2, మే 2022, సోమవారం

నేనొక శ్రామికుడిని

 "మేడే"...


నేనొక శ్రామికుడిని

వెలుగు నింపే దివిటీని


నేనొక కర్షకుడిని

పంట పండించే రైతుని


నేనొక కార్మికుడిని

ఉత్పాదక సామార్థ్యాన్ని


నేనొక శ్రమజీవిని

చెమట చిందించే మనిషిని


పని గంటలు ఎరుగని

మానవ యంత్రాన్ని..


చెమట చుక్కలు వెల్లువతో

సమాజానికి అంకితం చేస్తా

అలుపెరుగని యోధుడిగా

నిరంతరం యుద్దం చేస్తా.


గొడ్డలి చేసిన గాయాలెన్నో

పలుగు చేతిన వ్రణాలెన్నో

పనిలో పడిన బాధలెన్నో

తెగిపడిన అవయవాలెన్నో.


చిందే నా స్వేదంతో కట్టడాలు నిర్మించా...

చిమ్మచీకటి తరిమేందుకు

నా దేహం రగిలించా..

ప్రపంచానికి నేనొక సమిధనై కాలిపోతున్నా..



ఐనా! 

నేనంటే ఎందుకో అలుసు.


ఎందుకంటే నా పనికి విలువ కడతారే గాని

నా పనితనం విలువ కానరాక పోవడమే..


తాజ్ మహల్ కట్టినా

సాగర్ డ్యామ్ కట్టినా

రాళ్ళెత్తిన కూలీల మాట ఊసులేదు...

కేవలం కాసుల ఖర్చుల లెక్కలు తప్పా!.


పనిగంటలు ఎరుగని మానవ యంత్రాన్ని కావడమే నేనంటే అంత చులకనేమో!.


రాజ్యనికి వారధి నిర్మించినా

ఓటు వేసే సామాన్యులకు 

రాజ్యం ఇచ్చే పూజ్యం

"కూలీ బతుకులు".


మేము అన్నింటా ఉన్నాం

భద్రతా లేని మనుషులం

కార్మిక, కర్షక, రైతాంగం

వెలుగు చూడని జీవులం.


మనిషిలో మార్పు కోసం పోరాడుతున్నాం..


హక్కుల కోసం ఎర్రజెండా సాక్షిగా పిడికిలి బిగించి..


పోరాడితే పోయేది 

ఏమి లేదు 

బానిస సంకెళ్ళు తప్పా!

 

కష్ట జీవుల కోసం పుట్టిన రోజు "మేడే".


శుభాభినందనలు.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

రక్తదానం

 మాటామంతీ - 4 


నేనూ... రక్తదానం 

--------------- 


నా పేరు శ్రీధర్ చౌడారపు. వయసు యాభై మూడు సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగిగా (సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకునిగా) పనిచేస్తున్నాను. 


నేనిప్పటికి నలభై రెండు (42) సార్లు రక్తదానం చేశాను. రక్తదాన ఉద్యమంతో ముడిపెట్టుకుని, కార్యకర్తలుగా పని చేస్తున్నవారు వందలసార్లు ఇచ్చిన దానితో పోల్చుకుంటే నాదేమీ పెద్దసంఖ్య కాకపోవచ్చును. కానీ నా మట్టుకు ఒక సాధారణ వ్యక్తిగా ఆ సంఖ్య పెద్దదే, మీలో చాలా మందితో పోల్చుకుంటే. ఎందుకంటే మనలో చాలా మంది రక్తదానం చేయరు. కొంతమంది రక్తదానం అనే మాట అంటేనే భయపడుతుంటారు. అసలు ఒక్కసారి కూడా రక్తదానం చేయని వాళ్ళు కూడా నా పరిచయస్తులైన మీలో / మనలో ఎందరో ఉన్నారు.... అర్థరహితం అయిన భయంతో. 


నేను ఇంతగా రక్తదానం చేయటానికి ఒక కారణం ఉంది. 1986 వ సంవత్సరంలో నేను నిజామాబాదులో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ప్రమాదం జరిగి ఎడమకాలు మోకాలి వద్ద ఫ్రాక్చర్ అయ్యింది. నాందేడ్ (మహారాష్ట్ర) లోని శివాజీ పుత్లా వద్దకల 'వాడేకర్ హాస్పిటల్' లో సర్జరీ జరిగింది. అప్పట్లో అందరు స్పెషలిస్టులు ఉండే కార్పోరేట్ హాస్పిటల్‌లు లేవు. ఒక నర్సింగ్‌హోమ్ ఒక ఫిజీషియన్ లేదా సర్జన్ ఆధ్వర్యంలో నడిచేది. ఒకరిద్దరు స్పెషలిస్టులు (గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్లు ఉండేవారు. మిగతావాళ్ళను అనస్థటిస్ట్ (మత్తు డాక్టర్) తో సహా అవసరం పడినప్పుడు కన్సల్టెంట్ గా పిలిచేవారు. అలా పిలవబడిన 'రవీంద్ర ఝావర్' అనే ఔరంగాబాద్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. 


