30, జూన్ 2024, ఆదివారం

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🕉️ *సోమవారం*🕉️

   🔱 *జూలై 01, 2024*🔱

      *దృగ్గణిత పంచాంగం*                  

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : దశమి* ఉ 10.26 వరకు ఉపరి *ఏకాదశి*

వారం :*సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : అశ్విని* ఉ 06.26 *భరణి* తె 05.27 వరకు

*యోగం : సుకర్మ* మ 01.42 వరకు ఉపరి *ధృతి*

*కరణం : భద్ర* ఉ 10.26 *బవ* రా 09.32 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 12.00  సా 05.00 - 06.00*

అమృత కాలం :*రా 12.51 - 02.23*

అభిజిత్ కాలం :*ప 11.45 - 12.38*

*వర్జ్యం : మ 03.38 - 05.11*

*దుర్ముహుర్తం : మ 12.38 - 01.30 & 03.15 - 04.07* 

*రాహు కాలం : ఉ 07.17 - 08.55*

గుళిక కాలం :*మ 01.50 - 03.28*

యమ గండం :*ఉ 10.33 - 12.11*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 05.39* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల  :‌ తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.39 - 08.16*

సంగవ కాలం :*08.16 - 10.53*

మధ్యాహ్న కాలం :*10.53 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ బహుళ ఏకాదశి*

సాయంకాలం :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.55*

నిశీధి కాలం :*రా 11.50 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.55*

______________________________

            🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*గౌరీమనోహర !*  

*సురాసురమౌనిబృంద సంసేవితాంఘ్రియుగ !* *చంద్రకళావతంస ! కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో !*

*శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️

🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

⚜ *శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం*

 🕉 మన గుడి : నెం 864


⚜ *కర్నాటక  : నొగ్గెహల్లి - హసన్*


⚜ *శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం*



💠 హొయసల కాలంలో ప్రబలమైన నిర్మాణ శైలికి హాసన్‌లోని నుగ్గేహళ్లిలోని లక్ష్మీ నరసింహ దేవాలయం అద్భుతమైన ఉదాహరణ. 

ఈ ఆలయం నరసింహ స్వామికి అంకితం చేయబడింది.


💠 ఇక్కడ ప్రతి రాయి మాట్లాడుతుంది.  పరిపూర్ణతతో అందంగా తీర్చిదిద్దారు. 

ఆలయం మొత్తం భాగవత పురాణంలోని దృశ్యాలను వర్ణిస్తుంది.  

విష్ణువు 24 రూపాలలో అందంగా చెక్కబడ్డాడు .


💠 ఈ పట్టణం పురాతన కాలంలో విజయ సోమనాథపుర అని పిలువబడింది మరియు బొమ్మన్న దండనాయకుని కాలంలో అగ్రహారంగా (విద్యా స్థలం) ప్రాముఖ్యతను పొందింది.  

నగ్గెహల్లి, ("నుగ్గిహల్లి" అని కూడా పిలుస్తారు),


💠 లక్ష్మీ నరసింహ దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన హొయసల వాస్తుశిల్పంతో భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా, నుగ్గేహళ్లి గ్రామంలో ఉంది. 

ఇది త్రికూట ఆలయంగా కూడా ప్రసిద్ది చెందింది... ఎందుకంటే మూడు వైష్ణవ సముదాయం కేశవ , లక్ష్మీ నరసింహ మరియు వేణుగోపాలకు అంకితం చేయబడింది . 

ఇది 1246లో వీర సోమేశ్వర రాజు పాలనలో హొయసల సామ్రాజ్యంలో కమాండర్ అయిన బొమ్మన్న దండనాయకచే నిర్మించబడింది .


💠 ఈ ఆలయం  హరిహర , దక్షిణామూర్తి , చండికేశ్వర, గణేశ వంటి శైవ ,

 దుర్గా మహిషాసురమర్దిని వంటి శక్తి , 

నృత్యం చేసే లక్ష్మి మరియు సరస్వతి , అలాగే సూర్యుడు మరియు బ్రహ్మ వంటి వైదిక దేవతలకు ప్రసిద్ధి చెందింది . 

దిగువ భాగం హిందూ ఇతిహాసాలు మరియు భాగవత పురాణం నుండి దృశ్యాలను వర్ణిస్తుంది . హొయసల కళాకారిణి మల్లితమ్మ పూర్తి చేసి సంతకం చేసిన కళాకృతులు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి. 


💠 ఆలయం వాస్తవానికి ఏకకూట (ఒకే గోపురం మరియు మందిరం) ఆలయంలా కనిపిస్తుంది.

ఏకకూటంగా కనిపించే త్రికూట (మూడు మందిరాలు మరియు గోపురాలు) కి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ . 

తరువాతి కాలంలో ఎత్తైన స్తంభాలతో కూడిన పెద్ద బహిరంగ హాలు జోడించబడింది.


