29, ఆగస్టు 2024, గురువారం

డెంగ్యూ జ్వరం

 👉 డెంగ్యూ జ్వరం విస్తరిస్తోంది.  కొబ్బరి నూనెను మీ మోకాళ్ల నుండి మీ కాలి వరకు రాయండి.  ఇది ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది.  👍🏻డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు.    ఎవరైనా డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి.  ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్‌గా మారతాయి మరియు ప్లేట్‌లెట్స్ వెంటనే పెరుగుతాయి.    ఈ సందేశాన్ని అందరికీ పంపవలసిందిగా వినయపూర్వకమైన మనవి.   డెంగ్యూ వ్యాధిని 48 గంటల్లో నిర్మూలించవచ్చు   సామర్థ్యం   మందు  దయచేసి ఈ సందేశాన్ని పంపండి   ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంపండి:-   ఎవరైనా డెంగ్యూ లేదా సాధారణ జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే, హోమియోపతి ఔషధం ఉంది.   యుపటోరియం పర్ఫ్యూయం 200   లిక్విడ్ డైల్యూషన్ హోమియోపతి ఔషధం.   ప్రతి 2-2 గంటలకు సాదా నీటిలో 3 లేదా 4 చుక్కలు వేసి 2 రోజులు మాత్రమే త్రాగాలి.   మీరు మంచి పనులు చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ పంపండి 🙏

Panchaag


 

మహాభారత" సారాంశం...*

 *🕉️లక్షల శ్లోకాలు గల*

*"మహాభారత" సారాంశం...*

*తొమ్మిది వాక్యాలలో..🕉️🙏*




*🕉️🙏 ఆణిముత్యాలు వంటి "ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి".🕉️🙏*


*🕉️🙏1. మీ పిల్లల 'అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు' తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు. 🕉️🙏*


*🕉️🙏ఉదా "కౌరవులు."🕉️🙏*


*🕉️🙏2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని 'అధర్మం' కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.🕉️🙏*


*🕉️🙏ఉదా: "కర్ణుడు" 🕉️🙏*


*🕉️🙏3. యోగ్యత తెలుసుకోకుండా 'పుత్ర వాత్సల్యం' తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా:- "అశ్వత్థామ".🕉️🙏*


*🕉️🙏4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ 'నిర్వీర్యుడై' బ్రతకవలసి వస్తుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా :-" భీష్ముడు."🕉️🙏*


*🕉️🙏5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  'దురహంకారం' తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా :-"దుర్యోధనుడు "🕉️🙏*


*🕉️🙏6."స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది".🕉️🙏*


*🕉️🙏ఉదా: "ధృతరాష్ట్రుడు." 🕉️🙏*


*🕉️🙏7. తెలివితేటలకి 'ధర్మం, సుజ్ఞానం' తోడైతే విజయం తప్పక లభిస్తుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా: "అర్జునుడు".🕉️🙏*


*🕉️🙏8. 'మోసం,కపటం,' జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 🕉️🙏*


*🕉️🙏ఉదా: "శకుని."🕉️🙏*


*🕉️🙏9. నీవు 'నైతిక విలువలు' పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.🕉️🙏*


*🕉️🙏ఉదా : "యుధిష్ఠిరుడు."🕉️🙏*




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

పూజా విధానం

 🔔 *పూజా విధానం* 🔔


షోడశోపచార పూజ :

పూజలు ఎన్నిచేసినా అన్నిటికీ పునాది వంటిది షోడశోపచార పూజ. 16 రకాల సేవలు మనం దేవతలకు అర్పిస్తున్నాం గనుక, దీని పేరు షోడశోపచార పూజ. దేవత మన ఎదురుగుండా ప్రత్యక్షంగా వుండదు. మరి మనం ఉపచారాలు ఎలా చేస్తాము?


పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు

1.ఆవాహనం,2.ధ్యానం, 3.ఆసనం, 4.పాద్యం, 5.అర్ఘ్యం,

6.స్నానం-అభిషేకం,7.వస్త్రం, 8.యజ్ఞోపవీతం, 9.గంధం,

10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం, 13.నైవేద్యం, 14.తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం


1. ఆవాహనం: భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము.


2. ధ్యానం: భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. 


3. ఆసనం: రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం.


4. పాద్యం: పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు.


5. అర్ఘ్యం: చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అందించడాన్ని అర్ఘ్యం అంటారు.


6. అభిషేకం: స్నానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం (తేనె, ఆవు పాలు, ఆవు నెయ్య, పెరుగు, పంచదార) స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏడు పదార్ధాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు.


7. వస్త్రం: అభిషేకం తరువాత దేవునికి సమర్పించే వస్త్రాలు


8. యజ్ఞోపవీతం: యజ్ఞోపవీతం సమర్పించడం.


9. గంధం: దేవునికి గంధం, అక్షతలు మరియు పుష్పాలు సమర్పించడం.


10. అధాంగ పూజ: దేవుని అన్ని అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అధాంగ పూజ అంటారు.


11. ధూపం: అగరవత్తులు మరియు ధూపం సమర్పించడం.


12. దీపం: దీపాన్ని వెలిగించి దేవుని ముందువుంచడము


13. నైవేద్యం: భగవంతునికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు.


14. తాంబూలం: భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి, తాంబూలం సమర్పించడం.


15. నీరాజనం: దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు 


16. మంత్రపుష్పం: మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు.


