30, జూన్ 2022, గురువారం

 శ్లో𝕝𝕝 క్షుత్తృడాశాః కుటుమ్బిన్యః 

మయి జీవతి నాన్యగాఃl

తాసామాశా మహాసాధ్వీ

కదాచిన్మాం ముఞ్చతి||


తా𝕝𝕝 నాకు ఆకలి, దాహం, ఆశ అనే ముగ్గురు భార్యలున్నారు. ఆ ముగ్గురు నేను *బ్రతికి ఉన్నంతకాలం* వేరొకరివద్దకు వెళ్ళరు. ఆ ముగ్గురు భార్యలలో *ఆశ* మహా గొప్ప పతివ్రత.*నన్ను ఎప్పుడూ వదిలి ఉండదు*


ఆకలి దాహాన్నైనా వదిలి ఉండచ్చేమోగాని ఆశ మరియు దాని మిగిలిన వికృత రూపాలైన అత్యాశ దురాశలు చావవు మరియు మనిషిని నిశ్చింతగా ఉండనివ్వవు. వాటిని గెలవడంలోనే ఉంది మన ప్రయత్నమంతా.

29, జూన్ 2022, బుధవారం

మన దేవబాష

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


♦️ *మనం మర్చిపోయిన మన దేవబాష కి ప్రపంచం పట్టం కట్టింది*♦️



😵😨🚩🚩🚩🚩🚩🚩 #సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది :


▪️సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.


1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే.


2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.


3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.


4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.


5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.


6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.


7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.


8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.


9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.


10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.


11. *జర్మనీ లోని 14 యూనివ ర్సిటీ లలో సంస్కృత బోధన జరుగుతోంది*.


12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్త మవుతున్నాయట. *చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు*. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థ మూ మారదు. *ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి*. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చెప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.


13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృత భాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.


14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. *అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే*.


15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధ నలలో ఋజువు పరచుకుని *ప్రస్తు తం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు*.


16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (  *కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా* ) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.


▪️వ్యాసభారతం చూస్తుంటే, సంస్కృతం ఎంత సుసంపన్నమైన భాషో తెలుస్తుంది. నాదృష్టిలో వ్యాసుడంతటి కవి ఈ భూమండ లం మీద పుట్టియుండ డని నా ఉద్దేశ్యం.




హరిః ఓమ్. హరిః ఓమ్.హరిః ఓమ్.

చిదానంద రూప

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*చిదానంద రూప శివోహం శివోహం*


వ్యక్తి మనసులో ఏ కాంక్షలు లేకుండా ఉండాలి. మనసు శూన్యంగా మారాలి. నిర్మలత్వంతో నిండిపోవాలి. అప్పుడు అతను అపూర్వ శక్తితో నిండిపోతాడు. అద్భుతమైన చైతన్యం అతన్ని ఆవహిస్తుంది. అతనికి ఆ స్పృహ ఉండదు. అప్పుడు అతనిలో ప్రతీదీ సహజంగా పరివర్తన చెందుతుంది. సూర్యోదయం జరిగినట్లు, చంద్రుడు  ఉదయించినట్లు, పూలు వికసించినట్లు, నది ప్రవహించినట్లు ప్రతీదీ అప్రయత్నంగా నిర్నిమిత్తంగా జరిగిపోతుంది. అక్కడ అన్ని చలనంలో ఉంటాయి. అన్ని సహజంగా జరుగుతాయి. కానీ వాటన్నిటినీ నిర్వహిస్తున్నాను అన్న అహంకారం అతనికి ఉండదు. 


kఒక ప్రాచీన రోమన్ కథ ఉంది. అది గొప్ప కథ. గొప్ప సత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న కథ. ఒక సన్యాసి ఉదాత్తమైన జీవితం గడిపాడు. అతనికి ఎలాంటి స్వార్థ చింతన లేదు. ఏ కోరికలూ లేవు. ఏదో సాధించాలి అని అతను ఎప్పుడూ అనుకోలేదు. నిర్మలంగా , నిశ్చింతగా జీవించాడు. అతని సహజ జీవితం స్వర్గం దాకా వ్యాపించింది. అతను సాధారణంగా జీవించాడు. కానీ లోక దృష్టిలో అది అసాధారణం . కాంక్షలు లేని మనిషిని లోకం విచిత్రంగా చూస్తుంది. ఆ వ్యక్తి జౌన్నత్యానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. అటువంటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలని సంకల్పించారు.


ఒక రోజు దేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలను చూస్తూనే అతను భక్తితో, నమ్రతతో వాళ్ళకు ప్రణమిల్లాడు. “ నాలాంటి సామాన్యుడి పట్ల దయతో మీరు రావడం నా అదృష్టం . మీరు నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి " అన్నాడు. దేవతలు " మేం నీకు ఆజ్ఞలివ్వడానికి, ఆదేశాలు జారీ చేయడానికి రాలేదు. నువ్వు నీదంటూ ఏమీ లేనివాడివి! నీ గురించి ఎప్పుడూ ఆలోచించని వాడివి. నిస్వార్థపరుడివి. నిరాడంబరుడివి. అలాంటి నీ కోసం ఏమైనా చేయాలనిపించి మేము వచ్చాం! నీకు ఇష్టమైన కోరికను కోరుకో. నువ్వు ఏమీ అడిగినా ఇస్తాం" అన్నారు దేవతలు! 


దానికి ఆ సన్యాసి " మీరు నా పట్ల ఇంత దయగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు. నాకు సంబంధించిన కోరికలు అంటూ ఏమి లేవు. దైవం ఏది సంకల్పించిందో అదంతా యథాతథంగా జరుగుతోంది. మీరు ఇంతగా అడుగుతున్నారు. కాదంటే బాగుండదు. కానీ నాకు ఏమి అడగాలో తెలియడము  లేదు. నేను ఊహించినవే కాదు. నేను ఊహించనవి కూడా దైవం నాకు ఇచ్చింది" అన్నాడు.


అతని వినమ్రతకు దేవతలు మరింతగా అతన్ని ఇష్టపడ్డారు. కారణం అతను కాంక్షా తీరానికి అతీతంగా ఉన్నాడన్న విషయం వాళ్ళకు తెలిసి వచ్చింది. కానీ అతనికి ఏదో చేయాలన్న తపన వాళ్ళలో పెరిగింది. " నువ్వు వద్దు అంటున్నావు. కానీ మాకు ఏదైనా నీ కోసం చేయాలని ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా  కోరుకో. మేం నీకు వరం ఇవ్వనిదే కదలం" అన్నారు.


సన్యాసి సంకటంలో పడ్డాడు. తప్పించుకునే వీలు లేదు. సరే! ఏం కోరాలో నాకయితే తెలియదు. మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ వరం ఇవ్వండి" అన్నాడు. దేవతలు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి " నీకు గొప్ప వరం ఇస్తున్నాం. మరణించిన వారిని నువ్వు తాకితే వాళ్ళు బతికి లేచి కూర్చుంటారు" అన్నారు.! ఆ వరంతో సన్యాసి ఆలోచనలో పడ్డాడు. " మీరు అన్యధా భావించకండి. ఇలా చనిపోయిన వాళ్ళను బతికిస్తున్నాను అన్న స్పృహ ఉంటే నాలో అహంకారం పెరుగుతుంది. దయచేసి మీరు ఏ వరం ఇచ్చినా ఆ వరం యొక్క స్పృహ నాకు లేకుండా చేయండి" అని ప్రార్థించాడు.


ఆ మాటలు విని దేవతలు మరింతగా ఆనందించి " నీ నీడ ఎక్కడ పడినా అక్కడ చనిపోయిన అన్నీ తిరిగి బ్రతుకుతాయి" అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యారు.


వాళ్ళు వరం ఇచ్చారు.! ఆ వరం యొక్క స్పృహ ఆ సన్యాసికి లేదు. ఆయన తన పనుల్లో తాను ఉండేవాడు. ఆయన నీడ పడిన చోట ఎండిపోయిన పచ్చిక చిగురించేది. చనిపోయిన ప్రాణులు బ్రతికేవి. కానీ ఇదంతా ఆయనకు తెలిసేది కాదు. ఆయన తన దారంటే తాను వెళుతూ ఉండేవాడు. నీడ పడిన చోట నిత్యవసంతం ఉండేది. ఆ సన్యాసి  స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవతలు “ మీకిచ్చిన వరం ఎంతవరకూ పని చేసింది? “ అని అడిగారు. అదేమీ తెలియదు - గుర్తించలేదు అన్నాడు తత్వజ్ఞాని. అహంకారం ఉన్నప్పుడు కాంక్షలు ఉంటాయి. అవి ఏమీ లేనప్పుడు సర్వమూ శూన్యంగా ఉంటాడు తత్వవేత్త అయిన జీవన్ముక్తుడు. 


బంధాలు కలిపేది మాటే....

                     బంధాలు తెంచేది మాటే....

                     గాయాలు చేసేది మాటే..... 

                   గాయాలు మాన్పెది మాటే.... 

                      ప్రాణం పోసేది మాటే.....

                      ప్రాణం తీసేది మాటే.....    

                  మాటే నిన్ను గెలిపిస్తుంది.... 

                  మాటే నిన్ను ఓడిస్తుంది..... 

                  మాట్లాడే ముందు జాగ్రత్త...!!!

త్రికరణ శుద్ధితో జీవించు ! 

త్రిగుణాతీతుడవై జీవించు ! 

త్రిగుణరహితుడవై బయలున బయలై ఉండుము ! 


*కర్మలు భక్తి తో చేయవచ్చు. నిష్కామముగా చేస్తే అది, ఫలాపేక్ష లేని కర్మలు చిత్తము శుద్ధమగుటకు ఉపయుక్తమై నిరాకారమైన  పరమాత్మ స్థితిని పొందుటను అనుభూతి చెందుతారు.*


*నిర్విరామముగా నిర్వికారము - నిరాకారము అయిన పరమాత్మ యందు ఏకాగ్రత - అనన్య భక్తి - చిదానంద రూప శివోహం అనెడి స్వరూప జ్ఞానమే లక్ష్యము - లక్షణము - కోహం - సోహం - కట్ట కడపటికి నాహం - అజం - అచలం.*

నమస్కారం

 *నమస్కారం వలన కలిగే ప్రయోజనం*


*ఒక రోజు, దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు* 


*"నేను రేపు పాండవులను చంపుతాను"*


*అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది - భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు*. 


*అప్పుడు...*

*శ్రీ కృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు, ఇప్పుడు నాతో రండి*. 

*శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు. శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి* *నమస్కరించినప్పుడు, అతను* 

*"అఖండ సౌభాగ్యవతి భవ"* *అని ఆశీర్వదించిన తర్వాత  ద్రౌపదిని అడిగాడు !!*

*"ఏంటమ్మా?! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు? శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా"?*

*అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది* 


*"అవును తాతయ్యా.!  వారు గది బయట నిలబడి ఉన్నారు" అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు* *నమస్కరించుకున్నారు.*

 *భీష్ముడు చెప్పాడు-*

 *"నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"*

*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు "మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు"*

*"మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు -దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు" -*

*...... అంటే ......*

*ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం -*

*ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడమే.!*

*"తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు"*

*"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."*

*పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు*

*"అభ్యర్థన  ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ఇల్లు స్వర్గం అవుతుంది."*

*ఎందుకంటే:-*

*నమస్కారం ప్రేమ.*

*నమస్కారం క్రమశిక్షణ.*

*నమస్కారం చల్లదనం.*

*నమస్కారం సంస్కారాన్ని,* 

*గౌరవాన్ని నేర్పుతుంది.*

 *నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి.*

*నమస్కారం నమస్కరించడం నేర్పుతుంది.*

*నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

*నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*

*నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది*.

*నమస్కారం సకల కార్యసిద్ధికి సులభ మార్గం.*

*నమస్కారం, ప్రతి నమస్కారం మన సంస్కృతి మరియు మన జీవన విధానం.*

*అందరికి నమస్కారం* 


*సేకరణ* 

🕉️🕉️🙏🙏🕉️🕉️

One liner Geeta -

  here the essence of all the 18 chapters of Gita in just 18 sentences. 


One liner Geeta - 

Will you forward and circulate this to all? Each one is requested to forward this to 100 persons in 4 days. Not only within your state but this should be forwarded to the entire India. 


One liner Geeta


*Chapter 1 - Wrong thinking is the only problem in life .*

*Chapter 2 - Right knowledge is the ultimate solution to all our problems .*

*Chapter 3 - Selflessness is the only way to progress and prosperity .*

*Chapter 4 - Every act can be an act of prayer .*

*Chapter 5 - Renounce the ego of individuality and rejoice the bliss of infinity .*

*Chapter 6 - Connect to the higher consciousness daily.*

*Chapter 7 - Live what you learn .*

*Chapter 8 - Never give up on yourself .*

*Chapter 9 - Value your blessings .*

*Chapter 10 - See divinity all around .*

*Chapter 11 - Have enough surrender to see the truth as it is.*

*Chapter 12 - Absorb your mind in the higher.*

*Chapter 13 - Detach from Maya and attach to divine .*

*Chapter 14 - Live a life- style that matches your vision.*

*Chapter 15 - Give priority to Divinity .*

*Chapter 16 - Being good is a reward in itself .*

*Chapter 17 - Choosing the right over the pleasant is a sign of power .*

*Chapter 18 - Let go, let us move to union with God .*

( Introspect on each one of this principle)

                          

                  || ॐ तत्सत् ||

అద్వైత_సత్యం

 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩      

         *అద్వైత_సత్యం*


*ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం.*


*భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం.*


*జ్ఞానం వచ్చేంత వరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది.*


*నిద్రలో కల కంటున్నంతసేపు అది కల అని తెలియదు. బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది.*


*ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే.*


*కాబట్టి ఏ సిద్దాంతం ఆచరిస్తున్నా చివరికి అద్వైతానికి చేరుకోవాల్సిందే. ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే.*


*కానీ రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యరూపం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా లేదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువు కుడా అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలు అదే విధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.*


*మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి, ఇలా ఏ పర్వదినానికి తగ్గట్టు ఆ దేవుడుని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడు, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు*


        *శృంగేరి జగద్గురువులు*

శూన్యమాసం

 పూర్వ/ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ఆషాఢము. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు ఆధ్యాత్మికంగా గొప్పవని శాస్త్రములందు చెప్పబడింది.

