7, ఫిబ్రవరి 2026, శనివారం

ఆదివారం,ఫిబ్రవరి.8,2026

 🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏

🌻🙏శుభోదయం🙏*🌻

             -------------------

🌺 *మహనీయుని మాట*🌺

        -------------------------

"మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------


"ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పని లేదు.కానీ పరిస్థితిని అర్థం చేసుకుని గొడవ వద్దని తెలుసుకోడానికి తెలివితేటలు చాలా అవసరం."


🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻 


 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

ఆదివారం,ఫిబ్రవరి.8,2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి తె5.34 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రo:స్వాతి తె5.52 వరకు

యోగం:గండ రా1.18 వరకు

కరణం:భద్ర సా4.46 వరకు తదుపరి బవ తె5.34 వరకు

వర్జ్యం:ఉ9.52 - 11.36

దుర్ముహూర్తము:సా4.23 - 5.08

అమృతకాలం:రా8.18 - 10.02

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:మకరం

చంద్రరాశి:తుల

సూర్యోదయం:6.35

సూర్యాస్తమయం:5.54 

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻


°°°°°°°°°°°°°°°°°°°°°°

    *భక్తి -- భజన*

°°°°°°°°°°°°°°°°°°°°°°


    భజన యేదో కాలక్షేపానికి చేసే కర్మ కాదు...


    భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం తోనే ఉండాలి. 


    కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు, దేవుడా, దేవుడా అని దేవుళ్ళాడుతూ, సుఖాలు వచ్చిన ప్పుడు, మన కోర్కెలు తీరినప్పుడు దేవుని నామమే గుర్తుకు రావట్లేదు చాలా మందికి. ఇది సరియైన పధ్ధతి కాదు.

 

    భక్తి, భజనలవల్లనే మనస్సు ప్రేమమయంగా మారుతుంది. నియమంగా భజన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. 


    ఇది వ్యక్తి గత సాధన, సామూహిక సాధన కూడా. భజనలు కృత్రిమంగా చేయకూడదు. 

మనింట్లో భజన ఎంత శ్రధ్ధగా  జరుపుకొంటారో, అందరి భజనలు కూడా అలాగే జరగాలని, భావించాలి. 


మన భావమే భగవంతుని కి ముఖ్యం, భగవంతుని భజన చేస్తే నాకేమి వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. 

ఇటువంటి మంచి కార్యాల వల్ల, మీ కష్ట నష్టాలు ఎంత వరకూ తగ్గి పోతున్నాయో మీకు తెలీదు.


    ప్రేమతో విశ్వాసం తో భజన లలో పాల్గొనండి, అమూల్యమైన టైమును, సమయమును బైట ప్రపంచంలోని వింతలు, విశేషాల తో వృధా కాలక్షేపాలతో గడిపితే ఎంతో సిగ్గు చేటు. 


శాంతి సౌఖ్యాలకోసం విచారిస్తున్నారు కానీ  అందుకొనుటకు ప్రయత్నాలు చేయటం లేదు. 


మాటలలో ఉన్న గొప్పలు చేతలో లేవు, నామస్మరణ, భజనే మనకు నిజమైన ఆత్మ భోజనం. 


*భక్తులందరూ చేరి భగవంతుడా యనుచు చెవులకింపుగ నుతి చేయు దినమే  సుదినము.!!*


  *_🌹శుభమస్తు🌹_*


 🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

పంచాంగం

 



పరమాత్మ/పరమేశ్వరి

  శ్రీమాత్రేనమః 


పరమాత్మ/పరమేశ్వరి పరమదయార్ద్రమూర్తి. కాని, నిర్వికారనిర్వికల్పుడు. దేనికీ చలించడు. తనకు తానుగా ఎవరికి ఎంత కష్టం వచ్చినా.... ఎంతటి అవసరం వచ్చినా... ఎంతటి సంతోషం కలిగినా... అన్నిటినీ చూస్తూ ఉంటాడు. తనకు తానుగా కల్ఫించుకోడు. కోరితే ఏదీ కూడా ఇవ్వకుండా ఉండడు. ఆ కోరికలో స్వచ్ఛత ఉండాలి. ఏది కోరినా... అది దుర్గుణమైనా సద్గుణమైనా ఇస్తాడు. కోరినది సత్తా అసత్తా అనేది జీవునియొక్క గుణాధిక్యతను (సత్త్వ రజః తమోగుణాన్ని) అనుసరించి ఉంటుంది. 


ఒకరిని చూచి *"ఈమె ఎంతో గుణవంతురాలు. ఈమె నాకు తల్లి అయితే బాగుంటుంది."* అనే కోరిక మనసులో కలిగితే... అదికూడా ఒక కర్మగా మారి ఆ కర్మఫలంగా తరువాతి జన్మలలో ఆమెకు పుత్రుడిగా/పుత్రికగా జన్మించటం జరుగుతుంది. 


