14, జనవరి 2023, శనివారం

కొడుకులు బిడ్డలు

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


*కొడుకులు బిడ్డలు బాకీ సంబంధం తో పుడతారు.*


ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...


భక్తి గురించి దేవుని గురించి...


జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. 


అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది.


వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. 


గురువు అప్పుడు అడిగాడు, 


నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని. 

తన బార్య గర్భవతి అని చెప్పాడు. 


గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు?


అని అడిగాడు. గురువు. 


మీరు ఏది అడిగితే అదే ఇస్తాను. అన్నాడు. 


సరే...నీ భార్యను అడిగి రా...

తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? 


అలా చేస్తే నీకు మంత్రోప దేశం చేస్తాను. 

వెళ్లి నీ భార్యను అడిగి రా, 


పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి. 

అన్నాడు గురువు. 


అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? 


అని అడిగాడు. 


అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.

మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, 

అంటూ ఒప్పు కుంది.


ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రస వించింది. 

మగ పిల్లవాడు పుట్టాడు. 


ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు.

భార్య భర్తలు. 


గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు. 


తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, 

చేసేది. 


ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. 


ఈ విదంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు. 


మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. 


ఇదేం గురువయ్యా ? 


నాకు నచ్చలేదు.

నా కొడుకును ఇవ్వను. 

కాక ఇవ్వను.

అనీ మొండి కేసింది. 


అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. 


గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. 


అమ్మ నీ బిడ్డను ఇవ్వ నన్నావు కదా, 


ఇప్పుడు నీ బిడ్డను నే,నేమి చేయను.


కాని ఒక్క సారి బిడ్డను...

నా చేతి కిచ్చి 

నా వెంట రండి.

మీ బిడ్డను నే,నేమి చేయను.


మళ్లి మీ బిడ్డను 

మీకు ఇచ్చేస్తాను.

అని అన్నాడు. 


సరే ననీ బిడ్డను తీసు కొనీ గురువు వెంట బయలు దేరారు వారిరువురు.ను..


గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి  తీసుకు కెళ్లాడు. 


ఆ రెండు గొయ్యిల మద్యన తెల్లని గుడ్డ పరిచి...

ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొనీ మంత్రించి...

ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. 


తల్లీ దండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...

ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. 


గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగు తున్నాడు. 


ఒరేయ్ వీళ్ళకు కొడుకుగ పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. 


వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. 


రెండో వాడు ఇలా చెబుతున్నాడు. 


గత జన్మలో వీడు బాకి పడ్డాడు.

నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. 


అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అంది నంత లాగేసు కుందామని వచ్చాను. 


మరీ నువ్వేందు కొచ్చావు. 

అని అడిగాడు. 


వీడు నాకు కూడా ఇవ్వాలిరా...

నేను కూడా అందుకే వచ్చాను.

వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచు కొని వదిలేసి వెళ దామని వచ్చాను .


కానీ వీడు మనల్ని గురువు చేతి లో పడ వేసాడు. 

ఇంకే ముంది? 

వాడు.

మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేసాడు. 


ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది.

అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. 


ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. 


ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? 


అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, 


గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టీ ఆద రించాడు. 


నేను పోయే వరకు నన్ను పోషించాడు. 


అందుకే...

ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రు లిద్దరినీ వాళ్ళు బ్రతికి నంత కాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంత మైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. 


మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. 


గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత ిపెట్టాడు. 


నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను. 

అని చెప్పాడు. 


ఈ ముగ్గురు మాట్లాడు కున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. 


గురువు పాదాల మీద పడి క్షమించ మని వేడు కున్నారు...


కాబట్టీ ...

గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్దం. 


_ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణాను బంధాలే కాదు,= 

_జన్మ రాహిత్యమే జరుగు తుంది._


_ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది..._


_మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు._


_కాని అది కాదు._


_మోక్షం అంటే బ్రతి కుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం..._


_దైవం ఏ,ఏ,రూపాలలో ఉన్నాడు._ 


_ఎక్కడ ఉన్నాడు._ 


_ఏం చేస్తున్నాడు._


_ఈ సృష్టి ఏమిటి._ 


_ఎలా తయారైంది. నే,నె'వరిని._ 


_ఎక్కడ నుండి వచ్చాను._ 


_మళ్లి ఎక్కడికి వెళతాను._ 


_అసలు మాయ అంటే ఏమిటి???_

జననం, విద్య

 సిస్టర్ నివేదిత (అక్టోబర్ 28, 1867 - అక్టోబర్ 13, 1911) వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ (ఐర్లండ్) మహిళ.