ఇన్ని సేవలూ పూర్తి అయ్యాక, చేసిన పూజలో గాని, చదివిన మంత్రాలలో గాని తప్పులున్న మన్నించమని, ఉచ్చారణ దోషాలున్నా, భక్తి లో ఎటువంటి లోపము ఉండదని అపరాధ క్షమాపణ చెప్పుకుని “పునరాగమనాయచ” అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ సాగనంపుతారు. ఇవి మనం నిత్యం దేవునికి సమర్పించే షోడశోపచార సేవలు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

శ్రీమద్రామాయణము

 శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

తొమ్మిదవ సర్గ. (9)


తరువాత రాక్షసవీరులైన నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు,

సుప్తఘ్నడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, దుర్ధర్షుడు,రశ్మికేతువు, రావణుని కుమారుడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు,వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, నికుంభుడు, దుర్ముఖుడు అనే పేరు గల రాక్షస వీరులు రావణునితో తమ తమ శౌర్యప్రతాపాలను ప్రదర్శిస్తూ, వెంటనే హనుమంతుని చంపివేద్దాము అని ప్రతిజ్ఞలు చేసారు. రావణుని మెప్పు సంపాదించడం కోసరం రాక్షస వీరులుచెప్పిన మాటలను రావణుని తమ్ముడు విభీషణుడు శ్రద్ధగా విన్నాడు. వారందరినీ శాంతింపజేసి వారి వారి స్థానములలోకూర్చోపెట్టాడు. తరువాత విభీషణుడు లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. “ఏదైనా ఒక కార్యమును సాధించాలంటే సామ, దాన, భేదో పాయములను ముందు ప్రయోగించాలి. అవి సఫలము కానప్పుడు దండోపాయమును ప్రయోగించాలి అని తెలివికలవాళ్లు చెబుతారు. శత్రువు ఏమరిపాటుగా ఉన్నప్పుడు, ఇతర రాజులచేత ఓడింపబడినప్పుడు, వారికి దైవము అనుకూలంగా లేనప్పుడూ, శత్రువును మన పరాక్రమము ఉపయోగించి లొంగదీసుకోవచ్చును. ప్రస్తుతము మన శత్రువు రాముడు, మహా పరాక్రమవంతుడు. ఏ మాత్రం ఏమరిపాటు లేని వాడు. కోపమును జయించిన వాడు. ఎటువంటి క్లిష్టసమయములోనైనా సరైన నిర్ణయములు తీసుకోగల సమర్ధుడు. అటువంటి మహా వీరుడిని మీరంతా ఎలా ఎదుర్కోగలము అని అనుకుంటున్నారు. ఒక వానరము హనుమంతుడు అనే పేరుకలవాడు, సముద్రమము దాటివచ్చి, సీతను చూచి, లంకను దహించి వెళ్ళాడు అంటే నమ్మగలరా! కనీసం ఊహాంచగలరా! మీరంతా ఇప్పటిదాకా మీ మీ పరాక్రమములు గురించి చెప్పుకొన్నారు. మరి శత్రువుల బల పరాక్రమముల గురించి ఆలోచించారా! ఇంక అసలు విషయానికి వద్దాము. ఈ రాక్షస రాజు రావణుడు, జనస్థానములో ఉన్న రాముని భార్య సీతను, రాముడు ఇంటలేని సమయమున అపహరించి తెచ్చాడు. ఎందుకు? రాముడు రావణునికి ఏమైనా అపకారముచేసాడా! జనస్తానములో ఉన్న ఖరుడు ఏమి చేసాడో విచారించారా! ఖరుడు తన పరిధిని దాటి, మితిమీరి ప్రవర్తించబట్టే రాముడు ఖరుని దండించాడు. రాముడు తన ప్రాణములను, తనవారి ప్రాణములను రక్షించుకోడానికి ఖరుని చంపాడు. తప్పు మన దగ్గర పెట్టుకొని రాముని అనడంలో ఏమి ప్రయోజనము. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించి యుద్ధమును నివారించడమే ఉత్తమము. మనము యుద్ధమును కొని తెచ్చుకున్నాము. దానికి నివారణ చేయడం మంచిది. మనము రామునితో అకారణంగా వైరము పెట్టుకున్నాము. రాముడు సముద్రమును దాటి లంకకు వచ్చి, రాక్షసులను చించి చెండాడక ముందే సీతను రామునికి అర్పించి ఆ వైరమును మాన్పుకుందాము. అపారమైన వానర సేన సముద్రమును దాటి లంకను ముట్టడించకముందే సీతను రాముని వద్దకు పంపుదాము. అలా జరగని ఎడల, లంక సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే

హనుమంతుడు లంకను దహించి అపార నష్టం కలుగచేసాడు.

ఓ రావణా! నేను నీకు మంత్రినే కాదు. తమ్ముడను. బంధువును. అందుచేత ఇంతదాకా చెబుతున్నాను. నీ మెప్పు కోసం మాటలాడటం నాకు చేత కాదు. నీకు మంచి జరిగే మాటలు

చెబుతున్నాను. నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. రాముడు తన వాడి అయిన బాణములను లంక మీదికి సంధించకముందే, సీతను రామునికి ఇచ్చివేయి. రాముని మీద నీకు ఉన్న కోపాన్ని విడిచిపెట్టు. లంక సుఖము కోరి యుద్దము నివారించు. రాముని వద్దకు సీతను పంపితే మనమందరమూ భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలము.” అని పలికి విభీషణుడు మౌనంగా ఉన్నాడు. అప్పటిదాకా రాక్షసవీరులు పలికిన వీరోచిత ప్రగల్భాలూ, వాటికి విభిన్నంగా ఉన్న విభీషణుని మాటలు విన్న రావణుడు అందరినీ పంపివేసి మౌనంగా తన అంతఃపురమునకు వెళ్లిపోయాడు..


