18, అక్టోబర్ 2022, మంగళవారం

ఆనందం యొక్క అర్థం!*

 *18-Oct-22, Enlightenment Story*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*ఆనందం యొక్క అర్థం!*

 

*నేను మీ ముఖాన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నాను, తద్వారా నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు, నేను మిమ్మల్ని గుర్తించగలను మరియు మరోసారి ధన్యవాదాలు చెప్పగలను.*


*టెలిఫోన్ ఇంటర్వ్యూలో భారతీయ బిలియనీర్ రతన్‌జీ టాటాను రేడియో ప్రెజెంటర్ అడిగినప్పుడు:*


*"సర్, జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాన్ని పొందినప్పుడు మీకు ఏమి గుర్తుకొస్తుంది"?*


 *రతన్‌జీ టాటా చెప్పారు. నేను జీవితంలో నాలుగు సంతోష దశలను దాటాను.మరియు నేను చివరకు నిజమైన ఆనందం యొక్క అర్థం   అర్థం చేసుకున్నాను."*


*‘మొదటి దశ’ సంపద మరియు వనరులను కూడబెట్టుకోవడం.కానీ ఈ దశలో నేను కోరుకున్నంత ఆనందం లభించలేదు.*


*ఆపై విలువైన వస్తువులు మరియు వస్తువులను సేకరించే ‘రెండవ దశ’ వచ్చింది.కానీ ఈ విషయం యొక్క ప్రభావం కూడా తాత్కాలికమైనదని మరియు విలువైన వస్తువుల మెరుపు ఎక్కువ కాలం ఉండదని నేను గ్రహించాను.*


*అప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ పొందడానికి ‘మూడవ దశ’ వచ్చింది.అప్పుడే నాకు ఇండియా మరియు ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ఉండేది.*


*నేను భారతదేశం మరియు ఆసియాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిని కూడా.కానీ ఇక్కడ కూడా నేను ఊహించినంత ఆనందం లభించలేదు.*


*’నాల్గవ అడుగు’ కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్‌చైర్లు కొనమని నా స్నేహితుడు నన్ను అడిగాడు.దాదాపు 200 మంది పిల్లలు.*


*స్నేహితుడి కోరికతో, నేను వెంటనే వీల్ చైర్లు కొన్నాను.కానీ మిత్రుడు నేను అతనితో వెళ్లి పిల్లలకు వీల్ చైర్లు ఇవ్వమని పట్టుబట్టాడు.నేను రెడీ అయ్యి అతనితో వెళ్ళాను.*


*అక్కడ నేను నా స్వంత చేతులతో ఈ వీల్ చైర్లను ఈ పిల్లలకు ఇచ్చాను.ఆ పిల్లల ముఖాల్లో విచిత్రమైన ఆనందం కనిపించింది.*


*వాళ్లంతా వీల్‌ఛైర్‌లో కూర్చొని నడవడం, సరదాగా గడపడం చూశాను.వారు ఒక పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు, అక్కడ వారు విజేత బహుమతిని_ పంచుకున్నారు.*


*నా లోపల నిజమైన ఆనందాన్ని అనుభవించాను. నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు, పిల్లలలో ఒకడు నా కాలు పట్టుకున్నాడు.నేను నెమ్మదిగా నా కాళ్ళను విడిపించడానికి ప్రయత్నించాను, కాని పిల్లవాడు నా ముఖం వైపు చూస్తూ_ నా కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు.*


*నేను వంగి పిల్లవాడిని అడిగాను: "మీకు ఇంకేమైనా కావాలా"? ఆ పిల్లాడు నాకు ఇచ్చిన సమాధానం నన్ను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా తద్వారా పూర్తిగా నా అసలైన ఆనందం యొక్క అర్థం మార్చేసింది.*


 *ఆ పిల్లవాడు ఇలా అన్నాడు:*

 