   జననం, విద్య

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఇస‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్ఫూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు (1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 123 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరించారు. ఇతరులపై దయా గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.


     భారతదేశంలో

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబరులో కలకత్తా లోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాధ టాగూరు, జగదీశ్ చంద్ర బోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ ‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.


       చివరి రోజులలో

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికథైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.


ఆమెను కడుపులో మోస్తుండగా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం, తృప్తితో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని, తన తండ్రి, తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయంలో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్‌కి పెద్దషాక్ తగిలింది .


టీచర్‌గా పనిచేస్తూ తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరంగా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యం హరించని, ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయంలో మార్గరెట్‌కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబంధించిన పుస్తకం ఇచ్చారు. అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.


అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశము వెళుతూ లండన్‌లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామకృష్ణ మిషన్‌లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సిస్టర్ నివేదితగా వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది. కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది ఆమెలో. ఆ రోజుల్లో వైద్యవిధానాలు, చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణముగా తన అనారోగ్యానికి కారణం తెలియ పర్చలేదు.

అల్లం ముక్క

 వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ


దోరగా వేగిన పెసరట్టు కొరికితే -  జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ


మిర్చిబజ్జి ఆబగా తినబోతే -  నాలిక సుర్రుమన్నట్టూ


పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ


పచ్చి మిరపకాయలు తగిలించి -  రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ


మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ


పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ


దిబ్బరొట్టె మొత్తం - 

నేనే తినేసినట్టూ


వేపచెట్టు కింద మడతమంచమెక్కి - 

చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ


చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ


పప్పుచారులో గిన్నెడు -  చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు


రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ


కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ


చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ


నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ


పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ


చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ


సావిట్లో గేదెలతో పోటీపడి -  తేగలు తెగ తినేసినట్టూ


దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ


తిరుపతి లడ్డూ మొత్తం -  అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ


పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ


పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ


టమాటా పప్పుకి తోడు -  ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ


మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ


బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు


వేడి వేడి బెల్లం జిలేబీ , 

రోడ్ మీద కొనీ కొనగానే - 

కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు


బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు -  ఒలుచుకు తిన్నట్టూ


లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ -  స్టార్ బక్స్ లో దొరికినట్టూ


బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు -  పటపటమని నమిలేసినట్టూ


అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు -  తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ


సినిమా హాల్ లో పాప్కార్న్ -  ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ


చిన్నా పెద్దా తేడాలేకుండా -  రసాలు గుటకలేసినట్టూ


కొబ్బరి బూరెల కోసం చేసిన -  చలివిడి కొట్టేసి తిన్నట్టూ


బిడ్డనెత్తుకొచ్చిన సారెలో -  పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ


కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ


మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ


కిస్మిస్ లని -  కేజీల్లో మాయం చేసేసినట్టూ


దోర జాంకాయాలు  చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని -  పరపరా నమిలేసి తిన్నట్టూ


సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు -  ఘుప్పుమన్నట్టూ


వానాకాలంలో పకోడీల వాసన -  గాలిలో తేలి వచ్చినట్టూ


తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ


పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ


పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ


దోరగా పండిన చింతకాయ -  చిటుక్కున చేతికి అందినట్టూ


పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ


చిన్నుసిరికాయల చెట్టు -  స్కూలుకెళ్ళే దారిలో  కొమ్మజాపి రమ్మన్నట్టూ


ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ


వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ


కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ


మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ


సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ


ఎర్రని సీమతుమ్మకాయలు -  కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ


గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ


వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ


విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ 


బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ


వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 


వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ


భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని -  పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ


ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ


పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ


ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ


గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు


పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ


దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ


ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ


కమ్మని కలలు కంటూ మాంచిగా నిద్రలో  ఉంటే,  కుళ్ళుమోతు అలారం  పీడకలొచ్చినట్టు  మోగిచచ్చింది!


ఇదంతా ఎందుకంటే .....


ఈ రోజుల్లో ఇవిదొరకటం,దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!😍😍

నిజమైతే బాగుంటుందనిపించే కల😇😍

*కాశి ఆలయ చరిత్ర*

 *కాశి ఆలయ చరిత్ర*


👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*


👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*


👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*


👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*


👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*


👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*


👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*


👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*


👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*


👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*


👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*


👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*


👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*


👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*


👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*


👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*


👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*


👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*


👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 


👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*


👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*


👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*


👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*


👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*


👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*


👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*


👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి, కారణజన్ముడు, యుగపురుషుడు, మన హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*


*శ్రీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం అయిన తరువాత రోజూ 60 వేల మంది పైగా భక్తులు దర్శనానికి వస్తున్నారు.*


🙏 *ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.*🙏

మాతృ భాష

 38వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

38వ దినము (14-01-2023):

శిఖరము: అధిక్యత, కొప్పరము, కొమ్మ, గుబ్బ, ఘటము, దంతకము, ముకుటము, మోదు, శేఖరము, శృంగము, సిగరము. 

