28, నవంబర్ 2022, సోమవారం

పరోపకారార్థం ఇదం శరీరం

 "పరోపకారార్థం ఇదం శరీరం" అనే సూక్తి మీద ఒక అద్భుతమైన కథ ఒక పుస్తకములో చదవటం జరిగింది. మన సంస్థ సభ్యుల కోసం ఆ కథ. మనము చేసే సహాయం ఎంత చిన్నదైనా ఆ ఫలితం మనకు ఒకనాటికి తప్పక లభిస్తుంది అనే చెప్పే కథ ఇది. 


పాండవులు ఏకచక్రపురంలో బిక్షాటన చేసి జీవిస్తునప్పుడు ఒకరోజు వాళ్లకు ఏమి దొరకలేదు. ఆనాడు ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతుందని ఊళ్ళో అందరికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసారని తెలిసి పాండవులు కూడా అక్కడకు వెళ్లి భోజనం చేశారు. వాళ్ళు భోజనం చేసి వచ్చి   ఎదురుగా ఉన్న ఒక తిన్నె మీద విశ్రమించి ఉండగా ఒక ముసలమ్మ వాళ్ళ దగ్గిరకు వచ్చి తనకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పింది. అప్పుడు అర్జనుడు ఆమెకు ఇవ్వడానికి తమ వద్ద ఆహారం లేదని తానే ఒక పెళ్లి ఇంట భోజనం చేసి వచ్చామని చెప్పి, ఆమెకు తన చూపుడు వేలితో ఆ ఇల్లు చూపించాడు. ఆమె అక్కడికి వెళ్లి భోజనం చేసి వచ్చి, పెట్టకపోయినా పెట్టె ఇల్లు చూపినందుకు కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది.


కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకనాడు అర్జనుడికి చాలా దాహం వేసింది. తనకు చాలా దాహంగా ఉందని అర్జనుడు శ్రీకృష్ణుడికి చెప్పాడట. తాను వెంటనే నీళ్లు తాగగాపోతే  కష్టమని, తనకు చాలా నీరసంగా ఉందని, అస్త్రాలకు సంభందించిన మంత్రాలు కూడా జ్ఞాపకం రావడం లేదని అర్జనుడు - రథాన్ని మళ్ళించమని శ్రీకృష్ణుడిని కోరాడట. అందుకు శ్రీకృష్ణుడు రథాన్ని మళ్లించడం సాధ్యం కాదని, అర్జనుడు తన చూపుడువేలును తన పెదవులకు ఆనించి నోరు తెరవాలని చెప్పాడట. అర్జనుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేసాడు. అంతే - ఆ చూపుడు వేలి నుంచి గంగ ఉప్పొంగి అర్జనుడి దాహాన్ని తీర్చిందట. "నా చూపుడు వేలికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసావు మహానుభావా!" అని అర్జనుడు శ్రీకృష్ణుడిని అడిగాడు. అయిన నవ్వి - "చాలా ఏళ్ల క్రితం ఒక ముసలమ్మ ఆకలిని నీ చూపుడు వేలితో తీర్చావు కదా దాని మహిమ ఇది!" అన్నాడట.


చిన్నదా, పెద్దదా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇతరులకు మనకు తోచిన సహాయం చేద్దాం, మన గురువుగారు చూపిన బాటలో మనము నడుద్దాం. జై గాయత్రి మాత.

మంగళకరమైన వస్తువులు

 *🙏🏽ఓం శ్రీ సూర్య నారాయణ నమః 🙏🏽*


మన ఇంట్లో ఉండదగిన మంగళకరమైన వస్తువులు🚩


ఉప్పులో చిల్లర నాణెం వేసి ఉంచటం మంగళకరం🙏🏽🌹

బియ్యం నిల్వ చేసే డబ్బాలో కాశీ అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం వేసి ఉంచటం మంగళకరం🌹🙏🏽

ప్రతిరోజు ప్రదోషకాలంలో సింహద్వారంవద్ద పెరటి గుమ్ముమువద్ద ఆవునేతి తో దీపాలు వెలిగించడం మంగళకరం🙏🏽🌹