ఆషాఢమాసం శూన్యమాసంగా పెళ్ళిళ్ళు మొదలైన వాటికి పనికిరాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యమైనది. జగమంతా వ్యాపించిన జగన్నాథుడే స్వయంగా పురుషోత్తముడిగా సుభద్రా, బలభద్రా సమేత సుదర్శన స్వాములతో కలసి ప్రజల వద్దకు వచ్చి జాతర చేసుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాస విశేషములలో ప్రధానమైనది.

ఆధ్యాత్మికతావు ఏ మాత్రం పురోగతి ఉండాలన్నా అవసరమైన గురువులను పూజించుకునే గురుపూర్ణిమ, చాతుర్మాస్యవ్రత ప్రారంభం, కర్కాటక సంక్రమణం ఇలా ఎన్నో ముఖ్యమైన వాటిని కలబోసుకొని ఉన్నది ఈ మాసం.

శరన్నవరాత్రులు, వసంతనవరాత్రుల వలె ఆషాఢ నవరాత్రులు కూడా దేవీ పూజకు ప్రధానమైనవి. ఈ నవరాత్రులలో అమ్మవారి క్రియాశక్తిరూపమైన వారాహీదేవిని పూజించడం సంప్రదాయం. దానాలలో ఈ నెలలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


ఈమాస ప్రారంభం నుండి రైతులకు ఆశాజనకంగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. కనుకనే ‘ఆషాఢస్య ప్రథమ దివసే” అని కాళిదాసు మేఘసందేశాన్ని ఆషాఢమాసంలో వచ్చే మేఘంతోనే ప్రారంభించారు.

28, జూన్ 2022, మంగళవారం

 తెలుగుల ముద్దుబిడ్డడు*

సీ॥
చతురజ్ఞు డద్భుత సమయోచితోక్తుడు
          సామదానము లందు సవ్యసాచి
పాలకోత్తములందు ప్రథమగణ్యు డతడు
         పరిణీతచిత్తుండు పండితుండు
పదునారుభాషల పదును తేలినవాడు
          వేయిపడగలూన్చె విశ్వమందు
నపర చాణక్యుడై యశమందె ధరణిలో
          రాజనీతికి తానె ప్రాణమౌచు
గీ॥ తెలుగు బిడ్డడు సాహితీదీప్తితముడు
తెలుగుసంస్కృతీపుంభావతేజ మతడు
పీవి నరసింహరాయుండు భీష్ముడయ్యె
తనదు తలపుల నమలుకై దక్షుడవగ
*~శ్రీశర్మద* 

అక్షర స్వర హనుమ ప్రార్థన

 🍁🍃 *అక్షర స్వర హనుమ ప్రార్థన*🍁🍃


🌹 *శ్రీరామ జయరామ*🌹  

  🙏 *జయజయరామ*🙏


అక్షర స్వరములతో ఆంజనేయప్రార్థన వలన తలచిన కార్యముల సిధ్ది జరుగుతుంది. 🙏


*అం*-జనాగర్భసంభూతం అగ్నిమిత్రస్య పుత్రకం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.


*'ఆ'* దిత్యసదృశం బాలం అరుణోదయ సంభవం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

 

*ఇం* గితజ్ఞస్య రామస్య దూతకార్య పరాయణం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఈ* శ్వరస్యాంశసంభూతం ఈషణారహితం హరిం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.


*ఉ* దధిక్రమణం వీరం ఉదారచరితం విభుం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఊ* రువేగోత్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయుః 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఋ* క్శాఖాధ్యాయినం శాంతం మృగ్యమాణపదార్చితం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ౠ* కారాద్యక్షరోత్పత్తి జ్ఞానపూరిత మానసం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఌ* ఇత్యాది వర్ణానాం ఉచ్చారణ విధాయకం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

 

*ఏ* థమానశరీరం తం రాజమాన ముఖాకృతిం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

 

*ఐ* క్ష్వాకుకులవీరస్య రామస్య ప్రియపాత్రకం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఓ* షధాద్రి సమానీత దివ్యౌషధిసమన్వితం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.


*ఔ* త్సుక్యమాత్రకాలేన శత్రుక్షయకరం విభుం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


శ్రీరామ జయరామ జయజయరామ 

శ్రీరామ జయరామ జయజయరామ

శ్రీరామ జయరామ జయజయరామ


            🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

                *న్యాయపతి*

            *నరసింహా రావు*


🙏🌹🙏🌹🙏🌹🙏🌹

చతుఃషష్టి ఉపచారాలు

 *చతుఃషష్టి ఉపచారాలు*


ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం

2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం

3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం

4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం

5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం

6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట

7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట

8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము

9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం

10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం

11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం

12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం

13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం

14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం

15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం

16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము

17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము

18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం

19. దానిపైన చంద్ర శకలం పెట్టడం

20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం

21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం

22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం

23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం

24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం

25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం

26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం

27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము

28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట

29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం

30. పతకం – బంగారు పతకం

31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం

32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం

33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం

34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము

35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)

36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు

37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు

38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము

39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము

40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)

41. పాదకటకం – కాలి అందెలు

42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు

43. పాదంగుళీయములు - మట్టెలు

44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు

45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం

46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు

47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు

48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు

49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం

50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట

51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట

52. ఆచమనీయము – జలమునందించుట

53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)

54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము

55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం

56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట

57. చామరము – అమ్మవారికి చామరము వీచుట

58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట

59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట

60. చందనం – గంధం పమర్పించుట

61. పుష్పం – పుష్పాలను సమర్పించుట

62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట

63. దీపము – దీప దర్శనము చేయించుట

64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట

ఏకాంతము..


🙏సర్వోజనా సుఖినోభావంత్🙏

సమయానుకూలంగా వెళ్లితీరాలి

 *సమయానుకూలంగా వెళ్లితీరాలి..  లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?*

1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..

కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)

Etc., Etc..

చెప్తుపోతుంటే, List చాలదు..


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

*కారణం ???*

ఓకేఒక్కటి UPDATE.

they DIDN'T UPGRADE

 *కాలక్రమేణా అవి మారలేదు. !!*


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?

గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు

*నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…* పలుకుతుంటాయి.


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


*Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.*


🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.


*2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.*


రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..


🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.


*మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


*మీరు ఎప్పుడైనా గమనించారా ..?*


ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc

ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మీరు తప్పక వెనుకబడిపోతారు..


 *కాలక్రమేణా మార్పు సహజం*

 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

*"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"*


 సమయంతో కదిలితే విజయం సాధించడమ్, లేకపోతే కనుమరుగైపోవడం.   Healy  change Medical industry☀️🌈

దేవతా వృక్షాలు

 *🌿రావి, వేప, మారేడు, జమ్మి, ఉసిరి, మేడి, మఱ్ఱి*


*దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి*.  అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం.  రావి చెట్టును పిప్పల వృక్షమని  అశ్వత్థవృక్షం అని, బోధివృక్షం అని కూడా అంటారు.


రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం ఇది.


*శ్లోకం* 

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణ

అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమః!


ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ,  మధ్యలో విష్ణువు,  అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. 


రావి చెట్టును అశ్వత్థ నారాయణుడుగా భావించి పూజిస్తారు. 


రావిచెట్టును విష్ణు స్వరూపంగా భావించి

స్త్రీలు సంతానం కోసం ప్రదక్షిణలు పూజలు చేస్తారు. 


బుద్ధునికి ఈ చెట్టు క్రిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల బౌద్ధులు దీనిని *బోధి వృక్షమని*

అంటారు.

.....................................

*వేప చెట్టు*


*వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు*. అందువల్ల నే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేస్తారు. 


చాలా చోట్ల రావి చెట్లు, వేప చెట్లు కలిపి ఉంటాయి. 


వేపాకు, వేపపూత, వేప చెట్టు మీదుగా ప్రసరించే గాలి ప్రతిది మనిషి ఆరోగ్యంగా వుండడానికి ఉపయోగ పడతాయి.


వేప సర్వరోగ నివారిణి.  వేపలో ఉన్నన్ని ఔషధ గుణాలు వేరే చెట్టులో లేవంటే అతిశయోక్తి కాదేమో. 

.........................................

*మారేడు వృక్షం*


*మారేడు ఆకులను సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు*. మారేడు శివునికి ప్రీతికరం.  మూడు పత్రాల బిల్వ దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. 


మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు అని అంటారు.


మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.


బిల్వ పత్రాలను కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.


*ఆ శ్లోకం*

అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా

గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌!


*మారేడు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్ష మని పేరు*. 


జైనులకు కూడా మారేడు పవిత్ర వృక్షం.  వారి గురువుల్లో ఒకరైన *23వ తీర్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు*. 


మారేడులో ఔషధ గుణాలు అధికం.  కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.

.....................................

*జమ్మి వృక్షం*


*జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి*.   సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం  పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం ఇది.


అజ్ఞాతవాసంలో పాండవులు తమ 

ఆయుధాలను ఈ వృక్షం పైనే  ఉంచారు. 


*శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని!*


అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మమర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. 

....................................

*ఉసిరి చెట్టు*


*ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు*.  కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు.  ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగిస్తారు.  ఈ చెట్టు క్రింద భోజనాలు చేస్తారు. 


ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.

.............................................

*మేడి చెట్టు*


*మేడి చెట్టు క్రింద దత్తాత్రేయుల వారు (త్రిమూర్త్యాత్మకుడు) కూర్చుని ఉంటారు*.   ఇది కూడా దేవతా వృక్షమే. 


(మేడి పండును అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్‌, సీమ మేడిపండు అని కూడా పిలుస్తారు).

......................................

*మఱ్ఱి చెట్టు*


మఱ్ఱి చెట్టును సంస్కృతంలో వటవృక్షం అని అంటారు.  దీనినే *న్యగ్రోధ వృక్షము* అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు (మర్రి చెట్టు ఊడలు కిందికి పెరుగుతాయి) అని అర్థం. 


*మఱ్ఱి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు*.  ఈ చెట్టు సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు.


సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. 


ప్రళయ కాలమందు యావత్ జగత్తు జలమయము అయినపుడు శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రముపై మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది.

🚩

27, జూన్ 2022, సోమవారం

చిల్లగింజల గురించి

 చిల్లగింజల గురించి సంపూర్ణ వివరణ  - 


      ఈ చిల్లగింజలను సాధారణ భాషలో ఇండుప గింజ , నిర్మలి అని కూడా పిలుస్తారు . మురికిగా ఉన్న నీటిని తేటగా చేయుటకు ఈ గింజను వాడతారు. వర్షాకాలములో నదీ ప్రవాహములలో , వాగులలో వచ్చు నీరు బురద , కల్మషముతో కూడి ఉండును. ఆ నీటిని నిర్మలముగా చేయుటకు నీరు పట్టి ఉన్న బిందెలలో ఈ చిల్లగింజని అరగదీసి వచ్చిన గంధమును నీటిలో కలుపుతారు. ఇది నీటిలోని బురద , కల్మషములను శుద్ది చేయుటయే కాక నీటిలో గల అనేకరకాల విషపదార్ధాలను కూడా నిర్మూలించును అని ఆధునిక పరిశోధనలు రుజువుచేసినవి . 


               ఈ చిల్లగింజలు నీటిలో కలిగిన రసాయనిక విషపదార్ధాలనే కాకుండా పరమాణు జన్యుమైన విషపదార్ధాలను కూడా నిర్మూలించును. ఇది కేవలం నీటిని శుభ్రపరచడం మాత్రమే కాకుండా అనేకరకాలైన వ్యాధులను కూడా నయం చేయును . ముఖ్యంగా మూత్రాశయ సంబంధ వ్యాధులను తగ్గించి మూత్రమును జారీ అయ్యేట్టు చేయును . మూత్రాశయం నందలి రాళ్లను కరిగించును. మధుమేహమును తగ్గించును . మధుమేహరోగులు చిల్లగింజలు , చండ్ర చెక్క , వేగిసచెక్క ఈ మూడింటితో తయారుచేసిన కషాయం నిత్యం వాడుట వలన మధుమేహము తగ్గును. కామెర్ల నందు కూడా పనిచేయును . వాపులు తగ్గును. తరచుగా వచ్చు జలుబు తగ్గును. శరీరం బరువు తగ్గి సన్నబడేలా చేయును . నేత్రములకు మంచిది . 


