక్!".... అంటూ చుట్టేశారు ఆమెను అమ్మాయిలంతా! 

           🌷🌷🌷

ధన్యవాదాలతో 

ఓలేటి శశికళ

గాయత్రీ మంత్రము ద్వారా

 సత్యం పరం ధీమహి. అన్న పదమే గాయత్రీ మంత్ర సారమని, యిదే సృష్టికి మూలమని అనగా గాయత్రీ మంత్ర శక్తి యే సమస్త సృష్ట్యారంభమును తెలియుచున్నది. అనగా గాయత్రీ వక శక్తి. బీజాక్షర రూపమైన శక్తిని సాధన వలన సమస్తం అనగా సత్యం అవగతమగును. దీనిని వుపాసన చేయువారు శక్తి వ్యాప్తి దాని కారణము తెలియునని పెద్దలు చెప్పి యున్నారు. ఏదైనను సాధన చేసినగాని తెలియదు. పాలకులు గతి తప్పిన విష్ణువు మానవ రూపంలో ఆవిర్భవించి వారిని నాశనమును గావించి  ధర్మం ద్వారా భూమిని దీనిని ఆశ్రయించిన జీవులను వుధ్ధరించును. లేనిచో సృష్టి ఆగిపోయి జీవ మనుగడ సాధ్యం కాదు. దీనినే  గాయత్రీ మంత్రము లో తత్ సత్ యని సత్యం పూర్ణమైన గాని పదార్ధ ఆశ్రయము జరగదు. పదార్ధ ఆశ్రయమైన గాని సత్యం తెలియదు. జీవ రూపం తెలిసిన గాని జీవ వాసనా పూర్వకమైన లక్షణము తెలియదు. వాసనలు జీవులను వసుదేవ రూపంలో వ్యాప్తి చెంది యుండును. సత్యం పరమాత్మ తత్వమని పరిపూర్ణమైన గాని 

 జీవ రూపంలో తెలియదు. సత్య దర్శనం చేయుటే మానవ విధి. మరే యితర లక్షణములు కూడా భాస్వరమువలె కొన్ని తెలియకయే గాలివలన దహించబడును. గాలివలన నీటి తత్వం తెలియును. నీటి వలన విష్ణు వుష్ణ శక్తి తెలియును. యిది సత్యం మని దీనిని గాయత్రీ మంత్రము ద్వారా తెలియుచున్నది.

మొగలిచెర్ల

 *స్వామివారి చేయూత..*


ఒక గురువారం నాటి ఉదయం ఏడున్నర గంటలకు వచ్చే మొదటి బస్సు లో ఒక భార్యాభర్త మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..కాళ్ళూ చేతులు కడుక్కొని..తమతో తెచ్చుకున్న తమ సామాన్లను స్వామివారి మంటపం లో పెట్టి..మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు చేయసాగారు..అలా పదకొండు ప్రదక్షిణాలు చేసి..మా సిబ్బంది వద్దకు వచ్చి..స్వామివారి వద్ద అర్చన కొఱకు టికెట్ కొనుకున్నారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఆ సమాధి వద్ద ఉన్న స్వామివారి పాదుకులను ముట్టుకొని..కళ్లకద్దుకొని..ఇవతలికి వచ్చారు..తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు.. ఆ తరువాత ఇద్దరూ మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..మేము ఎవ్వరమూ ఆ దంపతుల గురించి పెద్దగా ఆలోచించలేదు..రోజూ వచ్చే అనేకమంది భక్తుల లాగానే భావించాము..


ఆరోజు మధ్యాహ్నం శ్రీ స్వామివారి కి అర్చకస్వాములు హారతి ఇచ్చిన తరువాత..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసే సమయంలో.."అయ్యా..ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలని అనుకుంటున్నాము..ఎవరిని సంప్రదించాలి?.." అని మా సిబ్బందిని అడిగారు..భోజనాల తరువాత మా సిబ్బంది ఆ దంపతులను నా వద్దకు తీసుకొని వచ్చారు..ఆ ఇద్దరిని కూర్చోమని చెప్పి వివరాలు అడిగాను.."నా పేరు మహేశ్వర రావు..ఈమె నా భార్య దుర్గారాణి...కొన్ని సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాము..వాటిల్లోంచి బయటపడటానికి మా ప్రయత్నాలు మేము చేసాము..చేస్తున్నాము కూడా..కానీ..దైవబలం కూడా తోడు కావాలి..మా ఇలవేలుపు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు..అలాగే మేము దత్తాత్రేయుడి ని కూడా కొలుస్తాము..ఆ ఇద్దరూ దగ్గరగా ఉన్న స్థలం ఇది..ఇక్కడికి కొద్దిదూరం లో ఉన్న మాల్యాద్రి పై లక్ష్మీనారసింహుడు కొలువై వున్నాడు..ఆ క్షేత్రం లో తపస్సు చేసి..ఇక్కడి కి వచ్చి ఆశ్రమం నిర్మించుకొని తన సాధన పూర్తి చేసుకొని కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత..దత్త ఉపాసకుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు సమాధి లో ఉన్నాడు..అందుకోసం కొన్నాళ్ళు ఇక్కడ వుండి..వాళ్లకు మా బాధ విన్నవించుకొని..ఊరట చెందాలని వచ్చాము..మీకు వీలుంటే మాకు వసతి చూపించండి..లేదా ఇలా మంటపం లోనే ఉంటాము.." అన్నారు..వాళ్ళుద్దరినీ ఏ సమస్యలు పీడిస్తున్నాయో నేను అడగలేదు..వాళ్ళు ఉండటానికి వసతి చూపించమని మా సిబ్బందికి చెప్పాను..