ఇదే విధంగా అన్నీ ఊహించాలి. 


ఈవిధమైన కర్మలను జీవుడు ఆచరించటం లేదా కోరుకోవటం జరిగినప్పుడే భగవంతుడు ఆ కర్మఫలాలను ఇచ్చి అనుభవింపజేస్తాడు. 


అదే... మోక్షజ్ఞానాన్ని కోరుకుంటే మోక్షజ్ఞానాన్నే ఇస్తాడు. 


"అడగనిదే అమ్మైనా పెట్టదు" అన్నట్లు కోరనిదే భగవంతుడు కూడా ఏదీ ఇవ్వడు.

మీ 

*~శ్రీశర్మద*

గంజి ఉపయోగాలు*

 



          *గంజి ఉపయోగాలు*

                ➖➖➖✍️


*నేటి తరానికి గంజి విలువ గంజి ఉపయోగాలు తెలియ చేద్దాము.....*


ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం. 


కానీ పూర్వీకులు ఆ గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. 


దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 


మన పూర్వీకులు మనకన్నా బలిష్టంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. 


ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.


*1. అతిసారం, కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థం బైండింగ్ ఏజంట్ గా పనిచేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. డీహైడ్రేషన్, అలసటను తగ్గిస్తుంది.


*2. మహిళలకు నెలసరి నొప్పులను తగ్గిస్తుంది.


*3. ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఉపయోగపడతాయి. 


*4. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం. ఇందులో క్యాలరీలు తక్కువ. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.


*5. గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు. 