              చిన్నపిల్లల్లో మరియు పెద్దవారిలో తరచుగా కనిపించే నులిపురుగుల సమస్యను నిర్మూలించును. చర్మవ్యాధులు నందు పనిచేయును . చర్మవ్యాధుల యందు నిమ్మగింజలతో కలిపి వాడుచున్న మంచి ఫలితం కనిపించును. తెలంగాణ ప్రాంతములో తాంబూలం నందు వక్కతో పాటు చిల్లగింజల ముక్కలు కూడా వాడుట సాంప్రదాయముగా ఉన్నది. ప్రతిరోజు చిల్లగింజను వాడుట వలన మూత్రాశయములో రాళ్లు ఏర్పడకుండా మూత్రం సాఫీగా జారి అయ్యేలా చేస్తుంది . 


  

          మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కాలజ్ఞాని

 కాకి కాలజ్ఞాని అంటారు ఎందుకో కాస్త పరిశోధనాత్మక తో మననం చేసుకుందాం...

 వేకువ జామునే (బ్రహ్మ ముహూర్తంలో) మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి..

 కావు కావు నీ భంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అంటూ అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ  అందరినీ తట్టి లేపేది కాకి.. 

ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసులుతున్నదే కాకి..

 శత్రువులను గుర్తించి వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు....


ఆడ కాకి మగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి

 అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం ఓ గొప్ప విషయం...

 ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.... 

సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన  కాకులదే; 

అంతేకాదు

 సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా...!!

 కాకులు లేని ప్రదేశం లేదు 

ఈ భువిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వఠవృక్షాలుగా పెరుగుతాయి

 అలా పచ్చని పకృతి విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే

 అందుకే కాకులు దూరని కారడవి అంటారు....

 కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన భంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తూంది అనేవారు పెద్దలు ....  

అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించేముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి

 సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికిచేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరించి బయట ఎగుతాయి 

 అందుకే కాకి కాలజ్ఞాని అంటారు....!!!


దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు...

 భోజనం చేసేముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు;

 మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఈ పక్షి కాకి.

 ఎక్కువ కాలం జీవిస్తూంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రం లో కూడా విశదీకరించారు .....!!! 

కాకి కూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చిన తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకికి....!!

సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ  కాకి బావ కధలు బిడ్డలకు చెప్పండి అని  తల్లి తండ్రులను పెద్దలను కోరుతూ...!!

భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం మనం ఆచరించాల్సినవే

 ఇవన్నీ సంఘజీవనం సేవాతత్పరత మంచి స్నేహభావాలతో ఈర్ష్య  ద్వేషాలు లేకుండా కలసి మెలసి అన్యోన్యంగా అసమాతలకతీమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.....!

ఉత్సవానికి వస్తావా?

 ఉత్సవానికి వస్తావా?


అవి నేను కాలేజిలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు పరమాచార్య స్వామివారు అంటే తెలుసు కాని, వారిపై ప్రత్యేకమైన భక్తీ ఏమి లేదు. హఠాత్తుగా ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మహాస్వామి. కాని అది ఎదో ఊహ అని కొట్టిపారేయలేను. వారు తరచుగా స్వప్న దర్శనం ఇస్తూనే ఉన్నారు.


మరి ఆ స్వప్న దర్శనాలను గౌరవించాలి కదా? అందుకే ప్రతి గురువారం ఉపవాసం చెయ్యడం ప్రారంభించాను. అప్పటినుండి ప్రతి గురువారమూ నాకు దర్శనభాగ్యం ప్రసాదించేవారు. అది చాలా సంతోషకరమైన విషయం. కాని ఎంతోకాలం నిలువలేదు.


మహాస్వామివారు కలలో రావడం ఆగిపోయింది. నా వల్ల ఏమి తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఆ రోజు గురువారం. నా మంచంపై కూర్చుని నిద్రకుపక్రమిస్తూ కళ్ళుమూసుకుని, “కనీసం ఈరోజైనా మీ దర్శనభాగ్యం నాకు కలగాలి” అని వేడుకున్నాను.


ఊహు! పెరియవ రాలేదు.


రెండురోజుల తరువాత పరమాచార్య స్వామివారు నా కలలో కన్పించారు. “ఇంతకుముందు పరమాచార్య స్వామివారు తరచుగా నాకు స్వప్న దర్శనం ఇచ్చేవారు. ఈమధ్య అస్సలు రావడం లేదు” అని బాధతో స్వామివారిని అడిగాను.


మహాస్వమైవారు చిన్నగా నవ్వి, “నాకు వయసైపోయింది కదా! నేను ఇప్పుడు ముసలివాణ్ణి. నేను దిన్ని మోసుకుని అంట దూరం రాలేను కనుక నువ్వే నా దర్శనానికి రా” అని దండం వైపు చూపిస్తూ చెప్పారు.


“పరమాచార్య స్వామి అనుగ్రహం నేను తప్పక రాగాలను”


“మరి ఉత్సవానికి వస్తావా?”


“మీ అనుగ్రహం ఉంటే తప్పక వస్తాను పెరియవ”


కల చదిరిపోయింది. నాకు ఏమి అర్థం కాలేదు. నేను ఏ ఉత్సవానికి వెళ్ళాలి? దానికి పరమాచార్య స్వామి దర్శనానికి సంబంధం ఏమిటి?


కాని ఆ ఆశ్చర్యకర సంఘటన మరుసటి రోజునే జరిగింది. మా పెద్దమ్మ చెన్నైలో ఒక వివాహానికి వెళ్ళాల్సి ఉంది. తనతో రమ్మని నాకు చెప్పింది. “నీవు కూడా వస్తే, అలాగే కాంచీపురం వెళ్లి పరమాచార్యుల దర్శనం చేసుకుందాము” అని చెప్పింది.


నేను వెంటనే అంగీకరించాను.


మరుసటిరోజు కంచి మఠం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగానే, ఊరెరిగింపుగా వచ్చిన కామాక్షి అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మవారి చుట్టూ ముగ్గురు పెరియవలూ(మహా పెరియవ, పుదు పెరియవ, బాల పెరియవ) ప్రదక్షిణం చేస్తున్నారు.


“ఏమిటి ఈరోజు విశేషం” అని అక్కడున్న ఒకావిడని అడిగాను.


“నీకు తెలియదా? కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవం జరుగుతోంది” అని చెప్పిందావిడ.


నాకు కలిగిన ఆశ్చర్యం ఆనందం గురించి చెప్పాల్సిన పనిలేదు. “ఉత్సవానికి వస్తావా?” అన్నది కేవలం కల కాదు. అది దైవ సంకల్పం.


--- జానా కణ్ణన్, మైలాపూర్. మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 5


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

26, జూన్ 2022, ఆదివారం

రస ఔషదాలు

 ఆయుర్వేదం -  రస ఔషదాలు .


 ఇంతకు ముందు నేను ఆయుర్వేదం లొ శల్య తంత్రం గురించి తెలియచేసాను. ఇప్పుడు ఆయుర్వేదం లొ రస ఔషధాల గురించి తెలియజేస్తున్నాను. 


 మూలికలతో చేసినటువంటి ఔషధాలు వెంటనే ఉపయోగించవలెను. వాటికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. కానీ కొన్ని రకాల లోహములు ను శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. అవి ఎప్పుడు ఉపయోగించినా సమర్దవంతం గా పనిచేస్తాయి. మానవుని శరీరం అష్టదాతువులతో నిర్మితమై ఉంటుంది. ఈ దాతువులు లలొ హెచ్చు తగ్గుల వలన మానవునికి రోగాలు ప్రాప్తిస్తున్నాయి. మరలా వాటిని పూరించడం వలన రోగాలు తగ్గు ముఖం పడతాయి. నేటి అల్లోపతి వైద్య విదానం అదే వాటిని ప్రాకృతికం గా తయారు చేయరు . 


ఉదాహరణకు పాండు రొగమునకు ఒక అత్యద్బుతమైన ఔషధం ఉన్నది. పాండు రోగం అనగా శరీరం నందలి రక్తము లేకుండా పాలిపోయినట్టు ఉండుట .ఈ వ్యాధి గ్రస్తులు తెల్లగా మొఖము నందు జీవకళ లేకుండా ఉంటారు.  ఏ గ్రామ భూమియందు 100 ఏళ్ళ నుండి ఉన్నట్టి చిట్టేపు రాళ్లను తీసుకుని వచ్చి వాటిని ఎర్రటి నిప్పుల్లో బాగుగా కాల్చి ఆవుపంచకం లొ ముంచి చల్లార్చాలి . ఈ రకం గా 12 సార్లు చేయాలి . ఇలా చేసిన తరువాత చూర్ణం చేయగా అది సిందూరం రంగులొ వస్తుంది. దానిని ఉదయం సాయంత్రం పుచ్చుకోనిన కేవలం 41 రొజులలొ మనిషి ఎర్రగా తయారవుతాడు. పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇలా చాలా ఉన్నాయి .


       భావ ప్రకాశిక మొదలయిన ఆయుర్వేద గ్రంథాలలో ఈ రసాయనిక తంత్రాల గురించి ఉన్నది. 3,4 శతాబ్దాల నుంచి వాగ్బట్టాచార్యుని కాలం వరకు ఈ రసయనిక ఔషధాలు చికిత్సకు  ఉపయోగించి నట్టు అంతగా లేదు . క్రీ.శ  4 వ శతాబ్దం లొ సంకలనం చేయబడ్డట్టు చెబుతున్న Bowers manicript అంతకు పూర్వం రచించబడిన D .r hernal గారిచే సంపాదించ బడిన వ్రాతపతి గా ఉన్న వైద్య గ్రందం నందు కుడా స్వర్ణ , లొహ ధాతువుల ప్రస్తావన ఉన్నది. కానీ విశేషం గా ఎక్కడా ఉపయోగించినట్టు లేదు .వైదిక కాలం న సోమరస ఉపయోగం అదిక ప్రచారం లొ ఉన్నందున రసవిజ్ఞానం ఋగ్వేద కాలం నుండి ఆదరణ, ప్రచారం లొ ఉనట్టు భావించుచున్నారు. దానిని అనుసరించే చరకాదులు తమ గ్రంధములయందు రసౌషదాలకు స్థానం ఇచ్చారు. భారతీయుల రసప్రక్రియలకు మూలం ప్రాచీనం అని తెలియచున్నది. 


      ఋగ్వేదం న స్వర్ణం, ఇనుము, సీసము, ఇత్తడి, శ్యామ లొహం. ఇలాంటి లోహాల ప్రసక్తి కలదు. రసశాస్త్ర ప్రక్రియ కొన్ని తాంత్రి కముల యందు ప్రాధమిక స్థాయిలో వర్ణించ బడెను. రసాయనిక తాంత్రికం లొ సిద్ధ నాగార్జునుడు ప్రసిద్ధుడు .


 రస తంత్రములో ఉపయోగించబడు ద్రవ్యములను పలువురు తంత్ర కర్తలు పలు విధాలుగా వర్గీకరించారు. అందులొ రత్న సముచ్చయకారుని వర్గీకరణ సామరస్యం గా ఉన్నది. అతడు మహారసములు, ఉపరసములు, సాధారణ రసములు, దాతువులు, ఉపదాతువులు ఇలా వర్గీకరణం చేసారు. 


 మహా రసములు - అబ్రకం, వైక్రాంతం, స్వర్ణ మాక్షిక, తామ్ర మాక్షిక , సస్యకము తుత్తుము , చపలము, రసకము , అని ఎనిమిది మహారసములు గా పేర్కొనబడినవి.


 ఉప రసములు - గంధకం, గైరికము, కాశీసము, స్పటికము, తాలకము , మనశ్హిల , అంజనము, కంకు ఉస్టం అనే ఎనిమిది ఉపరసములగా పేర్కొనబడినవి .


 సాదారణ రసములు - కంపిల్లము, గౌరీ పాషాణము, నవసాగారము, కపర్ధం, అగ్ని జారం, గైరికం, హింగులం, మ్రుద్దారు శృంగి, ఈ ఎనిమిది సాదారణ రసములగా పేర్కొనబడినవి .


  పూర్వాచార్యులు పాదరసం నోక్కదానినే మహారసం గా గ్రహించి తక్కిన వాటిని ఉపరసములుగా పరిగణించారు. రస ఔషద శాస్త్ర ప్రకారం రెండు రకాలు అగు ద్రవ్యాలు కలవు.మొదటి రకం పాదరసం, గంధకం, శంఖ పాషానాది రసొపరసములు. సాదారణ రసములు.రెండొవది సువర్ణం, రజతం, తామ్రము, వంగము, సీసము లోహాది దాతువులు.సుశ్రుతమున వంగం, సీసం , తామ్రము ,రజతము, స్వర్ణం , అయస్కాంతం , మండురం, వైడుర్యం , స్పటికం, ముత్యం , శంఖం ఇవి ఔషద ద్రవ్యాలుగా పేర్కొన్నారు . చరక సంహిత ఎందు రక్తపిత్త వ్యాధి చికిత్సకు , నేత్ర రోగ చికిత్సకు వైడుర్యం, ముత్యములు , మణులు, ప్రవాళం, శంఖం, లోహము, తామ్రము , సౌవీరంజనము ఔషధాలుగా చెప్పినాడు. కుష్టు రొగమునకు పాదరస గంధకములు ఔషదములు గా పేర్కొనెను .ఈ వ్యాధులకు అయస్కాంతం ఉపయోగించడం కూడా సుశ్రుత సంహితలో ఉన్నది.


