14, సెప్టెంబర్ 2021, మంగళవారం

*శ్రీ పరమానంద యోగి*

 *శ్రీ పరమానంద యోగి*

🕉️🌞🌏🌙🌟🚩


 ( శ్రీ పాండురంగ స్వామి భక్తుడు )



పండరీపురం దగ్గరవున్న చంద్రభాగానది ఒడ్డున పరమానంద యోగి అనే పరమభక్తుడు ఉండేవాడు. అతడు అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ వుండేవాడు.



ప్రతి ఉదయం ఆయన లేవగానే, యింటి వద్ద కాలకృత్యాలు తీర్చుకుని, చంద్రభాగా నదిలో స్నానమాచరించి, నది ఒడ్డున నిలబడి, భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు. ప్రతి శ్లోకం చివరన ఓం పాండురంగాయనమ : అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్ధించేవాడు. ఈ కార్యక్రమం పరమానంద యోగి, క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేసేవాడు.



ఒకరోజు ఆ యోగి వుంటున్న గ్రామంలో భారీవర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది. ఆ సమయంలో, శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు, ఆ గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ వర్తకుని వద్ద వున్న అమూల్యమైన శాలువాలు తడిసిపోయే ప్రమాదం వుండడంతో, తనకు వచ్చే అపారనష్టాన్ని తలుచుకుంటూ, ఆ నష్ట నివారణకు, ప్రతి యింటికీ వెళ్లి , తనకు ఆరాత్రికి ఆశ్రయమివ్వమని కోరసాగాడు.



కానీ, అందరివీ, చిన్న చిన్న యిండ్లు అవడం వలన, యెవరూ ఆయన కోరిక మన్నించ లేదు. సరిగదా, ఆయన ముఖం మీదే తలుపులు వేసుకోసాగారు. ఆ వర్తకుడు, యెంతో దిగులుగా తిరుగుతూ, పరమానంద యోగి వుంటున్న చిన్న గుడిసెకు కూడా వచ్చి, ఆశ్రయం అడిగాడు.



ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద, వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి, గుడిసె మొత్తంలో నీళ్లుకారని కొద్ది ప్రదేశాన్ని చూపించి, అక్కడ ఆయన అమూల్య వస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు. ఆ చిన్న ప్రదేశంలోనే వర్షంవస్తే,యోగి పడుకునేది, తడవకుండా, అయినా, ఆ సమయంలో, తన అవసరం తనకు గుర్తు రాలేదు,యోగికి.. ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టి, తానూ, ఆ వ్యాపారి, గుడిసెలో యింకొక ప్రక్క తడిగా వున్న ప్రదేశంలోనే తలదాచుకుని, ఆ రాత్రంతా కాలక్షేపం చేసారు, భగవన్నామ స్మరణలో.



మరునాడు తెల్లవారుతూనే, వర్షం తగ్గుముఖం పట్టింది. ఆవ్యాపారి పరమానంద యింటి నుండి బయలుదేరుతూ, యెంతో కృతజ్ఞతా పూర్వకంగా, ' మీరు నన్నూ, నా కుటుంబాన్ని, కష్టాల బారిన పడకుండా కాపాడారు. మీ ఋణం తీర్చుకోలేనిది. నా కృతజ్ఞతా సూచకంగా, యీ శాలువా తమరికి బహూకరిస్తున్నాను. కాదనకండి. ' అని ఒక అతి ఖరీదైన, సుందరమైన, శాలువా యోగికి యిచ్చి నమస్కరిస్తూ శలవు తీసుకున్నాడు.