*6. విరేచనాలు అవుతుంటే గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.✍️

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మాఘ పురాణం* ➖➖➖✍️ 20 వ అధ్యాయము

 ```


            *మాఘ పురాణం*

                ➖➖➖✍️

           20 వ అధ్యాయము


మాఘ పురాణం ఇరవయ్యొవ అధ్యాయంలో, గృత్నృమద మహర్షి జహ్ను ముని మాట్లాడుతూ, శివ, బ్రహ్మల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పాడు. 

రజో గుణ ప్రధానుడైన బ్రహ్మ, తమో గుణ ప్రధానుడైన శివుడు ఎవరు గొప్పవారో అని చాలా కాలంగా వాదించుకుంటున్నారు. ఒకసారి వారి ముందు అనేక ముఖాలు, నేత్రాలు, బాహువులు, పాదాలు కలిగిన, తేజోమయమైన మహారూపం కనిపించింది. అది శ్రీమహా విష్ణువు అని వారు గ్రహించి, ఆ రూపం యొక్క ఆద్యంతాలు చూడాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

అప్పుడు శ్రీమహా విష్ణువు తానే జగత్కర్త, కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షకుడు, సర్వేశ్వరుడు అని వివరించి, వారి వివాదానికి కారణమైన గుణాల ప్రభావం గురించి చెప్పాడు. తాము ముగ్గురూ ఒకే తత్త్వం నుండి వచ్చినవారమని, బ్రహ్మ సృష్టికర్త, తాను పోషకుడు, శివుడు లయకర్త అని వివరించాడు. బ్రహ్మను స్వతంత్రుడు, సర్వప్రాణుల సృష్టికర్త, దేవతలకు ప్రభువు అని కీర్తించాడు. చివరగా తాను ఏకత్వంలో నుండి అనేకత్వం పొందానని,తాను-బ్రహ్మ ఒక్కటేనని, బ్రహ్మ కూడా తనలాగే సమస్త దేవతలకు పూజనీయుడని చెప్పి, వారి వివాదాన్ని పరిష్కరించాడు. .



*శివ బ్రహ్మల వివాదము:*```

గృత్నృమద మహార్షి మరల యిట్లు పలికెను. శ్రీమహావిష్ణువు తత్త్వమును మహాత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము.. 

బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిస్టుడైన అధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము, మనోహరము అనంతము అగు ఆ రూపము శ్రీమహా విష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరము అయిన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడ తలచిరి. ఆ రూపము యొక్క ఆద్య తములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగు దిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని, చివరను గాని చూడ లేక పోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులము అని గమనించిరి. అప్పుడు ఆ రూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర్త సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించు వాడు సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణుల యందు నివసించువాడు, సర్వ ప్రాణులను తన యందే నిలుపు కొనువాడు, మనము వీనికంటె అధికులము కాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇటువంటి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువుని ఇట్లు స్తుతించిరి.

బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి

అనంతమూర్తీ ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవు అందరికిని అన్నిటికిని ఇచ్చువాడవు, సర్వ స్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచునిట్లనిరి.```

*హేవిషోవంతమూర్తే తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం*

*సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం|*

*అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం*

*చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం॥*

*నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై*

*త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |*

*పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః*

*ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||*

*త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహాద్రూపమనేక తేజాః*

*గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర।*

*త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట*

*దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం||*


*లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర*

*త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః*

*సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ*

*త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||*త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ*

*త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||*

*పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం* 

*తమాశ్రయంత్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||*

*వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ*

*కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||*


*నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః*

*రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||*

*అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం*

*తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి॥*


*తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే*

*తూర్ణం జగనాథ మహాత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద॥*```

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లనెను. “బ్రహ్మేశ్వరులారా ! మీరిద్దరును చిరకాలము వివాద పడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము స్వయం ప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహిని బంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును.

జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి, ఇహ లోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదము అనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ద సరిగా లేక పోవుట, శ్రద్ధా లోపముచే కార్యనిర్వహణ శక్తి లేక పోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టి కర్తగను, నేను పోషకునిగను, శివుడు లయ కర్తగను మనము ముగ్గురము అయితిమి. కాన ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదటినుండి భేదము లేదు కదా!

అని బ్రహ్మకు శివునికి శ్రీమహాా విష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో ఇట్లు అనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదను ఇచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వమును పొందితిని. మనమిద్ధరము ఒక్కటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహార్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్ర```

72f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀.      

7వ తేదీ శనివారం వేకువఝామున చదువుకొనుటకు..```


            *మాఘ పురాణం*

                ➖➖➖✍️

           20 వ అధ్యాయము


మాఘ పురాణం ఇరవయ్యొవ అధ్యాయంలో, గృత్నృమద మహర్షి జహ్ను ముని మాట్లాడుతూ, శివ, బ్రహ్మల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పాడు. 

రజో గుణ ప్రధానుడైన బ్రహ్మ, తమో గుణ ప్రధానుడైన శివుడు ఎవరు గొప్పవారో అని చాలా కాలంగా వాదించుకుంటున్నారు. ఒకసారి వారి ముందు అనేక ముఖాలు, నేత్రాలు, బాహువులు, పాదాలు కలిగిన, తేజోమయమైన మహారూపం కనిపించింది. అది శ్రీమహా విష్ణువు అని వారు గ్రహించి, ఆ రూపం యొక్క ఆద్యంతాలు చూడాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

అప్పుడు శ్రీమహా విష్ణువు తానే జగత్కర్త, కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షకుడు, సర్వేశ్వరుడు అని వివరించి, వారి వివాదానికి కారణమైన గుణాల ప్రభావం గురించి చెప్పాడు. తాము ముగ్గురూ ఒకే తత్త్వం నుండి వచ్చినవారమని, బ్రహ్మ సృష్టికర్త, తాను పోషకుడు, శివుడు లయకర్త అని వివరించాడు. బ్రహ్మను స్వతంత్రుడు, సర్వప్రాణుల సృష్టికర్త, దేవతలకు ప్రభువు అని కీర్తించాడు. చివరగా తాను ఏకత్వంలో నుండి అనేకత్వం పొందానని,తాను-బ్రహ్మ ఒక్కటేనని, బ్రహ్మ కూడా తనలాగే సమస్త దేవతలకు పూజనీయుడని చెప్పి, వారి వివాదాన్ని పరిష్కరించాడు. .



*శివ బ్రహ్మల వివాదము:*```

గృత్నృమద మహార్షి మరల యిట్లు పలికెను. శ్రీమహావిష్ణువు తత్త్వమును మహాత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము.. 

బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిస్టుడైన అధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము, మనోహరము అనంతము అగు ఆ రూపము శ్రీమహా విష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరము అయిన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడ తలచిరి. ఆ రూపము యొక్క ఆద్య తములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగు దిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని, చివరను గాని చూడ లేక పోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులము అని గమనించిరి. అప్పుడు ఆ రూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర్త సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించు వాడు సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణుల యందు నివసించువాడు, సర్వ ప్రాణులను తన యందే నిలుపు కొనువాడు, మనము వీనికంటె అధికులము కాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇటువంటి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువుని ఇట్లు స్తుతించిరి.

బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి

అనంతమూర్తీ ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవు అందరికిని అన్నిటికిని ఇచ్చువాడవు, సర్వ స్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచునిట్లనిరి.```

*హేవిషోవంతమూర్తే తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం*

*సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం|*

*అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం*

*చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం॥*

*నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై*

*త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |*

*పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః*

*ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||*

*త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహాద్రూపమనేక తేజాః*

*గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర।*

*త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట*

*దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం||*


*లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర*

*త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః*

*సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ*

*త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||*త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ*

*త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||*

*పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం* 

*తమాశ్రయంత్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||*

*వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ*

*కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||*


*నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః*

*రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||*

*అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం*

*తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి॥*


*తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే*

*తూర్ణం జగనాథ మహాత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద॥*```

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లనెను. “బ్రహ్మేశ్వరులారా ! మీరిద్దరును చిరకాలము వివాద పడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము స్వయం ప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహిని బంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును.

జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి, ఇహ లోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదము అనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ద సరిగా లేక పోవుట, శ్రద్ధా లోపముచే కార్యనిర్వహణ శక్తి లేక పోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టి కర్తగను, నేను పోషకునిగను, శివుడు లయ కర్తగను మనము ముగ్గురము అయితిమి. కాన ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదటినుండి భేదము లేదు కదా!

అని బ్రహ్మకు శివునికి శ్రీమహాా విష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో ఇట్లు అనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదను ఇచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వమును పొందితిని. మనమిద్ధరము ఒక్కటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహార్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖తలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

శ్రీ పెరియాండవర్ దేవాలయం

  🕉 మన గుడి : నెం 1381


⚜  తమిళనాడు :  తిరునిలై


⚜  శ్రీ పెరియాండవర్ దేవాలయం 


 

💠 చారిత్రక తొండమండలంలో భాగమైన కాంచీపురం జిల్లాలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.

చెంగల్పట్టు సమీపంలోని  తిరుకళుకుండ్రం సమీపంలోని అనేక ప్రాంతాలకు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.  

వాటిలో ఒకటి తిరునిలై.  

ఇది తిరుకళుకుండ్రంకు వాయువ్యంగా దాదాపు 7 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. 


💠 శ్రీ పెరియాండవర్ ఆలయం తిరునిలై అని పిలువబడే ఈ పవిత్ర గ్రామంలో అందంగా నిర్మించబడింది. ఇది 300 సంవత్సరాలకు పైగా పురాతనమైనప్పటికీ, ఇటీవలే అనేక మంది భక్తుల సహాయ సహకారంతో ఒక ఆలయం నిర్మించబడింది. 


⚜ ఆలయ చరిత్ర...