ఆంగ్లము: Hill top

*భోగి - కనుమ - సంక్రాంతి*

 *భోగి - కనుమ - సంక్రాంతి*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


🕉 *భోగి రోజున అగ్నిదేవుడిని పూజిస్తాము*


🕉 *సంక్రాంతి రోజు  -  సూర్యనారాయణ మూర్తిని పూజిస్తాము.*


🕉 *కనుమ రోజున పశుపతిని పూజిస్తాము..*


🕉 *మొదటి రెండు రోజులూ మానవాళికి సంబంధించినవి.  మూడవ రోజు కనుమ... మన మనుగడకు కీలకమైన, పశుపక్ష్యాదులకు సంబంధించినది.*


🕉 *ఆ రోజు పశువులకు పూజలు చేసి, మంచి ఆహారము సమర్పించి,  విశ్రాంతి కల్పించి, కృతజ్ఞతలు ప్రకటించే రోజు.*


🕉 *పశుపతికి ప్రీతి కలిగించే రోజు. అలాగే, శ్రీకృష్ణ పరమాత్మ  గోవర్ధనగిరినెత్తి , పశుపక్ష్యాదులనూ, మానవాళిని రక్షించిన రోజు కనుమ రోజే.*


🕉 రైతుల కష్టాలను గట్టెక్కించే ప్రత్యక్ష దేవతలే ఈ పశుజాతి..

పక్ష్యాదుల వల్లే వృక్ష జాతి, వీటివల్ల ఆక్సిజను, వానలు,

సస్యశ్యామలంగా, పాడిపంటలూ లభించటం, మానవాళి సుకృతం..


🕉 అందుకే కనుమకు సంబంధించిన మూగ ప్రాణులకు, మానవత్వ కృతజ్ఞతలు సమర్పణ చేస్తే, పశుపతి తప్పక కరుణిస్తాడు..


*సర్వే జనా సుఖినోభవంతు* 

*లోకా సమస్తా సుఖినోభవంతు* 



🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏


🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

కంచి కామకోటి

 కంచి కామకోటి... రాంచి రామకోటి..

పరమాచార్య వారు కాశి యాత్ర సందర్భంగా టాటా నగర్ (ఇప్పుడు ఝార్ఖండ్ లో ) లో జరిగిన ధనుర్మాస సభలలో పాల్గొన్నారు. బీహార్ లోని పత్రికలు స్వామి వారు పాల్గొన్న కార్యక్రమం వివరాలు ప్రజలకు అందించే క్రమం లో "కంచి కామకోటి స్వామి " వారు అనే బదులు "రాంచి రామకోటి స్వామి "వారు అని వ్రాసాయి. ఈ విషయం స్వామి వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళినప్పుడు స్వామి చమత్కారం గా ఇలా వివరించారు.

" ఆంగ్ల భాషలో  (k)  "క "కారానికి "ర"(R) కారానికి దగ్గరి పోలిక ఉంది.


ఆ పదాల అర్ధం తెలియక అలా వ్రాసి ఉంటారు. నిజానికి రాముని (విష్ణువు )కుమారుడే కాముడు (మన్మధుడు )కానీ రాముడున్న చోట కాముడుండడు . తులసి దాస్ తన రామచరిత మానస్ లో "జహ రామ హో  వహ కామ్ నహి "అన్నారు.కానీ రామకోటి ఉన్న చోట కామకోటి ఉండడానికి అభ్యంతరం లేదు.ఎందువల్ల అంటే రామకోటి వ్రాసిన పుస్తకాలను ఊరేగింపుగా తెచ్చి నాకు స్వాగతం చెప్పారు. (బందరు లో )అంటే రామకోటి ఉన్న చోట మేము కామకోటి వారం ఉంటాము."అని చమత్కరించారు.

భోగి పండుగ

 *🚩  భోగి పండుగ ! భోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? | భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?🚩* 


 పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. 


దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం..


 "భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.


 పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.


సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.


 కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తునం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. 


ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.


భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుస్సుకుందాం...

భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.


 మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అసిర్వాదిస్తారు.


మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.


- స్వస్తి...