శ్రీమద్రామాయణము

యుద్ధకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

ప్రపంచ తెలుగు మహాసభల

 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - దేశ భాషలందు తెలుగు లెస్స, "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స

—శ్రీ కృష్ణదేవ రాయలు శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు ఈ పద్యంలో ప్రముఖవాక్యమైన దేశభాషలందు తెలుగు లెస్స వాక్యాన్ని ఉటంకించారు. వల్లభరాయలు క్రీడాభిరామమనే వీథి నాటకాన్ని రచిస్తూ ప్రస్తావనలోని 37వ పద్యంగా రచించిన జనని సంస్కృతంబులో ఈ వాక్యం ప్రస్తావనకు వస్తుంది. ఆ పద్యం ఇది:


జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశ భాషలందు తెలుగు లెస్స

జగతి దల్లికంటె సౌభాగ్య సంపద

మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?

—సేకరణ.... అడ్మిన్ కొల్లూరు సతీష్ శర్మ

💐అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు🙏

అశోక చక్రవర్తి

 మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??



ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 

మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 


# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 

" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.


 # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 


# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 


# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.

ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 


# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 


# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది

భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 


# వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 


# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 


# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 


# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* "  జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 


లేదా ......

*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 


ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 

తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??


# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 

*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 


*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 

చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 

అలెగ్జాండర్ 

" *వెనుదిరగవలసి వచ్చింది* ".


# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 




*వర్ధిల్లాలి భారతి యశస్సు*

*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*


 *భారత్ మాతాకీ జై* 🇮🇳

✊✊✊✊✊✊

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 25*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*𝕝𝕝 శార్ధూలము𝕝𝕝* 


  *నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని*

  *క్షేపం బబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా*

  *శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ*

   *జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!!!!* 


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 25*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీచెంత నాకు భిక్షాన్నమైనా చాలును... నిధులు కలిగినా సరే నేను రాజాధముల సేవ చేయనోపను... సంసారమను ఆశాపాశాములందు నన్ను బంధింపక నీ బంటుగా చేర్చుకొని రక్షించు ప్రభో!*


✍️🌹💐🌷🙏

*శ్రీ చండిక దుర్గ పరమేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 423*


⚜ *కర్నాటక  :  కుంభాసి - ఉడిపి* 


⚜ *శ్రీ చండిక దుర్గ పరమేశ్వరి ఆలయం* 



💠 కర్నాటకలోని కుందపురాలో ఉన్న కుంభాశి దుర్గ దేవాలయం పరశురామ క్షేత్రం, పరశురాముడు స్థాపించిన ఏడు దేవాలయాలలో ఒకటి.  

ఈ క్షేత్రాన్ని ఆదిశక్తి మహామాయ శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయం అని కూడా అంటారు.



💠 ఇక్కడ కొలువై ఉన్న మాతృమూర్తి శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి, సింహం వెనుక కూర్చొని, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో చక్రం, అభయ మరియు వరద హస్తాలతో కొలువై ఉన్నారు.


🔆 *దేవాలయం చరిత్ర*🔆


💠 శ్రీ దేవి భక్తులు, శ్రీమతి అనిత మరియు శ్రీయుత దేవరాయ మంజునాథ వాటాదారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 

దేవరాయ మంజునాథ్  కుందాపురలో ఇల్లు కట్టుకున్నారు.  కాలక్రమేణా, అతను దానికి అనుబంధంగా ఒక భూమిని కొనుగోలు చేశాడు.  కానీ త్వరలోనే శక్తి దేవి అతని కలలో కనిపించడం ప్రారంభించింది, అది తన స్థలం అని మరియు అతను కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఆమె కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని   ఆజ్ఞాపించారు. 


💠 అతను తన ఇంట్లో కొల్లూరు మూకాంబికను పూజించేవాడు .

ఈ ప్రయోజనం కోసం శ్రీయుత దేవరాయలు గొప్ప మరియు అందమైన ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. 

ఈ అందమైన ఆలయాన్ని నిర్మించడానికి వేలాది మంది కార్మికులు ఆరున్నర సంవత్సరాలు కష్టపడ్డారు. 


💠 ఆలయం చాలా విశిష్టమైనది. 

గర్భగ్రహం రాతితో నిర్మితమైనది మరియు చాలా అందమైన చెక్కడాలు ఉన్నాయి. అదే విధంగా ఆలయ ప్రాంగణం, పైభాగంలో చెక్కతో చేసిన చెక్కడాలు, అందమైన విగ్రహాలు, పూల తీగలు, కుంభం, అడ్డా తోలే అందంగా అలంకరించబడి భక్తుల మనసును ఉర్రూతలూగించినట్లుంది. 


💠 ముఖ్యంగా చోళుల కాలం నాటి శిల్పాలు, హొయసల కాలం నాటి విగ్రహాలు, బేలూరు హలిబేడిలో కనిపించే చెక్కతో చేసిన విగ్రహాలతో సహా కాష్ట చెక్కతో కూడిన స్తంభాలు. 


💠 ఆలయం ముందు, సుమారు 35 అడుగుల ఎత్తులో ఉన్న విమాన గోపురం, ఇందులో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలు రాత్రి వెలుగులో అందంగా కనిపిస్తాయి. 

