23, జనవరి 2022, ఆదివారం

కాంచనమయ వేదికా

 *కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు*

_________________________________


(1) అర్జున - తెల్లనిది. అర్జునుడు అనగా తెల్లని శరీరచ్ఛాయకలవాడని అర్థం.


(2) కమ్మ అనగా చెవికమ్మ. ఇంకా ఒకప్రాంతంలో అనగా కమ్మనాడులో  నివసించిన జనులకు కలిగిన పేరు > జాతిబేధము. పత్రిక, మంచిరుచి (కమ్మనైన భోజనము), మట్ట (కొబ్బరిమట్ట), తాటియాకు, ప్రియమైనది, మంచివాసన (కమ్మనైన వాసన), అందము అనే అర్థాలువున్నాయి.


(3) కనిగిరి > కన్నియగిరి > కన్నియ అనగా చిన్నది, కొత్తది, పెండ్లికాని యువతి అనే అర్థాలున్నాయి.గిరి అంటే కొండ. చిన్నకొండ దగ్గర వెలసిన గ్రామం కాబట్టి ఆ గ్రామానికి కన్నియగిరి అనే పేరు కలిగింది.  కన్నియగిరి > కన్నిగిరి > కనిగిరి అయింది. ఇలా అ కార మ కారాల ఒత్తులను లోపింపచేసి పలుకడం వలన అచ్చమ్మపేట > అచ్చంపేటగాను, రాజమ్మపేట > రాజంపేటగాను, గంగమ్మపల్లి > గంగంపల్లిగాను, జానకమ్మపేట > జానకంపల్లిగాను మారాయి.


(4) చాండాలి > చాండాలిక > అనగా దుర్గాదేవి.చండాలురు > దుర్గాదేవి సంతతివారు > పూజ్యనీయులు.


(5) తార  అంటే ఓంకారమనే అర్థముతోపాటు కంటిలోని నల్లగుడ్డు, నక్షత్రమనే అర్థాలున్నాయి.

బృహస్పతి భార్యపేరు తార

వాలిభార్య పేరు తార


(6) బుద్ధఘోష అనగా పాళీ భాషలో బుద్ధుని పలుకులు.(Voice of Buddha) అని అర్థము. 5 వ శతాబ్ది (ACE)లో

బుద్ధఘోషుడు భారతదేశం / మగధదేశంలోని బుద్ధగయ వద్ద గల బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు.

శ్రీలంకకు వెళ్ళి అనురాధపురంలో స్థిరపడ్డాడు. బౌద్ధములోని తెరవాద శాఖకు చెందినవాడు.

తెరవాద సిద్ధాంతము ప్రకారం మనిషి శీలవంతుడు కావటానికి 7 మార్గాలను బోధించాడు. అవి (అ) శీలవిశుద్ధి అనగా ప్రవర్తనను పవిత్రంగా వుంచుకోవడం (ఆ) చిత్తవిశుద్ధి అనగా మనస్సును స్వచ్ఛంగా వుంచుకోవడం (ఇ)  విత్తివిశుద్ధి అనగా మనదృష్టిని సక్రమంగా వుంచుకోవడం (ఈ) కంక వితరణ విశుద్ధి అనగా సందేహాలను శంకలను అధిగమించడం > అనుమానం లేకుండా జీవించడం.(ఉ) మగ్గమగ్గ నాశనదస్సన అనగా మంచిదృష్టిని జ్ఞనాన్ని కలిగివుండడం. ఏది మంచో ఏది చెడో గ్రహించడం.(ఊ) శంకపురేక్క నాన అనగా కష్టమొచ్చినా సుఖం కలిగినా స్పందించకపోవడం., స్థితప్రజ్ఞత కలిగివుండటం (ఎ) నానాదశన విశుద్ది అనగా రకరకాల దర్శనాలపట్ల అవగాహన కలిగివుండడం. దర్శనాలు అనగా సిద్ధాంతాలు.


(7) నాస్తికుడు అనగా ఈ ప్రకృతి నిజం, కనబడుతున్న ప్రపంచం నిజమని, పరలోకంకాని పరలోక దేవుడు కాని లేనేలేవడనేవాడు.


(8) నీలిధ్వజుడు > నల్లటి తాటిచెట్టును ధ్వజముగా కలవాడు > భీష్ముడు.