మన మాతృ భాష

 37వ దినము:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

37వ దినము (13-01-2023):

కొండ: అగమము, అగము, అచలము, అద్రి, అవనీధరము, అవి, అహర్యము, ఉర్వీధరము, కందకారకము, కటకి, కరువ, కుట్టీరవము, కుత్కీలము, కుధరము, కులి, క్షితిధరము, గట్టు, గిరి, గుట్ట, గోత్రము, చట్టు, జీమూతము, తాలిశము, తిప్ప, తుంగము, దంతి, దుర్గమము, ధరము, ధరాధరము, ధాత్రీధరము, నిర్ఝరి, పరిఖ, పర్వతము, భూధరము, మల, మహీధరము, శిఖరి, శృంగి, శైలము, సుదానము, స్తంబము, స్రావరము. 

ఆంగ్లము: Hill

భక్తి లేని జ్ఞానం

 _*భక్తి లేని జ్ఞానం వృథా!*_


🔹🔸🔹🔸🔹🔸🔹


*‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు.* 


తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.


జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్దిమంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు దేనినీ పెద్దగా కోరుకోరు. లౌకిక విషయాలేవీ పట్టవు. వీరికి కావలసిందల్లా భగవంతునికి ఆత్మార్పణం చేసుకొని, అతనిలో ఐక్యం కావడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తుంటారు.


‘ఆత్మజ్ఞానులు’ చేసే పనులు ఎంతో విజ్ఞతతో కూడుకొని ఉంటాయి.


మానవుడు తన జ్ఞానంతో ఎన్నింటినో (విద్యుత్‌ బల్బ్‌, ఫ్యాన్‌, రిఫ్రిజిటర్‌ వంటి విద్యుత్‌ పరికరాలు) కనుగొన్నాడు. ఇవన్నీ కూడా స్వయంప్రతిపత్తి (స్వీయశక్తి)ని కలిగినవి కావు. వాటిని విద్యుచ్ఛక్తితో అనుసంధానిస్తేనే పనిచేస్తాయి. ఎలాంటి జ్ఞానం ఉపయోగించకుండానే వాటి స్విచ్‌ ఆన్‌ చేస్తే సరి. జ్ఞానం లేనివారు కూడా ఇంతే. అజ్ఞానంతో లోపభూయిష్టమైన జీవితాలు గడుపుతుంటారు. జ్ఞానం లేనివాని జీవితం కష్టాలమయంగా ఉంటుంది. అతను తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటుంటాడు. 


ఒకసారి ఈ దృశ్యాన్ని ఆకాశంలో విహరిస్తున్న ‘పార్వతీ పరమేశ్వరులు’ చూసి, తమలో తాము ఇలా అనుకున్నారట. ‘జ్ఞానం లేని ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు. కొమ్మ విరిగాక అతను కిందపడి పోవడం ఖాయం. అప్పుడు అతను ‘అమ్మా’ అని అరిస్తే నేను రక్షిస్తాను. ‘నాన్నా’ అని కేక వేస్తే మీరు రక్షించండి’ అందిట పార్వతి. 


ఇద్దరూ ‘సరే’ అని ఆ వ్యక్తివైపు చూడసాగారు. అతడు పడిపోతూ, ‘చచ్చాను..’ అని అరిచాడు. ఇద్దరిలో ఎవరినీ తలచుకోలేదు. ‘ఆపదల నుంచి గట్టెక్కించమని’ ఆపద్భాందవుని వేడుకుంటేనే కదా కాపాడేది!


ఇటువంటి ‘బుద్ధి’ (వివేచన) నిజానికి మనిషికి జ్ఞానం ‘ఉంటేనే’ పుడుతుంది. ‘కొంత ధీశక్తి, పరిశీలనా పటిమతో ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవాడు ఎక్కడ, ఎలా ఉంటాడు?’ అనే కుతూహలంతో నిరంతరం సాధన చేసేవాడే జ్ఞాని.


అతనిపై ఎలాంటి ఐహికమైన కోరికలు ప్రభావం చూపవు. ఒక్క పరమాత్మ సాన్నిధ్యం తప్ప, అతనికి మరేదీ అక్కరలేదు.


‘ప్రియో హి జ్ఞానినో త్యర్థం అహం సచ మమ ప్రియః’ (భగవద్గీత: 7-17).


‘నాకు జ్ఞాని అయినవాడు అత్యంత ప్రియుడు. నేనూ అతనికే మిక్కిలి ప్రియుడను’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.