అమావాస్యనాడు ఉదయం ఉపవాసం వుండి రాత్రివేళ మాత్రమే భోజనం చేయడం మంగళకరం🌹🙏🏽

గోవుకు మేత కుక్కలకు మినప పదార్థాలు కాకులకు తీపి పదార్థాలు పెట్టటం మంగళకరం🙏🏽🌹

పాలు పెరుగు నెయ్యి పసుపు కుంకుమ ఉప్పు ఇంట్లో ఎప్పుడూ వెలితి లేకుండా చూసుకోవడం మంగళకరం🌹🙏🏽

పుణ్య తిధి నక్షత్రములందు నది స్నానం చేయటం ప్రతినిత్యం స్నానం చేసేటప్పుడు గంగా స్తోత్రం పఠించటం మంగళకరం🙏🏽🌹

ఉప్పును ఆహార పదార్థాలతో కాకుండా విడిగా నిల్వ చేసుకోవడం మంగళకరం🌹🙏🏽

అమావాస్య తిధి పూర్తయినాక (ప్రతి మాసం )ఆవు పంచకముతో గృహమంతా సంప్రోక్షణ చేసుకోవడం మంగళకరం🙏🏽🌹

గవ్వలను పూజా మందిరంలో ఇలవేల్పుతో పాటుగా పెట్టుకుని పూజించటం మంగళకరం🌹🙏🏽

గురుసేవ ఆదిత్యము వ్రతము పరోపకారము దానము న్యాయ ప్రవర్తన పాతివ్రత్యము పశుపాలన మహోత్సవము లోకోద్ధరణ ఈ పది మానవ జీవితంలో అత్యంత మంగళకరమైనవి🙏🏽🌹

ప్రతినిత్యం ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు సింహద్వారం లోపల మాట్లాడే మాట దైవస్మరణ అయితే మంగళకరం🙏🏽🌹

సముద్ర నది స్నానం దంపతులిద్దరూ కలిసి ఆచరిస్తే అధిక ఫల పుణ్యఫలం  ప్రతి మాసానికి ఒకసారి ఈ విధమైన స్నానం చేయడం మంగళకరం🌹🙏🏽

ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ప్రదక్షణం దైవదర్శనం తీర్థప్రసాదాలు సేవించడంతోపాటు ఆలయ ప్రాంగణములో ఆ దైవ నామాన్ని కనీసం తొమ్మిది సార్లు  ధ్యానం చేయడం మంగళకరం 🙏🏽🌹


ఓం శ్రీ సూర్య నారాయణ స్వామి యే నమః 🙏🏽🌹


సర్వేజనాసుఖినోభవంతు

ఏ సమయంలోనైనా.. ఎవరైనా..

 రైల్వే , భరోసా 

రాజమండ్రికి చెందిన వెంకటేశ్వరరావు దంపతులు విజయవాడలో ఉంటున్న తన కూతురి దగ్గరకు వెళ్లి ఆమె బాగోగులు చూసి విజయవాడ నుంచి బిలాస్‌పూర్‌కు మరో రైల్లో బయలుదేరారు. విజయవాడలోని వెంకటేశ్వరరావు కుమార్తె మూడుగంటల తర్వాత తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఫోన్‌చేయగా ఫోన్‌ రింగవుతున్నా కాల్‌ లిఫ్టు చేయలేదు. వెంటనే ఆమె రైల్వే హెల్ప్‌లైన్‌ 182కు ఫోన్‌చేసి విషయం చెప్పి తన తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని కోరింది. వెంటనే రైల్వే అధికారులు సంబంధిత సిబ్బందికి వెంకటేశ్వరరావు వెళ్లే రైలు సమాచారాన్ని తెలపగా ఖాజీపేటలో రైల్వే అధికారులు ఆయన దగ్గరకు వెళ్లి వారితో ఫోన్‌లో విజయవాడలోని ఆయన కుమార్తెతో మాట్లాడించారు. దీంతో కుమార్తెకు వూరట లభించింది. 


హౌరా-యశ్వంత్‌పూర్‌ రైల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ విద్యార్థిని హిజ్రాలు ఏడిపించసాగారు. విద్యార్థి హిజ్రాల వేధింపులు భరించలేకపోవడాన్ని సాటి ప్రయాణికుడు గమనించాడు. వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్‌చేసి సమాచారాన్ని అందించాడు. రైలు ఏలూరు వెళ్లగానే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది హిజ్రాలుండే బోగి ఎక్కి వారిని అదుపులోనికి తీసుకున్నారు. 