ఉత్తరగోగ్రహణ సమయంలో బృహన్నల (అర్జునుడు) ఉత్తరకుమారునికి యుద్ధంలో తాను ఎదుర్కొబోయే కురుసైన్యం వారి జెండాలగురించి తెలిపాడు. ఈ అద్భుతపద్యభాగాలను తిక్కన అత్యంతద్భుతంగా మలిచాడు. మచ్చుకు...


*కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు* - *కలశజుండు*

*బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు*

*కలశజుండు* *(కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు*


*"సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు "* -

*సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.*


*"కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు "* -

*బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.*


*"లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "* -

*"లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.*


*"మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "* -

*"మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.*


*"మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"* -

*బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు*

*సురనదీసూనుడు.. సురనదీ : గంగాసూనుడుకొడుకు* *భీష్మాచార్యుడు.*


*ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు*


*కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.*

॥సేకరణ॥

___________________________________________జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

తెలుగు భాష

 _*తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. తెలుగు మాతృ భాషగా ఎవరికి వున్నదో,  తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.*_


1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగ కొరియన్ భాష.


3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.


10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.


11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.


14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.  కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన.  ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 


తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం

చింతామణి నాటకానికి గ్రహణం

 *తెలుగు నాటకరంగానికి' బ్లాక్‌ డే….!!


*నూరేళ్ళ చింతామణి నాటకానికి గ్రహణం…!!


*ప్రజాస్వామ్యంలో కూడా ఫ్యూడల్ మనస్తత్వం..!!


*నాటకాన్ని నిషేధించినవారు..కాళ్ళకూరివారి చింతామణి 

 ని అసలు చదివారా?


*నాటక ప్రదర్శనలో బలవంతంగా 'జొప్పించిన' బూతు

 ను నిషేధించాలా? లేక సందేశాత్మక నాటకాన్ని  నిషేధిం

 చాలా?


*కాళ్ళకూరి వారి చింతామణి లో "బూతెక్కడ " వుంది?


*సంస్కరణ వాదానికి అద్దంపట్టిన చింతామణిని 

 నిషేధించి సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ ఏమిటి?


*నేటి సినిమాలు,సీరీయళ్ళలోని బూతులు,ద్వంద్వార్ధాలు

కాళ్ళకూరి చింతామణిలో లేవు కదా?


*రోగం ఒకచోట ..వైద్యం ఇంకోచోటనా? నిషేధం అర్థంలేని నిర్ణయం కాదా?


నిజానికి చింతామణి నాటకంలో వున్నదేంటి..?


ఇక చదవండి...ఆలోచించండి..!!  


*చింతామణి కూడా ఓ సంస్కర్త..!!


ఈతరం వారు మిస్సవుతున్న నాటకరాజం….

కాళ్ళకూరి వారి “చింతామణి “.!!


“చింతామణి “, పేరు వినగానే నొసలు చిట్లించుకుంటాం.

రామ ! రామ ! అంటూ చెవులు మూసుకుంటాం.ఆ పేరు వింటేనే ఏదో పాపం చేసినట్లు ఫీలవుతాం.వాస్తవానికి చింతామణి ఓ సంస్కర్త.వేశ్యాకులంలో పుట్టి వేశ్యావృత్తిని స్వీకరించినా చివరకు  తప్పును తెలుసుకొని తన్నుతాను

సంస్కరించుకుంటుంది.వేశ్యాలోలత్వం మంచిది కాదని సమాజాన్ని మేల్కొలుపుతుంది.వేశ్యగా తాను సంపాదిం

చిన ధనరాశుల్ని తిరిగి వాపసు చేస్తుంది.యోగినిగా మారి

పోయి భగవధ్యానంలో తరిస్తుంది.


*ఎవరీ చింతామణి ?


కాళ్ళకూరు నారాయణరావు రాసిన “చింతామణి"నాటకం

లోని నాయిక పేరే చింతామణి.సమాజసంస్కరణ కోసం ప్రధానంగా వేశ్యపాత్రను సృష్టించడం ఆరోజుల్లో కొత్తేం కాదు.గురజాడ అప్పారావుగారితో నాటకాల్లో ఈ ధోరణి అలవడింది. కన్యాశుల్కంలో జగమెరిగిన జాణ “మధుర

వాణి”పాత్రను సృజించి అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ ను ప్రవేశ పెట్టారు గురజాడ.అప్పటినుండి వేశ్య పాత్రల్ని జొప్పించి

నాటకాలు రాయడం అలవాటుగా మారింది.కాళ్ళకూరి వారు కూడా గురజాడ వారి బాటలో మరో అడుగు

ముందుకేసి “చింతామణి “ పాత్రను ఓ సంస్కర్తగా,ఆదర్శ నారిగా తీర్చిదిద్దారు.అప్పట్లోసమాజంలో వేళ్ళూనుకున్న వ్యభిచార దురాచారాన్ని ' కాంతాసమ్మితంగా ‘ రక్తికట్టించి ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేశారు.జనాన్ని ఆలోచించేలా చేశారు.