ఇక ఆ పుండు నయం కావాల్సి ఉంది. దానికై యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అందులో ఒక మెడిసిన్ నాకు సరిపడక, రియాక్షన్ అయి మెత్తం శరీరం అంతా విషపూరితం అయ్యింది. అరికాళ్ళలో, అరచేతులలో నీళ్ళు నిండిపోయాయి. ఆ చర్మాన్ని తొలగించి ఆ నీళ్ళు తీసేసారు. నోట్లోని, నాలుకపైని, పెదాలపైని చర్మం మురిగినట్లుగా మారితే తొలగించారు. కళ్ళల్లో, చెవుల్లో, ముక్కులో ఇన్ఫెక్షన్లు. రియాక్షన్ తగ్గించే మందులు ఎన్ని వేర్వేరువి ఇచ్చి, డాక్టర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోగా... రోజురోజుకూ పరిస్థితి విషమించి పోయింది. ఓ రోజంతా నేను స్పృహలో లేకుండా (కోమా‌ కావచ్చు) పోయానని మా వాళ్ళు చెప్పారు. అదే రోజున 'డాక్టర్ వాడేకర్'.... "మీరు మీ అబ్బాయి 'బాడీ'ని ఇంటికి తీసుకెళ్ళే ఏర్పాటు చేసుకోండి" అని చెప్పారట. అంటే నేను బతికే ఛాన్సులు పెద్దగా ఏమీ లేవు అని డాక్టరుగారు నిర్ధారణకు వచ్చేశారన్న మాట. 


ఆ మాటతో బెదిరిపోయిన మా కాక (చిన్నాన్న) డాక్టర్‌తో పెద్ద గొడవపడి "ఏమైనా చేయండి, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు....కానీ మా వాడిని బతికించే ప్రయత్నం చేయండి"... అని అంటే ఆఖరి ప్రయత్నంగా 'అశోక్ కుమార్ జాదవ్' అనే మరో డాక్టర్‌ను కన్సల్టెంట్ ఫిజీషియన్ గా పిలిపించారు. ఆ డాక్టర్ గారు నన్ను పరిశీలించి, నాకు వాడిన మందులను గమనించి.... తన / ఆఖరి ప్రయత్నంగా 'ఎఫ్కార్లిన్' అనే మందును వాడి రియాక్షన్ తో విషపూరితం అయిన నా శరీరాన్ని సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేశారు. 


అయితే ఆ మందులు పనిచేస్తున్నా కూడా, నా శరీరంలోని రక్తంలో దాని ప్రభావంతో మెరుగయ్యే లక్షణాలు అంతగా కనబడక పోవడంతో నాకు ఆరోగ్యవంతుని రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు. నా రక్తం 'బీ పాజిటివ్' గ్రూపుది కావడం, నాన్నది కూడా 'బీ పాజిటివ్' కావడంతో... ఒక యూనిట్ రక్తం నాన్న ఇచ్చాడు. ఇంకా మరో రెండు యూనిట్లు అవసరం అవడంతో బయట నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది. 


అప్పుడు స్వచ్ఛంద రక్తదానం పట్ల అవగాహన అంతగా లేకపోవడంతో, రక్తం కావాలి అంటే... తమ రోజూవారీ ఖర్చుల నిమిత్తం రక్తాన్ని అమ్ముకునే బీదవాళ్ళను (ముఖ్యంగా రిక్షావాలాలు) సంప్రదించాల్సి వచ్చింది (వాళ్ళ వివరాలు, అడ్రసులూ హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఉండేవి లెండి). అలా పిలిపిస్తే వచ్చిన ఇద్దరు రిక్షావాలాలు ఇచ్చిన రెండుయూనిట్ల రక్తం ఎక్కించిన పిదప... మందులు సమర్థవంతంగా పనిచేసి నా శరీరం బాగయింది. మరో ఇరవై, ఇరవైఐదు రోజుల్లో క్రమక్రమంగా నా శరీరం సాధారణ పరిస్థితికి వచ్చింది. 


ఈ రోజున నేను బతికి ఉన్నాను అంటే, అప్పుడు ఇతరులనుంచి / ఆరోగ్యవంతులనుంచి నాకు ఎక్కించిన రక్తమే అనే స్పృహ నాకు కలిగి, నేను కూడా అడపాదడపా‌ రక్తదాన శిబిరాలలో పాల్గొంటూ, బ్లడ్ ‌బ్యాంకుకు వెళుతూ... రక్తదానం చేయడం మొదలెట్టాను. కొన్నిసార్లు సంవత్సరానికి ( మూడునెలల వ్యవధితో) నాలుగు సార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇప్పటివరకు నలభై రెండు (42) సార్లు ఇవ్వడం జరిగింది. 


మనదేశంలో ఆరోగ్యవంతులు, రక్తదానానికి అనువైన శారీరక పరిస్థితులు ఉన్నవారు ఎందరో ఉన్నప్పటికీ సరియైన అవగాహన లేకపోవడం వలన, అనవసరమైన భయంతో, రక్తదానానికి జనం ముందుకు రావటం లేదు. ఒక్కసారి కూడా రక్తదానం చేయని వాళ్ళు మనలో / ఈ సమాజంలో 95% పైగా ఉన్నారని పక్కాగా చెప్పవచ్చు. 


రక్తదానం చేసేందుకు ఈ క్రింది అర్హతలు ఉంటే చాలు. 


ఆ) పద్దెనిమిది నుంచి అరవైఐదు సంవత్సరాల మధ్య వయసులోని వాళ్ళు

ఆ) రక్తంలో హిమోగ్లోబిన్.... 

*12.5 (గ్రాములు/ డెసీలీటర్) ఉన్న ఆడవాళ్ళు, 

*12 (గ్రాములు/ డెసీలీటర్) ఉన్న మగవాళ్ళు‌ 

ఇ) బరువు ..... 

*మగవారికి కనీసం 45 కేజీలు, 

*ఆడవారికి యాభై కేజీలు ఉన్నవాళ్ళు

ఈ) పల్స్ రేటు 50-100 (ఇర్రెగ్యులారిటీ లేకుండా) ఉన్నవాళ్ళు

ఉ) బ్లడ్‌ప్రెజర్ 50-100 (డయోస్టలిక్), 100-180 (సిస్టోలిక్ ) ఉన్నవాళ్ళు

ఊ) అంతకుముందు మూడు నెలలుగా మలేరియా, టైఫాయిడ్, జాండిస్ లాంటి ఇన్ఫెక్షన్ లేనివాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. 