 *"నేను మీ ముఖాన్నిగుర్తుంచుకోవాలనుకుంటున్నాను, తద్వారా నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు, నేను మిమ్మల్ని గుర్తించగలను మరియు మరోసారి ధన్యవాదాలు చెప్పగలను".*


 *ప్రేమ మరియు దయ మాత్రమే నిధి, ఇది మీ హృదయాన్ని ఆనందం మరియు శాంతితో నింపుతుంది, మిగిలినవి కేవలం భ్రమలు మాత్రమే.*


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏 *లోకాసమస్తాసుఖినోభవన్తు*!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

power of Tulasi


The power of Tulasi


Tulasi mahima is spoken of by Prahlada in Padma Purana, said PT. Seshadri in a discourse. Prahlada says that rishis met Sadananda. They asked him whose name, if uttered, would destroy our sins and give us punyas. Sadananda told them about how Tulasi Devi's avatara happened.


He said Rudra had told his son Subrahmanya about Tu lasi Devi's greatness. Sadananda said that when the milky ocean was churned, using the Mantara mountain as the churning rod, many things appeared from the ocean, in cluding nectar. Sacred drops of water fell from Lord Na rayana's eye into the nectar pot. Tulasi came from one of these drops. Lord Narayana took for Himself only three entities that emanated from the ocean. They were Laksh mi, Kaustubha gem and Tulasi. Of these, He wore the first two on His chest, but He wore Tulasi all over His body. The Lord wanted to grant Tulasi a boon. Tulasi requested that no matter what sins a person had committed, if he prayed to Tulasi, his sins should be wiped out.


She further requested that those who did an archana to the Lord using Tulasi and those who consumed Tulasi of fered at His feet must reach His feet. She also prayed that He must always think of her, just as she would be thinking of Him always. The Lord gave her the boons she asked for. In addition, He said that there were lots of flowers like lo tuses, maalasugandha, jasmine and so on, which were of fered to Him in worship. Some even offered flowers made of gold. But if these flowers were offered without Tulasi, He would not be pleased. Moksha is guaranteed to those who use Tulasi when they do their daily aradhana to the Lord.



గోమాత మహత్యం

 🎻🌹🙏*🙏 గోమాత మహత్యం గురించి శివుడు పార్వతిదేవికి చేప్పిన మాటలు 🙏*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


*గోవును పూజించిన సర్వపాపములు నశించును… గోమాత నందు ఎంత మంది దేవతలు ఉన్నరో మీకు తెలుసా…?*


ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు. 


” ఓ పార్వతీ! గోమాత నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోమాతనదు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. 


ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.


కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. 


గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణంH చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.


” శ్రీ కృష్ణ పరమాత్మ” గోవును ఎంతో భక్తి తో శ్రద్ధ తో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా జనులారా గోవును పూజించిన ముక్తిని  పొందెదరు.

🙏🏻🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మహర్షుల చరిత్రలు..

 *మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 52. భృగు మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁


☘️భృగు మహర్షి ఈయన ప్రస్తావన ఆది పర్వము ప్రథమాశ్వాసములో వస్తుంది.


🍁బ్రహ్మదేవుని హృదయమునుంచి జన్మించినవాడు భృగువు. ఈయన నవ బ్రహ్మలలో ఒకడుగా పేరు పొందాడు. 


☘️విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే . భృగుమహర్షి ఖ్యాతిని పెళ్ళి చేసుకుని ధాత విధాతల్నీ శ్రీ అనే కూతుర్నీ , ఉశన వల్ల యశనుడనే కొడుకునీ , పులోమ వల్ల చ్యవనుడినీ పొందాడు . యశనుడంటే ఎవరోకాదు రాక్షస గురువు శుక్రాచార్యుడే .


🍁భృగుమహర్షి భార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు . అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు . 


☘️రాక్షసుడు పులోమని ఎత్తుకుపోతుంటే ఆమె గర్భంలో వున్న పిల్లాడు కిందపడిపోయాడు . భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు .


🍁 అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడతావు వన్నాడు .