కాళ్ళకూరు వారి చింతామణి ఏ సంఘ సంస్కర్త కంటే ..

తక్కువ కాదు.చింతామణి తన కులవృత్తిని స్వీకరించినా,

చివరకు బుద్ధి వికసించి,బురదలోని పద్మంలా ప్రకాశించిం

ది.ఒక మంచి నాటకం ప్రజల ఆలోచనా విధానంలో

మార్పు తెస్తుందనడానికి చింతామణి నాటకం ఓ చక్కని ఉదాహరణ.మనుషుల్లో సహజంగావుండే వేశ్యా వ్యామో

హం పట్ల కళ్ళు తెరిపిస్తుందీ నాటకం.అంతే కాదు వేశ్యా సంపర్కం పట్ల జుగుప్సను,విముఖతను కూడా కలిగి

స్తుందీ నాటకం!


 “జీవితమే ఓ నాటక రంగం...మనమంతా పాత్రధారులం “అని   ప్రముఖ నాటక కర్త షేక్స్పియర్ అన్నమాటలు చింతామణి నాటకానికి బాగా వర్తిస్తుంది.జీవితమనే 

నాటక రంగంలో చింతామణి ఒక  పాత్ర మాత్రమే.ఆ పాత్ర

ద్వారా సమాజంలో పాతుకుపోయిన ఓ దురాచారానికి చరమగీతం పాడాలని ఆశించాడు ఈ నాటక రచయిత కాళ్ళకూరి .


చింతామణి నాటకం అనేసరికి బూతులబుంగ,ముతక 

హాస్యం,అన్న ఓ అపప్రథ వుంది.నిజానికి ఈ నాటకం ఆద్యంతం ఎక్కడా బూతు లేదు.అర్వపల్లి సుబ్బారావు, గండికోట జగన్నాథం లాంటివృత్తి కళాకారులు కొందరు సందర్భాన్ని బట్టి,ప్రదర్శన ప్రాంతాన్ని బట్టి మూలంలో లేని బూతు సంభాషణల్ని,ముతక హాస్య, సన్నివేశాల్ని జొప్పిం

చారు.దీంతో చింతామణి అంటే ఓ చవకబారు నాటకం,

సంస్కారవంతులెవరూ చూడ కూడదన్న అపోహ నెల

కొంది.నిజానికి కాళ్ళకూరి వారి చింతామణి నాటకం ప్రదర్శన యోగ్యమైంది.పండిత,పామర జన రంజకమైంద

నడంలో ఎటువంటిసందేహం లేదు.


*ఇతివృత్తం…!!


బిల్వమంగళుడు,రాధ ఆదర్శ దంపతులు.దామోదరుడు బిల్వమంగళుడి మిత్రుడు.తండ్రి వార్థక్యంవల్ల బిళ్వ మంగ

ళుడు వ్యాపారభారాన్ని నెత్తినేసుకుంటాడు.అదే నగరంలో చింతామణి అనే వేశ్య వుంటుంది!ఆమె తల్లి  శ్రీహరికి డబ్బు పిచ్చి.చింతామణి  అందచందాల్ని వలగా విసిరి విటుల్నిఆకర్షించి వారివద్దనుంచి 💰 డబ్బు గుంజేది.

భవానీ శంకరం,సుబ్బిశెట్టి వంటి వారు ఇలా చింతామణి

 మోజులో పడి తమ సర్వస్వం కోల్పోతారు.


వ్యాపారంలో లక్షలు గడిస్తుప్న బిల్వమంగళుడిపై చింతా

మణి దృష్టిపడుతుంది.బిల్వ మంగళుడు సదాచార సంప

న్నుడు.నగరంలోమర్యాదస్తుడు.పెద్దమనిషి.బిల్వమంగళుడ్ని ఎలాగోఅలాగుతన దగ్గలకు తీసుకువస్తే కొంత సొమ్ము 

ముట్టజెబుతానంటూ చింతామణి భవానీ శంకరాన్ని

ప్రలోభ పెడుతుంది.భవానీ శంకరం మొత్తానికిబిల్వమంగ

ళుడ్ని తీసుకువచ్చి చింతామణి కి పరిచయం చేస్తాడు.