          సువర్నాధి దాతువులను పలచని రేకులగా చేసి సైంధవ లవనములను ఆ రేకులకు పూసి వానిని కాల్చి నిర్దేశించిన కషాయములలో ముంచి అందునుంచి మెత్తని చుర్ణమును గ్రహించు విదానం వివరించబడెను. ఇట్టి సుక్ష్మ చూర్ణం తయారికి 16 పర్యాయాలు ఆ రేకులను అగ్నిలో కాల్చి ముంచవలసి ఉన్నది. ఈ లొహ రేకులను చండ్రనిప్పుల బొగ్గుల మద్య నుంచి కాల్చి చల్లబడిన తరువాత మెత్తని చుర్ణమును తేనెతో సేవించవలసి ఉన్నది.అని తెలియచేయడం అయినది. అష్టాంగ హృదయం నందు నేత్ర రోగములనుకు పాదరసం తో చేసిన అంజనం ఉపయోగించెడి విదానం తెలియజేసెను.


          మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

భగీరధ ప్రయత్నం

 తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై కి చేర్చాడు,దాని మీద నుండి భూమిపైకి తెప్పించాడు మధ్యలో జాహ్న మహర్షి చెవిలో దూరితే బతిమాలి తప్పించి భూమార్గం పట్టించి సాగరుల భస్మ రాశులపై  పారించి వారికి విముక్తి కల్గించి పితృ ఋణం తీర్చుకొన్నాడు ఆయన చేసినా ఈ కఠోర శ్రమనే భగీరధ ప్రయత్నం అన్నారు .కరువు కాటకాలతో వరదలతో అల్లాడే గోదావరి ప్రాంత జనులకు దాహార్తి తీర్చి, తాగు నీటితో బాటు సాగి నీటి వసతి కల్పించి లక్షలాది ఎకరాలలో నీరు పారించి గోదావరి డెల్టాను సస్య శ్యామలం చేయటానికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి అంతటి శ్రమనూ పడ్డాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర .అందుకే ఆయన్ను ఆ ప్రాంత జనం ‘’అపర భగీరధుడు ‘’ అని ప్రశంశించి కృతజ్ఞతలు చెప్పి నిత్య గోదావరీ స్నానం లో ఆ మహానుహావుడికి సూర్యునితో పాటు అర్ఘ్య ప్రాదానం చేస్తున్నారు వాళ్ళు అలా ఆయన సేవల్ని నిత్యం స్మరిస్తూ ప్రాతస్మరణీయుడు గా భావించారు.

గోదావరి పై సర్వే-ఆనకట్ట ప్రతి పాదన

గోదావరి పై ఆనకట్ట కట్టక పూర్వం గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర లను కలిపి ‘’రాజమండ్రి జిల్లా ‘’అని పిలిచే వారు .1831-40మధ్యకాలం లో అతి వృష్టి అనా వృష్టి తుఫాన్లు ఉప్పెనలు జిల్లాను పూర్తిగా కుంగ దీశాయి .1821-లో జనాభా7,38,308  ఉంటె పదేళ్ళ తర్వాతా  1842-43 లో అంతే జనాభా  పెరగలేదుకాని5,61,041కి తగ్గి పోయింది .1815-24 మధ్య ప్రభుత్వానికి శిస్తు ఆదాయం 18 ,72172 రూపాయలు అయితే ,1830–43.మధ్య ఆదాయం పదహారు లక్షలే అయింది అంతకు ముందు గోదావరి డెల్టాకు సాగు నీటి సౌకర్యాలు కల్గించాలని యాభై ఏళ్ళుగా ఎన్నో ప్రతి పాదనలను పంపినా ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు .ఆదాయం తగ్గి పోయే సరికి వాళ్లకు చురుక్కు మని పించింది .ఇప్పుడు ద్రుష్టి పెట్టారు .తగ్గటానికి కారణాలను పరిశీలించమని నివేదికలు పంపమని పరిపాలనా విభాగం లో పని చేస్తున్న ‘’హెన్రి మౌంట్ గోమరీ ‘’ని ప్రభుత్వం ఆదేశించింది .కాని  తన జిల్లాకు వేరే అధికారిని నియమింటం రాజ మండ్రి కలెక్టర్ అవమానం గా భావించి సహాయ నిరాకరణ చేశాడు ప్రభుత్వం వెంటనే స్పందించికలెక్టర్ ను తొలగించి  మాంట్ గోమరీ నే జిల్లా ఎడ్మినిస్త్రేటర్ గాహోదా కల్పించి ,కార్య రంగం లో దిగమని సూచించింది

గోమరీ వెంటనే అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి అందులో జిల్లాలో ఇరిగేషన్ పనులను అశ్రద్ధ చేయటం ,రెవిన్యు అధికారుల లంచ గొండి తనం ,అసమర్ధత ,లోప భూయిష్ట ఎస్టేట్ ల నిర్వహణ వల్లక్షామం ఏర్పడి ఆకలి చావులతో జనాభా క్షీణించి ప్రభుత్వాదాయం తగ్గి పోయిందని తెలియ జేశాడు .దీనికి పరిష్కారం గోదావరి డెల్టాలో సాగు నీటి సౌకర్యం కల్గించటం ఒక్కటే శరణ్యం అని చెబుతూ ,దీనికి ఇప్పటికే ఈ రంగం లో తన సమర్ధతను శక్తి యుక్తులను ,వివేకాన్ని కష్ట సహిష్ణుతను రుజువు చేసుకొన్నఆర్ధర్  కాటన్ దొర ఒక్కడే సర్వ సమర్ధుడు అని ప్రభుత్వానికి నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు.

అప్పటికే మేజర్ ఆర్ధర్ కాటన్ రెండో శతాబ్దం లో కరికాల చోళుడు కావేరి నది పై నిర్మించిన’’ గ్రాండ్ ఆనకట్ట’’ ‘’కు అడుగున తూములు ఏర్పరచి,కావేరిలో ఒండును తొలగించి లోతు చేసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని30 మిలియన్ల ఘన గజాలకు బదులు నలభై మిలియన్లఘనగజాల వరకు పెంచాడు కాలరూన్ నదిపై ఆనకట్టలు కట్టి ,కొంత నీటిని కావేరికి మళ్ళించి వరదలను ఆపి ,తంజావవూర్ జిల్లాను’’ దక్షిణ దేశ దాన్యా గారం’’ చేశాడు  స్తానికం గా దొరికే వాటినే ఉపయోగించి తన ఆలోచన ను రుజువుచేసి సాటి లేని ‘’ఇరిగేషన్ ఇంజినీర్’’ గా   సుస్తిర కీర్తి పొందాడు .  .రెడ్ హిల్స్ కు రైల్ మార్గం ఏర్పరిచాడు .తర్వాతా మద్రాస్ లోపని చేసి నౌకాశ్రయ నిర్మాణం కార్య క్రమం చేబట్టి ,మిలిటరీ బారక్స్ ను తక్కువ వ్యయం తో నిర్మించి ప్రభుత్వ మన్ననలు పొందాడు ఆ తర్వాత విశాఖ లో చర్చి నిర్మించి విశాఖను సముద్ర కెరటాల నుండి రక్షించే రాతి గోడ లు కట్టాడు   ఆ రాళ్ళ మధ్య మట్టి ఇసుక పేరుకొని కట్టలు మరింత ద్రుఢతరం అయ్యాయి సహజ నౌకాశ్రయానికి విశాఖ చాలా అనువైన స్తలం అనీ ,విశాఖను జల మార్గాల ద్వారా ముఖ్య పట్నాలతోలతో కలిపి వృద్ధి చేయాలని విశాఖ పరిసరాల్లో చెరకు ,కాఫీ పండ్ల తోటలపెంపకం చాలా శ్రేష్టం అనీ ప్రభుత్వానికి ముందు చూపుతో సూచనలు చేసిన ‘’ఆధునిక విశాఖ శిల్పి’’ సర్ ఆర్ధర్ కాటన్.అప్పటికే ప్రభుత్వం కోరకుండానే గోదావరి డెల్టా భి వృద్ధికి కొన్ని సూచనలు ప్రభుత్వానికి పంపి ఉన్నాడు .ప్రత్తికి బదులు చెరుకు పండించటానికి ఏర్పాట్లు చేయాలని సూచించాడు ప్రాభుత్వం దీన్ని అంగీకరించింది కూడా . మాంట్ గోమరీ సూచన కు వెంటనే స్పందించిన ప్రభుత్వం కాటన్ ను గోదావరి డెల్టా కు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటానికి నివేదిక తయారు చెయ్యమని కాటన్ ను 1844 ఆగస్ట్ అయిదున  ఆదేశించింది .

కాటన్ కార్యక్రమం

ప్రభుత్వ ఆజ్ఞతో విశాఖ నుండి రాజ మండ్ర చేరుకొన్నాడు కాటన్ .పాపి కొండల నుంచి అసముద్రంవరకు గోదావరి నదిని సర్వ్ చేసి వేర్వేరు ప్రదేశాలలో నదీ నీటి మట్టాలను ,వాలును ,ప్రవాహ వేగాన్ని లెక్కలు  కట్టటానికి ఉద్యమించాడు 20లక్షల ఎకరాల్లో సర్వే  చేయాలి. కాలువల మార్గాలని, భూ మట్టాలని నిర్ణయించాలి .ఇదిఎంతో కష్టమైన పని .సర్వే కు ఎనిమిది మంది పని చేసే సోల్జర్లను ఆరుగురు సర్వేయర్లను ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి రాశాడు .పొదుపు మంత్రం పాటించే ప్రభుత్వం అనుభవం లేని ఒక కుర్ర అధికారిని ,శిక్షణ లో ఉన్న ఐదుగురుసర్వేయర్లను మాత్రమె సాంక్షన్ చేసింది .జీపుల్లేని కాలం. ఎడ్ల బండీ లేక గుర్రాల మీదే ప్రయాణ సాధ్యం .సర్వే పరికరాలు ఆధునికమైనవికవు మొరటుగా ఉండేవి .కాని ఏమాత్రం నిస్పృహ కు లోను కాని కాటన్ ఓపిక లేక పోయినా రోజుకు కనీసం పది మైళ్ళు గుర్రం మీద తిరుగుతూ మిక్కిలి శ్రమ కోర్చి అపర భగీరదుడై కేవలం ఎనిమిది నెలల్లో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి 1845ఏప్రిల్ పది హేడు న సమర్పించాడు .

కాటన్ నివేదికలో ముఖ్య విశేషాలు

గోదావరి డెల్టాలో నేల స్వభావం వాతా వరణం ,జల వనరులు ప్రపంచం లో ఎక్కడా లేవు వరదలను తట్టుకోనేట్లు లోతట్టు ప్రాంతం లో గోదావరికి రెండు వైపులా మట్టి కట్టలు ఎత్తుగా కట్టాలి .నదికి అడ్డం గా ఆనకట్ట కట్టి ,కాలువలు త్రవ్వి నదీ జలాలను ఎత్తు గా ఉండే పంట భూములకు అందించాలి .చదును భూముల నుండి మిగులు నీటిని బయటికి పంపి పంట దిగుబడికోసం మురికి కాలవలు త్రవ్వాలి .వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు రోడ్లు, వంతెనలు ఎక్కువగా నిర్మించాలి .వీటన్నిటికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది .

ఇలా చేస్తే ఒన గూడే సదుపాయాలేమిటో కూడా కాటన్ వివ రించాడు .గోదావరి కృష్ణా లోయలలో సుమారు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది .ముప్ఫై లక్షలున్న సంవత్సర ఆదాయం  రెండు కోట్ల రూపాయలకు పెరుగుతుంది .డెల్టాకు అంతటికి నౌకాయాన సదుపాయం ఏర్పడుతుంది .వేసవి లో 30 వేల ఎకరాలకు చెరుకు సాగుకు సరి పడ నీరు అందుతుంది.మారు మూల గ్రామాలకు కూడా తాగునీరు అందుతుంది .వార్షిక రెవిన్యు ఇరవై  లక్షల నుండి అరవై లక్షలకు పెరుగుతుంది  .

    ప్రత్యెక సూచనలు

ఆనకట్ట నిర్మాణం మిలిటరీ కట్టడాల నిర్మాణం అంత పటిష్టం గ ఇంజినీర్ల నిర్వహణలోనే జరగాలి. అనుభవం లేని స్తానిక రెవిన్యు అధికారులకు ఈ పని అప్పగిస్తే పైసా కూడా ఆదాయం రాదు .తన సూచనల్లో ఏదైనా సందేహాలుంటే తనకు రాత పూర్వకం గీ తెలియ జేసి సమాధానం రాయటానికి తనకు తగి నంత వ్యవదినివ్వాలి .

ఇలాంటి సూచనలు, సలహాలు ఇంత్సకు ముందు ఏ అధికారి సాదికారికం గా ప్రభుత్వానికి ఇవ్వలేదు .దీనికి ధైర్యం ఆత్మ విశ్వాసం ఉండాలి. అవి పుష్కలం గా ఉండబట్టే కాటన్ నిర్భయం గా ఈ విషయాలు తెలిపాడు వీటిని రాజ మండ్రిజిల్లా కలెక్టర్ ఫ్రేండర్ గాస్ట్  -మద్రాస్ చీఫ్ ఇంజినీర్ లెఫ్టి నేనెంట్ కల్నల్ ఏ లాయ్ కి పంపిస్తే ,  ఆయన బల పరచి రెవెన్యు బోర్డ్ కు  26-2-1846 న పంపాడు .ఇది సమర్ధించి మద్రాస్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం అంగీకరించి లండన్ లో డైరెక్టర్లకు పంపించింది .డైరేక్తర్ల్ కోర్టు ఆనకట్ట నిర్మాణానికి 4,75 572రూపాయలు ,అప్పటికే ఉన్న పంటకాలవల మరమ్మత్తులకు 14,000  రూపాయలు శాంక్షన్క్ చేసింది  1847లో ఆనకట్ట నిర్మాణానికి మద్రాస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గోదావరి డెల్టా ప్రజల కోరిక, కాటన్ ఆశ, ఒకే సారి నేర వేరాయి .ఇక కాటన్ కార్య రంగం లో దూకటమే మిగిలింది .

ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని ‘’అఖండ గోదావరి ‘’అంటారు .ఆనకట్ట ప్రాంతం వద్ద గోదావరి ధవళేశ్వరం ,ర్యాలి ,మద్దేశ్వరం విజ్జేశ్వరం అనే నాలుగు పాయలుగా చీలి పోతుంది .దిగువ కొంత దూరం లో ‘’గౌతమి, వసిష్ట’’ అనే మరి రెండు పాయలౌతుంది .ఆనకట్టలు కట్టాల్సిన ఈ నాలుగు పాయల మొత్తం పొడవు 11,945అడుగులు అంటే రెండున్నర మైళ్ళు .మధ్యలో మట్టి కట్ట వేసి ,ఎత్తు పెంచాల్సిన లంకలు నాలుగున్నాయి  .అవే పిచ్చిక లంక ,బొబ్బర్లంక ,మద్దూరు లంక ,చిగురు లంక .వీటి మొత్తం పొడవు ఒకటిన్నర మైళ్ళు అంటే 7,430అడుగులు .నదీ గర్భం లో ఆరు అడుగుల లోతు వరసకు ఇటుక బావులు నిర్మించి ,వాటిపై పన్నెండు అడుగుల ఎత్తు ఆనకట్ట నిర్మించాలి .దాని పై పద్దెనిమిది అడుగుల వెడల్పు రోడ్డు వేయాలి .’’ఇలాంటి ఆనకట్ట అప్పటికి ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు’’. ఈ బృహత్ నిర్మాణానికి కావలసింది అసాధారణ సాంకేతిక నైపుణ్యం తో బాటు ఎన్ని ఓడిదుడుకులోచ్చినా నిలబడే గుండె నిబ్బరం కూడా ఉండాలి  .ఈ రెండు కాటన్ దొరలో పుష్కలం గా ఉన్నాయి .అందుకే ఈ అత్యంత క్లిష్టమైన నిర్మాణం చేబట్టాడు .

ధవళేశ్వరం లో ఉన్న డెల్టా క్లబ్ వెనక తాటి దూలాలతో, తాటాకులతో ఒక కుటీరం నిర్మించుకొన్నాడు దొర .అదే దొరగారి బంగాళా .దాని పక్కనే సిబ్బందికి గుడారాలు వేయించాడు .భార్య ఎలిజ బెత్ ,కూతురు బేబీ హాప్ లను కూడా తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడు .దగ్గరలో ఉన్న కొండ రాయి ఎంతోనాణ్య మైనదిగా భావించాడు .ఇటుకలు తయారు చేయటానికి కావలసిన మంచి మట్టి ,కాల్చటానికి సున్నపు రాయి దగ్గరలోనే ఉన్నాయి .లాకులకు తూములకు పనికొచ్చే ప్రశస్తమైన టేకు ప్రక్కనే ఉన్న అడవిలోనే ఉంది .అన్ని వనరులు ఉన్న ప్రదేశం గా భావించాడు కాటన్ .సున్నపు బట్టీలు ఇటుక ఆవములు తయారయ్యాయి .క్వారీలో పగల గొట్టిన రాయి తేవటానికి రైలు మార్గం ఏర్పడింది .అక్కడి నుండి నదిలోకి వీటి నన్నిటిని చేర్చటానికి ‘’ఫంటు ‘’అంటే బల్లకట్టు నిర్మాణం చేయించాడు .రాళ్ళను సైజులో చెక్కటం ,ఆనకట్టల మధ్య ఉన్న లంకల ను ఎత్తు చేయటం ,వాటిని బల పరచటం చక చకా సాగిపోయాయి .జూన్ నెలాఖర్లో వచ్చే గోదావరి వరదలకు ముందే ఈ పనులన్నీ పూర్తీ చేయాలని కాటన్ లక్ష్యం   గా పెట్టుకొని చురుగ్గా పర్య వేక్షించి పనులు పూర్తీ చేశాడు

కావేరి పై కట్టిన ‘’గ్రాండ్ ఆనకట్ట’’ను నిశితం గా పరిశీలించిన కాటన్ అక్కడ ఉపరితలం పై వాడిన సున్నపు పూతకు బదులు ఇక్కడ చెక్కిన రాయి ని ఉపయోగిస్తే ఆనకట్ట బలం మరింత పెరుగుతుందని నిర్ణయించాడు .ఇలాంటి చెక్కుడు రాయి పని వాళ్ళు రాజ మండ్రి జిల్లా మొత్తం మీద ఎక్కడా దొరక లేదు .ఉన్న వాళ్ళతోనే పని సాగిస్తే నిర్మాణం మరో ఏడాది ఆలస్యం అవుతుంది. దీనికి ఇష్టపడలేదు దొర .అందుకని వ్యూహం మార్చాడు .తూములు ,లాకులు మొదలైన ముఖ్య భాగాలకే చెక్కుడు కొండరాయి ఉపయోగించాలని రాయి వాడకాన్ని పరిమితం చేశాడు .

1847 ఏప్రిల్ లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభ మైంది .ఆ నాడు కాంట్రాక్ట్ తీసుకొని చేసే సంస్థలు లేవు .క్వారీలలో కొండ రాయి పగల గొట్టటం ,సున్నపు రాయి కాల్చి గానుగ ఆడి  సున్నం తయారు చేయటం ఇటుకల్ని కాల్చటం మొదలైన పనులకు ప్రభుత్వం 12మంది అధికారుల్ని ,కొందరు సహాయకుల తో బాటు1300మంది కూలీలను ఏర్పాటు చేసింది .కూలీలు నదిలో పనికి ముందు భయపడ్డా ఒక వారం లో మంచి ఉత్సాహం తో ఇది తమ పని అని తమ కోసమే ఆనకట్ట అని పని చేశారు .ఆ తర్వాత చాలా మంది కూలీలు వచ్చి చేరారు .అధికారులు కూడా వారిని ఎంతో దయతో చూసేట్లు చేశాడు దొర. అప్పుడు మగ కూలీకి రోజుకు ఒక అణా అంటే ఇప్పటి ఆరు పైసలు ,ఆడకూలీకి తొమ్మిది పైసలు అంటే ఇప్పటి నాలుగున్నర పైసలు .తాపీ ,వడ్రంగం కమ్మరులు మొదలైన నాణ్యమైన పని వారికి  రోజుకూలీ రెండు అణాల,మూడు పైసలు అంటే నేటి పద్నాలుగు పైసలు .ఆదివారం సెలవు అయినా ,ఆ రోజు కూలి కూడా కలిపి వారానికి మొత్తం శనివారానికే డబ్బు చెల్లించే ఏర్పాటు చేశాడు కాటన్ .రోజు పని మొదలు పెట్టటానికి, ,ముగియ టానికి గుర్తుగా ఫిరంగి మోగించే వారు .

ఇక్కడ జరుగుతున్నా జల యజ్ఞం చూసి కూలీలు విపరేతం గా వచ్చి చేరుతూ సంఖ్యను పది వేలకు చేర్చారు .ఐదు వందల మంది వడ్రంగులు ,మరో అయిదు వందల కమ్మర్లు ,వెయ్యి మంది రాతి చెక్కుడు వాళ్ళను నియమించి వేగం గా పనులు చేయించాడు కాటన్ .రోజుకు అయిదు వందల టన్నుల కొండ రాయి కొట్టి సిద్ధం చేసే వారు .ఈ రాయి సున్నం ఇటుక నది ఒడ్డుకు చేర్చే రైలు మార్గమూ తయారై పోయింది .నాలుగు క్రేనులు పదహారు రైల్వే వాగన్లు తయారయ్యాయి .వీటిని నదిలోకి చేర్చటానికి పద్దెనిమిది ఫంట్లు వచ్చేశాయి .

ఇక్కడ తాటాకు పాకలో ఉన్నప్పుడే కాటన్ కు రెండో కూతురు పుట్టింది .కాని దురద్రుస్ట వశాత్తు ఏడాది మాత్రమె బ్రతికి చని పోయి కాటన్ దంపతులకు తీరని శోకం మిగిల్చింది .మనో వేదన తో తట్టుకో లేక పోయారిద్దరూ .నెమ్మదిగా జన జీవన స్రవంతిలో కలిసి నిర్మాణం పనులు వేగవంతం చేశాడు .పల్లెల నుంచి నిరుపేద స్త్రీలు చంకలో పిల్లల్ని ఎత్తుకొని అర్ధ నగ్నం గా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వచ్చి పని చేయటం ఆ దంపతుల్ని కలచి వేసింది బిచ్చ గాళ్ళ బెడద ఉండేది కాదు .కస్టపడి పని చేసి ,దొర మెప్పు సంపాదించుకొన్నారు. తెల్ల దొరలని వీరంతా గౌరవించే వారు. దొరలకు తమ వద్ద ఉన్న కానుక లిచ్చి సంతోష పెట్టె వారు. వాళ్లకు ఇబ్బంది కల్గించకుండా కూలీలు ఏంతో  జాగ్రత్తగా మసలే వారు .

నాలుగు వైపులా కొండను ప్రేలుడు పదార్ధాలతో పగల కొట్టే భయంకర శబ్దాలు, కూలీల పాటలు .మేస్త్రీల అదలింపు ల తో దొర ఇంటి చుట్టూ సందడే సందడి .ఈ గందర గోళానికి దూరం గా కొండ ప్రాంతం లో కి కాటన్ మకాం మార్చాడు .రాయిని మందు సామానుతో పేల్చినప్పుడు రాయి ముక్కలేగిరివచ్చి బంగ్లా పై పడుతూ ఉండేవి .ఈ అదు రుడు కు ఇంటి గోడలు బీటలు ఇచ్చి అందులోంచి గాలి వెలుతురూ ధారాళం గా బంగ్లా లోనికి వచ్చేవి .పాములు బెదిరి ఈ బీటల్లో దూరి భయం కలిగించేవి .పిల్లలు భయ పడే వారు .ప్రజల్లో కాటన్ దొర పై ఆరాధనా భావం ఏర్పడింది .ఆటబొమ్మలు, పంచదార చిలకలు తినే పదార్ధాలు దొర కుటుంబానికి కానుక లు గా ఇచ్చే వారు .

దొర ఇంటి పని వంటపని బట్టలుతికే పనికి ప్రత్యెక సేవకులుండే వారు .ఏకులం వాళ్ళు ఆ పనే చేసే వారు ఒక రోజు ‘’లచ్చి ‘’ అనే ఇల్లు ఊడ్చే పని మనిషి ఎలిజ బెత్ ను బతిమి లాడి అర్ధ రూపాయి జీతం లో అడ్వాన్సుగా అడిగి తీసుకోంది.ఎందుకు అంటే కారణం చెప్పలేదు .లచ్చి వెంటనే రాజ మండ్రి వెళ్లి అర్ధ రూపాయి పెట్టి ఒక చిన్న పాపను కొనుక్కొని తెచ్చుకోంది .పిల్లలు లేకుండా ఒంటరిగా బ్రతకలేనని అందుకే ఈ పిల్లను కొనుక్కోవటానికే అర్ధ రూపాయి అడిగానని చెప్పి పాపను దొరసానికి చూపించింది .ఆమె నిర్వీర్యురాలైంది .ఆడపిల్లల్ని ఎంత కారు చవకగా ఆనాడు అమ్ముతున్నారో అర్ధం చేసుకొని విచారించింది ఎలిజబెత్ .ధవళేశ్వరం ఆనకట్టకు కొన్ని పునాది బావుల నిర్మాణం పూర్తీ అయింది .కాని 1847లో గోదావరికి వచ్చిన వరదలవల్ల పనులు పూర్తిగా ఆగిపోయి కొంచెం నిరాశ కల్గించింది కాటన్ కు.

గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

గోదావరి వరదలోచ్చినా  ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని సమతలం గా చెక్కి వాటిపై రెండు అంగుళాల వెడల్పు ఇనుప రేకులమర్చి దానిపై కొయ్య చక్రాలవాగన్లు తేలిగ్గా తీసుకు పోయే ఏర్పాట్లూ జరిగి పోయాయి .1847అక్టోబర్ నుంచి వరదలు తగ్గాక మళ్ళీ పనులు మొదలైనాయి .25వేల ఘనపు అడుగుల చెక్కిన రాయి సిద్ధమై ఉంది .రోజుకు అయిదు వందల అడుగుల  రాయి ఫంటూలపై ఆనకట్ట ప్రదేశానికి చేరుతోంది .

వేసవి అయినా ఏ శీతల ప్రదేశాల్లో హాయిగా గడపటానికి వీలుగా ఉన్నా, కాటన్ ఎక్కడికీ కదలకుండా నెత్తిన టోపీ పెట్టుకొని ,పర్యవేక్షిస్తూ పని తీరును గమనించాడు .ఎక్కడికైనా కాంప్ మార్చాల్సి వస్తే అతి తక్కువ సామాను తో కుటుంబం తో కదిలే వాడు .ఆర్భాటం ఉండేదికాదు .అవసర సౌకర్యాలు లేక బాధ పడే వాడు .1848జూన్ కు ఆనకట్ట తొమ్మిది అడుగుల ఎత్తువరకు నిర్మించారు .ఇంకొక మూడడుగులు ఎత్తుపెంచాలి .లాకుల పని పూర్తయింది .తలుపులు బిగించాలి .అడుగు తూములు అంటే అండర్ స్లూయిస్ చెక్కుడు రాయి పని కూలీలు దొరక్క నెమ్మదిగా నడిచింది .ప్రధాన తూము అంటే హెడ్ స్లూయిస్ ఆర్చీల మట్టాలకు పూర్తీ అయింది .ర్యాలీ పాయలో కూడా పని మందకొడిగా జరుగుతోంది .లాకు పని అయిపోయి ,కాలువ పని ఉంది .మద్దూరు పాయలో పనులు వేగం గా జరుగుతోంది .వింగ్ వాల్స్ పై భాగం తప్ప అంతా పూర్తీ అయింది .విజ్జేశ్వరం పాయలో ప్రధాన ,అడుగు తూముల పనులు బాగా జరిగాయి .వరద లోచ్చే సరికి దాదాపు అంతా పూర్తీ అయింది .లాకుల పై పని అనుకొన్నంత వరకు బానే జరిగింది .తలుపుల పని మిగిలింది .రెక్క గోడలపై వరద లోచ్చినా పని చేయ వచ్చు .