💠 ఇది భారతదేశంలోని కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.  

హసన్ నగరానికి 50 కి.మీ.  

ఇది రాష్ట్ర రాజధాని బెంగళూరుతో రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

ధర్మాచరణ

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 


🌺🌺ధర్మాచరణ🌺🌺


హిందువుల్లో చాలా మందికి హిందూధర్మం గురించి తెలియదు. వారి స్వంత గ్రంథాలు మరియు వాటి బోధనల గురించి వారికి సరైన అవగాహన లేదు. అందువలన వారికి సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం తెలియదు. ఈ కారణంగానే వారికి తమ ధర్మం పట్ల పెద్దగా గౌరవం ఉండటం లేదు.


అన్యమతాలు గొప్పవి అనే అపోహకు సులభంగా లోనవుతున్నారు. ఇతర మతాలకు చెందిన వారు తమ ప్రార్థనా స్థలాల్లో క్రమం తప్పకుండా సమావేశమవుతారు. అక్కడ వారికి వారి గ్రంథాలను పరిచయం చేసి, వారి మతం మరియు అందులోని బోధనలు ఇతర మతాల కంటే గొప్పవని నమ్మేలా చేస్తారు. అక్కడ వారి మతపరిరక్షణకు వ్యాప్తికి ఏమిచెయ్యాలో కూడా సూచించబడుతుంది. సహజంగానే వారు తమ మతం కోసం నిలబడతున్నారు. వారు ఐక్యంగా ఉంటున్నారు. కానీ మనం ప్రాంతాల వారీగా, దేవుడి పరంగా, కులపరంగా విభజింపబడ్డాం. రాముడుని, శివుడుని కాకుండా కృష్ణుడిని మాత్రమే పూజించాలని ఇస్కాన్ వంటి గొప్ప సంస్థలు చెబుతున్నాయి.  కొందరు ప్రముఖ ప్రవచనకారులు అనాలోచితంగా కొన్నిసందర్భాలలో మన సంప్రదాయాలను కించపరుస్తారు. అన్యమతస్తులకు మనలను విమర్శించేందు అవకాశం కల్పిస్తారు. ఈ విధంగా మనలో ఐక్యత లేదు.


హిందువులలో ఐక్యత లోపించినపుడు మనుగడకే ముప్పువాటిల్లుతుంది. ఆనాడు ఇరాన్ ఇరాక్ ఇండోనేషియా జపాన్ మొదలైన అన్ని దేశాలలో వ్యాపించిన సనాతనధర్మం ఇప్పటికే తన ఉనికిని కోల్పోయి భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో మైనారిటీగా మిగిలిపోయింది. 

హిందువులలో ఐక్యత లోపించినపుడు అతి త్వరలోనే కాశ్మీరులో ఆనాడు జరిగిన సంఘటనలు భారతదేశమంతా జరిగే అవకాశం ఉంది. 


హిందువులు ఏకం కావడం నేడు అత్యవసరం. ఇది మన వారిలో మన ధర్మం గురించిన, సంస్కృతిని గురించిన అభిమానాన్ని, గౌరవాన్ని పెంపొందించినపుడే సాధ్యం. రాజకీయపార్టీలు అనేక కారణాల వలన నిస్సహాయంగా మిగిలిపోవచ్చు. కాబట్టి హిందువులలో ఐక్యత పెంపొందాలంటే హిందూ సంస్థలు - మతమార్పిడులు, మన దేవీదేవతలను దూషించడం వంటి మనధర్మంపై జరిగే దాడులను ప్రతిఘటించడమే కాకుండా, మన ధర్మం గురించి, మన సంస్కృతిని గురించి హిందువులకు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. వాటి ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి. అప్పుడే హిందువులు నిజమైన హిందువులు అవుతారు. మతమార్పిడులకు లోనుకారు. మనసంస్కృతి కాపాడేందుకు నడుం కట్టి నిలబడతారు. ప్రజలకు సరైన పరిజ్ఞానం ఉంటే సమస్యలు సహజంగానే పరిష్కారమవుతాయి.


           జై గురుదేవ్ 👏🏼👏🏼

ముళ్లపూడి సౌజన్యంతో

 శ్రీ వర ముళ్లపూడి సౌజన్యంతో, s/o గ్రేట్ శ్రీ MV రమణగారు:


ముళ్ళపూడి ముత్యాలు


" నేను సిగరెట్లు త్రాగడం మానేసాను     తెలుసా ? " అన్నారు దర్పంగా ఆరుద్ర. " అదేం పెద్ద గొప్ప ! నేను అలా చాలాసార్లు మానేసాను " అన్నారు ముళ్ళపూడి వారు.


ఒకాయన ముళ్ళపూడి వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ      ఆయన రమణగారితో " మద్రాసులో ఎక్కువగా అరవ వాళ్ళే వుంటారు కదా ! వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా ?                  " అనడిగాడు. దానికి రమణగారు తన మార్కు         జవాబిచ్చారు. 