💠 అసురులు తమ తీవ్రమైన తపస్సు ద్వారా దేవతల నుండి వరాలు పొందారు. 

వరాలను పొందిన తరువాత, జ్ఞానులు మరియు జ్ఞానోదయం పొందిన మరియు సాధారణ పురుషులు మరియు స్త్రీలను వేధించడం వారి లక్షణం. 

 

💠 శివుడు వారిపై చర్య తీసుకునే సమయం ఆసన్నమైంది.  

కానీ భగవంతుడు ఒక గంట పాటు మానవుడిగా జీవించినట్లయితే మాత్రమే వాటిని నాశనం చేయవచ్చు .

ఈ సౌకర్యాన్ని ఉపయోగించి, శివుడు పార్వతిని ఒక గంట పాటు తనను మానవుడిగా మారమని శపించేలా ఒక పరిస్థితిని సృష్టించాడు. 


💠 శివుడు ఇక్కడ అక్కడ సంచరించడం ప్రారంభించాడు. ఆయన లేకపోవడం వల్ల, అన్ని లోకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

దేవతలు పరిహారం కోసం భగవంతుని పాదాలపై పడిపోయారు.


💠 పార్వతి దేవి  అంగళ పరమేశ్వరి  రూపంలో శివుడు నిలబడి ఉన్న ప్రదేశానికి వచ్చి తన త్రిశూలాన్ని అక్కడ విసిరింది. త్రిశూలం నుండి వచ్చే కాంతితో, శివుడు అక్కడ కనిపించి తన పాదాలను నేలపై గట్టిగా ఉంచాడు - అదే తిరునిలై. 


💠 శాప కాలం కూడా ముగిసింది మరియు భగవంతుడు తన మానవ రూపాన్ని వదులుకున్నాడు. 

“నీవు గొప్ప మానవుడిగా ప్రపంచాలను చుట్టి వచ్చినప్పుడు, నిన్ను పెరియ అండవర్ - గొప్ప దేవుడు అని స్తుతిస్తారు” అని తల్లి పార్వతి చెప్పింది. 

దేవతలు పెరియ అండవర్ అని జపిస్తూ భగవంతుని పాదాలపై పడిపోయారు. 

భగవంతుడు శివలింగ రూపాన్ని ధరించి ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. ఇది ఈ తిరునిలైలో జరిగింది.


💠 తమిళంలో తిరునిలై అంటే శాశ్వతంగా జరుగుతుందని అర్థం. 

శివుడు మానవ రూపంలో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నప్పుడు, 21 శివ గణాలు కూడా ఆయనతో పాటు కనిపించకుండా పోయాయి. 

తల్లి అంగళ పరమేశ్వరి తన శక్తితో తన శక్తిని విసిరినప్పుడు, ఇసుకలో దాగి ఉన్న శివ గణాలు ఇసుక బంతులుగా పడిపోయాయి. భగవంతుడు తన నిజ రూపంలో కనిపించినప్పుడు, వారు కూడా శివ గణాలుగా మారారు.

 

💠 ఈ సంఘటనను గుర్తుచేస్తూ, ఈ 21 శివ గణాలు ఇక్కడ శివ లింగాల రూపంలో ఉన్నాయి. 

 నంది కూడా భగవంతునితో పాటు ఉండటం గమనార్హం.

 అందుకే, ఆలయంలో నంది మానవ రూపంలో కనిపిస్తాడు.


💠 వినాయకుడు కూడా రెండు చేతులతో మానవ రూపంలో ఉంటాడు. 

అభిషేకం అతనికి పవిత్ర బూడిదతో మాత్రమే అర్పిస్తారు. 

భక్తులు ఈ పవిత్ర బూడిద-విభూతిని శరీరంపై ఉపయోగిస్తారు మరియు విద్యా నైపుణ్యాలను పొందడానికి, శ్రేయస్సు పొందడానికి మరియు వారు బాధపడే వ్యాధులకు ఔషధంగా కూడా దీనిని వినియోగిస్తారు. 


💠 చాలా మంది ఋషులు ఇక్కడ ప్రతిరోజూ స్వామిని పూజిస్తారని నమ్ముతారు. 

అలాగే లింగ రూపంలో ఉన్న 21 శివ గణాలు కూడా ప్రతిరోజూ స్వామిని పూజిస్తున్నాయని చెబుతారు.   మానవ రూపంలో ఈ ప్రదేశానికి వచ్చిన శివుని పాద ముద్రలతో ఈ ప్రదేశం పవిత్రతను పెంచడం గమనార్హం.


💠 భక్తులు సిద్ధమృత పవిత్ర సరస్సులో స్నానం చేసి, చాలా కాలంగా నిలిచిపోయిన ప్రయత్నాలలో విజయం సాధించడానికి ఆరు వారాల పాటు నిరంతరం స్వామిని మరియు తల్లిని పూజిస్తారు.


💠 పెరియాండవర్‌తో పాటు దేవి అంగళపరమేశ్వరి కూడా ఆశీర్వదిస్తున్నారు. 

ఈ ఆలయానికి ఆమె దేవత. సుయంబు లింగంలో ఉన్న స్వామి పెరియాండవర్. 


💠 ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం 'నిలబడి ఉన్న భంగిమలో' 'నంది.

నంది దేవర్ యొక్క ఈ 'తిరుక్కోలం' మనం ఎక్కడా చూడలేము. 


💠 మహాశివరాత్రి, పౌర్ణమి పూజ, ప్రధోసం మరియు అనేక ఇతర పండుగలు ఇక్కడ పూర్తి పరిపూర్ణతతో నిర్వహిస్తారు. 

పౌర్ణమి మరియు అమావాస్య సందర్భంగా, శ్రీ పెరియాండవర్ మరియు దేవి అంగళపరమేశ్వరికి 18 కుండలలో పాల అభిషేకం చేస్తారు.  


💠 అనేక మంది ఋషులు ఇక్కడే ఉండి పెరియాండవర్‌ను పూజించి ఆయన ఆశీస్సులు పొందారని గ్రామస్తులు చెబుతారు.


💠 పెరియాండవర్ మరియు దేవి అంగళపరమేశ్వరి పిల్లలు లేని జంటలకు అపరిమితమైన ఆశీస్సులకు ప్రసిద్ధి చెందారు.

 వారు క్రమం తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. తక్కువ సమయంలోనే, వారి కోరిక నెరవేరుతుంది మరియు వారికి పిల్లలు కలుగుతారు.

 కాబట్టి, ఈ రోజుల్లో, పెరియాండవర్ యొక్క ఈ దయను తెలుసుకుని, పిల్లలు లేని జంటలు తమ కోరికలు నెరవేరడానికి ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు


💠 చెంగల్పట్టు నుండి 7 కి.మీ దూరంలో ఉన్న ప్రసిద్ధ శివతాలమన తిరుకళుక్కునరంలోని కైవకురవర్కళ్ పాట, తిరుప్పోరూర్ నుండి 14  కి.మీ   దూరంలో తిరుప్పోరూర్ నుండి 12  కి.మీ  దూరంలో తిరునిలై ఆలయం ఉంది.


రచన

©️ Santosh Kumar

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*644 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

శునస్సఖుడు