కాని రెండు వారాల ముందే జూన్ లో వరద లోచ్చాయి . రాతి కట్టడం ఏమై పోతుందో అని భయ పడ్డాడు కాటన్ .దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్తితి కూడా బాగాలేదు వడ దెబ్బ తగిలి తీవ్ర జ్వరం వచ్చి బాధ పడుతున్నాడు కాని ఆనకట్ట మీద ద్రుష్టి మాత్రం మర్చి పోలేదు .సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోమని భార్య ఒత్తిడి పెట్టింది .మిగిలిన అధికారులు కూడా అలానే చేయమని కోరారు .క్లిష్ట సమయం లోసెలవు పెట్టటం  ఇష్టం లేక పోయినా ఆరోగ్యం దృష్ట్యా సెలవు పెట్టి,ప్రభుత్వ ఆదేశం పై బాధ్యతను కెప్టెన్ చార్లెస్ అలేక్సాండర్ ఆర్ కు అప్పగించి, కాటన్ కుటుంబం తో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు .మనసు ఇక్కడా శరీరం అక్కడ గా ఉంది ఆయన పరిస్తితి .సెలవు పై వెళ్ళ టానికి ముందే ఉన్న డబ్బు అంతా ఖర్చు అయినందువల్లా ,మరొక లక్షా ముప్ఫై తొమ్మిది వేల రూపాయలు కావాలని ప్రభుత్వానికి రాశాడు

దీనికి ప్రభుత్వం నుండి వ్యతిరేకం గా శ్రీముఖం వచ్చింది .మితి మీరిన వ్యయం చేస్తున్నాడని పనుల భద్రత, ,నాణ్యత పట్టించుకోకుండా త్వరగాపని చేస్తున్నాడని విమర్శించింది .ఒకరిద్దరు అనుభవమున్న ఇంజినీర్లను పంపి సమీక్షించి ,నివేదిక ఇమ్మని కోరింది .విచారణ సంఘం లో ఇంజినీర్ యి.బకుల్ ,జే.హెచ్.బెల్.,కెప్టెన్ అలేక్సాండర్ ఆర్ ,రాజ మండ్రి సబ్  కలెక్టర్ హెన్రి ఫోర్ట్స్ సభ్యులు . 1848 నవంబర్ లో విచరణ సంఘం ఆనకట్టపనులు పర్య వేక్షించి జనవరి లో ప్రభుత్వానికి నివేదిక పంపింది .అందులో వివరాలు ‘’గోదావరి ఆనకట్ట నిర్మాణం లో మేజర్ కాటన్ ప్రదర్శించిన అపూర్వ శాస్త్ర విజ్ఞాన ప్రతిభను ,అనుభవ పూర్వక సామర్ధ్యాన్ని ,నిర్విరామ కృషిని ఈ కమిటీఎంతో ప్రశంసించింది .అయన మేధా శక్తికి ,ఆత్మనిష్ట కు ,ఒక అమోఘ ఈ నవీన జలదుర్గం ఒక ఉదాహరణ.అనుకో కుండా వచ్చిన వరదల వల్ల  ఆనకట్టకు కొంత నష్టం జరిగి అంచనా వ్యయం పెరిగిందే తప్ప కాటన్ తొందర పాటు కాదు అని మేం పూర్తిగా విశ్వ సిస్తున్నాం .ఇప్పటికే రాజమండ్రి జిల్లా ఈ ఆనకట్ట వల్ల  ఎంతో ప్రయోజనం పొందింది .కనుక మేజర్ కాటన్ ప్రతి పాడించిన అదనపు డబ్బుతో బాటు ,కెప్టెన్ ఆర్ కోరిన మరో మూడు లక్షల యాభై వేల రూపాయలు అత్యవసరం గా మంజూరు చేయమని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం ‘’అని కాటన్ దొర పని తనానికి, నిజాయితి కి ,నిర్భీకతకు కీర్తి కిరీటం పెట్టింది ఆ సంఘం.ప్రభుత్వం వెంటనే ఆ డబ్బును సాంక్షన్ చేసి పంపించింది .

రెండేళ్ళు ఆస్ట్రేలియా లో విశ్రాంతి తీసుకొని 1850 సెప్టెంబర్ లో తిరిగి వచ్చి బాధ్యతలు చేబట్టాడు .అనుకున్నట్లు గా పనులన్నీ పూర్తిగా సంతృప్తికరం గా జరిగిపోయాయి కాటన్ అక్కడ లేక పోయినా . .కెప్టెన్ సారధ్యం లో పనులు బాగా జరిగి నందుకు అతన్ని కాటన్ మనసారా అభి నందించాడు .నదిలో పడవలను వేగం గా లాగటానికి స్టీం లాంచ్ అవసర మని ప్రభుత్వానికి రాసినా అనుమతివ్వలేదు .కలకత్తా నుంచి లాంచిని తెప్పించి పని అతి వేగం గా జరిపించాడు .లాంచి వల్ల  ఎంత ప్రయోజనం జరిగిందో ప్రభుత్వానికి రాశాడు. సంతృప్తి చెందిన ప్రభుత్వం కలకత్తా లాంచి రావటానికి ,నిర్వహణకు అయిన డబ్బంతా ఇచ్చేసింది నిజాయితీ ఉన్న ఆఫీసర్ కు  దక్కిన గౌరవం ఇది .నిబద్ధతకు నిలువెత్తు గా కాటన్ నిలిచాడు .ఆయన దగ్గర పని చేసిన ఇంజినీర్లు కూడా పని మీద అత్యంత శ్రద్ధ ఉన్నవారే అవటం ఆయనకు ఎంతో కలిసి వచ్చింది .కెప్టెన్ అలేక్సాండర్ ,కెప్టెన్ హచిన్సన్ ,లెఫ్టి నెంట్ హేగ్ ,లెఫ్టి నెంట్ రున్దాల్ ,ఒవర్సీర్ వేణంవీరన్న ఆనకట్ట నిర్మాణం లో చిరస్మరణీయ సేవ లందించారు .ఏమాత్రం భేదాలు లేకుండా శాయ  శక్తులా కాటన్ కు సహాయ సహకారాలందించి అభిమాన పాత్రులయ్యారు .వేణం వీరన్న ను గూర్చి ‘’వీరన్న గారు లేక పోయి ఉంటె వేలాది కూలీల సమీకరణ జరిగేది కాదు .ఆన కట్ట పని సకాలం లో జరగటానికి వీరన్న సేవలు నిరుపమానం ‘’అని మెచ్చుకొన్నాడు కాటన్. వీరన్నకు ఇంజినీర్ గా ప్రొమోషన్ ఇవ్వటమే కాకుండా ‘’రాయ్ బహదూర్ ‘’బిరుదాన్ని కూడా ప్రభుత్వం చేత ఇప్పించిన పని పక్ష పాతి కాటన్ .

కాటన్ మార్గ దర్శకత్వం ,ఉత్సాహ వంతులైన ఇంజినీర్లకర్తవ్య నిస్ట ,వేలాది కార్మికుల అవిరళ కృషి, ,ప్రజా సహకారం వల్లనాలుగు కిలో మీటర్ల పొడవైన ఆనకట్టలు కేవలం అయిదేళ్ళలోఅంటే 1852లో పూర్తీ చేయగలిగాడు అపర భాగీరదుడు,డెల్టా శిల్పి అయిన  మేజర్ ఆర్ధర్ కాటన్ దొర .రెండు వేల మైళ్ళ పొడవున్న డిస్త్రి బ్యూటర్లు ,మురుగు కాలవలు ,రోడ్లు ,వంతెనలు ,వరద కట్టలు నిర్మించి మాహాద్భుతాన్ని ప్రపంచం లోనే అరుదైన గోదావరి నాదీమ  తల్లికి దివ్య భవ్య కంఠా భరణంఅయిన ధవళేశ్వరం  ఆనకట్ట నిర్మాణాన్ని సమర్ధ వంతం గా పూర్తీ చేశాడు .గోదావరి డెల్టాకు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలిగింది . 1889లో ఆనకట్ట ఎత్తు మరో రెండు అడుగులు పెంచారు . 1936లో మరో మూడు అడుగులు ఎత్తుపెంచి ఆయకట్టు విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు పెంచారు .

1970 లో ధవళేశ్వరం ఆనకట్ట శిధిలా వస్తకు చేరింది దాని స్స్థానం లో బ్యారేజి నిర్మించి కాటన్ గౌరవ సూచకం గా ‘’సర్ ఆర్ధర్ కాటన్ బారేజి ‘’అని పేరు పెట్టి గౌరవించారు .పది లక్షల ఎకరాలకు రెండు పంటలు పండించే సాగు నీరు లభ్యమై గోదావరి డెల్టా ‘’ఆంద్ర దేశపు దాన్యా గారం ‘’గా రూపొందింది .ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తీ అయ్యే సరికి కాటన్ దొర రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ గా ప్రమోషన్ పొంది మద్రాస్ కు వెళ్ళాడు

అసుర సంపత్తి.

 ఆత్మను ఆశ్రయించుకొని సమస్త ఇంద్రియాలు వాటి వాటి వ్యాపారాల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ మనస్సుకు మనస్సు అని చెప్పడంలో గల తాత్పర్యమేమనగా? చైతన్యజ్యోతి యొక్క ప్రకాశము లేకుండా అంత:కరణము తనకు విషయములైన సంకల్పము, నిశ్చయము, శ్రద్ధ, అశ్రద్ధ, అధృతి మొదలగు వాటి యందు సమర్థము


అవ్వదు. కావున ఆత్మ మనస్సునకు కూడ మనస్సు అని చెప్పబడినది. ఈ ఉపనిషత్తులో మరొక ప్రధాన విషయం- దేవాసుర సంగ్రామంలో అసురుల పై దేవతలు విజయాన్ని పొందారు. విజయగర్వంతో దేవతలు ఆనందిస్తున్న వేళ వారి గర్వాన్ని అణచడానికి బ్రహ్మ ఒక యక్షరూపాన్ని దాల్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు ఎవరో కనుక్కోమని మొదటగా 'అగ్నిదేవత'ను పంపిస్తాడు ఇంద్రుడు. ఆ యక్షుడు నువ్వు ఎవరివి? అని ప్రశ్నించగా నేను 'అగ్ని'దేవతను. ఈ సమస్తాన్ని క్షణకాలంలో దహించగలనని సమాధానం చెప్పాడు. యక్షుడు ఒక గడ్డిపోచను అతడి ముందు ఉంచి దీనిని దహించమని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవత సర్వశక్తితో గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అవమానంచే వెనుదిరిగాడు. తరువాత మాతరిశ్వుడు వచ్చి గడ్డిపోచను కదలించలేక వెళ్ళిపోయాడు. చివరకు దేవేంద్రుడు గర్వంతో వచ్చేసరికి యక్షుడు కనిపించకపోగా, అతడు అక్కడే ఉండి తపస్సు చేయగా, ఉమాదేవి ప్రత్యక్షమయి ఆ యక్షుడు ఎవరో కాదు సాక్షాత్ బ్రహ్మయేనని తెలిపింది.

ఇక్కడ గ్రహించవలసిన విషయమేమనగా! అహంకారాది అసుర సంపత్తి గల మనుజుడు ఆ భగవంతుని యొక్క వాస్తవతత్త్వాన్ని తెలుసుకోలేడు. కనుక అహంకారాది అసుర సంపత్తిని వదలినవారికే అతడి దర్శనం కలుగుతుందని గ్రహించాలి.

విశిష్టమయిన శ్లోకం

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీమద్రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?*


ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న "నవరత్నాలలో" ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది.


రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి "రామాయణం" లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు.


ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు.


ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు.


విక్రమాదిత్యుని రాజ్యసభలో "వరరుచి" అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.

అతనికి ఆ వెయ్యి  బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది.


అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు.


అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 


40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.


నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు.

వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ  మాటల్లో రామాయణంలో ప్రముఖమయిన శ్లోకం "మాం విద్ధి... అని చెప్పింది.

ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది.


అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు.


ఆ శ్లోకం ఇది 👇


*రామం దశరథం విద్ధి*

*మాం విద్ధి జనకాత్మజామ్*

*అయోధ్యామటవీం విద్ధి* *గచ్ఛ తాత యథాసుఖమ్*


ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు.


అతను  చెప్పిన 18 రకాలయిన  అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.


🚩ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు?


*ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో 40వ సర్గలో వస్తుంది*

రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ,

తన తల్లి "సుమిత్ర" ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం.


🚩ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. 


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్.

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత! యథాసుఖమ్৷৷


*మొదటి అర్ధం*:


రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


*రెండవ అర్ధం*:-


రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం)  దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ  ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి  రా! 


*మూడవ అర్ధం*:-


రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా


ఓ పుత్రా!  నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో,

సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు.

రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక  శోకిస్తుంది. కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.  

🌸🌸

25, జూన్ 2022, శనివారం

చేతి కర్ర

 దండం దశ గుణం భవేత్.....*


| దణ్డాత్ప్రతిభయం భూయః శాన్తిరుత్పద్యతే తదా |

||నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియామ్ ||


భావము...


చేసిన తప్పుకి దండించబడితే, మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు, అలా తప్పును అరికట్టినట్లవుతుంది. తద్వార ప్రశాంతత నెలకొంటుంది. ప్రశాంతత లేకపోతే, ఉద్వేగములో ధర్మాన్ని ఆచరించలేరు, అలాగే క్రియలు చేయలేరు. కాబట్టి "దండం దశగుణం భవేత్". శాంతి నెలకొనాలంటే దుష్టులు దండించ బడాలి.


మహాభారతం, ఆదిపర్వం, అధ్యాయం 41 - శ్లో. 28 - శమీక ఉవాచ..


"దండం దశ గుణం భవేత్" అంటారు కదా.. ఆ దశ గుణాలు ఏవో తెలియని వారి కోసం పంపుతున్నాను.. తెలుసుకొని  పలువురికీ తెలియ జేయండి..

శ్లో||


| విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ |

|| అంధే తమసి వార్థక్యే దండం దశగుణం భవేత్ ||


అర్థం...


1. వి = పక్షి

2. శ్వా = కుక్క

3. అమిత్ర = శత్రువు

4. అహి = పాము

5. పశుషు = పశువులు

6. కర్ద మేన = బురద

7. జలేనచ = నీటి యందు

8. అంధః = గుడ్డితనమందు

9. తమసి = చీకటిలో 

10. వార్థక్యము = ముసలితనము నందు.. దండము = కర్ర ఉపయోగపడును


భావము...


పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకునూ, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డి తనంలో, ముసలి తనంలో అవలంబనంగాను చేతి కర్ర పనికి వస్తుంది. అందు చేతనే "దండం దశ గుణం భవేత్" అంటారు.

common citizen

 When I was Subcollector, Bbsr,one  evening I came back to the Office after my field tour n found that one lady was sitting in front of my office chamber.I requested her to come to my office room n enquired about the purpose of visiting the office. She said ,one application is pending in your Office for extension of permission to sell her land in Bbsr.I immediately called for the case record n found that she had taken extension thrice n this was her 4th application for extension. I wanted to know the reason of obtaining the permission thrice n not selling the land but I was shocked when she gave the reason of taking multiple permissions.After obtaining the first permission to sell the land,her son expired n in subsequent extensions she faced two more mishaps of death of her husband n another son.She wanted to sell the land to settle some loan. I told Mam,pl furnish the affidavit on next day regarding non transaction of the land & she submitted too

n permission was also given on the same day. The lady was no other than Mrs Droupadi Murmu. She is that noble & humble lady,being a former Minister then came to the office like a common citizen for her work. We are proud of her as she is going to be the Head of the Nation.


Sisirkanta Panda 

MIG Colony 

Kalinga Vihar .

పని కోసం సాధారణ పౌరుడిలా

 తప్పక చదవాల్సింది


నేను  భువనేశ్వర్ లో సబ్‌కలెక్టర్‌గా ఉన్నప్పుడు, ఒక సాయంత్రం నా ఫీల్డ్ టూర్ తర్వాత నేను ఆఫీసుకు తిరిగి వచ్చాను, నా ఆఫీసు ఛాంబర్ ముందు ఒక మహిళ ఒంటరిగా కూర్చుని ఉన్నట్లు గుర్తించాను. నేను ఆమెను నా ఆఫీసు గదికి రమ్మని అభ్యర్థించాను.ఇంకా వచ్చిన పని  గురించి అడిగాను.   భువనేశ్వర్ లో తన భూమిని విక్రయించడానికి అనుమతిని పొడిగించడం కోసం మీ కార్యాలయంలో ఒక దరఖాస్తు పెండింగ్‌లో ఉందని ఆమె చెప్పింది. నేను వెంటనే కేసు రికార్డు కోసం కాల్ చేసాను, ఆమె మూడుసార్లు పొడిగింపు తీసుకున్నట్లు గుర్తించాను.  పొడిగింపు కోసం ఇది ఆమె 4వ దరఖాస్తు.  నేను భూమిని అమ్మకుండా మూడుసార్లు అనుమతి పొందటానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఆమె అనేక అనుమతులు తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. భూమిని విక్రయించడానికి మొదటి అనుమతి పొందిన తర్వాత, ఆమె కొడుకు మరణించాడు. గడువు ముగిసింది. ఇంకా తదుపరి పొడిగింపులలో ఆమె రెండు కష్టాలను ఎదుర్కొంది.  ఆమె భర్త మరియు మరొక కొడుకు మరణించారు.  ఆమె కొంత అప్పు  ఇంకా  వైద్య ఖర్చులను తీర్చడానికి భూమిని విక్రయించాల నుకుంది.  నేను ఆమెకు చెప్పాను, దయచేసి భూమికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి మరుసటి రోజు అఫిడవిట్  అందించండి అని.  ఆమె అలాగే  సమర్పించింది

 అదే రోజు  అనుమతి కూడా ఇచ్చారు.  ఆ మహిళ మరెవరో కాదు శ్రీమతి ద్రౌపది ముర్ము.  ఆమె ఒక గొప్ప  వినయ శీలి అయిన మహిళ, మాజీ మంత్రి. అయినా  ఆమె తన 

 పని కోసం సాధారణ పౌరుడిలా కార్యాలయానికి వచ్చింది.  ఆమె దేశాధిపతి కాబోతున్నందుకు మేము గర్విస్తున్నాము.


 సిసిర్కాంత పాండా (IAS)

 MIG కాలనీ

 కళింగ విహార్.

 భువనేశ్వర్


సేకరణ: శ్రీ దుర్గా ప్రసాద్ గారు

వైద్యరాజ నమస్తుభ్యం

 శ్లోకం:☝️

*వైద్యరాజ నమస్తుభ్యం*

   *యమరాజ సహోదర I*

*యమస్తు హరతి ప్రాణాన్*

   *వైద్యః ప్రాణాన్ ధనానిచ II*

  - కలివిడంబన శతకం


భావం: యమధర్మరాజు సహోదరుడవైన ఓ వైద్యరాజా! నీకు నమస్కారము. యముడు ప్రాణాలనే తీసుకుపోతాడు, వైద్యుడు ప్రాణాన్నీ, ధనాన్నీ కూడా హరిస్తాడు; కావున నా జోలికి రాకుండా ఉండుటకే నీకు నమస్కారము.🙏

వైద్యవృత్తిని ప్రాణాలను కాపాడేదిగా కాక కేవలం 'ధనసంపాదన' దృష్టితో ఉంటున్న వైద్యల గురించైతే ఇది పూర్తిగా నిజమనిపిస్తుంది.

నాకు ఇంకో జన్మ వద్దు

 *కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి !?*


*అవును! కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు*

*యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య .*


*కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో* *కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళి ఒక కోరిక అడిగాడు*


*కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని కృష్ణుడు అడిగాడు* 

*కర్ణుడు దానం చేసేసాడు.*


*అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు.*


*అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు .ఒకవేళ జన్మ ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు.*


**ఆ మాట  వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి*. 

*" ఇంత మంచివాడి వేంటయ్యా కర్ణా నువ్వు " అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు*.


*మనం మంచి మనసున్న వారమైతే చాలు ! ...ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు*💐🙏🏻🌹

🙏🙏🙏

సర్వేజనాః సుఖినోభవంతు

🙏🙏🙏🙏

లోకాసమస్త సుఖినోభవంతు

🙏🙏🙏🙏🙏

శివలింగ వృక్షం

 శివలింగ వృక్షం


శివలింగ వృక్షం శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది.


శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.


హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉంది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి.

అంత్యక్రియలు

 08)*🏺అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?*


    🙏….. *ప్రతి ఒక్కరు తెలుసుకోండి*..….🤝




*వాస్తవానికి శరీరము ఆత్మ రెండు వేరు వేరు*.


 *కలియుగ ధర్మము ప్రకారము.. మనిషి జీవితకాలము 120 సంవత్సరాలు*.


 *కానీ*......🤷‍♂️


 *ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది*.


*ఆత్మ చెప్పినట్టు శరీరము వినాలంటే... శరీరము ఆరోగ్యము గా ఉండాలి*. 


*శరీరము లో ప్రాణము ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరము చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు.......... ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరము వినే స్థితిలో లేదు*.


*బతికి ఉన్నంత కాలము భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది*. 


*ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరము నుండి ఆత్మ వేరైపోతుంది*.


 *శరీరాన్ని దహనము చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరము లోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది*.


*పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరము లో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు*.


*ఎందుకంటే........ శరీరాన్ని (పూడ్చిన) కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద..... తన వాళ్ళ మీద....... ఇష్టము తో ఆత్మ ఇంటికి రావాలని తపన పడుతూ ఉంటుంది*.


 *కానీ శరీరము మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే......... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా 'సూర్యోదయము' లోపు మాత్రమే*..


 *అంతలోపు లెక్కించక పోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి*.


*శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు*.


 *ఎందుకంటే*......... 


*కుండ నీ శరీరము లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రము నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరము నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాము అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. (పూడ్చేస్తాము)  ఇంకా నీకు ఈ శరీరము ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతము*.


*హిందూ సాంప్రదాయము లో చేసే ప్రతి పనికి ఓ అర్థము దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ*...


*ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే... ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను. కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు*........


*దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థము దాగి ఉంటుంది*.


🙏🔱 *శివోహం* 🔱 🙏

24, జూన్ 2022, శుక్రవారం

మనసులోని నిర్మ్యాల్యం

 🙏మానవుని మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొని, ఏకత్వ స్థితి పొందాలంటే ఏమి చేయాలి???🙏


మనం నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటాము...

కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము, మనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము !...


రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి ? కాశీ నుండా ? రామేశ్వరం నుండా ?!

అవి మన నుండియే వచ్చాయి కదా !! బాధలు మన నుండే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి !?...


కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం, అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము... అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా ! అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి...

మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతకడం ?!...

ఇది కేవలము భ్రమ, నిజమునకు మనలో లేనిదేది బయట లేదు. 

పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి. 

అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు ఆనందమనే వెన్న రావడం జరుగుతుంది...

     లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది ?!...


     "మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు....


      మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది....

" దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం"...


భగవంతుడ్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు....

దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, కానీ మనకి కానరావడం లేదు...

ఎందుకనీ ? మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.! మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు !...


మొదటిది ' నేను' అనే తలంపు... 

రెండవది 'నాది' అన్న తలంపు...


మొదటిది అహంకారం, రెండవది మమకారం !...

ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు....


మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి....


*_ఎలా?_*

ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. 

అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధిచేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి, అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి...

ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి...


(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి) మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి...


సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు...

శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది...


మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం, మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం...


మనలో అనేక బలహీనతలుంటాయి...

అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి... ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి...


హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించం...

ఇదే మాయ, శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి...


మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది !


🙏

సర్వధర్మములు

 శ్లోకం:☝️

*జన్మ ప్రభృతి యత్కించిత్*

    *చేతసా ధర్మమాచరేత్ l*

*సర్వం తు నిష్ఫలం యాతి*

    *ఏకహస్తాభివాదనాత్ ll*

    -విష్ణు పురాణం


భావం: పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదనమందు అవినయమే భాసిస్తుంటుంది. దానివల్ల సర్వధర్మములు నిష్ఫలమైపోతాయి.

23, జూన్ 2022, గురువారం

అహోబిలంలో నిలువుదోపిడి

 అహోబిలంలో నిలువుదోపిడి


*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* 👏 

 *మమ్మలని క్చమించండీ స్వామి 👏* 


నంద్యాల జిల్లా 

అహోబిలం లో


👉అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ


👉 మాకు ఫ్రీ నే కదా అని 😁 పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు  🤔


👉అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే


👉అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహమా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.


 *కేశకండన* 


👉" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు


👉గుండుగిసే వాడు 🤦‍♂️

నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️

లేక పోతే లేదు.

 

👉మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం అంటున్న టోల్ గేట్ కాంట్రాక్టర్

 

👉మమ్ములను అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.


👉ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు అంటూ నిర్లక్ష సమాధానం.


👉మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... 


👉అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి  కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.🤦‍♂️🤦‍♂️🙏🙏🙏


 *దర్శనం* 


👉 ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, 

శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు

ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు🤔


  *కార్ పార్కింగ్* 


👉ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు 

అహోబిలంలో గుడికి 3 - 4  కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.


👉4 కిమి  దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా  కూడా పోలీసులు వినిపించుకోవడం లేదంటూ భక్తుల ఆరోపణ. 


👉తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.  


 *స్నాన ఘట్టాలు :* 


👉 స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు🤔


👉ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక  నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , 


 *మరుడొడ్లు* 


👉స్త్రీల కు కనీసం మరుడొడ్లు కూడా లేక పోవడం గమనార్హం

 

👉ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.