" ఏముందీ ? మీరు పేపర్ కొని చదువుకుం  టుంటే, మధ్యలో ఆ పేపర్ని ఎవరు అడిగి తీసుకుంటారో వాడే తెలుగువాడు " అన్నారు. 


" ఏమిటండీ మీ వ్రాత ఇలా వుంటుంది ? "      అన్నాడట ఓసారి ముళ్ళపూడి వారి పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేస్తున్న కంపోజిటర్. " అందుకేనయ్యా ! నా రాత ఇలావుంది " అని ముళ్ళపూడి వారి సమాధానం.  


వాక్య విన్యాసం లో కూడా రమణ మంచి నేర్పరి. “అవినీతి కధలు కాదు అవి నీతి కధలు” అనడం, “సిగరెట్టులు తెల్లగా ఉంటాయి – అగ  రొత్తులు నల్లగా ఉంటాయి. అగరొత్తులు      గోడ మీద గుచ్చి కాలుస్తారు,  సిగరెట్టులు నోట్లో పెట్టుకు కాలుస్తారు”అని.


”బాబాయ్      సంజెవారుస్తాడు,బామ్మ గంజి వా  రుస్తుంది.” ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

 

నుడికారాలు,సామెతలు వాడుకలో ఉన్నవాటిని ప్రయోగించినప్డు వక్త ఒక అర్ధంలో అంటే శ్రోత ఇంకో అర్ధం చేసుకున్నట్టు సృష్టించి సన్నివేశం హాస్యస్ఫూర్తితో తీర్చిదిద్దేవారు.


“నా మొహంలా ఉంది అంటే – ఏదో నీ అభి  మానం కొద్ది మెచ్చుకుంటావు” అన్న సందర్భాలు.


“వీళ్ళు ఎక్కడ్నుంచి వచ్చారండి మన ప్రాణాని  కి అని వక్త అంటే – అడ్రెస్సు తర్వాత కనుక్కుందాం” అని శ్రోత వ్యంగ్య సమాధానాలు.


“నువ్వెందుకు పనికొస్తావు అంటే – నేనాండి అని తాను చెయ్యగలిగే పనులు చెప్పడం”. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో….


భాషను వాడుకోవడంలో రమణ చూపిన  లాఘవం పాఠకులని పరవశుల్ని చేస్తుంది. కాడిలాక్ కారున్నవాడిని కాడిలా కియర్ అని, అప్పుచేసి బతికే పద్ధతిని అప్పోమానియా  అని, సినిమాలు తీసేవారు సినిమా కారులు  అని, సినిమాల పిచ్చి ఉండడం సినీమేనియా అని. సినీ జీవులకి సంబంధించిన కొత్త జబ్బుని కూడా కనిపెట్టారు మన రమణ – అదే సెరిబ్రల్ సినేరియా.        అంతేకాదండోయ్,రమణ గారు-బాపు గారు అద్దెకుండే ఇంట్లో రాత్రి పూట హాలులో మందు పార్టీ పెట్టుకునేవారట,  దానికి రమణగారు పెట్టిన పేరు “ఆల్కహాల్”.  ఇలా పదప్రయోగంలో ఎన్నో కొత్తపోకడలు     పోయారు రమణ. పదాలతో ఆడుకున్నారు.  వాటిలో రెండు వేరు వేరు పదాలను ఏకకాలం లో ప్రయోగించి కొత్త అర్ధాన్ని కల్పించిన ప్రతిభ రమణది. అందులో క్రిటికా తాత్పర్యాలు (క్రిటిక్ టీకా తాత్పర్యాలు అని) లాంటి పదాలు కోకొల్లలు. 


ఇలా చెప్పుకుంటూపోతే ముళ్ళపూడి వారి రచనలలో పదాలు, సామెతలు వాక్యాలు కొత్త కొత్తగా మనల్ని నవ్విస్తాయి,కవ్విస్తాయి.హాస్య రచనలలో రమణ గారిది ఫోర్జరీ చెయ్యలేని సంతకం.


హాస్యం,వెటకారం,సూటి మాటలు,  వేళాకోళాలు వ్యంగ్యం,చమత్కారం – ఇంత “కలాపోసన” మన ముళ్ళపూడి రమణీయుడికే  సాధ్యం…!

 రమణగారి        పుట్టినరోజు  సందర్భంగా.....