ఆ ప్రక్కరోజు శుక్రవారం నాడు శ్రీ స్వామివారి మందిరం శుభ్రం చేసే కార్యక్రమంలో ఆ దంపతులు పాల్గొన్నారు..మహేశ్వరరావు అర్చకస్వాములతో కలిసి స్వామివారి సమాధి ఉన్న గర్భాలయం శుద్ధి చేసే పనిలో పాలుపంచుకున్నాడు..అతని భార్య స్వామివారి పూజ కొఱకు వినియోగించే సమాన్లను కడిగి..తుడిచి పెట్టింది..అలా ఇద్దరూ తమ శక్తి మేరకు స్వామివారి మందిరం లో సేవ చేసుకోసాగారు..శనివారం ఉదయాన్నే ఆ దంపతులు మాలకొండ క్షేత్రానికి వెళ్లి..అక్కడ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడిని దర్శించుకొని..అక్కడే అన్నప్రసాద స్వీకరించి..తిరిగి సాయంత్రానికి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి చేరారు..ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ లో అత్యంత భక్తిగా పాల్గొన్నారు..ఆరోజు రాత్రి అన్నదాన సత్రం వద్దకు వెళ్లి..భక్తులకు అన్నప్రసాద వడ్డన చేశారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం కూడా మా సిబ్బంది తో కలిసి స్వామివారి మందిరాన్ని శుభ్రం చేసి..ఆ తరువాత మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు చేశారు..ఇలా ప్రతిరోజూ స్వామివారి సేవ చేస్తూ..సుమారు మూడు వారాల సమయం స్వామివారి మందిరం వద్దే వున్నారు..


ఆ దంపతులు వచ్చి ఐదోవారం వారం గడుస్తున్నది..ఒకరోజు ఉదయం నా వద్దకు వచ్చి.."అయ్యా..మేము ఇక్కడికి వచ్చి ఇది ఐదవ వారం..రోజుల్లో చెప్పాలంటే ఇప్పటికి ముప్పై మూడు రోజులు అవుతున్నది..ఇన్నాళ్లకు స్వామివారు మమ్మల్ని కరుణించారు..మాకున్న సమస్యల్లో అతి ముఖ్యమైన ఒకదానికి పరిష్కారం లభించే సూచనలు కనబడుతున్నాయి..మా వాళ్ళ వద్దనుంచి ఫోన్ వచ్చింది..రేపు మమ్మల్ని రమ్మన్నారు..నేనొక్కడినే వెళుతున్నాను..నా భార్య ఇక్కడే స్వామివారి సేవలో వుంటుంది..ఆ పని చూసుకొని మళ్లీ నేను వస్తాను..మేము పూర్తిగా నలభై ఒక్క రోజు ఈ స్వామివారి సన్నిధి లోనే ఉంటాము..మేము ఇక్కడికి వచ్చిన మూడోరోజే అలా నిర్ణయం తీసుకున్నాము..ఒక మండలం రోజులు స్వామివారికి సేవ చేసుకుంటూ..ఆ మండలం రోజుల్లో వచ్చే శనివారాల్లో ఆ లక్ష్మీనారసింహుడి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము.." అన్నాడు..ఆరోజు మధ్యాహ్నం మహేశ్వరరావు తన ఊరెళ్లిపోయాడు..మరో రెండు రోజుల తరువాత మహేశ్వర రావు తిరిగి వచ్చాడు..ఆరోజు ఆదివారం..ఆ దంపతుల ముఖాల్లో ఆనందం కనబడుతోంది..ఇద్దరూ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..మరో నాలుగురోజుల్లో మేమనుకున్న మండలం పూర్తి అవుతుంది..కానీ మాకున్న అతిపెద్ద సమస్య తీరిపోయింది..మా అన్నదమ్ములు నా మీద కక్ష గట్టి..నాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి రాకుండా అడ్డుపడ్డారు..సుమారు పదికోట్ల విలువ చేసే ఆస్తి..నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు..మొత్తం మీద రాజీకి వచ్చారు..నా ఆస్తి నాకు దక్కింది..మీతో ముందే చెప్పాను కదా..దైవం యొక్క చేయూత లేకుండా మనం ఏమి చేసినా ప్రయోజనం ఉండదు..మండలం పూర్తిగా ఇక్కడే ఉంటాము..మా ఆస్తి కాగితాలు ఇప్పుడే స్వామివారి సమాధికి తాకించి వచ్చాను.."మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి..మీరు రోజూ సోషల్ మీడియా లో పెట్టే పోస్టుల వల్ల మాలాటివారికి ఈ క్షేత్రం గురించి తెలుస్తున్నది..మేము అలానే వచ్చాము..ఇన్నాళ్ళూ ప్రతిరోజూ స్వామివారి ప్రసాదం గా భావించి ఇక్కడ భోజనం చేసాము..ఏదో మా వంతుగా ఇక్కడ ఒక వారం పాటు అన్నదానానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాము.." అని చెపుతూ ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు..


మహేశ్వరరావు చెప్పిన ఒక మాట నా మనసులో నాటుకుపోయింది.."దైవం తోడు లేకుండా..ఏ ప్రయోజనం ఉండదు..మనం ప్రయత్నం చేయాలి..కానీ దైవాన్ని నమ్ముకోవాలి.." ఆ దంపతుల విషయం లో అదే జరిగింది..వాళ్ళు స్వామివారిని పరిపూర్ణంగా నమ్మారు..స్వామివారు వారికి చేయూత నిచ్చి కాపాడారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).