అత్యధికంగా సంవత్సరానికి నాలుగుసార్లు (అంటే తడవతడవకీ మూడునెలల వ్యవధిలో) రక్తదానం చేయవచ్చు. 


రక్తదానానికి ముందుకొచ్చే వాళ్ళు ఎక్కువగా విద్యార్థులే. వివిధ కళాశాలల్లోని ఎన్. సి.సి‌ లేదా ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ లు వివిధ బ్లడ్ బ్యాంకులతో సంబంధాలు కలిగి ఉండి సామాజిక సేవలో భాగంగా వారి విద్యార్థులతో సంవత్సరానికి రెండు మూడుసార్లు, యాభై నుంచి వంద యూనిట్లు రక్తదానం చేయిస్తారు. అలాగే కొంతమంది సినిమా హీరోల/ రాజకీయనాయకుల అభిమానులు ఆ హీరో / నాయకుని పుట్టినరోజున రక్తదానం చేస్తారు. అలాగే ప్రభుత్వంలోని కొన్ని శాఖలు ఆయా శాఖల దినోత్సవాల సందర్భంగా తమ ఉద్యోగుల చేత కూడా రక్తదానం చేయిస్తాయి. ఇక లయన్స్‌ క్లబ్ లాంటి సంస్థలు సమాజంలోని వివిధ వర్గాల యందలి రక్తదాన అర్హులను గుర్తించి, వాళ్ళను సమీకరించి ప్రతినెలా కొన్ని కొన్ని పట్టణాల్లో ఈ శిబిరాలు నిర్వహించటం గమనించగలం. 


అయితే రక్తదాతల సంఖ్యలో సింహభాగం విద్యార్థులదే కావడం వలన... ఆ విద్యార్థులు సెలవుల్లో అందుబాటులో ఉండకపోవడం వల్ల వేసవిలో‌ రక్తదానం శిబిరాలు అంతగా ఉండవు. అందుకే ఈ కాలంలో రక్తం కొరత అధికంగా ఉంటుంది. హాస్పిటల్స్ అవసరానికి తగినంత రక్తం అందుబాటులో ఉండదు. 


అందుకే ప్రతి బ్లడ్‌‌బ్యాంకు వారు వేసవిలో రక్తదాన శిబిరాలకై విశ్వప్రయత్నాలు / విఫలప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీ వలన రక్తంలోని ప్లాస్మా, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు మొదలగు వివిధ కణాలను వేరుచేస్తున్నారు. అందువలన ఇప్పుడు ఒక యూనిట్ రక్తం నుంచి నలుగురు రోగుల అవసరాలు తీరుతున్నాయి. అయినా ఇంకా రక్తం కొరత ఎంతో ఉంది. 


మన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. అది శరీరపు కనీసం అవసరం కంటే అధికమే. దానిని అలాగే దాచుకుంటే మనకేమీ లాభం లేదు. మనం మూడు నెలలకు ఒకసారి ఒక యూనిట్ అంటే మూడువందల మిల్లీ లీటర్ల రక్తం ఇవ్వడం వలన మన శరీరానికేమీ ఢోకా లేదు. మనం ఇచ్చే రక్తం ప్రమాదాలు పాలైన వారికీ, అనారోగ్యంరీత్యా సర్జరీలు చేసుకుంటున్నవారికి రక్తం ఎక్కించబడి వారికి ప్రాణదానం చేస్తుంది. 


రక్తం అనేది కర్మగారాల్లో తయారయ్యేదికాదు. అందుకే సాటి మనుషులు / సమాజంలోని మనలాంటివాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తే మంచిది. అన్ని దానాలలోకెల్లా గొప్పది విద్యాదానం అంటారు. దాని సరసన కూచోబెట్టాల్సిన దానాలలో ఒకటి రక్తదానం. అందుకే అర్హులైన అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయాల్సింది. రండి... రక్తదానం చేయండి.


         .... శ్రీధర్ చౌడారపు (05.11.2020) /(02.05.2022)

చంపకమాల

 దూరము భారము తీరము తోరము పదాలతో


చంపకమాల


ఐచ్ఛికాంశ వర్ణన;


జయమును కోరి *దూరమ* ను చక్కగ నెంచుక


సాధనమ్ముకై


రయమున లేచి *భారము* ను లౌక్యముతో


పరుగెత్త సాగగన్


భయమును వీడి *తీరము* కు బాధ్యత తోడను


రోజు చేర


జయము వరించి *తోరము* గ జాప్యము లేకను


కొల్వు దక్కెనే


విద్యావాని (ప్రపంచ పుస్తక దినోత్సవం


సందర్భంగా)


క.


అర్థింతురె దీనముగా


నర్థన కనుకూలమైన నవ విద్యలకై


నిర్థారణ జేసి దయతొ


వ్యర్థులనక నొసగుతల్లి ప్రార్థన గనుచున్

అక్షయ తృతీయ

 _*🚩 అక్షయ తృతీయ🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 3 మే 2022 అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం  కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు  చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం


1. పరశురాముని జన్మదినం.


2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.


3. త్రేతాయుగం మొదలైన దినం.


4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.


5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.


6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.


7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.


8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.


9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.


అక్షయ తృతీయ నాడు , మనం  చేపట్టిన  ఏ  కార్య  ఫలమైనా , (అది  పుణ్యం కావచ్చు , లేదా  పాపం  కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే.  అందునా ,  ఆ రోజు  ఓ  కొత్త  కుండలో గానీ , కూజాలో గానీ ,  మంచి నీరు  పోసి , దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే ,  ఎన్ని  జన్మలలోనూ ,  మన  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. అతిధులకు , అభ్యాగతులకు ,  పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే ,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన  రోజు  రాదు. వస్త్రదానం వల్ల  తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు  స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు  సమర్పించుకుంటే ,  మన  ఉత్తర జన్మలలో ,  వాటికి  లోటు  రాదు. గొడుగులు , చెప్పులు ,  విసన కర్రల లాటివి  దానం  చేసుకోవచ్చు. ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం.


అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు.

అక్షయ తృతీయ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

            🌷 *శ్రీరామ*🌷                 

అక్షయ తృతీయ అనగా రోహిణి నక్షత్ర యుక్త వైశాఖ శుక్ల తదియ రోజున ఏ పని చేసినా పుణ్యం లేదా పాపం అది అక్షయం గా ఉంటుంది అనేది శాస్త్ర వచనం. ఇంకా అక్షయ తృతీయ గురించి విశేషాలు పురాణాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. 👇👇


అక్షయ తృతీయ రోజు చేయవలసిన పని :

పితృ దేవతా ప్రీత్యర్థం: *ఉద కుంభం దానం*(బిందె లేదా చెంబు)

నారాయణ ప్రీత్యర్థం:

*లక్ష్మి నారాయణ పూజ చేసి, విసనకర్ర, మామిడి పండ్లు,గొడుగు, చెప్పులు, వస్త్రం ఇంకా దక్షిణ*

అవకాశం ఉన్నవారు *స్వయంపాకం* కూడ కలిపి బ్రాహ్మణునకు 

ఇచ్చిన అశేష పుణ్యం లభించును..


పై వస్తువులు ఇచ్చిన వారికి మరణానంతరం యమ మార్గాన చేరే దారి చాలా దుర్గమమైనది ఐతే ఇది ఇచ్చిన వారికి మార్గ మధ్యంలో దాహం తీర్చే సాధనంగా పై దానం ఉపయోగపడును... 🙂 🙂 🙂..

వీలు కుదిరిన వారు చేసి ఉత్తమ ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి....


*జై శ్రీరామ్* 



 ఆధారం: *ధర్మ సింధు* *స్కంద పురాణం* *గరుడ పురాణం*

 పెళ్లికాక ముందు లవర్ పక్కన కూర్చొని చెరువులో రాళ్లేస్తూ మాట్లాడేవాడు పెళ్లి చేసుకున్నాక బియ్యంలో రాళ్లు ఏరుతూ వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు

వాడికి రాళ్లకి ఏంటో ఆ అవినాభావ సంబంధం  మళ్లీ వాడి దగ్గరికే 

తిరిగొచ్చేసాయ్.

😊😊😊😊😊😊😊😊

భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?

దేవుడు : పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాల్లని భార్యలుగా మీరు చేసుకున్నారు....

అది మీ ఖర్మ...

😊😊😊😊😊😊😊😊

Teacher:- ఓరేయి..Hospital..అంటే అర్దం...ఏమిటిరా.....

Student:- భూమి నుండి నరకానికి...వెళ్ళేటప్పుడు మద్యలో వచ్చే...Toll Plaza.సార్....

😊😊😊😊😊😊😊

బార్య : ఏమండీ ఫైర్ స్టేషన్లో మగవాళ్లు మాత్రమే పని చేస్తారు ఆడవాళ్లు ఎందుకు చేయరండి?

భర్త:  మీ ఆడవాళ్లుకు మంట పెట్టడమే తెలుసు ఆర్పడం తెలవదు కదే అందుకు..

😊😊😊😊😊😊😊😊😊

భార్యః’’ ఎక్కడికెళ్ళ్తున్నారు?’’

భర్తః ‘’ ఆత్మహత్య చేసుకోడానికి’’.

భార్యః ‘’ ఒక సంచీ కూడా పట్టుకెళ్ళకూడదూ?’’

భర్తః’’ అదెందుకు?’’

భార్యః ‘’ ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేప్పుడు ఒక కేజీ టమేటాలూ,అరకేజీ చింతపండూ తెస్తారని.’’

😊😊😊😊😊😊😊😊😊

టీచర్:,  పులికి,  మేకకు తేడా ఏంటి?

విద్యార్థి:,  మొదటిది క్రూర జంతువు,  రెండోది కూర  జంతువు

😊😊😊😊😊😊😊😊😊

టీచర్:  అరటిపండు గురించి రెండు వాక్యాలు చెప్పరా,,,, రవి

రవి:  ఒకటి,, తింటే బలపడతాం, రెండు తొక్కితే జారి పడతాం

😊😊😊😊😊😊😊😊😊

అమృతం తాగిన వాడిని " దేవుడు " అంటారు.

విషం తాగిన వాడిని " మహా దేవుడు " అంటారు.

విషం తాగి కూడా, అమృతం తాగినట్లు ఆనందం నటించే వాడినే " పతి దేవుడు " అంటారు..

😊😊😊😊😊😊😊😊😊

భర్త : ఏమిటే ఈ రోజు సాంబార్ లో రెండు రూపాయల కాయిన్లు వస్తున్నాయేంటి?

భార్య : మీరే కదండీ వారం రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు!

😊😊😊😊😊😊😊😊😊

 డాక్టరుః ‘’ ఆశ్చర్యంగా నీది, నీ భార్యదీ ఒక్టే బ్లడ్ గ్రూపు.’’

వ్యక్తిః ‘’ ఎక్పెట్ చేశా డాక్టర్, ఒకటా, రెండా—ఇరవై ఏళ్ళనుండి పీలుస్తూనే ఉందికదా నా రక్తం.

😊😊😊😊😊😊😊😊

పాప : నాన్న.. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా?

నాన్న : అవునమ్మా...

పాప : మరి వాళ్ళు వెల్లిపోవాలంటే..??

నాన్న : "మీ అమ్మ అరవాలి"..