‘జ్ఞానికి నేను తప్ప ఇంకేమీ అవసరం లేదు. తన్ను తాను నాకు సమర్పించుకుంటాడు. ఆత్మార్పణ బుద్ధితో, శరణాగత భావంతో నన్ను సమీపిస్తాడు. నేను అతనిని కృపాదృష్టితో, ప్రేమభావంతో చూడకపోతే అతని శరణాగతి, ఆత్మార్పణం అర్థం లేకపోగా, అవి వృథా అవుతాయి కదా. అందుకే, నేను అతణ్నే ప్రేమిస్తాను. అతనంటేనే నాకంత ఇష్టం.’ అన్నది పరమాత్మ భావన.


మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వార్థరహిత ప్రేమ చూపగలిగితే దీర్ఘకాలిక శత్రువు కూడా ప్రేమమూర్తిగా మారిపోతాడు. 


ఈ లోకంలో భక్తి, జ్ఞాన మార్గాలు రెండూ వేర్వేరు. ఒకరకంగా ఇవి రెండు ‘విరుద్ధాలు’ కూడా. ఇక్కడ జ్ఞానియే భక్తుడు కూడా అవటం విశేషం. ‘భక్తి లేని జ్ఞానం’ నిస్సారమైంది. ‘ఆత్మజ్ఞానం’ అనేది సాధన ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానులు సమస్త జీవకోటి, మానవ కల్యాణానికి బాటలు వేస్తారు.

సదాచార సంపన్నులు

 సదాచార సంపన్నులు


శ్రీ గోపాల అయ్యర్ శ్రీమఠంలో పనిచేసేవారు. పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. దిండిగల్ దగ్గర్లోని సిరుమలైలో ఉన్న శ్రీమఠం తోట నుండి తిరిగొస్తూ 500 మలై రకం అరటిపళ్ళు పట్టుకొచ్చారు. వాటిని మహాస్వామి వారి ముందు పెట్టారు. 


”ఈ పళ్ళు మన శ్రీమఠం ఎస్టేట్ లోనివి పెరియవ. మీకోసమనే వీటిని తీసుకుని వచ్చాను” అని చెప్పారు. మహాస్వామివారు మొత్తం పళ్ళంన్నింటిని ఒకసారి పరికించి కేవలం ఒక్క పండును మాత్రం తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారు. 


అక్కడున్న భక్తులంతా ఆ పళ్ళను ప్రసాదంగా ఇస్తారు కాబోలు అని అనుకున్నారు. కాని మహాస్వామివారి ఆలోచనలు ఎవరికి అందనంత స్థాయిలో ఉంటాయి. పరమాచార్య స్వామివారు ఉంటున్న ప్రాంతం నుండి 300 అడుగుల దూరంలో ఒక కురవల (గ్రామాలు తిరిగే సంచారి జాతుల) శిబిరం ఉంది. వారికి నివసించడానికి ఒక ఇల్లు ఉండదు. చెట్ల నీడ క్రింద బ్రతుకుతుంటారు. అక్కడే తినడడం, పడుకోవడం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మహాస్వామివారు మేనేజరును పిలిచారు. 


”చూడు, ఈ అరటిపళ్ళను అన్నింటిని తీసుకో. అలాగే అన్ని పళ్ళు, కొబ్బరికాయలు, కమలా పళ్ళు భక్తులు తెచ్చిన పళ్ళను అన్నింటిని తీసుకొని అక్కడున్న కురవలకు ఇచ్చెయ్” అని స్వామివారు ఆదేశించారు. అక్కడ నిలుచున్న భక్తులందరూ విస్మయం చెందారు. అప్పుడు శ్రీమఠంలోనే ఉంటున్న అనంతాననంత స్వామివారు పరమాచార్య స్వామిని, “ఏమిటి ఈ కొత్త పద్ధతి? పళ్ళన్నీ వారికి ఇవ్వాలా?” అని అడిగారు. 