సనాతనధర్మంలో

 *🕉️🙏సనాతనధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది*

*కాశీకి చేరుకున్నారు ఒక జంట. కొన్నేళ్ల తరువాత వారికి ఒకమ్మాయి* *పుట్టింది.చిన్నప్పుటి నుండి శివారాధనలో మునిగింది అమ్మాయి.భక్తిలో ఆ ఈశుడినే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.ఆమె కాశీకి దైవదర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది.అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి* *తోడుగా ఉన్నాడు.ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె ‘వివాహం చేసుకోను,ఇలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను!’ అని చెప్పింది.*

*ఆమె కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది.* *దాహంతో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటారని!ఆమె అడిగినవారికి దానం చేయడం తెలుసుకున్న అందరూ ఆమెను వచ్చి అడుగుతుంటే… కాదనలేక అందరికి ఇస్తూ* *అప్పులుపాలైపోయింది.అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరు ఆమెను నిష్టూరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ”మా డబ్బులు మాకు ఇవ్వండి!”* *అంటూ గొడవ పెట్టారు.*

*ఆమెకు ఏం చేయాలో అర్థం కానివేళ ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర తన అప్పులు తీర్చమని అడిగింది. అప్పు మొత్తం ఐదు లక్షలు అని చెప్పింది.*

*అతడు “తాకట్టుగా నీ దగ్గర ఏముంది!” అని అడిగాడు.*

*🕉️🙏అందుకు ఆమె “నాదగ్గర ఏమి లేదు నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప!” అన్నది.*🕉️🙏

*🕉️🙏”నీ పుణ్యం నాకు ఎలా వస్తుంది?” అంటే…*

*“ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టే ఉంది,* *అక్కడకి వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరింది. ఇప్పుడు ఆ నీటి తొట్టెను మీకు ఇస్తున్నాను. నా పుణ్యం తీరేవరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే!” అంది.*🕉️🙏

*🕉️🙏”నాకెలా తెలుస్తుంది- నాకెంత పుణ్యం వచ్చిందో?”* *అని అంటే…*🕉️🙏

*🕉️🙏ఆమె ఒక లింగ రూపం అయిన రాయిని తీసి* *“అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను, అది మునిగి నదిలో ఉంటుంది.🕉️🙏 🕉️🙏ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది!” అని చెప్పింది.*🕉️🙏

*🕉️🙏రాయి మునిగిపోతుంది, కాని ఎప్పటికీ తేలదు అని అనుకుని అతడు ఆమెకు ఐదులక్షలు అప్పు తీర్చాడు.*🕉️🙏

*🕉️🙏ఆ తరువాత ఆ వ్యక్తి ఆ తొట్టే దగ్గర ఒక వ్యక్తిని నియమించాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్కకట్టమన్నాడు.*🕉️🙏

*🕉️🙏ఆరోజు రాత్రి గడిచింది.ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు.అతడి నివాసం నుండి అతను నదిలోకి చూస్తూ ఉన్నాడు.’అనవసరంగా అంత డబ్బు గుడ్డిగా నమ్మి ఇచ్చాను.,*🕉️🙏 *మోసపోయానేమో?’ అని అనుకుంటుండగా… ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలోని నీరు తాగింది.* *అంతే! నదిలో ఆమె విసిరిన లింగం పైకి తేలింది.*🕉️🙏

*🕉️🙏ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి!* *‘ఏంటి ఐదులక్షలు విలువ చేస్తుందా పుణ్యం ఈ ఒక్క ఆవు తాగిన ఈ చుక్క నీరు అంటే ఆ తల్లి చేసిన పుణ్యం నా కోట్లు కుమ్మరించినా సరితూగదు కదా!’ అని* *ఆమెను వెతుక్కుంటూ పరుగు పెట్టాడు.ఆ రోజు* *నుండి అతను కూడా అందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ* *ఈశుడిని భక్తిగా కొలవడం మొదలుపెట్టాడు.మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం చాలా విలువైనది వెల కట్టలేనిది. చెడు ఒక్క క్షణం కూడా తలవకు మంచిని నిమిషమైన మరిచిపోకు!🕉️🙏*

ఆదివారం

 *🍁ఆదివారం నాడు ఇలాంటివి వద్దు.🍁*

*🔆అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |*

*సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||*


*🔆స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే* |

*న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||*


*🔆తాత్పర్యం🔆:*


*🔆మాంసం తినడం*, 

*మద్యం తాగడం,* 

*స్త్రీతో సాంగత్యం*, 

*తలకు నూనె పెట్టుకోవడం* *ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించెయి దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా*


*🔆అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది*.


*🔆మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు*.


*🔆ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి*


*🔆అందుకే మనకొచ్చే* *ముఖ్యమైన పండుగలన్నీ* *కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి*

*ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి*.