చింతామణి అందచందాలు,నాట్య విన్యాసాలు చూసి ముగ్ధుడైపోతాడుకట్ చేస్తే..చింతామణి మాయలో పడి ఉన్నదంతా చింతామణికిమర్పించుకుంటాడు . బిల్వ

మంగళుడు.సమాజంలో పరువు ప్రతిష్టలు దిగజారిపో

తాయి.పండంటి కాపురం కూలి పోతుంది.భార్య రాధ 

పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుంది.


డబ్బులేదని తమ ఇంటికిరావద్దంటుంది చింతామణి

తల్లి శ్రీహరి.ఉన్నదంతా మీకే ఊడ్చి ఇచ్చానుగాఅంటా

డు బిల్వమంగళుడు.అయినా డబ్బులేకండా రావడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతుంది శ్రీహరి.ఇక చేసేది లేక డబ్బుకోసం ఇంటికొస్తాడు  బిల్వమంగళుడు.


వేశ్యా వ్యామోహం  వదులుకోమంటాడు  తండ్రి.  బిల్వ

మంగళుడు ‌తండ్రి మాటల్ని పెడచెవిన పెడతాడు.దీంతో మిగిలిన ఆస్తుల్ని కోడలు రాధ పేర రాసి మరణిస్తాడు బిల్వమంగళుడి తండ్రి.చివరకు తనపేర వున్న ఆస్తిని కూడా  భర్తకే రాసి ఇచ్చేస్తుంది రాధ.


*కామాతురాణాం…..!!


తన తండ్రి ఇంట్లో శవంగా పడివున్నా పట్టించుకోడు.

దహన సంస్కారాలను చేయకుండా ఆస్తిపత్రాలను

తీసుకొని అంత రాత్రి పూట చింతామణి దగ్గరకు బయ

లుదేరుతాడు.వర్షం జోరుగాకురుస్తుంటుంది నది ఒడ్డున వున్న చింతామణిని చేరాలంటే నావ అవసరంవుంటుం

ది.అయితేఅంత రాత్రి నావ ఎక్కడ  దొరుకుతుంది?

అందుకే నదిలో దూకి ఈదటం మొదలుపెడతాడు.

ప్రవాహవేగం  ఎక్కువగా వుండి కొట్టుకుపోయే పరిస్థితి కలుగుతుంది.ఇంతలో ఓ ఆధారందొరుకుతుంది.దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరతాడు.తీరా చూస్తే తాను పట్టుకున్న ఆధారం ‘శవం ‘అని తెలుస్తుంది.”కామాతురాణాం..న భయం..న లజ్జ “ అని ఊరికే అన్నారా? బిల్వమంగళుడి

పరిస్థితీ అదే.


ఈలోగా….,


ఈలోగా అక్కడ చింతామణి కి జ్ఞానోదయంఅవుతుంది.

వేశ్యావృత్తిని మానేస్తుంది.దైవారాధనలోకాలం గడుపు

తుంటుంది.ఈ విషయం బిల్వమంగళుడికి తెలీదు!.

ఆస్తిపత్రాలతో చింతామణి ఇంటికి చేరుకుంటాడు... బిల్వమంగళుడు.!


*అక్కడి వాతావరణమే వేరు.!!


బిల్వమంగళుడికి చింతామణి ఇంటి వాతావరణం వేరు

గా కనిపిస్తుంది .గతంలో మాదిరిగామల్లెలు,పన్నీరు, సుగంధాలు కనబడవు.కేవలం  బదులు అగరొత్తుల వాసన మాత్రం వస్తుంటుంది.రసిక,సంగీత నాట్యాలకు బదులు వైరాగ్య భరితమైన మీరా భజనలు వినిపిస్తుం

టాయి.బిల్వమంగళుడికిదేం అర్థం కాదు.మతి పోతుంది.

అసలు తానొచ్చింది చింతామణి ఇంటికేనా? అన్న అను

మానం కలుగుతుంది.


చింతామణి వుండే గదిలోకి వెళతాడుబిల్వమంగళుడు.