😊😊😊😊😊😊😊

కాసేపు కరోనా భయాన్ని ప్రక్కన పెట్టి నవ్వుకోండి👆

సోరియాసిస్ వ్యాధి గురించి

 సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -


      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా  లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు  "సిద్మ కుష్టు"  దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "

వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 


             ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. ఈ సమస్యని నేను నయం చేయుటకు ఎంతో పరిశోధించి కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేశాను . వీటితో అత్యంత సులభముగా " సోరియాసిస్ " సమస్యను నిర్మూలించవచ్చు. మొదటి 2 నుంచి 3 నెలలలో మీకు మార్పు వస్తుంది . 6 నెలలపాటు ఆపకుండా వాడవలెను .  


       పైన చెప్పిన విధముగా ఒక వ్యక్తికి నేను చేసిన చికిత్స ఫలితాన్ని ఫొటో రూపంలో మీకు చూపిస్తాను. ఇది కేవలం 15 రోజుల్లొ వచ్చిన మార్పు మాత్రమే . మరికొన్ని రోజుల్లొ ఆ వ్యక్తి ఆ పరమేశ్వరుడి దయవలన సంపూర్ణముగా సమస్య నుంచి బయటపడతాడు . ఇది తధ్యం . 


          నేను చెప్పిన విధముగా ఔషధ సేవన చేస్తూ పథ్యం పాటించగలిగిన వారు మాత్రమే చికిత్స కొరకు నన్ను సంప్రదించండి. 


                     కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                          9885030034

నేటి జీవిత సత్యం.

 నేటి జీవిత సత్యం. 


మన జీవన మార్గంలో నడిచే దారి మంచిదే అయితే ....  భగవంతుడు మన జీవితాన్ని పూల బాట గా మారుస్తాడు . తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడం ఎంత గొప్పో ... అంతకంటే మనం మనశ్శాంతి గా తింటూ ఇంకొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి ఎదగడం ఇంకా గొప్పగా వుంటుంది .


 ఎవరికీ తల వంచనిది ఆత్మ గౌరవం , ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం , ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత . ఈ మూడు కలిసిన జీవితం ఆదర్శనీయం .


 కిరణానికి చీకటి లేదు , సిరిమువ్వకి మౌనం లేదు , చిరునవ్వుకి శత్రుత్వం లేదు , మంచి స్నేహానికి అంతం లేదు .


 మనిషిలో భక్తి పెరిగితే దేవుడి ని చూడాలనే కోరిక ఉంటుంది . మనిషిలో రాక్షసత్వం పెరిగితే దేవుడికే ఆ మనిషిని చూడాలన్న కోరిక ఉంటుంది . 


దుష్ట శిక్షణ... శిష్ట రక్షణ... కోసం ఆ భగవంతుడు ఏదో రూపంలో మనలోనే ఉంటాడు  అన్న సత్యాన్ని తెలుసుకున్న రోజు   తప్పులు చేయకుండా మంచి మార్గాన్ని ఎంచుకుంటారు మన మానవ జాతి . ఇదే జీవిత  సత్యాలు.🤝🤝🤝

 ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనేఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.


నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషినిరాశతో ఉసూరుమన్నాడు!


రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"


రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!


ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!


పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.


కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...


కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. 


*మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*

🌼🌼

మేడే

  "మేడే"...


నేనొక శ్రామికుడిని

వెలుగు నింపే దివిటీని


నేనొక కర్షకుడిని

పంట పండించే రైతుని


నేనొక కార్మికుడిని

ఉత్పాదక సామార్థ్యాన్ని


నేనొక శ్రమజీవిని

చెమట చిందించే మనిషిని


పని గంటలు ఎరుగని

మానవ యంత్రాన్ని..


చెమట చుక్కలు వెల్లువతో

సమాజానికి అంకితం చేస్తా

అలుపెరుగని యోధుడిగా

నిరంతరం యుద్దం చేస్తా.


గొడ్డలి చేసిన గాయాలెన్నో

పలుగు చేతిన వ్రణాలెన్నో

పనిలో పడిన బాధలెన్నో

తెగిపడిన అవయవాలెన్నో.


చిందే నా స్వేదంతో కట్టడాలు నిర్మించా...

చిమ్మచీకటి తరిమేందుకు

నా దేహం రగిలించా..

ప్రపంచానికి నేనొక సమిధనై కాలిపోతున్నా..



ఐనా! 

నేనంటే ఎందుకో అలుసు.


ఎందుకంటే నా పనికి విలువ కడతారే గాని

నా పనితనం విలువ కానరాక పోవడమే..


తాజ్ మహల్ కట్టినా

సాగర్ డ్యామ్ కట్టినా

రాళ్ళెత్తిన కూలీల మాట ఊసులేదు...

కేవలం కాసుల ఖర్చుల లెక్కలు తప్పా!.


పనిగంటలు ఎరుగని మానవ యంత్రాన్ని కావడమే నేనంటే అంత చులకనేమో!.


రాజ్యనికి వారధి నిర్మించినా

ఓటు వేసే సామాన్యులకు 

రాజ్యం ఇచ్చే పూజ్యం

"కూలీ బతుకులు".


మేము అన్నింటా ఉన్నాం

భద్రతా లేని మనుషులం

కార్మిక, కర్షక, రైతాంగం

వెలుగు చూడని జీవులం.


మనిషిలో మార్పు కోసం పోరాడుతున్నాం..


హక్కుల కోసం ఎర్రజెండా సాక్షిగా పిడికిలి బిగించి..


పోరాడితే పోయేది 

ఏమి లేదు 

బానిస సంకెళ్ళు తప్పా!

 

కష్ట జీవుల కోసం పుట్టిన రోజు "మేడే".