అదేవిధంగా, ఆలయం వెలుపలి గోడ మరియు పైకప్పుపై, జగన్మాత యొక్క వివిధ విగ్రహాలు మంత్రముగ్దులను చేసే రూపంలో అలంకరించబడ్డాయి. 


💠 అమ్మవారి చండికా హోమాన్ని నిర్వహించే విశాలమైన రాతి యాగ మండపాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. 


💠 ఈ దుర్గా పరమేశ్వరి దేవాలయం

ప్రధాన మందిరానికి ఎదురుగా యాగ మండపం ఉంది. 

ప్రధాన మందిరం ముందు 4 నుండి 5 మెట్లతో ఎత్తైన పోడియం ఉంది. 

ఈ పోడియం మధ్యలో ఒక పెద్ద మర్రిచెట్టు మరియు చెట్టుకు ఇరువైపులా నల్లరాతితో చేసిన రాహువు మరియు కేతువుల విగ్రహాలు ఉన్నాయి మరియు దీనికి ఎదురుగా బలి పీడం మరియు తులసి మాడం ఉన్నాయి. 

వీటి లోపల పొడవైన లోహ ద్వజస్తంభం ఉంది. వీటిలో చాలా వరకు బంగారు పూతతో గంభీరమైన విస్మయాన్ని కలిగిస్తాయి. 

ఆలయం గంభీరంగా కనిపిస్తుంది మరియు ప్రవేశానికి ఇరువైపులా ఒక జత నల్ల ఏనుగు విగ్రహాలు ఉన్నాయి.


💠 ఈ రోజు ఈ గొప్ప మరియు అందమైన ఆలయంలో, ఆమె తన పవిత్ర హస్తంతో భక్తులను చూసుకునే తల్లిగా దర్శనమిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర, దేశ, విదేశాల్లో ప్రచారం పొందిన ఈ ఆలయం ఇప్పటికే లక్షలాది మంది భక్తుల భక్తిని తీర్చిన సందర్భాలున్నాయి. అలాగే దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు సప్తశతి పారాయణ, పంచ దుర్గాదీప నమస్కారాలు, తులాభార సేవ, చండికా హోమం తదితర సేవలను కుటుంబ సమేతంగా నిర్వహిస్తారు. అలా ఈరోజు భక్తుల కోరిన కోర్కెలు త్వరగా తీర్చే అమ్మగా, కుంభాశిలో స్థిరపడింది.


💠 ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ఇక్కడ అమ్మవారి దర్శనానికి అవకాశం ఉంది.


🔆 *పండుగలు & ఆచారాలు*


💠 నవరాత్రి: 

ఆలయంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి.  

నవరాత్రులు తొమ్మిది రాత్రులలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను గౌరవిస్తారు, విజయదశమిలో ముగుస్తుంది, ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.


💠 చండికా హోమం: 

 దైవ కృప మరియు భక్తులందరి సంక్షేమం కోసం నిర్వహించబడే ఒక ప్రత్యేక ఆచారం.


💠 విష్ణు సూక్త హోమం:  

లోకం మరియు భక్తుల శ్రేయస్సు కోసం శ్రవణా నక్షత్రం ద్వారా గుర్తించబడిన రోజులలో నిర్వహించబడుతుంది.


💠 ఆశ్లేష బలి:  

 ఆశ్లేష నక్షత్ర రోజులలో దివ్య ఆశీర్వాదం కోసం సర్ప దేవతల సన్నిధిలో నిర్వహించే ఆచారం.


💠 గణహోమం:  

అన్ని ప్రయత్నాలు సజావుగా సాగేందుకు గణేశుని ఆశీస్సులను కోరేందుకు ప్రతి చతుర్థి తిథి నాడు నిర్వహిస్తారు.


 💠 ఈ అందమైన ఆలయం ఉడిపి కుందాపుర రహదారిపై ఉంది మరియు ప్రసిద్ధ ఆనేగుద్దె వినాయక ఆలయానికి ఒక కిలోమీటర్ ముందు ఉంటుంది.

గోమూత్రం

 గోమూత్రం గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


       మానవ శరీరము నందు వాత, పిత్త , కఫాలు ప్రధానపాత్ర వహించుచున్నాయి. కొన్ని కారణాల వలన వీటిలో అసమతుల్యత ఏర్పడినపుడు మానవునకు రోగాలు సంభవించుచున్నాయి.  ఇలా సంభవించిన రోగాల నివారణకు గోమూత్రం ఒక గొప్ప ఔషధముగా పనిచేయును . గోమూత్రం విషదోషాన్ని హరించును . గోమూత్రం క్రిమిహరముగా కూడా పనిచేయును . మన శరీరము నందలి రోగ నిరోధకశక్తి తగ్గడం వలన కొన్ని రోగాలు రావటం జరుగును. గోమూత్రం రసాయన గుణములు కలిగి ఉండును. రోగనిరోధక శక్తి తగ్గటం వలన రసరక్తాధి ధాతువులు తగ్గును. అటువంటి సమస్యను కూడా గోమూత్రం నివారించును.


                గోమూత్రం నందు తామ్రము అను థాతువు కలదు. అది గోమూత్ర సేవన వలన మనుష్య శరీరం నందు ప్రవేశించినపుడు స్వర్ణముగా మారును . స్వర్ణం శరీరం నందలి సమస్తదోషములను నివారించును. రోగములలో రెండు రకాలు కలవు అవి మానసికం మరియు శారీరకం . మానసిక రోగం అత్యంత విషాదాన్ని కలిగించును. ఈ మనసిక విషాదం కలిగి ఉండటం వలన శరీరం నందు విషాణువులు ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషాణువుల సమూహమే క్యాన్సరు వ్యాధిగా పరిమణించును.