అక్కడ చింతామణిని చూసి అవాక్కవుతాడు.పట్టు చీర 

కట్టుకొని ఒంటినిండా భరణాల్ని ధరించి,సిగలోమల్లెచెండు 

తురిమి,తనను సరస సల్లాపాలతోతనను కవ్విస్తూ,సుఖ

భోగాలతో అలరించే అపూర్వఅందాలరాసి...నారచీర

కట్టి,నుదుట విభూతితో,ఏక్ తారను మీటుతూ మీరా భజన ఆలపిస్తుంటుంది. చింతామణిని ఇలా చూసి జీర్ణించుకో లేక పోతాడు.బిల్వమంగళుడు.అయితే ….

బిల్వమంగళుడ్ని దగ్గరకు పిలిచి ఓదారుస్తుంది చింతా

మణి.తనలో కలిగిన ఈ ఆథ్యాత్మిక మార్పును తెలియ

జేస్తుంది!అశాశ్వతమైన శారీరక ఆనందం కంటే ఆత్మానం

దం గొప్పదనిచెబుతుంది.బిల్వ మంగళుడికి కనువిప్పు కలుగుతుంది.బిల్వమంగళుడికి సోమగిరి యోగితో పరిచయం కలుగుతుంది. ఆ యోగి దగ్గర శ్రీకృష్ణ మంత్రో

పదేశాన్ని పొంది సన్యాసిగా మారిపోతాడు.ఆయోగి వెంటే 

వెళ్ళిపోతాడు బిల్వమంగళుడు.” దైవభక్తే మానవజీవితా

నికి మోక్ష సాధన “, అన్న సందేశంతో నాటకంముగుస్తుం

ది.వేశ్యావ్యామోహం పట్ల ప్రేక్షకులకు / పాఠకులకుఛీత్కా

రం కలుగుతుంది.


*చింతామణి వ్యక్తిత్వం..!


చింతామణి అందాల రాసి.సకల విద్యలు నేర్చిన నెరజా

ణ.సంగీత,సాహిత్యాల్లో నిష్ణాతురాలు.నాట్యంలోమయూ

రి.లోకానుభవానికి కొదవే లేదు.అయినా కులవృత్తి రీత్యా

సానికాక తప్పలేదు!కులవృత్తి లోకాచారమే కదా ! అని సరిపెట్టుకుంది.వేశ్యాకులంలో పుట్టినా సంస్కారవంతు

రాలు.కాబట్టే మంచీ చెడులవిచక్షణను గుర్తెరిగి ప్రవర్తిం

చేది.


తన వ్యామోహంలో పడి సర్వంసమర్పించుకొని,ఉత్తచేతు

లతో మిగిలిన భవానీ శంకరాన్ని బయటకు గెంటేయ మం

టుంది తల్లి శ్రీహరి.అయితే చింతామణి ఇందుకు ఓపట్టా

న అంగీకరించదు.తల్లికి నచ్చజెప్పబోతుంది.అయినా భవానీ శంకరాన్ని ఇంటినుంచి బలవంతంగా గెంటేస్తుంది శ్రీహరి.నిజానికిచింతామణి కి వేశ్యా కుల సహజ లక్ష

ణాలు అంతగా ఒంటబట్టలేదు.వేశ్యకు కూడా నీతి వుం

టుందని చింతామణి నిరూపించింది.


“తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి నీకే సమర్పించు

కున్నాను.”గదా! 


అని భవానీ శంకరం అన్నప్పుడు…


“నేను మాత్రంవనీకేం తక్కువ చేశాను ? నీకోసం 

నా చుట్టూ తిరిగే విటుల్ని పంపివేశాను. మా అమ్మ

కసురుకుంటున్నానీకే లోబడి వున్నాను కదా “,

అంటుంది. 


“నీవు లోటు చేశావని యే ఛండాలుడన్నా డని” 

భవానీ శంకరం  అంటాడు


తసుకున్న డబ్బుకు న్యాయం చేయడం చింతామణికి వృత్తితో పెట్టిన విద్య.అందుకే చింతామణి ప్రియవస్య,

సర్వాంగ సుందరి అంటాడు భవానీ శంకరం.


 *పాండిత్యం..!!


