*భూలోకంలో *భూలోకంలో అమృతం మజ్జిగ సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు*
*అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్! తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!*
*సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది.. అదే మజ్జిగ. మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. అన్నంలో కూడా తినవచ్చు. పెరుగుని చిలికి, దానికి మూడు నుంచి ఎనిమిది రెట్లు నీళ్లు పోసి, రాత్రంతా ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఉంచాలి. ఉదయాన్నే అందులో సైంధవ లవణం, జీలకర్ర, కాల్చిన శొంఠి దంచి, ఆ పొడి తగుపాళ్లలో కలిపి రోజూ తాగితే వాతం, పైత్యం, కఫ దోషాలు పోతాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాసు, మంట తగ్గుతాయి. మొలల వ్యాధి కూడా తగ్గుతుంది. అజీర్తి పోతుంది. షుగరు, బీపీ, స్థూలకాయం, కీళ్లవాతం, చర్మ వ్యాధులు. సైనసైటిస్, మైగ్రేన్ తలనొప్పికి మంచి ఔషధం. ఈ అద్భుత పానీయం ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉంది, పెరిగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ పేగు ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఎందుకంటే ఇంకా ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లకు మంచి మూలం, మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.*
*శొంఠి, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, కమలాపండు పైన తొక్కలను తగు పాళ్లలో తీసుకొని, దంచి, ఆ పొడిని చిలికిన మజ్జిగలో కలపాలి. ఇంగువ పొంగించిన నెయ్యితో తిరగమోత పెడితే ఆ మజ్జిగని ‘గౌరీ తక్రం’ అంటారు. దీన్ని పార్వతీదేవి శివుడి కోసం తయారు చేసిందన్నాడు క్షేమశర్మ. ఇది ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. సమస్త వ్యాధుల్లోనూ ఔషధం. దీని రుచి ‘దివ్యం’ అన్నాడు. పులిసిన మజ్జిగలో ఎనిమిది రెట్లు నీళ్లు కలిపి, ఔషధంగా మలుచుకోవచ్చు. వాత వ్యాధుల్లో సైంధవ లవణం (పింక్ సాల్ట్), పైత్య వ్యాధుల్లో చక్కెర, కఫ వ్యాధుల్లో శొంఠి, పిప్పలి, మిరియాల పొడి కలిపి తాగాలన్నాడు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం. ఈ పానీయం బాడీకి చేసే మేలు అంతా ఇంతా కాదు. కూల్ డ్రింక్స్ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో చల్ల చల్లగా తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి.*
*1. వేసవిలో చల్ల చల్లగా మజ్జిగను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండకు వెళ్లి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తీరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉంటాయి.*
*2. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.*
*3. కాల్షియం లోపం ఉన్నవారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.*
*4. మజ్జిగను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.*
*5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది. పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.*
*6.పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిన్నటి మజ్జిగ మిగిలిపోతే ఒక వస్త్రంలో పోసి, మూటగట్టి, వడగట్టండి. సైంధవ లవణం, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, ఇంగువ, ఆవాలు,మెంతులు దంచి, ఆ పొడిని తగినంత కలిపిన మజ్జిగని ‘అచ్చిక’ అంటారు. ఇది అన్ని దోషాల మీదా పని చేస్తుంది. ముఖ్యంగా అజీర్తిని పోగొడుతుంది. భోజనం చేసిన తరువాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా మజ్జిగని ఎంచుకుని, రోజూ తాగుతుంటే భుక్తాయాసం కలగదు. తీసుకున్న ఆహారం తేలికగా అరుగుతుంది. అన్నంలో విష దోషాలు పోతాయి. చర్మానికి మంచి కాంతి వస్తుంది. స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు ఉత్తేజం కలుగుతుంది. షుగరు రోగులు ఈ మజ్జిగని తాగితే షుగరు త్వరగా అదుపులోకి వస్తుంది.*
*అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.* సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు*
*అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్! తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!*
*సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది.. అదే మజ్జిగ. మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. అన్నంలో కూడా తినవచ్చు. పెరుగుని చిలికి, దానికి మూడు నుంచి ఎనిమిది రెట్లు నీళ్లు పోసి, రాత్రంతా ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఉంచాలి. ఉదయాన్నే అందులో సైంధవ లవణం, జీలకర్ర, కాల్చిన శొంఠి దంచి, ఆ పొడి తగుపాళ్లలో కలిపి రోజూ తాగితే వాతం, పైత్యం, కఫ దోషాలు పోతాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాసు, మంట తగ్గుతాయి. మొలల వ్యాధి కూడా తగ్గుతుంది. అజీర్తి పోతుంది. షుగరు, బీపీ, స్థూలకాయం, కీళ్లవాతం, చర్మ వ్యాధులు. సైనసైటిస్, మైగ్రేన్ తలనొప్పికి మంచి ఔషధం. ఈ అద్భుత పానీయం ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉంది, పెరిగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ పేగు ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఎందుకంటే ఇంకా ఇది పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లకు మంచి మూలం, మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.*
*శొంఠి, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, కమలాపండు పైన తొక్కలను తగు పాళ్లలో తీసుకొని, దంచి, ఆ పొడిని చిలికిన మజ్జిగలో కలపాలి. ఇంగువ పొంగించిన నెయ్యితో తిరగమోత పెడితే ఆ మజ్జిగని ‘గౌరీ తక్రం’ అంటారు. దీన్ని పార్వతీదేవి శివుడి కోసం తయారు చేసిందన్నాడు క్షేమశర్మ. ఇది ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. సమస్త వ్యాధుల్లోనూ ఔషధం. దీని రుచి ‘దివ్యం’ అన్నాడు. పులిసిన మజ్జిగలో ఎనిమిది రెట్లు నీళ్లు కలిపి, ఔషధంగా మలుచుకోవచ్చు. వాత వ్యాధుల్లో సైంధవ లవణం (పింక్ సాల్ట్), పైత్య వ్యాధుల్లో చక్కెర, కఫ వ్యాధుల్లో శొంఠి, పిప్పలి, మిరియాల పొడి కలిపి తాగాలన్నాడు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అనే సామెత వినే ఉంటాం. సామెత గురించి తెలియదు కానీ పలుచటి మజ్జిగతో మాత్రం చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి మజ్జిగ చాలా అవసరం. ఈ పానీయం బాడీకి చేసే మేలు అంతా ఇంతా కాదు. కూల్ డ్రింక్స్ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో చల్ల చల్లగా తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి.*
*1. వేసవిలో చల్ల చల్లగా మజ్జిగను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండకు వెళ్లి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తీరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉంటాయి.*
*2. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.*
*3. కాల్షియం లోపం ఉన్నవారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.*
*4. మజ్జిగను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.*
*5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది. పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.*
*6.పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నిన్నటి మజ్జిగ మిగిలిపోతే ఒక వస్త్రంలో పోసి, మూటగట్టి, వడగట్టండి. సైంధవ లవణం, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, ఇంగువ, ఆవాలు,మెంతులు దంచి, ఆ పొడిని తగినంత కలిపిన మజ్జిగని ‘అచ్చిక’ అంటారు. ఇది అన్ని దోషాల మీదా పని చేస్తుంది. ముఖ్యంగా అజీర్తిని పోగొడుతుంది. భోజనం చేసిన తరువాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా మజ్జిగని ఎంచుకుని, రోజూ తాగుతుంటే భుక్తాయాసం కలగదు. తీసుకున్న ఆహారం తేలికగా అరుగుతుంది. అన్నంలో విష దోషాలు పోతాయి. చర్మానికి మంచి కాంతి వస్తుంది. స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు ఉత్తేజం కలుగుతుంది. షుగరు రోగులు ఈ మజ్జిగని తాగితే షుగరు త్వరగా అదుపులోకి వస్తుంది.*
*అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.*