పూర్వం దేవతలు రాక్షసుల్ని స్వర్గలోకంలో లేకుండా గెంటేవారు .


☘️ రాక్షస గురువు శుక్రాచార్యుడు శివుణ్ణి మెప్పించి సంజీవిని తెస్తానని వెళ్ళాడు . ఇదే సమయంలో దేవతలు రాక్షసుల్ని చంపెయ్యడం మొదలు పెట్టారు .


🍁 భృగుమహర్షి భార్య ఉశన దగ్గరకు వెళ్ళి తమను కాపాడమని శరణు కోరారు రాక్షసులు . ఇంద్రుడితో సహా దేవతలందర్ని స్తంభించిపోయేలా శపించింది ఉశన . 


☘️కొంతమంది దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు . స్త్రీని చంపడం పాపం కదా భయపెడదామనుకున్నాడు విష్ణుమూర్తి . ఈ లోపునే ఉశన విష్ణుమూర్తినే శపించాలని అక్షరం అనబోయేలోగా విష్ణుమూర్తి ఆవిడ కంఠంలో బాణం వేశాడు . 


🍁వెంటనే ఆమె చనిపోయింది . భృగు మహర్షి వచ్చి ఇదంతా చూసి ఒక స్త్రీని చంపావు , నీకు ఇంత అహంకారమా ? అని భూలోకంలో మనిషివై పుడుతూ మరణిస్తూ సుఖదుఃఖాలనుభవిస్తావని విష్ణుమూర్తిని శపించాడు .


☘️మంత్రజలంతో ఉశనని బ్రతికించాడు . నేనిచ్చిన వరాలో నన్నే శపిస్తావా ? అన్నాడు విష్ణుమూర్తి . నిన్ను శపించడం ఎవరితరం ? దుష్టుల్ని శిక్షించడానికి , శిష్టుల్ని రక్షించడానికి అవతారం ఎత్తడానికి నన్ను ఉపయోగించుకున్నావు . 


🍁నీ అవతారం వల్ల దర్మసంస్థాపన అవుతుందిలే అన్నాడు భృగు మహర్షి . భృగు మహర్షి శక్తిని చూసి మిగిలిన ఋషులు ఆశ్చర్యపోతూ ముక్కు మీద వేలేసుకున్నారు . 


☘️సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది . వెంటనే త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు .

        

🍁ఒకసారి మునులందరి మధ్య త్రిమూర్తులలో అధికుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ విషయం తెలుసుకురమ్మని అందరూ భృగుమహర్షిని పంపారు.

          

☘️భృగువు ముందు బ్రహ్మ దగ్గరకి వెళ్లాడు. ఆయన సృష్టి క్రార్యక్రమంలో ఉండి చూచి చూడనట్లు ఉపేక్షించాడు. భృగువు కోపంలో పూజకి అనర్హుడివి అని బ్రహ్మను శపించి అక్కడ నుండి కైలాసంకు వెళ్లాడు. 


🍁అక్కడ శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువును చూచీ చూడనట్ల ఉన్నారు. శివుని కేవలం నీ లింగమునకు మాత్రమే అభిషేకం జరుగును అని శపించి వైకుంఠంకు వెళ్లడు. 


☘️అక్కడ కూడా విష్ణువు కళ్లు మూసుకొని తనను గౌరవించలేదని  గుండెలమీద తన్నాడు భృగుడు 


🍁వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు క్షమించమన్నాడు . నీపాదాలకున్న నీళ్ళు తగిలి నా పొట్టలో వున్న లోకాలు పవిత్రమయ్యాయి . 


☘️నీ పాదం నా భుజాలకి అలంకారమైంది . నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు - విష్ణుమూర్తి . 


🍁 అప్పుడు విష్ణువు వినయంతో భృగువుకు అతిధి మర్యాదలు చేసి కాళ్లు నొక్కుతూ ఆయన పాదంలో ఉన్న కన్నును నొక్కివేశాడు. ఆయన అహంకారం పోయి విష్ణువుని స్తుతించాడు.