మండవల్లి, న్యూస్‌టుడే


భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 182 హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటు చేసింది. విపత్తులు, ఆపద సమయాల్లో ప్రయాణికులు ఈ నంబరుకు ఫోన్‌చేస్తే వెనువెంటనే సాయం అందుతుంది. ఇటీవల బెంగళూరు స్టేషన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది తప్పిపోయిన సంఘటనలో సైతం ఇది ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోని రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌)కు అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులు ఆ నంబరుకు కాల్‌ చేసిన వెంటనే అది ఏ డివిజన్‌లో ప్రయాణిస్తుందో, ఏ రైల్వే స్టేషన్‌లో నిలుస్తుందనే సమాచారం మొత్తం జీపీఎస్‌ ద్వారా తెలుస్తుంది. రైలు తరువాత నిలిచే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం వెళుతుంది. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి వెళ్లే ఈ కాల్‌ రికార్డు కావడంతో ప్రతి కాల్‌కు ఎటువంటి పరిష్కారం చూపారనే విషయం సైతం సిబ్బంది నోట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాల్‌ వచ్చిన రైలు బోగీకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. 


ఎలాంటి సమస్యకైనా పరిష్కారం.. 

మనం రిజర్వేషన్‌ చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నా వెంటనే 138 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బోగీల్లొ ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, మరుగుదొడ్లలో నీరు రాకున్నా, దుర్వాసన వస్తున్నా, ఫ్యాన్లు తిరగకపోయినా.. లైట్లు వెలుగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. తోటి ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, హిజ్రాలు, ఆకతాయిల వేధింపుల ఎక్కువైనా ఫోన్‌చేసి తక్షణ పరిష్కారం పొందవచ్చు. రైల్లో మన లగేజీ మరచిపోయి.. దిగిపోయిన సందర్భంలో సైతం ఫోన్‌చేస్తే అవతలి స్టేషన్‌లో లగేజిని పొందవచ్చు. 


ఏ సమయంలోనైనా.. ఎవరైనా.. 

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 182 ఉచిత హెల్‌లైన్‌ నంబరు 24గంటలు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఏ సమయంలో అయినా ఫోన్‌చేసి సహాయాన్ని పొందవచ్చు. ఈ నంబరుకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులతోపాటు ఎవరైనా  ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణంలో అనారోగ్యం సంభవించినా.. 182 ఫోన్‌చేసి సత్వర పరిష్కారం పొందవచ్చు.

దైవ స్మరణ

 *శ్రీ గురుభ్యోనమః*

 

*ఎన్ని పనులున్నప్పటికీ మీరు దైవ స్మరణను మరువకండి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా భగవంతుని పాదములను విడువకండి. భగవంతుడు లేని కాలం, చోటు లేదు కనుక మీరు ఎప్పుడు, ఎక్కడున్నా సరే నామస్మరణ చేసుకోండి. మీరు ఎంతటి విపత్కర పరిస్థితిలలో ఉన్నాసరే ఆయనని విశ్వాసంతో, ఆర్తితో పిలవండి . ఆయనే మీకు సమాధానం ఇస్తాడు. మీ సమస్యకు ఆ పరమాత్మయే పరిష్కారం చూపిస్తాడు. 'నాకు ఎవరూ తోడు లేరని' చింతించకండి. మనమంతా ఎవరికో తోడుండడానికి రాలేదు! ఎవరిదైనా తోడు పొందడానికి వచ్చాము. భగవంతుని ఆశ్రయించండి! మీకు ఆ పరమాత్మయే తోడు నీడై ఉంటాడు. మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తెచ్చే భారం ఆయనదే కానీ మీ మీ కర్మలకి అనుసంధానంగానే సుమా*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

చిన్నపిల్లవాడు

 ఇతను చిన్నపిల్లవాడు


1949వ సంవత్సరంలో శ్రీ పరమాచార్య స్వామివారు ఆనందతాండవపురం విజయం చేసి నలభై రోజులపాటు మకాం చేశారు. అప్పుడు నేను పదమూడు సంవత్సరాల పిల్లవాడిని. అక్కడున్న శివాలయ కొలను జీర్ణోద్ధరణ కోసం స్వామివారిని ప్రార్థించగా; స్వామివారు అంగీకరించి విజయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.