*🔆ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు.*


*🙏🌹 జై. శ్రీ. రామ్ 🌹🙏.*

తెలుగు రుచులు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 తెలుగు రుచులు ఎంతమందికి తెలుసు? తెలుగు భాష ఎంత బాగా తెలిస్తే తెలుగు రుచులు కూడా అంత బాగా తెలుస్తాయి. స్వర్గ ద్వారాలు తెరుచుకోవాలంటే తెలుగు రుచులు నాలుకకు తగలాల్సిందే. ఆవకాయ తెలుగు లో పెట్టుకుంటే ఆ రుచే వేరు. మాగాయ ఎలాగూ మహా పచ్చడే. అందుకే తెలుగు భాష మరువకండి, తెలుగు రుచులు వదలకండి అంటున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. చక్కని ఆరోగ్యానికి కూడా తెలుగు రుచులే మేలు. తెలుగు పోపులు తెలిస్తే అదే సిసలైన అదృష్టం. నీరజ గారు ఇంకా ఏం చెప్పారో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ధర్మం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*ధర్మం దానంతట అదే గెలవదు!*

               ➖➖➖✍️


*అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని...*

*అది తప్పు...! ధర్మం దానంతట అదే గెలవదు..!*

*నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..!*


*అర్థం కాలేదా...?*


*ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడు..!*



**కృత యుగం లో…*

*తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు. అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో ఒక స్తంభం నుండీ వచ్చాడు. హిరణ్య కశ్యపుడిని సంహరించాడు.*


*ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు.*



**త్రేతాయుగంలో…*

*రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,*

*సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని… రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.*


*రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు.*

*ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు.*


*ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి.*

*నరాలు తెగి రక్తం చిందుతున్నాసరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు. యుద్ధంలో గెలిచాడు... ధర్మం గెలిచింది..!*



**ద్వాపరయగంలో…*

*కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్దాన్ని చూడలేదు..*


*ధర్మం చూసుకున్నాడు, పాండవుల పక్షాన నిలుచున్నాడు, అర్జునుడికి రధ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, అబద్ధం ఆడాడు, చివరకు మోసం కూడా చేసాడు...!*


*అవన్నీధర్మం కోసమే చేసాడు, ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది...!*



**కలియుగం…*

*ఇప్పుడు కూడా మనం ప్రతిరోజూ సమస్యలతో పోరాడుతునే వున్నాం..*

*ప్రతి ఒక్కరి మదిలో మంచికి-చెడుకి యుద్ధం జరుగుతునే వుంది..!*

*నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..!*

*అదే నువ్వు నా, నీ, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది.*

*అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది!*

*తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు…*

*నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది..!*

               *ధర్మో రక్షతి రక్షితః*✍️


. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శరీరం

 *శరీరం* ఎంత *చలిస్తే* అంత *ఆరోగ్యం*.

*మనస్సు* ఎంత *స్థిరంగా* ఉంటే అంత *ఆనందం*


దేశపు గర్వాన్ని

 విమానం. రైట్ బ్రదర్ లు కనిపెట్టారు అని చెప్పిన వాడు. నీకు అంతకు ముందే పుష్పకవిమానం. వుందని చెప్పలేదు 

టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని పండగ చేసినవాడు. 101 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీ లే అని చెప్పలేదు. 

3d house అని మురిసిపోయే నీతో .తరాల క్రితం మయసభ వుందని చెప్పలేదు

చదువు విజ్ఞానం అని గొప్పలు పోయె నీకు. మొట్టమొదటి విశ్వ విద్యాలయం భారతదేశం లోదే అని తెలియదు. 

ఆదిమానవుడి గీతలు ఆశ్చర్యంగా చూసే నీకు . అంతకు మునుపే తాళపత్ర గ్రంథాలను రాశారు అని తెలియదు. 

లేజర్ సర్జరీ అని డప్పు కొట్టుకొనే నీకు. సుశ్రుడు చేసిన వైద్యం తెలియదు.

గండు చీమల తో చరకుడు చేసిన శస్త్ర చికిత్స లు తెలియదు. 

ఎందుకంటే.. ఇలాంటి ఎన్నో నీకు తెలియకుండా చేశారు. నీ దేశపు గర్వాన్ని నే చేతితోనే తుడిపించారు. 


ఓ మేధావి. నీకు నిజంగా స్పృహ వుంటే . ఒక్కటే తెలుసుకో 


ఆ బ్రిటీష్ వారి పూర్వీకులు గాడిదల మీద తిరగటం కూడా రాక మునుపే. 

నీ. తాత ముత్తాతలు. గుర్రాలు పున్ చిన రథం మీద. బంగారు నగలు ధరించి తిరిగే వారు. 

వారికి స్నానం తెలియక తోలు చుట్టుకు తిరగక ముందే. నీ తాత ముత్తాతలు. సుగంధ ద్రవ్యాల తో స్నానాలు చేసేవారు 👍

వాగ్భూషణం భూషణం*

*వాగ్భూషణం భూషణం*


సభ్యులకు నమస్కారములు.


మధురంగా మాట్లాడడం ఒక కళ. ఆలా మాట్లాడగలగడమే మనిషికి అసలైన అలంకారము. సందర్భోచితంగా ఎదుటి వారి మనసు గాయపడకుండా మాట్లాడడం గొప్ప లక్షణం.