                  గోమూత్రానికి విషాణువులను నివారించు గుణం కలదు. అందువలన క్యాన్సర్ నివారణలో ఈ గోమూత్రం అత్యద్భుతంగా పనిచేయును . అదేవిధంగా గోమూత్రాన్ని రసాయనిక విశ్లేషణ చేసినప్పుడు కొన్ని రకాల ధాతువులు ఆ మూత్రపరీక్ష నందు బయటపడినాయి. అవి  వరసగా 


 నత్రజని , గంధకం , అమ్మోనియా , అమ్మోనియా గ్యాస్ , తామ్రము ( రాగి ) , పొటాషియం , మాంగనీస్ , యూరియా , లవణము , ఆరోగ్యాన్ని పెంపొందించే ఆమ్లములు , క్యాల్షియం , జలం , లోహము ( ఐరన్ ) , యూరిక్ ఆసిడ్ , ఫాస్ఫెట్ లు , సోడియం , కార్బానిక్ ఆసిడ్ , A , B , C , D  విటమిన్లు , ఇతర ఖనిజములు , ల్యాక్టోజ్ ( ఇది పాలు ఇచ్చు గోవులలో ఉండును.) , ఎంజైములు , హిఫ్యూరిక్ యాసిడ్ , స్వర్ణక్షారము  మొదలైనవన్నీ గోమూత్రం నందు కలవు.


             గోవు యొక్క వెన్నుముక లోపల సూర్యకేతు నాడి కలదు. ఎప్పుడైతే సూర్యకిరణములు గోవు యొక్క శరీరాన్ని తాకునో వెంటనే అప్పుడు సూర్యకేతు నాడి సూర్యకిరణాల సహాయముతో స్వర్ణమును తయారుచేయును . మూత్రపిండములు   రక్తమును వడపోసినప్పుడు ఈ స్వర్ణక్షారం నిర్మాణం అగును. ఇది సర్వరోగహారం .


       గోమూత్రం సేకరించుటకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు కలవు. వాటిని కూడా మీకు నేను వివరిస్తాను. 


  గోమూత్ర సేకరణ నియమాలు  -


 *  పరిసరముల నందలి అడివిలో లేక బీళ్లలో యథేచ్ఛగా తిరుగుతూ ఏ గోవు గడ్డిమేయునో మరియు నిర్మలమైన నీటిని తాగుచూ ఆరోగ్యముగా ఉండునో అట్టి గోవుయొక్క పాలు మరియు మూత్రం గొప్ప ఔషధగుణములు కలిగి ఉండును.


 *  దూడ , పెయ్య  , ముసలి ఆవు , ఎటువంటి గోవు యొక్క మూత్రం అయినను ఔషధ ప్రయోగానికి పనికివచ్చును.


 *  ఎద్దు మూత్రం తీక్షణముగా ఉండును. కాని ఔషధోపయోగమునకు పనికివచ్చును. ఎందువలన అనగా ఆవు మరియు గోవు రెండూ ఒకే జాతికి చెందినివి .


 *  గోమూత్రమును రాగి ,ఇత్తడి పాత్ర యందు ఉంచరాదు. మట్టిపాత్ర , గాజుపాత్ర , పింగాణిపాత్ర లేక స్టీలు పాత్రలో ఉంచవలెను.


 *  ఎంతకాలం నిలువ ఉంచినప్పటికీ గోమూత్రం యొక్క గుణము తరగదు. దాని యందలి లోహము లేక తామ్రము కారణంగా దాని రంగు కొద్దిగా నలుపు లేక ఎరుపుగా మారవచ్చు  . గోమూత్రం నందు గంగ ఉండునని చెపుతారు. గంగాజలం ఎలాగో గోమూత్రం కూడా ఎంతకాలం యున్నను చెడకుండా ఉండును. క్రిమికీటకాలు ఉత్పన్నం అవ్వవు.


 *  పెద్దవారు ఉదయం 25ml ఒక కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు . సాయంత్రం కూడా ఇదే మోతాదులో తీసికొనవచ్చు. దీనివలన మలప్రవృత్తి ఎక్కువ అయ్యి ప్రేగులు శుభ్రపడును .ఎక్కువుగా విరేచనం అవుచున్నచో 10ml మోతాదులో తీసుకొనవచ్చు .


 *  గోమూత్రాన్ని మధుమేహరోగం ఉన్నవారు తీసికొనవచ్చు. ఈ మధ్య కొంతమంది గోమూత్రం నందు బెల్లం కలిపి అమ్ముతున్నారు. అది మాత్రం నిషిద్దం. 


       పైన చెప్పిన ఉపయోగాలన్నీ దేశివాళి గోమూత్రాన్ని స్వీకరించినప్పుడే ఉపయోగపడును. జెర్సీ ఆవు మూత్రం వలన ఎటువంటి ఉపయోగాలు లేవు . నేను రాసిన గ్రంథాలలో ఆవుపాలు , ఆవునెయ్యి , ఆవు వెన్న ఉపయోగాల ఏయే వ్యాధులకు ఉపయోగపడునొ వివరంగా తెలియచేశాను . 


       తరవాతి పోస్టులో గోమూత్రం నందలి ధాతువులు మనశరీరానికి ఏవిధంగా ఉపయోగపడునో సవివరంగా వివరిస్తాను.


  

      మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మాతెలుగుతల్లికీ



తెలుగదేలయన్న దేశంబుతెలు,గేను

తెలుగు వల్లభుండ!