ఊరెరిగింపులో భాగంగా స్వామివారు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు, సామవేదంలోని ‘అభి త్వా . . .’ అని మొదలయ్యే మంత్రం పఠిస్తూ స్వామివారికి పూర్ణకుంభం సమర్పించాము. శివస్తోత్ర రూపంలో వచ్చే మంత్రం ఇది. ఈ మంత్రాన్ని పఠిస్తూ పూర్ణకుంభం సమర్పించడం సామవేదీయుల సాంప్రదాయం.


వెంటనే స్వామివారు, “నీకు ‘న కర్మణా . . .’ అన్న మంత్రం తెలుసా?” అని అడిగారు. మా నాన్నగారు ఆ మంత్రాన్ని పూర్తిగా చెప్పారు, వారితో పాటుగా నేను కూడా చెప్పాను.


తరువాత పక్క ఇంటి వారి పూర్ణకుంభం. ‘అభి త్వా . . .’ అన్న మంత్రాన్ని పఠించమన్నారు. నా మంత్రపఠనం పూర్తైన తరువాత, “కొబ్బరికాయను తాకు. నువ్వు పఠించిన మంత్రశక్తి అందులోకి వెళ్ళాలి కదా” అన్నారు స్వామివారు. నేను తాకిన తరువాతనే స్వామివారు కొబ్బరికాయను తాకి ఆ ఇంటివారికి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఇలాగే జరిగింది.


ఒకరోజు భిక్షావందనం అయిపోయిన తరువాత అక్కడున్న పెద్ద ఇత్తడి పాత్రలో ఉన్న ఎండుద్రాక్షను పిడికెడు తీసుకుని గుంపులో ఉన్న వ్యక్తికొకరికి ఇచ్చారు స్వామివారు. అతను వాటిని భుజంపైన ఉన్న తువ్వాలులో గట్టిగా మూటకట్టి భద్రం చేశాడు. స్వామివారి ఎదురుగా వాటిని నోటిలో వేసుకుని నమలడం ఉచితం కాదని నాకు తెలియకపోవడంతో వాటిని అక్కడే ఉన్న కొందరు పాఠశాల విద్యార్థులకు ఇచ్చి, వారితోపాటుగా తిన్నాను. కొద్దిసేపు అక్కడంతా మౌనం.


తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడారు, “ఇతను చిన్నపిల్లాడు; ప్రపంచం పోకడ తెలియదు. కనుక తనకి లభించిన దానిని ఇతరులతో పంచుకుని తిన్నాడు. నేను మరొక్కరికి కూడా ఇచ్చాను కదా? అతనికి లోకవ్యవహారం తెలుసు. అందుకే తన కుటుంబం కోసమని భద్రంగా దాచుకున్నాడు”.


“లోకవ్యవహారం తెలియకపోవడం వల్ల స్వార్థం కూడా తెలియదు. కానీ మరొకతనికి లోకవ్యవహారం తెలుసు కాబట్టి, స్వార్థం కూడా తెలుసు. మూటకట్టి భద్రంగా దాచుకున్నాడు”.


తత్వం ఎంత సులభం అయిపోయింది కదా!


--- ఎన్. వేంకట్రామన్, మైలదుతురై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అత్యంత శ్రేష్టుడు!

 శ్లోకం:☝️

*అజ్ఞేభ్యో గ్రంథినః శ్రేష్ఠాః*

  *గ్రంథిభ్యో ధారిణో వరాః |*

*ధారిభ్యో జ్ఞానినః శ్రేష్ఠాః*

  *జ్ఞానిభ్యో వ్యవసాయినః ||*


భావం: ఒక ఏమీ చదవని వ్యక్తికంటే చదువుకొన్నవాడు కాస్త మేలు. వానికంటే చదివింది తన మేధలో నిలుపుకొన్నవాడు మేలు. వానికంటే దానిని ఆకళింపు చేసుకొన్న జ్ఞాని మేలు. ఆతనికంటే దానిని ఆచరణలో ఉంచినవాడు కదా అత్యంత శ్రేష్టుడు!