చింతామణి పాండిత్యంలో కన్యాశుల్కం లోని మధుర

వాణి కంటే మిన్నగా కనిపిస్తుంది. బిల్వమంగళుడు చింతామణి కోసం సర్పం,సంపెంగ పూవు,శివుడు రాహు

వు రూపాలన్న  దంతపు పెట్టెను తెచ్చి తెరవకుండా,

వీటి ఆధారంగా లోపల ఏముందో కనిపట్టమంటూ ‘

సవాలు విసురుతాడు.అలా తెలుసుకోగలిగితే మరో మంచి బహుమతి కూడా ఇస్తానంటాడు.చింతామణి 

ఈ సవాలును స్వీకరిస్తుంది.పెట్టెలపై వున్న గుర్తులను బట్టి లాజిక్ వెదుకుతుంది.


"దంతపు పెట్టెపై మొదట సర్పం వున్నది.సర్పం దేనినిని హరింప గలదు?  మారుతమును….మారు తము దేని

కొరకు వచ్చును.? పరిమళము కొరకు వచ్చును.?

పరిమళము దేనియందు..వుండును? పుష్పాదుల

యందు...అందువల్ల పెట్టెలోని వస్తువు పుష్పాదులలో

నిది కావలెను.


ఇక రెండవ గుర్తు సంపెంగ పూవు.‌సంపెంగ దేనినిహరింప 

గలదు?తుమ్మెదను.తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు.మకరందము దేనియందుండును? పుష్పమందు.అందు వల్ల పెట్టెలోని వస్తువు పుష్పమగుట నిశ్చయము.కానీ ...ఏ పుష్పమో? తేలాలి.


మూడవ గుర్తు శివుడు.శివుడు ఎవరిని వారించును? మన్మథుని. మన్మథునికే పుష్పము కావలెను? అరవింద

ము.అశోకము,చూతము,మల్లిక,నీలోత్పలము, అందువల్ల పెట్టెలోనిది పుష్పమే కావలెను.


ఇక నాల్గవ గుర్తు రాహువు.రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు.సూర్యునికే పుష్పము ప్రియము? ఇంకే

ముంది? కమలమే.కావున పెట్టెలో వున్నది కమలమే “అంటుంది చింతామణి.

   

చింతామణి పాండిత్యానికి అబ్బురపడతాడు బిల్వమంగ

ళుడు! పెట్టెతెరచి అందులో వున్న  వజ్రకమలాన్ని తీసు

కోమని ఇస్తాడు. ఇక బహుమతిగా ఏం కావాలో కోరుకో

మంటాడు.

   

"నాకెప్పటి నుంచో కామ శాస్త్రం చదువుకోవాలని వుంది.

ఇప్పటి దాకా సరైన బోధకులు నాకు దొరకలేదు.మీరది తీర్చిన చాలును “అంటూ పీటముడి వేస్తుంది .చింతా

మణి. నిజానికి  బిల్వమంగళుడికి సమస్త శాస్త్రాలు తెలు

సన్న విషయం చింతామణి కి ముందే తెలుసు. అతన్ని లోబరుచుకోడానికే బహుమతి మిషతో కామశాస్త్రం నేర్పమంటుంది.దీనివల్ల ఎలాగూ బిల్వమంగళుడు తనకు కామదాసుడవుతాడు.


*జ్ఞానోదయం..!!


వేశ్యగా తన బతుకు పట్ల తనకే  హేయభావం ఏర్పడు

తుంది. దీంతో చింతామణికి జ్ఞానోదయం కలుగుతుంది.‍‍‌” 


"పాపిని,భ్రష్టురాలను,నతిబానిసనై బహు నీచ వృత్తిలో  లేపులు మావులుంబడిచరించిన మాటయె నిక్కువ,మింక పాపపు దారి త్రొక్కును.భవచ్చరణాబ్ది యుగంబు సాక్షిగా నాప ప్రేమ నిల్పియదు నందన కృష్ణా తరింప జేయవే "

అంటూ తనను తాను తిట్టుకుంటూ కష్ణారాధనకు…..

అంకితమవుతుంది.


చింతామణి సహజ సంస్కారం వల్ల ఆథ్యాత్మిక చింతన పొంది ,తన వల్ల నష్టపోయిన వారందరికీ ధనాన్ని తిరిగి ఇచ్చివేస్తుంది.భవానీ శంకరం,బిల్వమంగళుడు,సుబ్బి శెట్టి,వంటి వారిలో పరివర్తన  కలుగజేస్తుంది. 


*సంస్కరణ..!!