☘️అందరిలోకి విష్ణువే గొప్ప అని నిర్ణయించి మునులకు తెలియచేశాడు. అందరూ విష్ణువుని పూజించటం మొదలుపెట్టారు.

    

🍁యవనాశ్వడనే రాజు పిల్లలు లేక బాధపడి భృగుమహర్షి ఆశ్రమంకు వచ్చాడు. భృగుమహర్షి ఆ రాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు.


☘️మంత్రజలం జాగ్రత్త పెట్టమని బ్రాహ్మణులకిచ్చాడు .

అందరూ నిద్రపోతున్న సమయంలో రాజుకి దాహం వేసి ఆ నీళ్ళు తాగేశాడు . భృగు మహర్షికి ఆ విషయం తెలిసి నీ భార్య తాగాల్సిన మంత్రజలం నువ్వే తాగావు , కొడుకుని కూడా నువ్వేకంటావు అన్నాడు .


🍁 తర్వాత వంద సంవత్సరాలకి రాజు ఎడమభాగం చీల్చుకుని గొప్ప తేజస్సుతో ఏడుగురు చక్రవర్తుల్లో ఒకడైన మాంధాత పుట్టాడు .


☘️ఒకసారి వింధ్యపర్వత ప్రాంతంలో బాగా కరువొచ్చింది . పితృదేవతలకి ఏమీ పెట్టలేని స్థితిలో భృగు మహర్షి కైలాస పర్వత ప్రాంతానికి వచ్చి ఆశ్రమం కట్టుకుని వున్నాడు .


🍁 పులి మొహంతో భార్యను తీసుకుని ఒక విధ్యాధరుడొచ్చి నాకు ఈ ముఖం ఎలా వచ్చిందో తెలియదు , ఇది పోయే మార్గం చెప్పమని బ్రతిమాలుకున్నాడు .


☘️నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు తలస్నానం చేశావు ,  ఆ కీడు ఇలా చేసిందన్నాడు భృగు మహర్షి .


🍁మాఘమాసంలో స్నానం చేశాక నువ్వు మళ్ళీ మామూలుగా అవుతావని చెప్పాడు . 

ఆతను మాఘస్నానం చేసి మామూలు ముఖం పొంది భృగువుకు నమస్కరించి వెళ్లాడు.


☘️భృగువు చెప్పినట్లు శివుని గురించి తపస్సు చేసి పరశురాముడు భార్గవాస్త్రం‍ను సంపాదించుకున్నాడు. భృగుమహర్షి  జ్యోతిశాస్త్రమును రచించాడు. 


🍁ఆ గ్రంథమే భృగు సూత్రములనే పేర ప్రసిద్ధికెక్కింది. ఈయన స్మృతి ఒకటి ఉంది. ఈయన ధర్మ ప్రవక్తగా విలసిల్లాడు. తపశ్శక్తిచే బ్రహ్మత్వాన్ని పొందాడు.


☘️భృగు మహర్షి ధర్మశాస్త్ర ప్రవక్తగా పేరు పొందాడు . ఈయన జ్యోతిష శాస్త్రం రాశాడు . దాంట్లో ఎనిమిది అధ్యాయాలున్నాయి . సృష్టికోసం బ్రహ్మతో సృష్టించబడి చివరకి బ్రహ్మలోనే అయిపోయాడు భృగు మహర్షి .


🍁ఇదండీ మనము తెలుసుకున్న భృగు మహర్షి చరిత్ర రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


సేకరణ: కె.వి. రమణమూర్తి వాట్సాప్ పోస్ట్. 

☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

క్షౌరకర్మను గురించి

 

క్షౌరకర్మను గురించి శాస్త్రము ఒక క్రమపద్ధతిని నిర్దిష్టపరచినది.