ఇదంతా విన్న శునస్సఖుడు " ఈ తామరతూండ్లు దొంగకు ఇవ్వడం వేదవేదాంగములు చదివిన బ్రాహ్మణోత్తముడికి తనపుత్రికను దానం ఇవ్వడం వంటిది " అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్య పోయారు. అదేమిటి నువ్వు ధర్మవచనాలు పలుకుతున్నావు. అంటే తామరతూడులు దొంగిలించినది నువ్వే అన్న మాట. ఆకలితో అల్లాడి పోతున్నాము. దయచేసి ఆ తామరతూండ్లు మాకు ఇవ్వు " అని అడిగాడు. శునస్సఖుడు " అయ్యా ! నిజం చెప్తున్నాను. ఈ తామరతూండ్లు కనిపించక పోతే మీరు ఏమి అనుకుంటారో అని తెలుసుకోవడానికి ఈ తామరతూండ్లను దాచి పెట్టాను. ఇవిగో తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి " అని తాను దాచిన తామరతూండ్లను తెచ్చి ఇచ్చి " మహానుభావులారా ! మీ మీద కోపించి వృషాదర్భి మిమ్మల్ని చంపడానికి హోమం చేసి హోమగుండం నుండి కృత్తి అనే రాక్షసిని సృష్టించి మీ మీదకు పంపాడు. అది తెలిసిన నేను ఆ రాక్షసిని చంపాను. ఇక ఎందుకు దాపరికం నేను దేవేంద్రుడను. మీరంతా లోభత్వం వదలడం వలన మీకు పుణ్యలోకాలు సిద్ధించాయి. రండి పుణ్యలోకాలకు పోదాము " అని దేవేంద్రుడు సప్తఋషులను, అరుంధతిని పుణ్య లోకాలకు తీసుకుపోయాడు. ధర్మనందనా ! ఇదంతా వారు ఇతరులకు ఇచ్చినది పుచ్చుకొనక పోవడం, లోభం విడిచిపెట్టడం వంటి సద్గుణాల వలన జరిగింది. కనుక నీవు కూడా లోభమును విడిచి పెట్టు. ఒకరి సొత్తుకు ఆశించకు " అని భీష్ముడు చెప్పాడు.

పితృకార్యము గొడుగులు చెప్పులు

ధర్మరాజు " పితామహా ! పితృకార్యములలో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా ! అలా ఎందుకు ఇస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో జమదగ్నికి సూర్యుడికి జరిన సంవాదం వినిపిస్తాను. ఒక సారి జమదగ్ని తన భార్య రేణుకాదేవితో కలిసి ఆశ్రమం వదిలి దూరంగా వెళ్ళి విహరించసాగాడు. అప్పుడు జమదగ్ని విల్లు పట్టుకుని ఉన్నాడు. రేణుకాదేవి అంబుల పొది పట్టుకుని ఉంది. జమదగ్ని ఆరుబయట బాణములు వదులుతున్నాడు. రేణుకాదేవి ఆబాణములు తిరిగి తెచ్చి జమదగ్నికి ఇస్తుంది. ఇలా మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. ఒక సారి రేణుకదేవి బాణములు తీసుకు రావడంలో ఆలస్యం జరిగింది. జమదగ్ని రేణుకాదేవిని చూసి " ఇంత ఆలస్యం జరిగిందేమి ? " అని అడిగాడు. రేణుకాదేవి " నాధా ఎండవేడిమి ఎక్కువగా ఉంది. అందుకని కొంతసేపు చెట్టునీడన నిలబడ్డాను. అందుకని ఆలస్యం అయింది " అని బదులు చెప్పింది రేణుక. జమదగ్ని కోపించి " ఏమీ ఆ సూర్యుడు నీకు తాపం కలిగించాడా ? ఉండు సూర్యుడికి తగిన బుద్ధి చెప్తాను. నా బాణములతో సూర్యమండలం కప్పి వేస్తాను " అని అన్నాడు. ఆ మాటలు సూర్యుడు విని బ్రాహ్మణ వేషంలో జమదగ్ని వద్దకు వచ్చి " అయ్యా సూర్యుడి మీద కోపం మానండి " అని వేడుకున్నాడు. జమదగ్ని " నువ్వు మాట్లాడకు పక్కకు పో నేను ఈ సూర్యుడిని కాల్చి వేస్తాను " అని అన్నాడు. సూర్యుడు " మునీంద్రా తాపసులైన మీరు కోపిస్తే ఎలాగా ! సూర్యుడి తాపము చేతనే కదా జలములు వేడెక్కి మేఘములుగా మారి వర్షరూపంలో లోకాలకు నీరు లభిస్తుంది. దానివలన మనకు ఓషధులు, పంటలు లభిస్తాయి కదా ! మరి సూర్యకిరణాలు తపించక పోతే ఎలాగ " అని అన్నాడు. అప్పటికి జమదగ్ని శాంతించ లేదు. సూర్యుడు నిజస్వరూపంతో జమదగ్ని ముందు నిలిచి " మునీంద్రా ! నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించండి " అని వేడుకున్నాడు. ఆ మాటలకు జమదగ్ని శాంతించాడు. వెంటనే సూర్యుడు గొడుగు చెప్పులు సృష్టించి జమదగ్నికి ఇచ్చి " మహర్షి ఈ సాధనము ఇంతకు ముందు లేవు. ఈ గొడుగు వేసుకుంటే సూర్యతాపము సోకదు, ఈ చెప్పులు వేసుకుంటే ఎండవేడిమికి కాళ్ళు కాలవు. ఈ గొడుగును, చెప్పులను బ్రాహ్మణులకు దానంచేస్తే పుణ్యం లభిస్తుంది " అని అన్నాడు. ఆ వస్తువులను స్వీకరించిన జమదగ్ని సంతోషించాడు. ధర్మరాజా ! గొడుగు, చెప్పులు సూర్యుడి చేత సృష్టించబడ్డాయి. వాటిని దానంగా ఇస్తే పుణ్యలోకాలు లభిస్తాయి " అని భీష్ముడు చెప్పాడు

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ప్రయత్నించు

 *సేకరణ*


📚📖📚

రష్యా విద్యా వ్యవస్థలో పరీక్షలో పొందగలిగే అత్యధిక మార్కు 5.

 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే

—విద్యార్థి పూర్తిగా ఖాళీ జవాబు పత్రం సమర్పించినా కూడా వారికి 2 మార్కులు ఇస్తారు.

మాస్కో యూనివర్సిటీలో చదువుతున్న నా మొదటి రోజే ఇది తెలిసినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు అది అర్థం కాలేదు. ఎవరో ఏమీ రాయకపోతే వారికి సున్నా ఇవ్వకూడదా అనిపించింది.

ఆసక్తితో నేను డా. థియోడర్ మెద్రాయేవ్‌ను అడిగాను,

“సార్, ఏమీ రాయకపోయినా విద్యార్థికి 2 మార్కులు ఇవ్వడం ఎలా సరైనది?”

డా. మెద్రాయేవ్ చిరునవ్వు నవ్వారు. ప్రశాంతంగా చెప్పారు,