తెలుగొకండ యెల్లనృపులుగొలువ

ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగులెస్స!!

-శ్రీకృష్ణదేవరాయలు-ఆముక్తమాల్యద!

       సకలదేశభాలయందు పరిచయముగల కర్ణాటక రాజ్యచక్రవర్తి రాయలనోట వెలువడిన మాట యిది.

      తెలుగు తియ్యనిభాష.సకలదాక్షిణాత్యభాషలలో మధురాతి మధురమైనది.అట్టి మాతృభాషను విస్మరించి మనం ఇతరభాషలవైపు పరుగుబెట్టటం హాస్యాస్పదం.

      మనంతెలుగులోనే మాటలాడుదాం.తెలుగుగ్రంధాలనుచదువుదాం.

ఇంటా బయటా తెలుగును విస్తరిద్దాం.తెలుగుకు వెలుగుపూవులు పూయిద్దాం.

       మాతెలుగుతల్లికీ

మల్లెపూదండ!

    మాకన్నతల్లికీ

    మంగళారతులు!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తెలుగు భాష

 మధురమైన తెలుగు భాష...... (మిత్రాజీ )|


తెలుగు భాషకు వందనం

 మన మాతృ భాషకు వందనం 

తెలుగు తల్లికి వందనం 

మన తెలుగు కవులకు వందనం


ఆది కవి నన్నయ్య కలమున పొంగినది మన తెలుగు భాష పోతనార్యుని కలమున జాలువారెను తెలుగు భాషా


అల్లాసాని అమరవాణి అమృతాల తెలుగు వాణి ఎందరో మహా కవుల కలమున కీర్తి పొందిన తెలుగు మనది


రాయపోలు దేశ భక్తి గురజాడ తెచ్చిన తెలుగు కీర్తి కృష్ణ రాయలే కీర్తించిన తేనె తెలుగు భాష మనది


మన భాష యాసనే బతుకు భాషని చెప్పెను మన కాళోజి నాడు తెలుగు భాష వైభవాన్ని చూపించే గిడుగు రామ్మూర్తి నాడు


ఎందరో మహనీయులు తెలుగు భాషనే కొనియాడిరి ప్రపంచంలో తెలుగు భాషకు ప్రత్యేక స్థానమే తెచ్చిరీ

తెలుగు భాష అభివృద్ధి

 https://youtu.be/h6xlh10l15Y?si=c-m6gEDkHYGW3neS

శ్రీభారత్ వీక్షకులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 🌹 గిడుగు రామమూర్తి జయంతి అంటే తెలుగు పండుగ. తెలుగు వారందరు తెలుగు భాష అభివృద్ధి కోసం పరితపించే పండుగ. ఇప్పుడు తెలంగాణ లో కాళోజీ జయంతిని కూడా తెలుగు పండుగగా జరుపుతున్నారు. తెలుగు పండుగలు పెరిగాయి.. తెలుగు పెరిగిందా! అధికార భాషా సంఘాలు అలంకార ప్రాయంగా మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగును పెంచాలంటే ఏం చేయాలో చక్కగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు డా. టి. గౌరీశంకర్ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఉచితం అంటే

 *RTC buses*


 లో స్త్రీ లకు  ఉచితం అంటే .... స్త్రీ లందరికి  సంతోషమే. మరీ మధ్య తరగతి....... మరి .....పేద వర్గానికి ఇది మంచి వరమే. మనలాంటి వారికీ .... ఇది హాస్యము. ఒక సారి ఈ క్రింద మెసేజ్ విపులంగా వుంది . చదవండి . ఏది సముచితమే మనకు ఓ అవగాహనా వస్తుంది .

—————————————————

From Mrs. నిర్మలా రవీంద్రా రెడ్డి

అడ్వకేట్,Highcourt Telangana 

*మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


*మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం,చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


 మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


 ఒక్కో ఎమ్మెల్యే జీత భత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట.


 భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


ఇక ప్రతి సంవత్సరం ఈ MP లకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం,జీవనం, ఆహారం,ప్రయాణ భత్యం, చికిత్స,విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


 అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


 7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు.


ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


 ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు, పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.


అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


*ఇప్పుడు ఆలోచించండి.*


మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము,పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇదా ప్రజాస్వామ్యం?


(ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది.)


ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


     *మొదటిది:*         


ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (TV) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి, ప్రచార ఖర్చు ఒకరికి 10 వెలు మాత్రమే.


     *రెండవది:*       


నాయకుల జీతాలు, ఉచితాలు,సబ్సిడీలు మరియు అలవెన్సులపై నిషేధం విధించాలి 

అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం,దేశభక్తి ఎవరికి ఎంతుందో..


ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు,వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గరికి 

దయచేసి అన్ని ప్లానింగ్స్ ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోతాయి.


*మీకు ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం గుర్తుంది..


 సిలిండర్,రేషన్ తీసుకురావడం వుండదు.


మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది. 


చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


 *అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ₹1 కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.*


మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.


దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించ డానికి ప్రయత్నించండి.


     *ఇది అహంకారమా లేక మోసమా....లేక గుత్తాధి పత్యమా?*  


భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో...


టీ = ₹ 1

sup = ₹ 5.50

పప్పు = ₹ 1.50

ఆహారం = ₹2.00

చపాతీ = ₹1.00

చికెన్ = ₹24.50

దోస = ₹4.00

బిర్యానీ=₹8.00

చేప = ₹13.00


ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.                    