ఆశాలువాని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి. దానిని నడుముకు కట్టుకుని, యధాప్రకారంగా, నది ఒడ్డుకు బయలుదేరి యోగి, భగవద్గీత శ్లోకాలు వల్లెవేయడం ప్రారంభించాడు. అయితే, నోరు దాని పని చేస్తున్నది గానీ, చేతులు మాత్రం, యెక్కువసేపు జోడించి, పాండురంగని స్తుతించలేకపోతున్నాడు. ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ అందమైన, ఖరీదైన శాలువా తడిసిపోతుందో, మరకలు పడతాయో అని మాటిమాటికీ, దానిని సర్దుకోవడమే సరిపోయింది, యోగీ పరమానందకి.



యోగికి శ్లోకాలమీద ధ్యాస కుదరడంలేదు, శ్లోకం చివర ఓం నమో పాండురంగాయనమ : అన్నాడో లేదో గమనించడంలేదు. ఈ విధంగా ఆరోజు ప్రార్ధన ముగిసింది. ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి. తాను చేసిన పొరపాటు అర్ధమైంది. అపరాధనా భావం ముంచెత్తింది యోగీ పరమానందని.



తాను చేసిన ఘోరతప్పిదం తనకు అర్ధమైంది. తననుతాను శిక్షించు కోవాలి

అనుకున్నాడు. వెంటనే, దగ్గరలోని తన వరిపొలంలోకి వెళ్లి, నాగలిని ఆ శాలువాతో కట్టి, దానిని తన నడుముకు బిగించుకుని, పాండురంగని ధ్యానం చేస్తూ, ఆ వరిపొలం దున్నసాగాడు.



ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి, తాను నాగలితో ముడివేసుకున్న శాలువాను విప్పి, ' ఎవరు నిన్ను యింత ఘోరశిక్షకు గురిచేసారు. ' అని లాలనగా అడిగాడు. దానికి సమాధానంగా ' బాబూ ! నన్ను ఆపవద్దు. నన్ను యెవరూ శిక్షించలేదు. నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే, నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను. ' అని చెప్పిమళ్ళీ శాలువా కట్టుకోబోయాడు.



అందుకు ఆ బాలుడు, ' అయితే, ఆ పాండురంగడే, నిన్ను ఆపితే ఆగుతావా ? ' అని అంటూ, పాండురంగని రూపంలో ప్రత్యక్షమై, ' నీలో ఏ తప్పిదము లేదు. నీకు ఏకొంచెం మమకార వాసనలు వున్నా, అవి యీ నాటితో తీరిపోవడానికే, నీకు యీ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను. నీవు ఆ వ్యాపారినుండి, యేమీ ఆశించి అతనికి ఆశ్రయం కలిపించలేదని నాకు తెలుసు పరమానందా ! నీలో వున్న అపరాధభావం యిప్పటితో, తొలగిపోయింది. ' అని భుజం తట్టి పాండురంగడు అంతర్ధానమయ్యాడు.



ఆనందాశ్రువులు వర్షిస్తుండగా, పరమానంద యోగి, పాండురంగని రూపాన్నే తలుచుకుంటూ, అక్కడే కూర్చుండిపోయాడు.



ప్రహ్లాదుడు చెప్పిన నవ విధ భక్తి లక్షణాలలో సారాంశం ఇదేకదా ! శ్రవణం, కీర్తనం, విష్ణోహ్స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం . ఇవే కదా నవ లక్షణాలు.


🕉️🌞🌏🌙🌟🚩

శ్రీమద్భాగవతము

 *14.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2261(౨౨౬౧)*


*10.1-1378-*


*శా. మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే*

*సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగా*

*బంచత్వంబును బొంది యున్న విమతుం బద్మాక్షుఁ డీడ్చెన్ వడిం*

*బంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై.* 🌺



*_భావము: శ్రీకృష్ణుడు తోసిన వేగానికి గద్దె మీద నుండి రంగస్థలం లోకి పడిన కంసుడు కూలిపోయి ఎటువంటి కదలిక లేక మరణించాడు. ఇది చూచిన ప్రజలు ఆశ్చర్యచకితులు కాగా, సింహము ఏనుగును ఈడ్చిన విధముగా, బాహుబలుడగు శ్రీకృష్ణుడు ఆ కంసుని శరీరాన్ని ఆ గోదా చుట్టూ ఈడుస్తూ తిరిగాడు._* 🙏