చింతామణి ముందుగా తన్ను తాను సంస్కరించుకుంటుం

ది.తన వల్ల కష్టాలు పడిన వారందరూ తనవలె పరివర్తన చెందాలని కోరుకుంటుందివేశ్యావవ్యామోహం,వేశ్యా సంప

ర్కం వల్ల వాళ్ళకు   కలిగిన కష్టాన్ని,నష్టాన్ని లోకంలోతిరిగి 

ఓ ఆర్నెల్లు ప్రచారం చేయాలని కోరుతుంది.చింతామణి

మాటను మన్నించి సుబ్బిశెట్టి,భవానీ శంకరం,వేశ్యావ్యా

మోహ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటారు!

బిల్వమంగుళుడు కృష్ణ దర్శనానికి మధురానగరానికి బయలుదేరి వెళ్తాడు.


కాళ్ళకూరి వారి చింతామణి పాత్ర ఉదాత్తమైంది. కేవలం జాతివల్ల గాక,నీతివల్ల మాత్రమే మనుషుల్ని,వారి మన

స్తత్వాల్ని గ్రహించాలని చింతామణి పాత్ర ద్వారా లోకానికి చాటి చెప్పాడు  రచయిత.


ఈ నాటకం గొప్పదనమేమంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఓ మూల ఈ నాటకం నిరంతరం ప్రదర్శింపబడుతూ

నే వుంటుంది.ఈ నాటకంలోని 


*అత్తవారిచ్చిన అంటుమామిడి తోట…”


*వగలును,వలపులు వర్షించి తొలినాడె తిరగని పిచ్చి యెత్తించినాను “


వంటి పద్యాలు ఎన్నిమార్లు విన్నా..'వన్స్ మోర్లు".. పడాల్సిందే.మరో మాట అర్వపల్లి సుబ్బారావు (సుబ్బిశెట్టి ) బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (చింతామణి ) కనకం (శ్రీహరి ) షణ్ముఖ (బిల్వమంగళుడు )కాంబి

నేషన్లో చింతామణి నాటక ప్రదర్శనను తిలకించడం 

ఓ మధురానుభూతి. ఈ నాటక ప్రదర్శనను ఎన్నో…

మార్లు చూడటం నా అదృష్టం.రాత్రి 9గం.లకు నాటకం మొదలైతే..అదిపూర్తయ్యేసరికి తెల్లారేది..ఎన్నిసార్లు చూసినా తనివి తీరని నాటకం చింతామణి !!

                                                                                *ఎ.రజాహుస్సేన్ !!

  నంది వెలుగు..!!

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది

 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతర్వేది


తూర్పు గోదావరి జిల్లా లో వున్న  పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం.... పురాణాలలో కూడా దీని ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు....

గోదావరీ నదికి ఇటువేపు ఉన్న "సఖినేటి పల్లి" మండలానికి చెందిన "అంతర్వేది" తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు

ఇక్కడి స్థలపురాణం: సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

రక్తావలోచనుని కథ:  హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.

త్రేతాయుగంలో... శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది. ఓం నమో వేంకటేశాయ

 Share to your group

పూజా పునస్కారాలు

 ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారుని కి ఖాళీ గా ఉన్నాడా లేడా అని కనుక్కుని తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం....


     తల్లి...నాయనా .పూజా పునస్కారాలు ఐనాయా?

కుమారుడు...ఇలా చెప్పారు.

అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని.అది కూడా అమెరికాలో  మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు.అలాంటి నేను పూజ లు అవి ఏం బాగోదు.

   తల్లి మందహాసం తో కన్నా!నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా.కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.....అన్నది.

కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.

అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. ..


నీకు దశావతరాలు అది మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.

 అప్పుడు ఆ తల్లి...హా సంభంధం ఉంది. ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.

     మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది.అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.ఇది నిజమా కాదా.

  కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.

   తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించిన ట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

 మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్ల ని గుర్తు కు తెస్తుంది.

  ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు.దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమై న జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.

ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు.నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు  హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.

  కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

తల్లి కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలి ని పట్టుకు తిరిగేవాడు.దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.

 ఇక ఏడో అవతారం రామావతరం.మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు .సమస్త కుటుంబ బంధుత్వనికి అది పురుషుడు.

 ఇక ఎనిమిదవ ది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి.అతడు సమాజ  నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజము లో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యం విస్మయం తో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ

 తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం.ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమం లో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు.ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణ లకు మూలం.

ఇక వచ్చేది కల్కిపురుషుడు.అతను నీవు   ఏ మానవునికై వేతుకోతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వరసత్వానిగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తి.గా వెలుగొందుతాడు.

కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తున్నాడు

   అపుడా ఆ కొడుకు ఆనంద భాష్పలతో అమ్మ...హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం. అని అన్నాడు

    ..

. ఆత్మీయులారా !!

                 మన వేదాలు ,గ్రంథాలు,పురాణాలు,ఉపనిషత్తులు,

ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి.మీరు ఎలాగ అనుకొంటే అలా వైజ్ఞనికమైనవి కావచ్చు.లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్ట్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢచారాలు పేరిట మన సంస్కృతి ని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం.ఇకనైనా మేలుకోండి రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

మనంమారుదాం. యుగంమారుతుంది...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

నేతాజీ జయంతి

 నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. గాంధీ కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటునే, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించి, రాజీనామా చేసిన ఆయన ధైర్యమూ, త్యాగమూ మన యువతకు అలవడితే, మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 


    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం. 


                జై హింద్

BRAHMINS KITCHEN

 *ONLY BRAHMINS KITCHEN* *(OBK)*


*హైదరాబాద్ లో ఇంటి వద్దకే ప్రతీరోజూ బ్రాహ్మణ భోజనం*


బ్రాహ్మణుల వంట శుచిగా పంపించబడును

 

*మల్కాజిగిరి/ఆనందబాగ్/సఫిల్ గూడా/నేరెడ్ మెట్/సైనిక్ పురి/AS రావు నగర్ / రాధిక థియేటర్ / ఈస్టు మారేడుపల్లి / వెస్ట్ మారేడుపల్లి/ ముషీరాబాద్ / చిక్కడపల్లి / RTC X రోడ్స్ / గాంధీ నగర్/ విద్యా నగర్ / నల్లకుంట / సాకేత్ / దమ్మాయిగూడా* మొదలగు సమీప ప్రాంతాల్లో ప్రతిఇంటికి ప్రతిరోజూ శాఖాహార భోజనం *నెలవారీ పద్ధతిలో మాత్రమే* సప్లై చేయబడును... *కాయకూర, పప్పు, సాంబారు, పచ్చడి* ఉదయం క్యారెజి వస్తుంది.


మా ఇంటి (బలరాంనగర్, సఫిల్ గూడ) నుండి *మూడు కిలోమీటర్ల వరకు సరఫరా మాత్రం ఉచితం* గా పంపబడును...


మా ధరలు ఈ క్రింది విధంగా ఉంటాయి...


పచ్చడి (60-80 గ్రాములు)

పప్పు (100-120 గ్రాములు)

కాయగూర (100-120 గ్రాములు)

పులుసు (100-120 గ్రాములు)


పై వన్నీ కలిసి ధర రూ. 80/-


పై వాటికి అన్నం (400 గ్రాములు) కలిపి కావాలంటే ధర రూ. 100/-


*ఈ పై ధరలు 3 కీలోమీటర్ల వరకు మాత్రమే...*


ఒకవేళ మీకు సాయంత్రం చపాతీలు కావలస్తే, మేము సరఫరా చేయగలం, కానీ అవి మధ్యాహ్న భోజనంతో పాటే ఇచ్చేస్తాము... వాటి ధర రూ. 60/-  (మూడు చపాతీ, ఒక కూర)


మీరు మీ ఇంటి స్థానం (location) పంపినట్లైతే, మీ ఇల్లు ఉన్న దూరం google ద్వారా చూసి మూడు కిలోమీటర్ల పైన ఎంతదూరం ఉంటే అన్ని కిలోమీటర్లు ₹.10/- తో గుణించి పై ధరకు కలపటం జరుగుతుంది...

ఇది కూడా మొత్తము దూరం మా ఇంటి వద్ద నుండి 8 నుంచి10 కిలోమీటర్ల లోపు మాత్రమే మా సేవలు అందుబాటులో ఉంటాయి...


మీకు అవసరం ఐతే కాల్ చెయ్యండి,  లేకుంటే *దయచేసి మీ వద్ద ఉన్న *బ్రాహ్మణ* సమూహాలలో ఈ పోస్టు షేర్ చెయ్యమని ప్రార్థన...🙏🙏🙏


శాఖహరులకు మాత్రమే సంప్రదించ వలసిన చరవాణి /  ఫోను నెంబర్లు  7382754039 / 9966066021

Star Enterprises



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/XHzm1mv1XfRpkggy5