ఇవన్నీ  పార్లమెంటు సభ్యులకు,ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం. 


ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది,మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ,మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.


MP, MLA, MLC లు మరియు ఏ ఇతర ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే. 


ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని...కాదు...కాదు సేవ చేయాలి.


రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించే వాడు భికారి,పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే.


*ఎన్నో జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి, మీ మొబైల్‌లో అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*


*మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుంది.*


 *సేకరణ: పవర్ ఆఫ్ ఆర్టీఐ.*                 


*Mrs.నిర్మలారవీంద్రారెడ్డి Advocate,*


*High Court of Telangana.*

అన్నం గురించి

 అన్నం గురించి  మంచి మనుషులు చెప్పిన  గొప్ప మాటలు.🙏 *శుభోదయం* 🌺🙏🙏🌺


1.. " నేను వంటింట్లోకి వేరే  పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా.   ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని ! .... ఎంతయినా అమ్మ అంటే అన్నం. .... అన్నం అంటే అమ్మ ! అంతే !


  ( జంధ్యాల గారు ) .


2.  మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం ! 


( విశ్వనాధ సత్యనారాయణ గారు ) . 


3... రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  ... వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! 


( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

 


4. . ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !


( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .


5.  ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా " అని బీదసాదల కి చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు ! 


( ఆత్రేయ గారు ) 


6. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! 

అమ్మ చేతి  అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! 


( చాగంటి కోటేశ్వరరావు గారు ) . 


7..  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!


(గౌతమ బుద్దుడు ). 


8.  ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారు కూడా అమృతంలా రుచిస్తుంది !


( మాతా అమృతానందమయి ) .


9. . మీ పిల్లలు ఎంత దూరంలో,  ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు .... మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించుకుని మనం బ్రతకాలి.. 


ఎంతటి మంచి వాక్యాలు....... 

పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం... 


ఎందరో మహానుభావులు... 

 అందరికి వందనములు .....


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కరువు

 జై శ్రీ రామ్ 


" కరువు" లో ఉన్నానని 

"అరువు" తీసుకుంటే..

ఆ " అరువు" రేపు నీకు 

" బరువు" అయితే...

జీవితం కన్నీళ్ళ " చెరువు " అవుతుంది..

అందుకే " ఆడంబరాలకు" పోకుండా 

ఉన్నదానితో " ఆనందంగా" జీవించు..!

జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ

జంటపదములు

 *" జంటపదములు "*


ఏతావాతా, దానాదీనా, తాడోపేడో, వాడివేడి, రాతకోతలు, గిల్లికజ్జాలు, గంపగుత్తగా, ఒళ్ళూపై, తిమ్మిని బమ్మిని, తాడూ బొంగరం, వావివరస, కన్నీరుమున్నీరు, ఆదరాబాదరా, కరాకండీ [కరాఖండీ], కన్నూమిన్నూ, ఉబ్బితబ్బిబ్బు, తత్తరబిత్తర, యిలాంటి జోడీలు జాడీలకొద్దీ ఉన్నాయి మనకి.  అయితే అవి యిలా ఎందుకు జతలు కట్టాయో చెప్పగలిగితే సంతోషం.  కొన్నింటి అర్థాలూ తెలియవుగా మరి!


రెండు అదే పదాలు వస్తే ఆమ్రేడితం అంటారు, రెండు సంబంధం ఉన్న లేక లేని పదాలూ జంటగా వాడతారు.  రెండూ అర్థం కలిగినవి వాడతారు, ఒకొక సారి ధ్వనికోసం వాడతారు, నొక్కి చెప్పడానికి వాడతారు. 


1. ఏతావాతా = ఏతావత్ అనేది సంస్కృతం శబ్దం = So much, so far ఏతావదుక్త్వా అని రామాయణంలోనూ భారతంలోనూ చాల సార్లు వస్తుంది. 'ఇంతవరకు చెప్పి' - అని అర్థం.  ఇది గోదావరిజిల్లా వాడుకలో ఏతావాతా అయింది.  ఇంతకూ - అని అర్థం, ఏతావాతా చెప్పొచ్చేదేమంటే = ఇంతకూ చెప్పవచ్చేదేమంటే. 


2. దానాదీనా = దాన్నీ దీన్ని = అదీ ఇది = మొత్తము మీఁద = on the whole, దానా దీనా పదిలక్షలు ఖర్చు అయింది. 


3. తాడోపేడో తేల్చు = అటో యిటో పరిష్కరించు, either this or that "ఈ వ్యవహారం ఈ రోజు తాడోపేడో తేల్చుకొని కాని ఇక్కడినుండి కదలను."


4. రాతకోతలు, వ్రాఁతకోతలు – Writing the sale deed (రాత) after the final hard bargain and the final cut (కోత) in the price. 


5. తిమ్మినిబమ్మినిచేయు = క్రిందిది మీదికి - మీదిది క్రిందికి చేయు వ్యవహారములో దక్షత చూపు.  ఇక్కడ తిమ్మి అంటే తిమ్మడు (కోతి) బమ్మి అంటే బ్రహ్మ లేదా బమ్మి (బ్రాహ్మడు).  "మొత్తానికి తిమ్మిని బమ్మిచేసి మా వాడికి ఉద్యోగం ఇప్పించాను."


6. వావీ వరుసా = వావి అంటే బంధుత్వము relation, వరుస అంటే "ఆ అమ్మాయి నాకు వరుసకు మరదలు ఔతుంది" distant but equivalent relationship.  సుందరకాండలో మైనాకుడు హనుమను నీకు పినతండ్రిని అంటాడు.  అది వరుస కలపడం. 