*_Meaning: As Sri Krishna heaved Kamsa on the wrestling ring, Kamsa fell down, remained motionless for a while and breathed his last. Seeing this, the spectators were bewildered and like a fierce lion hauling an elephant, amazingly powerful Sri Krishna dragged the body of cruel Kamsa around the wrestling arena._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

థైరాయిడ్ వ్యాధి సంపూర్ణ వివరణ

 థైరాయిడ్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -


  ఈ థైరాయిడ్ వ్యాధి నందు రెండు రకాలు కలవు. అవి .


  * హైపో థైరాయిడిజం .


  * హైపర్ థైరాయిడిజం .


      ముందుగా మీకు హైపో థైరాయిడిజం గురించి వివరిస్తాను.


 హైపో థైరాయిడ్ -


      థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువుగా ఉండటం వలన హైపొ థైరాయిడ్ వస్తుంది. ఇది T3 ( Tridothyronine) , T4 (Thyroxine) ను థైరాయిడ్ గ్రంథి తక్కువుగా స్రవించడం మూలాన ఈ సమస్య వచ్చును.


 లక్షణాలు -


 * వీరి చర్మం పొడిగా ఉంటుంది. ముఖం ఉబ్బుగా , గుండ్రంగా అవుతుంది. త్వరగా అలిసిపోవడం , బలహీనంగా ఉండి చలికి తట్టుకోలేరు.


 * చెమట తక్కువుగా వస్తుంది. జుట్టు ఎక్కువుగా రాలిపోతుంది. మానసికపరమైన ఆందోళన ఎక్కువుగా ఉండును.


 * గుండె పెరుగుతుంది . గొంతులో మార్పు వస్తుంది. కళ్ల కింద ఉబ్బుగా ఉంటుంది. మాటల స్పష్టత తగ్గును. కండరాల శక్తి క్షీణిస్తుంది. మలబద్దకం , పొట్ట ఉబ్బుగా ఉండును. రక్తహీనత కలిగి ఉండి దేనిమీద ఆసక్తి లేకపోవటం , కోపం , చిరాకు , విసుగు ఎక్కువుగా ఉండును. జుట్టు రంగు తగ్గును. శరీరం ఉదయం ఒకలాగా సాయంత్రం ఒకరకంగా ఉండును.


 * ఈ సమస్య ఎక్కువుగా స్త్రీలలో కనిపిస్తుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్యవయస్సు ఉన్నవారికి వస్తుంది. ఉదయం పూట వదులుగా ఉన్న జాకెట్లు సాయంత్రం అయ్యేసరికి బిగుతుగా అగును. బరువు పెరుగుతారు.


 * మలబద్దకం ఎక్కువుగా ఉండును. ఋతువు సరైన సమయానికి రాదు . ఋతు సమయంలో కడుపులో నొప్పి ఉండును.


 * కండరాలు మరియు జాయింట్ నొప్పులు అధికంగా ఉండును. భుజాలు , చేతులు , కాళ్లు నొప్పి ఎక్కువుగా ఉండును.


 * శరీరం నందు బద్ధకం ఎక్కువుగా ఉండును. ఎక్కువుగా జలుబు చేయును .


 * చేతి మరియు కాలు వేళ్ళ గోళ్లు పగుళ్లు రావచ్చును. సీరం సోడియం తక్కువుగా ఉండును. రక్తహీనత ఉండును.


 * లివర్ ఎంజైమ్స్ ఎక్కువుగా ఉండును. శరీర ఉష్ణోగ్రత తక్కువుగా ఉండును. గుండెవేగం తక్కువుగా ఉండును. రక్తపోటు తక్కువుగా ఉండును.


 * హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు క్యాబేజి , సోయాబీన్స్ , వేరుశనగ , మొక్కజొన్న , బఠాణి , ముల్లంగి మెదలైనవి వాడకూడదు.


 * విటమిన్ - C , విటమిన్ - E , విటమిన్ - B2 , జింక్ , నియాసిన్ , B3 , B6 మరియు టైరోసిన్ ఉన్న ఆహారపదార్ధాలు వాడాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ ను కూడా బాగా తీసుకోవాలి .


 * థైరాయిడ్ బాగా పనిచేయాలి అంటే ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవాలి . పసుపుపచ్చ రంగులో ఉండే పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి . డ్రై ఫ్రూట్స్ , పచ్చికొబ్బరి తినవలెను .


  హైపర్ థైరాయిడ్ -


     థైరాయిడ్ గ్రంథి అతిగా హార్మోన్ ను ఉత్పత్తి చేయుచున్న హైపర్ థైరాయిడిజం అంటారు. T3 మరియు T4 లను ఎక్కువుగా స్రవించును.


 లక్షణాలు -


 * రోజురోజుకి బరువు తగ్గుట.


 * గుండె వేగం పెరగటం .


 * చెమట ఎక్కువుగా పట్టడం .


 * వేడి వాతావరణాన్ని భరించలేకపోవడం .


 * ఆకలి ఎక్కువుగా ఉంటుంది.


 * వికారంగా ఉండును.


 * మలబద్దకం లేదా విరేచనాలు , అతిమూత్రం , నీరసం , అలసట ఉంటుంది.


 * మతిమరుపు , దుఃఖం , శరీరం వేడిగా ఉంటుంది. జుట్టురాలడం , నిద్ర సరిగా లేకపోవటం వంటి లక్షణాలు కనపడును.


 * దేని మీద శ్రద్ధ లేకపోవటం , అసహనంగా ఉండటం , కోపంతో కేకలేయడం , చేతులు వణుకుతుంటాయి .


 పాటించాల్సిన నియమాలు -


 * వీరు ఆహరంలో ఎక్కువుగా క్యాబేజి , చిక్కుడు , సోయాబీన్స్ , వేరుశనగ వాడాలి. ముల్లంగి కూడా వాడవచ్చు .


 * విటమిన్ - C , E , B2 , B6 , జింక్ , నియాసిన్ లు థైరాయిడ్ గ్రంథికి శక్తిని ఇస్తాయి . ఇవి టమాటా , నారింజ , ఉసిరి వంటి పండ్లలో ఎక్కువుగా ఉండును.


 * మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి . ధ్యాన సాధన చేయడం మంచిది .


 * రోజుకి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయుట మంచిది . సర్వాంగాసనం , హలాసనం , మత్స్యసనం , భుజంగాసనం , ధనురాసనం వేయడం మంచిది .


         కొన్ని ప్రాంతాలలో ఆహారం , నీటిలో అయొడిన్ లవణం తక్కువుగా ఉండటం వలన "గాయిటర్" అనే వ్యాధి వస్తుంది. గాయిటర్ వ్యాధి ఉన్నవారిలో మీద ముందు థైరాయిడ్ గ్రంథి కణిత వలే పెద్దగా కనపడును. అయోడిన్ లవణం అధికంగా తీసుకోవడం వలన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు . సహజ ఆహారపదార్దాల ద్వారానే దీనిని పొందడం ఉత్తమం . అయొడిన్ ప్రతిరోజు పెద్దవారు 150 మి.గ్రా , గర్భిణి స్త్రీలు 175 మి.గ్రా తీసికొనవలెను . ఇది ముఖ్యంగా కూరగాయలలో అధికంగా ఉండును.


       ఆయుర్వేదం నందు దీనిని "గళగండ " వ్యాధిగా పిలుస్తారు . ఆయుర్వేదం నందు అత్యద్భుతమైన మరియు సంపూర్ణంగా వ్యాధిని నివారించు ఔషధాలు కలవు.