అందుకే లోకంలో ఇంపుగా మాట్లాడే వారిని ప్రజలు ప్రశంసిస్తారు. మేలు చేసేదే అయినప్పటికీ, వినడానికి కఠోరంగా ఉండే మాటలను ప్రజలు  మనః పూర్వకంగా అంగీకరించరు. కఠిన భాష అనర్థ దాయకమే గాక కార్యభంగము, పరాభవానికి కారణమవుతుంది.


మాటల చేత దేవతలు వరాలిస్తారనీ, రాజులు తమను ఆశ్రయించిన వారిని, వారి మాటల ఆధారంగానే ఆదరిస్తారని, మధురమైన మాటల చేతనే వనితా మణులు వశవర్తులవుతారనీ, వినయ మధురంగా మాట్లాడడం చేతగాని వారికి ఇబ్బందులు కల్గుతాయని ప్రతీతి.


రాజసూయ యాగ సమయములో శ్రీ కృష్ణుని నిందిస్తున్న శిశుపాలునికి ధర్మరాజు చేసిన హిత బోధ ఇది.

*భూరి గుణోన్నతులనదగు వారికి, ధీరులకు, ధరణి వల్లభులకు వాకారుష్యము చన్నే, మాహా దారుణమది విషము కంటే దహనము కంటెన్*.


శిశుపాలా! గొప్ప గుణముల చేత ఉన్నతులైన వారికి, ధీరులకు, రాజులకు కఠినంగా మాట్లాడడం తగునా, వాక్పారుష్యము విషము కంటే, అగ్ని కంటే దారుణమైనది కదా.


*మానవులకు శాస్త్ర సంస్కారమైన మాటలే భూషణాలు గాని, భుజ కీర్తులు, సువర్ణాభరణాలు, అంగలేపనాలు శోభను కలిగించవని భర్తృహరి చెప్పాడు*.


మధురమైన వాక్కులకు మన పురాణాలలో గొప్ప ఉదాహరణ ఆంజనేయ స్వామి. మారుతి చతుర్వేద విజ్ఞాన సంపన్నుడు, వాక్యకోవిదుడైనందున  ఒక్క అప శబ్దము లేకుండా సీతమ్మ తల్లికి సవినయంగా అన్ని వాస్తవాలు వివరించ గలిగాడు. 


శ్రీ రామ, లక్ష్మణులతో శ్రీ హనుమ మాట్లాడిన మాటలను శ్రీ రామచంద్రుల వారు ఎంతగానో మెచ్చుకున్నారు.


శ్రీ ఆంజేయస్వామి సమస్త (నవ) వ్యాకరణ శాస్త్ర ప్రవీణుడు. మాట్లాడేటప్పుడు శరీర వికారాలు లేకుండా,  అటు గంభీర స్వరంతో కాకుండా, మధ్యమ స్వరంతో మధురంగా సంభాషిస్తాడు.


చివరిగా....

*జిహ్వగ్రే వర్త తే లక్ష్మిః, జిహ్వాగ్రే మిత్ర బoధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధృవం*.


మన మాట వల్లనే సంపదలు లభిస్తాయి, మిత్రులు బంధువులు చేరుతారు, మాటల ప్రభావము వల్లనే బంధన ప్రాప్తి కలుగుతుంది. *ఒక్కొక్కప్పుడు మాటల వలననే ప్రాణ హాని కూడా కలుగుతుంది*.


కాబట్టి ఎప్పటికైనా మృదుమధురంగా మాట్లాడడం లాభ మరియు క్షేమకరము.

*ముఖ్యంగా ఈ కలి యుగంలో వాకారుష్యము కూడనే కూడదు*


ధన్యవాదములు.

బిల్ నేను కడతాను

 చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల  చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని?.


ఆ వ్యక్తి ఇలా అన్నాడు....

       జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌ దోశ తినిపిస్తాను అని  మా అమ్మాయికి వాగ్దానం చేశాను.


                   'మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి' అని అతను అడగడం జరిగింది . 'మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు.... మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు ? అతను కొంచం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, ' నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బే మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు'! 

        విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి #యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు ..."నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి" అని వెయిటర్ అనగా....అప్పుడు అది విన్న యజమాని  వెయిటర్ ని  అభినందిస్తూ ఇలా అనడం జరిగింది .... "ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం". అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు 


                  హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో  పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని  పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి ,సత్కరించిన హటల్ యజమానికి, వెయిటర్ కి  కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి ,కూతురు.


          సమయం గడిచిపోయింది (కొన్ని సంవత్సరాల పిమ్మట)...

          ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే #కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి.


       అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థం గా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా .., వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను ,మాతండ్రితో కలసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మెుదటి ర్యాంకు తెచ్చికొన్న విషయం మీకు తెలిసి.. మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు  సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడ అడగక పోవడమే కాక మమల్ని మీరు ఘనంగా సత్కరిృచడం జరిగింది .                                                ఆనాడు మీరిద్దరూ #మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి, మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు.


       ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరుపున, ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.  అలా అని అందరి ముందు హోటల్ యజమనితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది.


నీతి: పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న #ప్రతిభను గుర్తించి గౌరవించండి.... వాళ్ళను ప్రోత్సహించండి 💐🙏💐

తేనె ఉపయోగాలు

 తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 


        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 


                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 


                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 


                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 


              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 


                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో  సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 


              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 


             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 


             సంపూర్ణం     


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పంచాంగం 30.06.2024 Sunday

 ఈ రోజు పంచాంగం 30.06.2024 Sunday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష నవమి తిధి భాను వాసర: రేవతి నక్షత్రం అతిగండ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి మద్యాహ్నం 12:20 వరకు.

రేవతి ఉదయం 07:33 వరకు.


సూర్యోదయం : 05:49

సూర్యాస్తమయం : 06:51


వర్జ్యం : రాత్రి 02:37 నుండి 04:08 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 05:07 నుండి 05:59 వరకు. 


అమృతఘడియలు : తెల్లవారుఝామున 05:17 నుండి ఉదయం 06:48 వరకు తిరిగి రాత్రి 11:47 నుండి 01:05 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

పెద్దన యాశీస్సులు

 శు  భో  ద  యం!!🙏


పెద్దన  యాశీస్సులు

                              ------------------------------ 


శా: "  శ్రీ వక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద  విశ్వంభరా


          దేవిం దత్కమలా  సమీపమున  బ్రీతిం  నిల్పినాడో  యనం


           గా వందారు  సనందనాది  నిజ  భక్త శ్రేణికిం   దోచు   రా

           

           జీవాక్షుండుఁ  గృతార్ధు  సేయు  శుభదృష్టిన్  కృష్ణరాయాధిపున్


                           మను చరిత్రము  కావ్యారంభమున  కృతిభర్త యగు శ్రీకృష్ణరాయ  సార్వ భౌమునకు  పెద్దన యెసఁగు

ఆశీర్వచనము.


                   ఆది లక్ష్మియు  శ్రీహరియు  సరసములలో  దేలుచుండ  నామె వక్షోజములకు  అలంకరించుకొనిన  కస్తూరి

శ్రీహరి  వక్షస్థలమున  నంటినది.  అది జూచి  సనక సనందనాది మునులు ఆహా! శ్రీహరి యెంతగొప్పవాడు! శ్రీ దేవితో సమముగా భూదేవికి గూడ సముచిత స్థానమునొసంగినాడనుచు మురియుచు  వందనముల నొనరింప  సంతసమున

విలసిల్లు  ఆహరి దయాళువై కృష్ణరాయలను  శుభదృష్టితో జూచి యనుగ్రహించుగాక!

   

                                అనిదీని తాత్పర్యము!


         శ్రీదేవి  విష్ణువక్షస్థల  నివాసి. భూదేవికి ఆభాగ్యములేదు. ఇపుడీ కస్తురి పూతలు జూడ ఆమెకుగూడ హరి తనహృదయమున  నివాస మేర్పరచెనా ?యను భ్రాంతిని సనందనాదులకు కలిగించినది.కావున భ్రాంతిమంత

మను నలంకారము ఇందుకలదు.

                         

                 కృతిభర్త రాయల కిరువురు భార్యలు  తిరుమలదేవి, చిన్నాదేవి,లు. వారిరువురను  శ్రీహరివలెనీవు సమముగా నేలి దక్షిణ నాయకుడ వనిపించు కొందువుగాక! యని రాయల కుపదేశము (వ్యంగ్యము) 


           నావిష్ణుః పృధివీపతిః"- అను న్యాయముచే  ప్రభువుకూడా విష్ణువుతో సమానుడే! విష్ణువు ,జగత్పోషకుడు. రాయలుకూడ జగద్రక్షకుఁడై వర్ధిల్లవలెనని భావము.


                 శ్రీదేవి కలిమిచే భాగ్యము, భూదేవి కలిమిచే  పంటల ,సమృధ్ధితో  నొప్పుదువుగాక యని యాశీస్సు!


ఈవిధముగా "ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశోవాపి తన్ముఖమ్" అను నాలంకారిక సూత్రాను సారముగా  ఆశీర్వాద పురస్సరముగా పెద్దనగారు  మనుచరిత్రమును  ప్రారంభించినారు. 


                                                           స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కాటుక పూసినట్లు

 ఉ.