అందుకు మహాస్వామివారు పరమ ప్రశాంతంగా ఇలా చెప్పసాగారు. “మనమందరమూ మన సంస్కృతిని మార్చుకుని చక్కగా క్రాపు చేయించుకుని, పాంట్లు చొక్కాలు తొడుక్కుంటున్నాము. బయట ఎంగిలి హోటళ్లలో, టి కొట్లలో తినడం కూడా మొదలుపెట్టాము. అంటు, ముట్టు, మైల వదిలేసాము. ఇంకా కొందరు విదేశాలకు కూడా వెళ్తున్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తుడిచెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. కాని ఆ కురవలు ఇప్పటికి పేదలే. వాళ్ళని చూడు వారి ఆహార వేషభాషలు ఏవీ మారలేదు. క్రాపు చేయించుకోరు. తరతరాలుగా వారు పూసలు, పిన్నులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకరి సొమ్ము దొంగిలించరు. వాళ్ళ కులంలోనే వివాహాలు చేసుకుంటారు. మరుసటి రోజు గురించి వారికి దిగులు లేదు. అక్కడైనా సరే వండుకుని తిని పడుకుండిపోతారు. ఏవిధమైన రాజకీయాలకు కుట్రలకు దిగరు. స్వార్థము, చెడ్డ బుద్ధి ఎరుగరు. ఆరోజుకు కావలసిన సరుకు మాత్ర6 కొనుక్కుని మరుసటి రోజుకు ఏదీ దాచుకోకుండా జీవనం సాగిస్తారు. పాతకాలంలో ఋషులు, మునుల వంటి జివనం సాసిఅతూ, నిజమైన సనాతన సంస్కృతిని ఖచ్చితంగా పాటిస్తున్నది వారే”


పరమాచార్య స్వామివారు సనాతన ధర్మం నశించిపోతోందని ఉద్ఘాటించి, ఒక చిన్న సమూహం దాన్ని ఎలా నిలబెడుతోందో చెప్పారు. ఇది మహాస్వామివారి గొప్పతనం. ఎవరూ ఇష్టపడని ఆ కురవ జాతిలోని మంచితనాన్ని స్వామివారు గుర్తించారు. మహాస్వామివారు ఆ గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు ఆ కురవలు కూడా వీడ్కోలు పలకడానికి వచ్చారు. స్వామివారు వారినందరిని ఆశీర్వదించి పంపారు. 


--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీత్రిపురసుందరీభావనాష్టకం

 శ్రీత్రిపురసుందరీభావనాష్టకం 


1) తురీయజ్ఞానభాసినీం

   తులనాతీతరూపిణీం 

   తిరోధానుగ్రహరూపాం 

   భావయామి త్రిపురసుందరీం ||


2) మహిషాసురమర్దినీం

    మమతానురాగవర్జితాం

    మనోజవప్రదాయినీం 

    భావయామి త్రిపురసుందరీం ||


3) కాదిహాదివిద్యాంకురాం 

    కారణాతీతవిగ్రహాం 

    కార్యాకార్యవిచక్షణాం 

    భావయామి త్రిపురసుందరీం ||


4) వంశాభివృద్ధికారిణీం 

    వరిష్ఠమునిగణవందితాం 

    వామాచారవిద్వేషిణీం 

    భావయామి త్రిపురసుందరీం ||


5) పర్వతరాజనందినీం 

   పార్వణేందుముఖీం

   పాపసంఘవిఘాతినీం 

   భావయామి త్రిపురసుందరీం ||


6) కరిచర్మాంబరమనోహరాం 

    కామితార్థఫలదాయినీం 

    కవితారసమాధుర్యాం 

    భావయామి త్రిపురసుందరీం ||


7) అరుణారుణవర్ణవిగ్రహాం 

    ఆశాపాశవిమోచనీం 

    అరవిందదళాయతాక్షీం 

    భావయామి త్రిపురసుందరీం ||


8) మేధాబుద్ధిప్రదాయినీం 

    మణిమేఖలధారిణీం 

    మోక్షమార్గప్రదర్శినీం 

    భావయామి త్రిపురసుందరీం || 


    సర్వం శ్రీ త్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

ఋష్య శృంగులు

 కలియుగ ఋష్య శృంగులు..

1983 జులై నెలలో కర్నూలు లో ముగ్గురు కంచి స్వాములు చాతుర్మాస దీక్ష చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వారిని చూడడానికి వేలాదిగా జనం వచ్చారు.

స్వామి వారలు రాక పూర్వమే కర్నూలులో వర్షాభావ పరిస్థితి నెలకొని ఉంది. నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే 300 అడుగులు తవ్వినా నీటి జాడ లేదు.ముగ్గురు స్వాములు స్నానానికి సమీపంలో నదికెళ్తే మోకాలు లోతు నీరు కూడ లేదు.పరమాచార్య వారు చాతుర్మాస దీక్ష లో భాగంగా వ్యాస పూజ చేసారు.

వ్యాస పూజ జరిగి 12గంటలు కూడ గడవక ముందే నీరు ఎక్కడ నుంచి వచ్చిందో నది కట్టలు తెగే లాగ నీరు ప్రవహించింది. మరునాడు కర్నూలు లో కుంభ వృష్టి కురిసింది. జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణ ప్రజలు ఆనందించారు.