“సున్నా అంటే అస్థిత్వం లేకపోవడం. ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పుడు అతను ఎలా సున్నా అవుతాడు? ఆలోచించండి

—కేవలం క్లాస్‌కు రావడానికే ఒక విద్యార్థి ఎంత శ్రమ చేస్తాడు? బహుశా తెల్లవారుజామున చలిలో లేచి, బస్సు లేదా ట్రామ్ లేదా రైలులో నిలబడి ప్రయాణించి వచ్చి ఉంటాడు. ఖాళీ పేపర్ ఇచ్చినా, అతను వచ్చాడంటే ప్రయత్నించాడు అన్నమాట. అలా ఉంటే నేను అతనికి సున్నా ఎలా ఇవ్వగలను?”

అతను ఇంకా చెప్పారు,

“విద్యార్థి జవాబులు రాయలేకపోయి ఉండవచ్చు. కానీ అందుకని అతని శ్రమ అంతా తుడిచేయాలా? రాత్రిళ్లు మేల్కొని చదివిన రోజులు, కొనుకున్న నోటుబుక్లు, తెరిచిన పుస్తకాలు, చేసిన కష్టాలు

—ఇవన్నీ మరిచిపోవాలా?

కాదు నా ప్రియమైనవాడా. మనిషి ఎప్పుడూ సున్నా కాదు. సున్నా ఇచ్చినప్పుడు మనం వారి ఆత్మవిశ్వాసాన్ని దోచుకుంటాం, వారి లోపలి అగ్నిని ఆర్పేస్తాం. ఉపాధ్యాయులుగా మన లక్ష్యం వారిని మళ్లీ మళ్లీ లేవనెత్తOడం

—లొంగిపోవడానికి కాదు.”

నేను మౌనంగా విన్నాను. ఆ క్షణంలో నా లోపల ఏదో కదిలింది. అప్పుడే నాకు అర్థమైంది

—విద్య అనేది కేవలం మార్కుల గురించో, జవాబుల గురించో కాదు. విద్య అనేది మనుషులను బ్రతికించడం, వారి శ్రమను గుర్తించడం, ఆశను కాపాడడం.

ఆ రోజు డా. మెద్రాయేవ్ నాకు ఒక గొప్ప సత్యం నేర్పారు:

విద్య అనేది కేవలం జ్ఞానాన్ని పంచడం కాదు

—మానవత్వాన్ని ఆచరించడం.

సున్నా మార్కు చాలా సందర్భాల్లో విద్యార్థులకు మృత్యుఘంటలా మారుతుంది. ఆ పేపర్ మీద సున్నా చూసినప్పుడు భయం పెరుగుతుంది, ఆసక్తి తగ్గుతుంది, చదువు మీద ద్వేషం పుడుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడి బాధ్యత ప్రోత్సహించడం, ధైర్యం చెప్పడం

“నీవు చేయగలవు. మళ్లీ ప్రయత్నించు.”

ఖాళీ జవాబు పత్రానికైనా కనీస మార్కులు ఇస్తే మనం చెప్పేది ఇదే

“నీవు సున్నా కాదు. నీవు విలువైనవాడివి. నీవు ఇంకా చేయగలవు. ఈసారి గెలవలేదు అంతే

—మళ్లీ ప్రయత్నించు.”


అదే నిజమైన విద్య.

విద్యార్థి భవిష్యత్తు ఉపాధ్యాయుడి చేతుల్లోనే ఉంటుంది. ఉపాధ్యాయులు కొంచెం మరింత మానవత్వంతో ఆలోచిస్తే, సంఖ్యలకంటే శ్రమను చూస్తే, చాలా నిరుత్సాహపడిన విద్యార్థులు మళ్లీ కలలు కనే ధైర్యం పొందుతారు.

ఈ కథ రష్యాకే పరిమితం కాకూడదు

—ప్రపంచమంతా ఉన్న ఉపాధ్యాయులతో పంచుకోవాలి. ఎందుకంటే సున్నా మార్కు అనేది విద్య కాదు. చాలా సందర్భాల్లో అది ఒకరి ప్రయాణానికి ముగింపు.

ఎవరైనా ప్రయత్నిస్తున్నంతకాలం, వారికి కనీసం ధైర్యం ఇవ్వాలి, కనీసం గుర్తింపు ఇవ్వాలి.

రష్యాలో చదువుతున్న ఒక గుర్తు తెలియని విద్యార్థి రచన.

మీకు నచ్చిన ఒక ఉపాధ్యాయునితో దీన్ని పంచుకోండి

—మన విద్యా వ్యవస్థలో ఒక చిన్న కానీ అర్థవంతమైన మార్పుకు ఇది కారణమవుతుందేమో.

నక్షత్రం: మఖ (Magha)*

  72f9;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



          *నక్షత్ర స్తోత్ర మాలిక:*

                ➖➖➖✍️

       10 వ రోజు (విశేష స్తోత్రం)


​*నక్షత్రం: మఖ (Magha)*


అధిదేవతలు: పితృదేవతలు


​మఖ నక్షత్ర జాతకులు మరియు పితృ దోష నివారణ కోరుకునే వారు పఠించాల్సిన విశేష స్తోత్రం:


​🙏 శ్రీ పితృ స్తోత్రం 🙏


​*అర్చితామమ్యుతానాం చ పితృణాం దీప్తతేజసామ్।*

*నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషామ్॥1॥*


​*ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా ।*

*సప్తర్షీణాం తథాన్యేషాం తాన్ నమస్యామి పితృన్॥ 2 ॥*


​*మనువంశప్రధానానాం మునీనాం చ తథైవ చ ।*

*నమస్యామి పితృన్ సర్వాన్ లోకేష్వపి చ పూజితాన్ ॥ 3 ॥*


​*నక్షత్రాణాం గ్రహాణాం చ తథా చంద్రార్కయోరపి ।*

*నమస్యామి సదా తేషాం సర్వజ్ఞానాం మహౌజసామ్॥4॥*


​*అగ్నేర్వాయోస్తథాన్యేషాం లోకానాం చైవ పూజితాన్ ।*

*నమస్యామి పితృన్ సర్వాన్ కృతప్రణత మానసః ॥ 5 ॥*


​*నమస్యామి పితృన్ భక్త్యా యే లోకేష్వపి పూజితాః ।*

*యే మే దదతు కామేశాన్ సర్వకామఫలప్రదాన్ ॥ 6 ॥*


​*నమస్యామి పితృన్ భక్త్యా యే భుక్తిముక్తి దాయినః ।*

*యే మే దదతు కామేశాన్ సర్వకామఫలప్రదాన్ ॥ 7 ॥*


​*యేషాం స్మరణమాత్రేణ సకలార్థ ఫలప్రదమ్ ।*

*తాన్ నమస్యామి పితృన్ సర్వాన్ ప్రసన్నా భవంతు మే ॥ 8 ॥*


​💡 విశేషం:


●ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు దక్షిణాభిముఖంగా (South direction) కూర్చుని పఠించడం మరింత శుభకరం.


●​మఖ నక్షత్రం ఉన్న రోజున లేదా ప్రతి అమావాస్య రోజున దీనిని పఠిస్తే పితృదేవతల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 87121 84465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - షష్ఠి - చిత్ర -‌‌ స్థిర వాసరే* (07.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

Hiii




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*