14, డిసెంబర్ 2023, గురువారం

Great indian art


 

Panchaag


 

 🕉 మన గుడి : నెం 269


⚜ హర్యానా : కురుక్షేత్ర


⚜ శ్రీ లక్ష్మీ నారాయణ మందిర్



💠 కురుక్షేత్రలోని సుందరమైన లక్ష్మీ నారాయణ దేవాలయం 18వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశం పాలనలో నిర్మించబడింది మరియు శ్రీహరి మరియు లక్ష్మీ దేవతలకు అంకితం చేయబడింది. 


💠 ఈ ఆలయం ఎత్తు 124 అడుగులు కాబట్టి, నగరంలోని అనేక ప్రాంతాల నుండి చూడవచ్చు. 


💠 మహాభారత యుద్ధానికి ముందు పాండవులు ఇక్కడ లక్ష్మీ నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించారని చెబుతారు.


💠 ఈ ఆలయానికి వాస్తు శాస్త్రం నుండి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది, సూర్యుని మొదటి కిరణం ఆలయం యొక్క తూర్పు ద్వారంలో పడి దేవుని పాదాలను తాకుతుంది.


💠 దేవుడికి పసుపు నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా ప్రతి పనిలో విజయం సాధిస్తారని పూజారులు నమ్ముతారు. 

ఈ ఆలయంలో మంగళవారం మరియు గురువారాల్లో వేలాది మంది భక్తులు పసుపు నైవేద్యాలు  సమర్పిస్తారు. 


 💠ఈ ఆలయానికి ఇంకొక ప్రాముఖ్యత ఉంది, భక్తులు ఈ ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తే, వారు చార్ ధామ్ కోసం వెళ్లవలసిన అవసరం లేదని చెబుతారు.



💠 కురుక్షేత్ర రైల్వే స్టేషన్, సిటీ సెంటర్ నుండి 2 కి.మీ. 

ఇది ఢిల్లీ, పాటియాలా, మీరట్, లూథియానా, పానిపట్ మరియు అంబాలా వంటి నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

గెలవాల్సింది

 *దేశం గెలవాల్సింది...*

 *స్టేడియాల్లో కాదు...* 

*పచ్చని పొలాల్లో...*


🌱🍅🌰🍠🥔🌶🌽🍆


వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే 

దేశ భక్తులారా.... 

ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... 

ఒక్కసారి ఆలోచించండి...


దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ 

పట్టించుకుంటున్నావా.......


🍅🍅🍅


ఇష్టమయిన క్రికేటరెవరో 

వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు,  

నీకు తెలిసిన రైతు ఎవరైనా 

వంద బస్తాలు పండించాలని 

ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....


🍏🍏🍏


రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే 

నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....


🌽🌽🌽


దేశాన్ని గెలిపించడానికి 

కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,

టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.

దేశాన్ని బతికించే 

నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ 

అనే ఆందోళన నీకుందా ?...


🌶🌶🌶


నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను 

నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్

నిన్ను బతికించే రైతులకెవరూ 

ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....


🥕🥕🥕


నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ

నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో 

ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......


🍆🍆🍆


అన్నం తింటూ కూడా ..

పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని 

నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .

అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో 

విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....


🍋🍋🍋


ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో 

చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్

వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో 

ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని

అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....


🍠🍠🍠


ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన 

నీకు 

రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....


🥒🥒🥒


🍍🍍🍍


ఎప్పుడయినా ,

గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ

లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....


🍇🍇🍇


ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు 

రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.


🍈🍈🍈


కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు 

రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనాచూసావా... ?


🥜🥜

🍊🍊🍊


పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం 

కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....


🌿🌿

🐓🐓🐓


ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు 

పచ్చని పోలాల్లో ....

అందుకు 

రైతులు నాటౌట్ గా నిలవాలి...🙏💐🌾🎋

రాజకీయాన

 రాజకీయాన

ఎన్ని..కలలో..

కళలో!.


అభ్యర్ధి ఎవరైతే

ఎటువైపు ఉంటే

ఏమి లాభం...


తూగే తూకం సరిపోలేదనో

లెక్క తప్పిందనో

గోడ దాటుతనం..

ఎన్నికల విచిత్రం.


పోరు పందెంలో

పరిగెత్తే గుర్రాల్లో

గెలుపు ఎవరిదో..


అదే సమయంలో అవకాశం కోసం

గోడ మీది దాగిన పిల్లులెన్నో...