***వాల్మీకి రామాయణం బాలకాండలో ఋష్య శృంగుని వర్ణన...

తత్ర చానీయ మానేతు

విప్రే తస్మిన్ మహాత్మని

వవర్ష సహసా దేవో

జగత్ ప్రహ్లాదయం స్తదా.

*మహాత్ముడుగు ఆ ఋష్య శృంగుడు అంగ దేశం లో కాలిడగానే సర్వ ప్రపంచానికి సంతోషం కలిగించేలా వెంటనే వర్షం కురిసింది.

న’గరం’

*శీర్షిక: న’గరం’*


1. గరం చాయి పిలుస్తోంది

మనసు ఆపేస్తోంది

ఒ’కప్పు’డు రూపాయి

ఇప్పుడు 20 దేనికని.

2. సమాచార సంద్రంలో

అందరూ ఈదుతూ ఉంటారు

కానీ గమ్యం చేరేది కొందరే.

3. (చాదర్ ఘాట్, మూసారాం బాగ్ వంతెనలు)

వరదోస్తే మునుగుతాయని తెలుసు

తెలియనిది ఒక్కటే

ఎందుకలా కట్టారో...

4. లాడ్ బజార్ లో

లాడ్ (ప్రేమ) కరువైంది.

5. ‘భాగ్య’ నగరం

వచ్చినవారందరూ

వెతుకుతూనే ఉంటారు.

6. నగరం మధ్యలో

పండ్ల మార్కెట్ ఉండేది

ఇప్పుడు వీధికో 

పళ్ళ దవాఖానా ఉంది.

7. మూసీనది గతి

అధోగతి అనిపిస్తుంది, కానీ

మూసీ కలకలలాడితే

నగరం విలవిలలాడుతుంది.

8. ముత్యాల నగరమైనా

మురిపాల కోసం వచ్చాము

అదీ లేదనటం భావ్యమా?

9. బంగళాలు పెరిగాయి

వాహనాలు పెరిగాయి

పెరగనిదొక్కటే - మానవత్వం.

10. నగర బ్రతుకుబండికి

కరోనా పంచర్ చేసింది

ఈడ్చుకెళ్లక తప్పడంలేదు.

🌀🎼🌈🌹🙏🌹🌈🎼🌀


తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)*

జగజ్జననిఆలయం

 🛕జగజ్జననిఆలయం🛕 


_*అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపించే అద్భుతం*_ త్రిమూర్తులు సహా ముక్కోటి దేవతలందరినీ నడిపించే తల్లి జగజ్జనని. సకల చరాచర జగత్తును సృష్టించిన తల్లి జగజ్జనని. అలాంటి శక్తి స్వరూపిణిని కాళీ, దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాల్లో దర్శనం చేసుకుంటాం. కానీ జగజ్జనని రూపంలో ఆ తల్లిని మాత్రం చాలా తక్కువమంది దర్శించుకొని ఉంటారు. ఇలా జగజ్జనని రూపంలో ఆ తల్లి వెలసిన ఆలయాలు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నవి. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? ఆ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలలో శ్రీ జగజ్జనని ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయాలు ప్రపంచంలో రెండు ఉండగా అందులో ఒకటి హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరం లో ఉండగా, మరొక ఆలయం ఈ ప్రాంతంలో ఉందని చెబుతారు. ఇక మానస సరోవరంలో వెలసిన అమ్మవారు స్వయంభువు అని చెబుతారు. కానీ ఆ విగ్రహం ప్రస్తుతం శిధిలావస్తలో ఉందని చెబుతారు. ఇక ఈ ఆలయంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక కొత్త అనుభూతి వస్తుందని అంటారు. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం నంద్యాలకు చెందిన శివనాగపుల్లయ్య అనే వ్యక్తి భవానీ మాత భక్తుడు. అతను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండ భవానీ మాల ధరించేవాడు. అయితే 1983 వ సంవత్సరంలో అయన భవానీ దీక్షలో ఉన్నపుడు యాత్రలో భాగంగా అహోబిలానికి వెళ్లగా అక్కడ కొంతమంది యోగులని కలిసాడు. అప్పుడు వారి మధ్య ఆధ్యాత్మిక చర్చ జరుగగా జగజ్జనని ప్రస్తావన వచ్చినది. అందులో ఉన్న ఒక యోగి జగజ్జనని రూపం గురించి తెలియచేసి అతడికి ఆ అమ్మవారి రూపం ఉన్న ఒక చిత్ర పటాన్ని ఇవ్వగా అందులో ఉన్న అమ్మవారి దివ్య మంగలా రూపాన్ని చూసి ముగ్డుడై ఈ అమ్మవారి రూపాన్ని ఇప్పటివరకు చూడలేదే అని చాలా ఆవేదన చెందాడు. ఇలా అమ్మవారి ఆలయము ఒకే ప్రాంతంలో నిర్మించాడు. ఇక ఈ ఆలయ గర్భాలయంలో జగజ్జనని నల్లరాతి విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.🙏🔱