మనలో చాలామంది ఆదివారం సెలవు అని ఆదివారం నాడు  క్షౌరకర్మ (Hair Cutting) కు వెళుతుంటారునిజానికి ఆదివారం పనికిరాదని చాలామందికి తెలియదు వారాలు తిధులు క్షౌరకర్మను ఆచరించాలని మన శాస్త్రాలు తెలుపుతున్నాయో తెలుసుకుందాం

క్రింది తిధుల యందు క్షుర కర్మ నిషేధం. అవి.

ఏకాదశీ, చతుర్దశీ, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి (భద్రా) ఇత్యాదులయందు, మరియు వ్రతదినములయందు, శ్రాద్ధదినముల యందు

ఇక వారములు మంగళ,, శనివారములయందు క్షౌరకర్మ పనికిరాదు. ఆదివారము క్షౌరము చేయించుకొనుటవలన ఒకమాసము ఆయువును, శనివారము క్షురకర్మ చేయించుకొనుటచేత ఏడుమాసములు ఆయువును, భౌమవాసరము (మంగళవారము) వలన ఎనిమిది మాసముల ఆయువును, ఆయా దినములకు చెందిన అభిమాన దేవతలు క్షీణింపచేయుదురు. ఇదేవిధముగా బుధవారము క్షౌరము చేయించుకొనుటచే ఐదు మాసముల ఆయుర్దాయమును, సోమవారము వలన ఏడుమాసముల ఆయువును, గురువారమువలన పదిమాసముల ఆయుష్యమును, శుక్రవారమువలన పదునొకండు నెలల ఆయువును, ఆయా దినములయొక్క అభిమానదేవతలు వృద్ధి చేయుదురు. గృహస్థులు మరియు ఒకే ఒక పుత్రుడు గలవారలు సోమవారమునాడు చేయించుకొనగూడదు. అట్లే విద్యను, లక్ష్మిని కోరుకొనెడువారలు క్షురకర్మ చేయించుకొనుట పనికిరాదు. అని ఈవిధముగా గూర్చి గర్గాదిమహర్షులు వచించియున్నారు

ఇక బ్రాహ్మణుల క్షౌర విధిని పరిశీలిద్దాంప్రతి బ్రాహ్మణుడు శిరో ముండనం (గుండు) చేయించుకోవలెను  శిఖదారణ (పిలక కలిగి ఉండటం.)  చేయటం తప్పనిసరి. అది మూర్ఖత్వం కాదు ప్రతి బ్రాహ్మడు విధిగా శిఖ కలిగి ఉండటం ఆవశ్యకంశిఖ లేకుండా ఆచరించే క్రతువు కూడా ఫలితాలను ఇవ్వదుమన దురదృష్టం ఏమిటంటే కేవలం పితృ కర్మలను ఆచరించేటప్పుడే శిఖ ధరించటం ఆనవాయతీగా అనుకుంటున్నాముకానీ శిఖ లేకుండా సంధ్యావందనం చేయటానికి కూడా అయోగుదే  అది తెలుసుకొనవలెను.. పౌరోహితం చేసే బ్రాహ్మణోత్తములు విషయం ప్రతి బ్రాహ్మణుడికి తెలపాల్సిన అవసరం వున్నదిముందుగా వారు ఆచరించాల్సిన విధి  కుడా వున్నది. . ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు చేకూరుతాయి అన్నది మన మహర్షులు శోధించి సాధించి మనకు ఒక చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారుకేవలం మనం వారిని అనుసరించివాటిని ఆచరించి తరించటమే మన కర్తవ్యము

విషయములను గీత ప్రెస్ వారి ప్రచురణ "నిత్యకర్మ - పూజా ప్రకాశిక " అను గ్రంధము నుండి సేకరించపడినవి . బ్రాహ్మణులు ఆచరించవలసిన అనేక విషయములను అందు ప్రస్తావించబడెను గ్రంధము ధర వెరసి రూ . 150/- వలసిన వారు గీతాప్రెస్ పుస్తక బండారం నుండి ఖరీదు చేయవచ్చు. సికిందరాబాదు రెయిల్వేస్టేషన్ ప్లాట్ఫారం నెం 1 నందు స్టాలు కలదు