శుభాభినందనలు.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

అక్షయతృతీయ

 *మే నెల 3 వ తేదీ*

*మంగళ వారము* *అక్షయతృతీయ రోజున*

*బంగారం తప్పక కొనాలా?*

నిజమైన అక్షయము???

అక్షయతృతీయ 

అంటే ఏమిటి?వివరణ?

👇


👉ఈ రోజునే 

సింహాచల 

వరాహ నరసింహ 

స్వామి వారి  చందనోత్సవం.


👉అదే రోజున

పరశురామ  జయంతి .


మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.


అక్షయ తృతీయ ప్రాముఖ్యత


1. పరశురాముని 

     జన్మదినం


2. పవిత్ర గంగా నది

     భూమిని తాకిన

      పర్వదినం


3. త్రేతాయుగం 

    మొదలైన దినం


4. శ్రీకృష్ణుడు 

    తన బాల్యమిత్రుడైన

     కుచేలుని కలుసుకొన్న

     దినం


5. వ్యాస మహర్షి 

     “మహా భారతము”ను,

      వినాయకుని

      సహాయముతో,

      వ్రాయడం

      మొదలుపెట్టిన దినం


6. సూర్య భగవానుడు

     అజ్ఞాతవాసములో

     వున్న పాండవులకు

      *అక్షయ పాత్ర*

      ఇచ్చిన దినం


7. శివుని ప్రార్థించి

     కుబేరుడు

     శ్రీమహాలక్ష్మితో 

     సమస్త సంపదలకు

     సంరక్షకునిగా

     నియమింపబడిన దినం


8. ఆదిశంకరులు

     “కనకధారాస్తవం” ను

     చెప్పిన దినం


9. అన్నపూర్ణా దేవి 

     తన అవతారాన్ని

      స్వీకరించిన దినం


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు

       దుశ్శాసనుని

       బారినుండి 

       కాపాడిన దినం.


*అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?*


అక్షయ తృతీయ అంటేనే

నేటికాలంలో 

బంగారం, వెండి లేదా

ఇతర ఏదేని విలువైన

వస్తువులు కొనడం 

అనేది ప్రచారంలో ఉంది.

ఈ రోజున కొన్నది 

అక్షయం అవుతుందని

చెప్పిన వ్యాపార ప్రచారాన్ని

వాస్తవంగా నమ్మి వాటిని

కొనుగోలు చేయడం

ఆనవాయితీగా మారింది.


అసలు అటువంటివి

కొనాలని అనుకుని 

డబ్బు లేకున్నా 

అప్పు చేసో, 

తప్పు చేసో కొంటే, 

కొన్న బంగారం అక్షయం

అవడం అటుంచి 

చేసిన అప్పులు, తప్పులు

తత్సంబంధ పాపాలు

అక్షయం అవుతాయని

శాస్త్రాలు వివరిస్తున్నాయి.


*అసలు ఈ రోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు*


👉ఇది కేవలం 

వ్యాపార జిమ్మిక్ మాత్రమే.


అక్షయ తృతీయ నాడు,

మనం  చేపట్టిన  

ఏ  కార్య  ఫలమైనా, 

[ అది  పుణ్యం కావచ్చు;

లేదా  పాపం  కావచ్చు.]

అక్షయంగా,  నిరంతరం, 

జన్మలతో  సంబంధం

లేకుండా,  మన  వెంట  వస్తూనే ఉంటుంది. 


పుణ్య  కర్మలన్నీ

 విహితమైనవే.  


అందునా,  ఆ రోజు  

ఓ  కొత్త  కుండలో గానీ,

కూజాలో గానీ,  మంచి నీరు  పోసి,దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన జీవుడికి    

దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు.


అతిధులకు,

అభ్యాగతులకు, 

పెరుగన్నంతో  కూడిన 

భోజనం  సమర్పిస్తే,  

ఏ  రోజూ  ఆకలితో  

మనం అలమటించవలసిన

రోజు  రాదు. 


👉వస్త్రదానం వల్ల 

తదనుగుణ 

ఫలితం లభిస్తుంది.


👉అర్హులకు  స్వయంపాకం,

దక్షిణ, తాంబూలాదులు   

సమర్పించుకుంటే,  

మన  ఉత్తర జన్మలలో, 

వాటికి  లోటు  రాదు.


👉గొడుగులు, 

👉చెప్పులు, 

👉విసన కర్రల లాటివి  

దానం  చేసుకోవచ్చు.


ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం. 


ఓ  సారి  పరిశీలిస్తే,

*భాగవతం* 

ప్రధమ స్కంధం ప్రకారం,  

పరీక్షిన్మహా రాజు  

కలి పురుషుడికి  

ఐదు  నివాస స్థానాలను 

కేటాయించాడు.  

అవి: 👇


1)జూదం,  

2)మద్య పానం, 

3)స్త్రీలు, 

4)ప్రాణి వధ,  

5)బంగారం.  


వీటితో పాటు 

కలి కి  లభించినవి 


👉 ఇంకో  ఐదు*👈


1)అసత్యం,

2)గర్వం, 

3)కామం, 

4)హింస, 

5)వైరం.  


జాగ్రత్తగా  పరిశీలిస్తే,  

ఆ పైన  ఉన్న  ఐదిటికీ  

ఇవి  అనుషంగికాలు.


ఆ  పై  ఐదిటినీ  

ఇవి  నీడలా  

వెన్నంటే  ఉంటాయి.


అక్షయ తృతీయ  రోజు 

ఎవరైనా,  

ఈ  ఐదిటిలో  

దేని  జోలికి  వెళ్ళినా,  

కలి పురుషుడి 

దుష్ప్రభావం

అక్షయంగా 

వెంటాడుతూనే  ఉంటుంది.

*గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు 9393569333*

గజానాం మన్దబుధ్ధిశ్చ

 బ్రాహ్మణానాం అనేకత్వం

సర్పాణాం అతి నిద్రత

గజానాం మంద బుద్ధిశ్చ

త్రిభిర్ లోకోప కారిణః!! (లోకోపకారక:)


*గజానాం మన్దబుధ్ధిశ్చ-*

ఏనుగులకు బుధ్ధి (ఆలోచించ గలిగే జ్ఞానం) తక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమిమీద సంచరించే జంతువుల్లోకెల్లా అమితమైన బల సంపద ఏనుగుల సొంతం కానీ సాధారణంగా గోడలనుకూడా తోసుకుని వెళ్ళే శక్తి ఉన్నాకూడా ఒక ఇంటిముందర గేటు మూయబడి ఉంటే అక్కడే నిలబడిచూస్తూ ఉంటుంది. 

అదే బుద్ధిమాన్ద్యం లేకపోతే ఏనుగును ఆపడం ఎవరితరం?….


*సర్పాణామతినిద్రతః-*

పాములు వాటి జీవితకాలంలో సగం పైగా కేవలం నిద్రలోనే గడిపేస్తాయిట, ఆసమయంలో వాటికి వాయువే ఆధారం,

ఒకవేళ ఈ గుణం (అతినిద్ర) వాటికి లేదనుకుందాం. ఇక పరిస్థితి సర్పలోకంలో మనం బ్రతుకుతున్నట్టే ఉంటుంది,

ప్రమాదంకూడా!!?


*బ్రాహ్మణాణామనేకత్వం:-*

విశ్వానికి జ్ఞానం అందింది అంటే అది కేవలం తపస్సంపన్నులయిన, భవిష్యద్ద్రష్టలైన మహర్షుల వలనే, అటువంటి బ్రహ్మజ్ఞానులు

(బ్రహ్మజ్ఞానీ భవేద్బ్రాహ్మణః)

అనేకరకములైన బ్రాహ్మణాలను

(పరాశరస్మృతి, శౌనకస్మృతి…) వారివారి దివ్యాను (భూతితో) భవంతో ప్రతిపాదించారు. అనేక రకములైన ఆ జ్ఞానభాణ్డముల వలనేకదా ఈనాటికీ-ఏనాటికైనా తరతరాలుగా జ్ఞానాన్ని పొందుతున్నాము….

ఇవి లోకోపకారములే కదా!!? 🙏

(త్రిభిర్లోకోపకారక:)

మనం చూసే దృక్పథం మార్పు కానీ… ఏవి వేటికి ఉండాలో వాటికి అవి ఉన్నవి!! 


ఇక్కడ  బ్రాహ్మణాణామనేకత్వం అనే పదబంధంలో బ్రాహ్మణులు అనే పదం కులానికి సంబంధించినది కాదు అనీ....జ్ఞాన సంపన్నులయిన మహర్షుల రచనలు బ్రాహ్మణములు అనీ ఈ వ్యాఖ్యని అర్థం చేసుకోవాలి.

శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ.!!*

 *!! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ.!!*                                                >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                         *31.కనకాంగద కేయూర కమని య భుజాన్వితా.........*                                                                            ఇది పదహారు అక్షరములనామము ఈ నామముతో మనముపరమాత్మ ను భక్తితో నమస్కరించేటప్పుడు.                                                                     *ఓం.కనకాంగద కేయూర కమని య భుజాన్వితా యై నమః.*                                                                                                                                               అని పలుకవలెను.

                                                              *కనకము =  బంగారము.                        అంగదము = భుజమున.                                                                  కేయూర = భుజముపైధరించు ఆ భరణము,భుజకీర్తి.                                                                కమనీయ = కనులకుఆనందము కలిగించు విధముగా.                                                భుజాన్వితా = భుజములపైధరి చి యున్నది*......                                

                                                                          

అంగదముఅంటే భుజమునధరించే అభరణము. కేయూరము భుజము పైన  అంటేచేతిమొదలునుండిధరిం చే అభరణము భుజకీర్తి.                                                              అంగజము కేయూరము రెండూఒకే అర్దము వస్తుంది.చేతికి ధరించేఆభ రణాలుఅనిఆతల్లిచేతికిముత్యాలు రత్నాలు,పొదగబడినఅద్భుతమైన కాంతులతోప్రకాశిస్తున్నమణికట్టు, మొచేయి, భుజములమీద ధరించు అభరణములచే వేళ్లు ఉంగరాలచే ప్రకాశిస్తూయున్నది.                                                       


మెడ ,బహువులు,కంఠము మిధున రాశి చిహ్నములు.                                                                                          ఈ రాశి ద్విస్వభావ రాశి ద్వందము గా కనపడుచున్న సృష్టి రహస్యము లు,ఈరాశియందుసంకేతింపబడినవి.                                                                                                   ముందు,తెలుపబడిన,నామములలోగల,మెడ,మంగళసూత్రములు, ఈనామమున,అంగద,కేయూరము లుతెలుపబడుటలోద్వంద్వముకలిగి,అధిష్టించ బడిన సమన్వయము కలిగిన శ్రీ లలితా దేవిగా అమ్మను అవగాహన చేసుకొనవలెను.                                                              శ్రీలలితాదేవీసహస్రనామములయం దు,ద్వంద్వములు, పరస్పర విరుద్ధ ములైన,విషయములయందు,ఏకత్వముప్రతిపాదింపబడినదిఅట్టిఏకత్వమునందు,ద్వందములు,దర్శించుట,మొదలవుతుంది.ఈ నామ ము,ఐశ్వర్యము,మరియూ,జీవరక్షణకు,సంకేతార్థము..                                   