కండువాలు మార్చి

రంగులు ఏమార్చి

పూటకొక్క పార్టీ

అదే 'గో-పి' సంగతి.


వల విసిరే పార్టీలు

కావడి మోసే ముఖ్యులు.


తైలం పూసే అభ్యర్ధులకు

అంతా అయో'మయమే.


గెలుపే లక్ష్యంగా

ఓటరు చుట్టూ ప్ర'దక్షణాలు..

కరుణించే దెవరినో....


అంతా రహస్యం...

గప్ చిప్..బ్యాలెట్ చిత్రం..


ఎన్నికల్లో...

ఎన్ని కలలో... 

ఎన్ని కళలో...


రంగు వేసే దగ్గరనుండి

రంగు పడే వరకు

అంతా రాజకీయ విచిత్ర విన్యాసం...


చివరికి...

గెలిచిన గుర్రమే

ప్రజాపాలనపై పెత్తనం..


డామిట్... 

కధ అడ్డం తిరిగింది.


ఎన్నిక రోజు రాజైన ఓటరేమో 

మరో ఐదేండ్లు అయ్యేను బానిస...


ఇక మొదలైంది

రంగుమార్చే ఊసరవెల్లి ''రాజకీయం."



అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

శ్రీ దేవీ భాగవతం

శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||

శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||

శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

దేవదేవా ! కరుణానిధీ ! నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. వేదోక్తప్రకారంగా భూరిదక్షిణలతో వరుణయజ్ఞం
చేస్తాము. బిడ్డపుట్టిన పదకొండవవాటికి తండ్రికి శుద్ధి. వెలగడిచాక తల్లికి శుద్ధి. అప్పుడుగదా మేమిద్దరం
యజ్ఞానికి అర్హులం అవుతాం ! నువ్వు సర్వజ్ఞుడివి. ధర్మశాస్త్రాలు చదివినవాడివి. అందాకా ఓపికపట్టు అని
వివయంగా అభ్యర్థించాడు.
సరే, మహారాజా ! నీకు శుభమగుగాక! నెల గడిచాక వస్తాను. అప్పుడింక వాయిదా
వెయ్యకూడదుసుమా ! అని చెప్పి వరుణుడు నిష్క్రమించాడు. గండం గడిచిందికదా అని హరిశ్చంద్రుడు
ఊపిరి పీల్చుకున్నాడు. కొడుకుకి రోహితుడు అని నామకరణమహోత్సవం జరిపించాడు. పరిగ్గా వెల
గడిచేపరికి వరుణుడు విప్రవేషంలో ప్రత్యక్షమయ్యాడు. చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు.
సాష్టాంగపడి అతిథిమర్యాదలు అత్యద్భుతంగా జరిపాడు

మహానుభావా ! నీ రాకతో మా గృహం పావనమయ్యింది. యజ్ఞం తప్పకుండా చేస్తాను. అయితే
- దంతాలు రాని పిల్లవాడు యజ్ఞపశువుగా పనికిరాడు అంటున్నారు మా విద్వాంసులు. అంచేత
పాలపళ్ళు వచ్చేదాకానన్నా ఆగు అని అప్పటికి దాటవేశాడు హరిశ్చంద్రుడు. సరేనని వెళ్ళిపోయాడు.
వరుణుడు.
పిల్లవాడికి దంతాలు వచ్చాయి. హరిశ్చంద్రుడికి భయం పట్టుకుంది. వరుణుడు రానేవచ్చాడు.
స్వామి ! బిడ్డడికి ఇంకా పుట్టువెంట్రుకలు తీయించలేదు. ఆ చౌలకర్మ అయ్యేంతవరకూ ఈ గర్భకేశుడు
యజ్ఞవశువుగా పనికిరాడుటగదా! పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అప్పటిదాకా మరికాస్త ఓపికపట్టు.
యజ్ఞం తప్పకుండా చేస్తాను. ఆడిన మాట తప్పడం మా ఇంటా వంటా లేదు. నీకు తెలుసుగదా - అన్నాడు
మహారాజు.
రాజా ! నన్ను వంచించాలని చూస్తున్నావు. ఏదో ఒక వంక చెప్పి వాయిదాలు వేస్తున్నావు..
పుత్ర స్నేహానికి లొంగిపోతున్నట్టున్నావు. మిగతా యజ్ఞ సంబారాలన్నీ సిద్ధం చేసుకున్నావుగదా! సరే
ఇప్పటికి వెడుతున్నాను. చౌలకర్మ అయ్యిన తరవాత యజ్ఞం చెయ్యకపోయావో జాగ్రత్త. శపిస్తాను సుమా!
ఇక్ష్వాకువంశంలో పుట్టావు. మాట తప్పకూడదు. గుర్తుంచుకో అంటూ చరచరా నడిచి వెళ్ళిపోయాడు

.

జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ

 *మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!*


ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా? 


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు, తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.


కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు.  చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.


ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు..


”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.


అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధాన మిస్తాడు…


”ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు,  నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ,   నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు) ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.


తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.”


”నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...


”కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.


అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి .. 


 “ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి....ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.


అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు.


మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి.


అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. భూమి మీదపడి నప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. 


     ఏ ఆధ్యాత్మిక కధ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. 


గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!”

అరుణాచలశివ 🌹

కవుల కలములో

 తే.గీ


కవుల కలములో మాయమ్మ కావ్యముగను నిలచి యుండును శ్రీదేవి నీడ వోలె ఘనతకెక్కెడి కావ్యాలు గరునిచేత చేర్చ బడునుట దివిలోకి సిరివిధముగ

పంచాంగం డిసెంబర్-14-గురువారం ,

 శుభోదయం, పంచాంగం 

డిసెంబర్-14-గురువారం   ,

 స్వస్తిశ్రీ  శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు*మార్గశిర మాసం* శుక్లపక్షం 

తిథి:  విదియ 2.51pm

బృహస్పతివాసరే

నక్షత్రం:  మూల 11.33 am

వర్జ్యం: 06:44 pm – 08:14 pm

దుర్ముహుర్తం: 10:14 am - 11:05 

03:21 pm - 04:12 pm

రాహుకాలం: 01:30 pm - 03:00 

యోగం:  గండము 01:24 pm

కరణం:  బవ 03:09 am,

 భాలవ 02:05 pm

సూర్యోదయం   : 06:41

సూర్యాస్తమయం : 06:39

విడుదల

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


' విడుదల ' ! 


'ఎదుగుదల'కు - మూలం - 'విడుదల'


నిలకడకు - పునాది - 'విడుదల'


ఎంతో కష్టము - 'విడుదల' - ప్రక్రియ 


సాధన - క్రమశిక్షణ - తో - సాధ్యము - 'విడుదల'


ఆసుపత్రి  నుండి రోగి  - 'విడుదల'


చెర నుండి ఖైదీ  -  'విడుదల'


చెడు ఆలోచనల నుండి మనసు - 'విడుదల'


మంచి వైపు అడుగు - చెడు నుండి - 'విడుదల'


మితము - అన్ని - 'అతి' ల నుండి - 'విడుదల'


వృద్ధాప్యాన - భక్తి, ముక్తి - వైపు - ఆసక్తి, రక్తి - నుండి - 'విడుదల'


భవ బంధనముల  - నుండి - ఆఖరి - 'విడుదల' 


మనిషి - జీవితమే - పట్టు - విడుపుల - మధ్య - ఉయ్యాల 


విడుపులు - ఎక్కువున్న - గెలుపులు - సాధ్యాలు - తెలుసుకున్న !!! 


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మణ్యం  - చెన్నై

10.11.23

నా స్వీయ రచన

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ ప్రతిపత్ - జేష్ఠ -‌ సౌమ్య వాసరే* *(13-12-2023)* 


ప్రముఖ వేదపండితులు, 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/hmg0asPxSXY?si=uAK84mkGzSRSgck1


🙏🙏

రాశిఫలాలు

 🕉️శ్రీ గురుభ్యోనమః🕉️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*14-12-2023 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి.

---------------------------------------

వృషభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. సోదరులతో  స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మిధునం


వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.

---------------------------------------

కర్కాటకం


స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో  విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

సింహం


ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

---------------------------------------

కన్య


ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విద్యార్థుల శ్రమ ఫలించదు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు.

---------------------------------------

తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని  సమస్యలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------

వృశ్చికం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

ధనస్సు


సోదరులతో స్థిరస్తి వివాదాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మకరం


విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.  సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు.

---------------------------------------

కుంభం


వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 

---------------------------------------

మీనం


వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.  బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

దోసావకాయోత్పత్తి

 *దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో,  దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!

ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని,  ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!

అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ,  పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి,  ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!

ఒక గంట  పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు  బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి  ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!

ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!

ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః

ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో  జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన  కొన్ని విషయాలు:

ఈ దోసావకాయ అపమృత్యువులను,    అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని  శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు  నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో  దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.

నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...