శ్రీ మాత్రే నమః...🙏🙏

వివేకానంద జయంతి

 శ్లోకం:☝️

*అనిత్య దృశ్యేషు వివిచ్య నిత్యం*

*తస్మిన్ సమాధత్త ఇహస్మలీలయా |*

*వివేక వైరాగ్య విశుద్ధ చిత్తమ్*

*యోఽసౌ వివేకీ తమహం నమామి ||*

   - వివేకానంద పంచకం - 1


స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనమందరం స్ఫూర్తిని పొందుదాం!🙏

సంక్రాంతి ముందు మాత్రమే

 గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం 


సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు 


హరిదాసు అంటె పరమాత్మతో సమానం 


శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి 


హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు 


నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు 


సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు 


ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. 


ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  


శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. 


హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. 


శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. 


అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.


హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.


హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి., మన సంస్కృతి ని కాపాడండి🙏🙏🙏🙏🙏

సేకరణ

రేగి పండ్లు ఎందుకు పోస్తారు🌷

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🔯🌷రేగి పండ్లు ఎందుకు పోస్తారు🌷🔯


భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలి ఆని పాతవస్తువులు భోగి మంటవేస్తారు ఆ బోగి నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుడి ముందు ఉంచుతారు ఇది సంప్రదాయం దాంతో పాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవస్తారాలు లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు , పిల్లలకు ఐదు సంవస్తారాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి  తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు పోస్తారు ఆ వయసుపిల్లలకు బ్రహ్మ రంద్రం పలుచగా ఉంటుంది రేఖి అరా కూడా పలచగా ఉంటుంది ఈ రేగి పండ్లుకి రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటుంది. అవి పోసిన సమయంలో రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లల తల పైన బ్రహ్మ రంద్రానికి శక్తిని ఇస్తుంది , మేధస్సుకి శక్తి వస్తుంది ఈ పండ్లు తల పైన నుండి పడటం వల్ల తలలోని మెదడు లోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు.. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం అలాగే చుట్టూ ఉండే అరా బలపడుతుంది..ఎటువంటి పరిస్థితులు అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లు నే పోస్తారు, అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది చుట్టు పక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది.రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.అందుకే రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.


ఇంకో కారణం భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు


రేగి పండ్లును బదరీఫలం అంటారు


సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు, అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.


మన దేశంలోనే కాకుండా తూర్పుదేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.


రేగిపండ్లు, బంతిపూల రెక్కలు (వీటికి వాయువు లో ఉండే క్రిములను నాశనము చేసే గుణం ఉంది) , చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటీతో పోయాలి..చివరిగా దిష్టి తీయాలి అలా పోసే టప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరిగా కర్పూరం తో పిల్లలకు దిష్టి తీయాలి..


పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణుని కి బోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృషుడి కి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు... 


 {12 సంవస్తారాలు లోపు పిల్లలకు బోగి పళ్ళు పోయవచ్చు)


🙏🙏🙏

ప్రెస్ కాన్ఫరెన్స్

 రాహుల్ పండగ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో :


పండగ అనేది ఇవాళ్టిది కాదు కొన్ని యుగాలనుండి వస్తోంది, అది మహాభారత కాలం నుండి మనం ఎంతో నేర్చుకోవాలి, అప్పట్లోనే హిందూ ముస్లిం లు అన్నదమ్ములాగా కలిసి మెలిసి పండగ చేసుకునేవారు!


ఓ విలేఖరికి అర్ధం కాలేదు బుర్ర గోక్కుంటూ : మహాభారతం లో ముస్లింసా? 🤔🤔


రాహుల్ : అందుకే మహాభారతం చదవాలి అనేది,

అందులో భీష్ముడు ఆవో ఉస్మాన్ భాయ్ అన్నది చదవలేదా?

🤭🤭🤭


విలేఖరికి పిచ్చెక్కి పోయింది 🤐, ఏమీ అర్ధం కాలా, చాలాసేపు జుట్టు పీక్కుని లేచి అప్పుడు చెప్పాడు :

నీయబ్బరే అది ఆవో ఉస్మాన్ భాయ్ కాదురా *ఆయుష్మాన్ భవ.*