కాటుక పూసినట్లు మసిఁ గాఢతఁ బుల్మిన యట్లు దిక్కరుల్ 

ధాటిగఁ నొక్కటై యురికి ధారుణిఁ గ్రమ్మినయట్లు చీకటుల్ 

కోటలుగట్ట మేఘములు గూడ మహార్ణవ మాగ్రహించుచున్ 

చేటును గల్గజేసెనొ యన చిందిలె వర్షము భీతిగొల్పుచున్ 

*~శ్రీశర్మద*

8333844664

మోక్ష సాధనకు మార్గం*

 *మోక్ష సాధనకు మార్గం*




🙏 *భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.* 


💐 *మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం,* 


💐 *దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం,* 


💐 *నామ సంకీర్తన చేయడం  వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే.* 


1. *కృతయుగంలో ధ్యానం* 

2. *త్రేతాయుగంలో యజ్ఞాలు* 

3. *ద్వాపర యుగంలో అర్చనలు* 

4. *కలియుగంలో భగవన్నామ సంకీర్తనం* 


🪷 పై నాలుగు మార్గాలు, భగవంతుని అనుగ్రహానికి,  మోక్షప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు.


🪷 *ముక్తి సాధనాలు* గా *కర్మయోగం,* 

*రాజయోగం,* 

*భక్తియోగం,* 

*జ్ఞాన యోగం* 

అని నాలుగు యోగాలు శాస్త్రాలలో తెలిపారు.


💐 సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు.  ఫలాపేక్ష వదలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమనీ గీతాచార్యుడు బోధించాడు. 

దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామకర్మ - బంధం నుండి విడిపిస్తుంది. 


💐 *ప్రతి పనినీ భగవత్‌ కైంకర్యమనే భావంతో చేయాలి. ఇదే కర్మయోగం.* 


💐 *చంచలమైన మనస్సును అరికట్టడమే రాజయోగం ఇది బ్రహ్మప్రాప్తికి రాజమార్గం కావడం వలన రాజయోగం అనబడింది.* 


💐 అభ్యాసంతోనూ, వైరాగ్యంతోనూ మనస్సును అరికట్టవచ్చని గీతలో చెప్పబడింది. 


💐 *తత్వ విచారణలో జీవాత్మ స్వరూపాన్ని పరమాత్మతో దాని సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగం.* 


💐 అద్వైత మతస్తులు - జ్ఞానయోగమే అన్ని యోగాల కంటే శ్రేష్ఠమని చెబుతారు. అవిద్య, అజ్ఞానం తొలగినప్పుడు జీవాత్మకు పరమాత్మకు తేడా ఉండదని చెబుతారు. 


💐 ఈ కాలంలో తరించడానికి భక్తియోగమే సులభోపాయం. 


💐 *అనన్యమైన భక్తి చేత మాత్రమే భగవంతుణ్ని తెలుసుకోవడం, దర్శించడం ఆయనలో ప్రవేశించడం సాధ్యమవుతుంది.* 


💐 సాత్వికాహారాన్నే భుజించడం, విషయసుఖాలపై విరక్తి, శాస్త్రవిధిని పాటించడం, సత్యమార్గాన్ని అనుసరించడం, అహంకారానికి లోను కాకుండా ఉండడం భక్తియోగానికి మార్గాలు.


*ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి* 


💐 సమస్త ప్రాణుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి, భూత దయ గలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్థాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి. 


💐 *అలా జీవితం కొనసాగించి, మరణం తరువాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగలగడమే అసలైన మోక్షం.*

మానసిక జపమునకు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝    *శుచిర్వావ్య శుచిర్వాపి గచ్చ న్తిష్ఠన్స్వపన్నపి*

           *మంత్రైక శరణో విద్యాన్మన నైవ సదావనేత్*

          *నదోషో మానసే జప్యే సర్వదేశేపి సర్వదా*

           *జపనిష్ఠో ద్విజ శ్రేష్టోఽఖిల యజ్ఞ ఫలం లభేత్*॥


*తా𝕝𝕝  శుద్ధుడైగాని... యపరిశుద్ధుడైగాని.. నడచు వాడై.. లేదా నిలుచున్న వాడై .. లేదా నిద్రించువాడైగాని... మంత్రైక శరణుడై మానసికముగ జేసిన వానికే దోషము లేదు. మానసిక జపమునకు దేశకాల నియమములేదు*.


 ✍️💐🌷🌹🙏

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 30.06.2024

ఆది వారం (భాను వాసరే)  

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే కృష్ణ పక్షే నవమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే   కృష్ణ పక్షే నవమ్యౌపరి దశమ్యాం. 

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.32

సూ.అ.6.34

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

కృష్ణ పక్షం నవమి మ. 1.17 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం రేవతి ఉ.9.10 వరకు. 

అమృతం  ఉ.6.56 ల 8.26 వరకు. 

పునరమృతం రా. 12.54 ల 2.24 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.50 ల 5.32 వరకు. 

వర్జ్యం  రా.తె.3.54 ల 5.24 వరకు.

యోగం అతిగండ సా. 6.12 వరకు. 

కరణం గరజి మ.1.17 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ. 12.00 ల 1.30 వరకు.      

***********   

 పుణ్యతిధి జ్యేష్ఠ బహుళ దశమి

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