                                                               *శివశక్తిరూపాయనమశ్శివాయ.*        .                                       *ఓం. ఐం. హ్రీం. శ్రీం శ్రీమాత్రేన మః.*                                        (శక్తిఆరాధనయేచక్రఉపాసన.)             .      *సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                                                                      *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*

జీవిత సారం.

 జీవిత సారం.. నిస్సారమేనా// అంతర్మథనం

...................................

జీవితాన్ని పండించుకోవడం లోనే సారం.. నిస్సారం ఉందంటారు పెద్దలు. తృప్తి కలిగి ఉండటమే సారవంతమైన జీవితమని జ్ఞానులు చెబుతారు. స్వయం కృషి మాత్రమే చాలంటారు లౌకిక వాదులు. ఇందులో సత్యం ఏదనేది ఎవరూ ఇతమిద్ధంగా  చెప్పరు. తెలిసిన వాళ్ళు పెదవి విప్పరు. తెలియని వాళ్ళు తమకు తోచినదే సూక్తుల రూపంలో ఊదర గొడతారు. వీళ్లది ఆచరణ లేని వాదన.. తర్కం. అందుకే చెట్టుకు ఒకరు, పుట్టకు ఒక్కరూ స్వీయ బోధకు లు వెలుస్తుంటారు. జనం మోస పోతూనే ఉంటారు.

 

జీవితం అంటే జీవించిన కాలం. కాలం దైవాధీనం. అంటే..కాలానికి మనిషి బద్ధుడై ఉండాలి. మన సుకృత, దుష్కృతులను బట్టే జీవిక సాగుతుంది. చివరకు నడిచేది, నడిపించేది, సాధించేది, సాధించ బడేది అంతా సంచిత కర్మల ప్రకారమే జరుగుతుంది. భగవానుడి సంకల్పమే..మన సంకల్పంగా మారి..మన ఉన్నతికి కారణ మవుతుంది. అది మన గొప్పతనంగా అన్వ యించుకుంటే..మన పతనాన్ని కూడా మన సంకల్ప కారణంగానే అన్వయించు కో వాల్సి వస్తుంది. కాబట్టి..జీవి పరిమిత స్వాతంత్రం కలిగిన వాడు మాత్రమేనని, సర్వ స్వతంత్రుడు అయిన దైవ సంకల్పమే ఎప్పటికీ నెరవేరుతుందని, దానిని కష్టమైనా ఇష్టంగానే మనిషి స్వీకరించాలని మన స్ఫురణకు రావాలి. మన అనుభవం ఎవరికీ కొరగాక పోవచ్చు. ఎవరి అనుభవం నుంచి వారే పాఠాలు నేర్చుకుంటారు. ఎవరున్నా లేకున్నా, చివరికి నువ్వు ఉన్నా లేకున్నా..ప్రపంచం ఆగదు. ఇదొక Never ending story. You are one of the spectator. నువ్వొక సాక్షి మాత్రమే. నీకు సాక్షీభూతుడు ఆ పరంధాముడే. హరి ఓం/ ఆదూరి వేంకటేశ్వర రావు🙏

శంకర జయంతి ప్రత్యేకం - 2

 ॐ       శంకర జయంతి ప్రత్యేకం - 2 

    ( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 

    


శంకరుల అవతారం 


1. ఆవశ్యకత 


    శతాబ్దాల క్రితంనాటి దేశ పరిస్థితులు గమనిస్తే, అనేక సమస్యలతోపాటు వివిధ దేవతారాధనలమధ్య సమన్వయం లోపించడం వంటి సంకుచిత భావాలు తెలుస్తాయి. 

    ఆ సమయంలో పరమేశ్వరుడు ఆదిశంకరులుగా అవతరించి దేశపరిస్థితిని సరిదిద్దారు. 

    అయితే, ఆ కాలంలోని పరిస్థితులు ఇప్పుడు లేవు కదా! అని, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా మరొక విధానం రావాలనే వాదన కొంతమంది చెయ్యొచ్చు. 

    కానీ ఏ అవతార విశేషాలైనా, అవి, అన్ని కాలాలలోనూ ఉపయోగపడేవే! 

    ఉదాహరణకి 

* శ్రీమద్వాల్మీకి రామాయణ కథ భూమిమీద పర్వతాలూ, నదులూ ఉన్నంతవరకూ నడుస్తుందని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వాల్మీకిమహర్షితో చెప్పి వ్రాయించాడు. అది కథాభాగంగా ఉన్న వేదవివరణ కనుక. 

* ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు భగవద్గీత ఉపదేశించాడు.అది ఆ కాలంలోని కొంతమందికే కాక, ఏ కాలంలోనైనా తెలిసికొని, సాధనలో గమ్యాన్ని చేరడానికి. అది వేదాంతమైన ఉపనిషత్సారం కాబట్టి. 

    అదే విధంగా అద్వైత సిద్ధాన్తాన్నీ, స్మార్త సంప్రదాయాన్నీ, సులువుగా ఆచరించే ఆరాధనా విధానాన్నీ ఆదిశంకరులు అందించారు. అది వేదప్రామాణికం. 

      వేదం సార్వకాలీనం కదా! 


    త్రేతాయుగంనాటి మానవరూపంలో  శ్రీరాముని ధర్మాచరణ, 

    ద్వాపరంనాటి శ్రీకృష్ణుని ప్రకటిత దైవశక్తితో చేసిన బోధ అన్నికాలాలకీ అనుసరణీయం కదా! 

    అట్లే, జగద్గురువులైన ఆదిశంకరుల అవతార లక్ష్యం - బోధనా విధానమూ ఎప్పటికీ అనుసరించదగినదే! విశేషించి కలియుగంలో అత్యంత ఆవశ్యకం. 

                                        కొనసాగింపు ....  


                          =x=x=x= 


    — రామాయణం శర్మగా పిలువబడే 

      బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

         భద్రాచలం