7. అమీతుమీ = నేనా నువ్వా, బెంగాలీ పదాలు, ఈ రోజు అమీతుమీ తేల్చుకుందాం.


8. తత్తర బిత్తర = కంగారు; తత్తర పడడం = అంటే తొట్రు పడడం, కంగారు పడడం, బిత్తర పోవడం = అంటే ఆశ్చర్య పడడం, తెల్లబోవడం, మానసిక స్థితిని వర్ణించడానికి రెండూ కలిపి వాడతాం.


9. కన్నీరు, మున్నీరు = సముద్రం, కన్నీరు మున్నీరుగా విలపించడం అంటే దుఃఖ సముద్రంలో పడుటకు చిహ్నం.


10. ఆదరాబాదరా = తగినంత ఆలోచన, వ్యవధి లేకుండా; హడావుడిగా hurry burry, ఆవార్తవిని ఆదరాబాదరాగా బయలుదేరి వచ్చాము.  ఆదరా బాదరాగా = కంగారుగా, ఉన్న పళంగా,అద్ధంతరంగా, బాదర బందీలు ఉండగానే.


జంట పదాలను లెక్కించడం సాధ్యం కాదు.  

కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.  వీటి వివరణలకు ఒక సిద్ధాంత వ్యాసం కావాలి.


ఒక్క కూలీ నాలీ చూదాం:  

"కూలి" తెలిసిన పదమే.  విశేషణం (కూలిపని), నామవాచకము (నీకెంత కూలి కావాలి?)  మన సాఫ్టువేరు ఇంజనీర్లను - techno కూలీలుగా వర్ణించాడు ఒక IAS గారు.  South Africa గాంధీ గారిని కూలీ బారిస్టరు అనేవారు.  నాలి విశేషణమే కుత్సితము, కుచ్చితము, (ఉదా - నాలి ముచ్చు) hypocrite, hook or crook కూలో నాలో చేసుకు బ్రతుకు అంటే live - by hook or crook


మచ్చుకు మరికొన్ని:-


అన్నెం పున్నెం, అండ దండ, అందం చందం, అడపా తడపా, అలుపూ సొలుపూ, అభం శుభం, అదురు బెదురు (నదురు బెదురు), అవాకులు చెవాకులు, అణా కానీ, అప్పో సొప్పో, అల్లా టప్పా, అతుకు బొతుకు, ఇరుగు పొరుగు, ఊరూ వాడా, ఎండా కొండా, ఒళ్ళూ పై, కలొ గంజో, కల్ల బొల్లి, కరాఖండీ, కఱ్ఱా బుఱ్ఱా, కన్నూ మిన్నూ, కాసర బీసర, కిందా మీదా, కూలీ నాలీ, కూరా నారా, చదువూ చట్టుబండా, చిన్నా చితకా, పిల్లా జెల్లా, చెట్టూ చేమా, చెత్తా చెదారం, చెదురు మదురు, చిన్నా చితకా, చిన్నం చిదరా, చిందర వందర, గంపగుత్తం, గొడ్డూ గోదా, బీదా బిక్కీ, తలాతోకా, వంపు సొంపు, తట్టా బుట్టా, తీరూ తెన్నూ, మొక్కా మోడూ, నెత్తీ నోరూ, నోరూ వాయీ, వంటా వార్పూ, వెనకా ముందూ, వింతా విడ్డూరం, వింత విశేషం, గందర గోళం, గిన్నీ గిట్రా, డబ్బు దస్కం, నగా నట్రా, పొలం పుట్రా, పెట్టీ బేడా, పిల్లా పీచూ, పెట్టూపోతా, పెళ్ళీ పెటాకులు, పుట్టు పూర్వోత్తరాలు, రసాభాస, రాయీ రప్పా, గిల్లి కజ్జా, సింగినాదం జీలకఱ్ఱ, వంకర టింకర, పుణ్యం పురుషార్థం, లెక్కా పత్రం, ముద్దూ ముచ్చట, మాటామంతీ, రానూపోనూ, అదీయిదీ ..... 


ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయో!!! మరో భాషలోనికి యథా తథంగా అనువదించలేనివి ఇవి.  తెలుగు సోయగం ఇది.

పూర్వ పద్ధతి పంచాంగం. తేదీ.29.08.2024

 *శుభోదయం*

********* 

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.29.08.2024

బృహస్పతివాసరే( గురువారము)

 ********       

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే  సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. __________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే

వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణ పక్షే ఏకాదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే దక్షిణాయనే

వర్ష ఋతౌ 

శ్రావణ మాసే  కృష్ణ పక్షే ఏకాదశ్యాం

బృహస్పతివాసరే( గురువారము) 

అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.48

సూ.అ.6.15

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం  

వర్ష ఋతువు

శ్రావణ మాసం 

బహుళ పక్షం ఏకాదశి  తె. 3.36 వరకు. 

బృహస్పతివాసరే( గురువారము)

నక్షత్రం ఆర్ద్ర రా.7.58 వరకు. 

అమృతం ప.9.59 ల 11.35 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.57 ల 10.47 వరకు.

దుర్ముహూర్తం 2.56 ల 3.46 వరకు. 

వర్జ్యం  ఉ.5.59 వరకు. 

యోగం సిధ్ధి రా.9.57 వరకు.

కరణం బవ మ.3.52 వరకు.

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ. 6.00 ల 7.30 వరకు.      

***********   

 పుణ్యతిధి  శ్రావణ బహుళ ఏకాదశి.

 ********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