👉 పూలు మూర కావాలా రూ.100.00 లు కావాల్సిందే


👉 తులసి ఆకులు /మాల రూ. 100/- 🤔


👉టెంకాయ కావాలా కేవలం 50/- , 60 /- మాత్రమే🤔


👉 త్రాగు నీరు కావాలా - 70 రూ మాత్రమే


👉  గమ్య స్థానాలకు వెళ్లే లోపు ఇలాంటి టోల్ గేట్ లు ఎన్నో లెక్క లేదు


👉 గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే పార్కింగ్ పేరుతో , టోల్ గేట్ పేరుతో మరో రూ.150/- లు అక్షరాల చెల్లించాలి.


👉 రూ.150/- కట్టీ 3 , 4 కి మీ ర్ల దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే


👉 గుడికి వెళ్ళాక అక్కడ గంటల కొద్ది క్యూ లో ఉండి రూ.10/- పెట్టీ తల నీలాలు టికెట్ తెచ్చు కోవాలి


👉 రూ.10/- ఇస్తే సరిపోదు ,అక్చరాలా రూ. 100 /- లు లంచం ఇస్తేనే గుండు 

లేక పొతే లేదు 


మీకు ఇష్టమైతే నే గుండు లేక పోతే లేదు , మీరు ఎవరికి చెప్పుకున్నా సరే🤔


👉 పాద రక్చలు ఉంచు కోవాలంటే  డబ్బు చెల్లించు కోవాలి.


👉ఇంతా కస్టపడి వెళితే , అక్కడ భారీ క్యూ ఉంటుంది 


👉 ఆ క్యూ లో గంటల తరబడి నిలుచొని వెళితే , కనీసం స్వామిని కళ్ళారా చూసి తరించే అవకాశం ఉండదు. క్షణం లో బయటకు తోస్తారు.


👉 బయటికి వచ్చి ఏమైనా పిల్లకు తినే తందుకూ కొనిపెడదమంటే 

ఇంక చెప్ప నక్కర్లేదు, ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చా లి అంటే


👉ఒక దోశె 50/- 70/- అంటే ఒక మనిషికి రూ.150/- దాటల్సిందే.


👉ఇంక కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చా లి అంటే రూ.1000/- కావాల్సిందే.


ఇది అహోబిలం పరిస్తితి 


భగవంతుడా నీ దర్శనం ఇంత ఖరీదైనది అయింది 


మేము నీ దర్శనానికి రాలేము తండ్రీ మమ్మల్ని క్షమించండి.


...దోపిడిలో అందరికి భాగస్వామ్యం కావడంతో భక్తులను దోచుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

...ప్రధాన ఆలయాల్లో దోపిడీని నివారించే నాధుడే కరువయ్యారు.

...దేవాలయాల్లో దోపిడితో ఆలయాలకు పోవాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని భక్తులు అంటున్నారు.

....సమస్యలు విన్నవించుకొని తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్లే భక్తుల కుటుంబాలకు దేవాలయాల్లో అడుగు పెట్టి బయటికి రావాలంటే ఒకొక్క కుటుంబానికి వెయ్యి నుంచి మూడు వేలు ఖర్చుఅవుతుందంటూ వాపోతున్నారు.

...దేవా మీ దర్శనం పొందాలంటే మాకింత ముందే మహాలక్ష్మిని కనుకరించు మహా ప్రభో అంటూ భక్తులు ముక్కుతున్నారు.


*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* 👏 

 *మమ్మలని క్చమించండీ స్వామి 👏* 


నంద్యాల జిల్లా 

అహోబిలం లో


👉అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ


👉 మాకు ఫ్రీ నే కదా అని 😁 పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు  🤔


👉అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే


👉అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహమా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.


 *కేశకండన* 


👉" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు


👉గుండుగిసే వాడు 🤦‍♂️

నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️

లేక పోతే లేదు.

 

👉మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం అంటున్న టోల్ గేట్ కాంట్రాక్టర్

 

👉మమ్ములను అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.


👉ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు అంటూ నిర్లక్ష సమాధానం.


👉మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... 


👉అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి  కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.🤦‍♂️🤦‍♂️🙏🙏🙏


 *దర్శనం* 


👉 ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, 

శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు

ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు🤔


  *కార్ పార్కింగ్* 


👉ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు 

అహోబిలంలో గుడికి 3 - 4  కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.


👉4 కిమి  దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా  కూడా పోలీసులు వినిపించుకోవడం లేదంటూ భక్తుల ఆరోపణ. 


👉తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.  


 *స్నాన ఘట్టాలు :* 


👉 స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు🤔


👉ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక  నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , 


 *మరుడొడ్లు* 


👉స్త్రీల కు కనీసం మరుడొడ్లు కూడా లేక పోవడం గమనార్హం

 

👉ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.


👉 పూలు మూర కావాలా రూ.100.00 లు కావాల్సిందే


👉 తులసి ఆకులు /మాల రూ. 100/- 🤔


👉టెంకాయ కావాలా కేవలం 50/- , 60 /- మాత్రమే🤔


👉 త్రాగు నీరు కావాలా - 70 రూ మాత్రమే


👉  గమ్య స్థానాలకు వెళ్లే లోపు ఇలాంటి టోల్ గేట్ లు ఎన్నో లెక్క లేదు


👉 గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే పార్కింగ్ పేరుతో , టోల్ గేట్ పేరుతో మరో రూ.150/- లు అక్షరాల చెల్లించాలి.


👉 రూ.150/- కట్టీ 3 , 4 కి మీ ర్ల దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే


👉 గుడికి వెళ్ళాక అక్కడ గంటల కొద్ది క్యూ లో ఉండి రూ.10/- పెట్టీ తల నీలాలు టికెట్ తెచ్చు కోవాలి


👉 రూ.10/- ఇస్తే సరిపోదు ,అక్చరాలా రూ. 100 /- లు లంచం ఇస్తేనే గుండు 

లేక పొతే లేదు 


మీకు ఇష్టమైతే నే గుండు లేక పోతే లేదు , మీరు ఎవరికి చెప్పుకున్నా సరే🤔


👉 పాద రక్చలు ఉంచు కోవాలంటే  డబ్బు చెల్లించు కోవాలి.


👉ఇంతా కస్టపడి వెళితే , అక్కడ భారీ క్యూ ఉంటుంది 


👉 ఆ క్యూ లో గంటల తరబడి నిలుచొని వెళితే , కనీసం స్వామిని కళ్ళారా చూసి తరించే అవకాశం ఉండదు. క్షణం లో బయటకు తోస్తారు.


👉 బయటికి వచ్చి ఏమైనా పిల్లకు తినే తందుకూ కొనిపెడదమంటే 

ఇంక చెప్ప నక్కర్లేదు, ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చా లి అంటే


👉ఒక దోశె 50/- 70/- అంటే ఒక మనిషికి రూ.150/- దాటల్సిందే.


👉ఇంక కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చా లి అంటే రూ.1000/- కావాల్సిందే.


ఇది అహోబిలం పరిస్తితి 


భగవంతుడా నీ దర్శనం ఇంత ఖరీదైనది అయింది 


మేము నీ దర్శనానికి రాలేము తండ్రీ మమ్మల్ని క్షమించండి.


...దోపిడిలో అందరికి భాగస్వామ్యం కావడంతో భక్తులను దోచుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

...ప్రధాన ఆలయాల్లో దోపిడీని నివారించే నాధుడే కరువయ్యారు.

...దేవాలయాల్లో దోపిడితో ఆలయాలకు పోవాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని భక్తులు అంటున్నారు.

....సమస్యలు విన్నవించుకొని తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్లే భక్తుల కుటుంబాలకు దేవాలయాల్లో అడుగు పెట్టి బయటికి రావాలంటే ఒకొక్క కుటుంబానికి వెయ్యి నుంచి మూడు వేలు ఖర్చుఅవుతుందంటూ వాపోతున్నారు.

...దేవా మీ దర్శనం పొందాలంటే మాకింత ముందే మహాలక్ష్మిని కనుకరించు మహా ప్రభో అంటూ భక్తులు ముక్కుతున్నారు.

పిల్లలూ, మనవలూ..

 అల అగ్రహారంలో  ఎత్తు అరుగులున్న ఓ వందేళ్ళనాటి పెద్ద ఇల్లు.. నాలుగైదు వాకిళ్ళూ, వరండాలూ, పెరడూ.. గదులూ...


ఎర్రటి వేసవికాలపు ఎండలో మెరుస్తూ రాజసంగా కనబడేది...


శలవుల్లో ‘శ ‘ అనగానే రక రకాల ఊర్లనించీ గూడు చేరిన పక్షుల్లా ఆనందంగా ఎగిరొచ్చి వాలిపోయే పిల్లలూ, మనవలూ.. 


చిన్నా, పెద్దా కలిసి ముఫ్ఫైమంది కి తక్కువకాని మనుష్యులు...


“బారెడు పొద్దెక్కాకా వీధరుగులు కడుక్కోరర్రా! పొద్దున్నే కడుక్కోవాలి..” 


పెద్ద కోడలి మాట వినడానికి పిల్లలు నిద్ర లేస్తేగా?


  పిల్లలు రాత్రి ఓ పట్టాన పడుకోరు, పొద్దున్న లేవరు.. ప్రతీ తరంలోనూ ఏ మాత్రం అంతరం లేని నిరంతర ప్రక్రియ ఇది....


మండువాలోనే రాత్రే బకెట్ నీళ్ళు, చెంబూ పెట్టుకుని.. పొద్దు పొడవకుండానే ఆవిడే లేచి వీధి అరుగులు, గుమ్మాలు కడుక్కుని, వాకిట్లో పేణ్ణీళ్ళు కలాపి చల్లి ఓ గుమ్మడిపండో, పనసచెక్కో ముగ్గు వేసి వచ్చేసరికి ముడుచుకుని పడుకున్న పిల్లలు కదలరు.. మంచాల మీది పెద్దలు మెదలరు....


కాఫీ వసారాలో పొయ్యి వెలిగించి డికాక్షన్ వేసే సమయానికి ఒక్కొక్కళ్ళూ ప్రత్యక్షం.. మెట్ల మీద సుఖాసనాలు.. కులాసా కబుర్లు.. సందడి..


' వదినా నాకు పంచదారెక్కువ.. 


అక్కా, నాకు పాలు తక్కువ.. 


నాకు డికాక్షనూ, పంచదారా రెండూ ఎక్కువే.. 


నాకు బాగా వేడిగా ఉండాలి.. నిన్న కాఫీ చల్లారిపోయింది.. 


' అయ్యబాబోయ్! నాకు వేడి ఒద్దు, నాలిక్కాలిపోయింది


 ఇలాంటి రకరకాల ఆదేశాలు, అభ్యర్ధనలు గుర్తు పెట్టుకుని.. అందరికీ కాఫీలిచ్చి.. పొయ్యిలో నిప్పులు బయటకి లాగి మిగతా కాఫీ చెంబులో పోసి వాటిమీద సన్నటి సెగకి పెట్టి, పొలంపనికొచ్చినవారికి అది తాగాలని గుర్తు చేసి నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుని, జుట్టు ముడి వేసుకుని బొట్టు పెట్టుకుని వంట ఇంటి ప్రవేశం…


 వంద చదరపు అడుగులుంటుందేమో ఆ గది.. 


ఓ మూలకి పొయ్యి, పెడా.. మరో మూలకి గంజి వార్చుకునే తూము.. 

మెత్తగా దంచిన రాళ్ళ ఉప్పు పెట్టుకునే రాచ్చిప్పసైజుకు సరిపడా జాలకర్ర అనే ఓ చిన్న కిటికీ..


ఆ చిన్న గదిలో రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, వేడి వేడి గా పొగలు కక్కే అన్నం వీటితో పసందైన భోజనం.. ఈ లోపుల ‘ఆకలో రామచంద్రా!’  అని ఏడ్చే పిల్లలకి తరవాణి చద్దన్నాలు


అందరి భోజనాలు కానిచ్చి,  ఆకులు తీసి పేడలు పెట్టి, అలసిన నడుముని నట్టింటి గడపకు జేరేసేసరికి మధ్యాహ్నం టీ వేళే..


 టీతో పకోడీలో, చెగోడీలో.. అదీ కాకపోతే పనసపళ్ళో..


మళ్ళీ ఇంతమందికీ రాత్రి భోజనాలో ఫలహారాలో అంటే బలుహారాలే.. రొట్టెముక్కలో, ఉప్పుడుపిండో.. ఇలా.. 


ఉప్పు, మిరపకాయల దగ్గరనించీ ఎండపెట్టుకుని దంపించి పెట్టుకునే ఊరగాయ కారాలూ..


ఆవకాయలూ, ఆల్చిప్పలకీ, కత్తిపీటలకీ నాలుగిళ్ళకీ పిల్లలని పంపి తెప్పించుకుని,  అరుగంతా పరిచి పెట్టే తొక్కుపచ్చడీ, మాగాయ ముక్కలూ.. దరిమిలా జాడీలకెక్కే ఊరగాయలూ..


పంచ మీదకి పాకిన బూడిద గుమ్మడికాయల్ని అలాగే తరిగి ఇంగువ ఘుమాయింపులతో పాటు పెట్టే గుమ్మడి వడియాలు, పొట్టు వడియాలు, చిట్టి వడియాలూ. మజ్జిగ మిరపకాయలూ..


కాలాన్ని బట్టి గింజలు తీసుకుని దాచుకునే చింతపండు ముద్దలూ..


రాత్రి నానబెట్టి మర్నాడు దంపించుకునే అటుకుల ధాన్యాలూ..


బియ్యం తడిపి పిండి కొట్టి వండే జంతికలూ, అరిసెలూ..


కొత్తనోములూ, పాత నోములూ అంటే దొంతరలుగా వేసే వందలాది అట్లూ..


ఈ లోపు గ్రహణాలూ, పుణ్యాహవచనాలు, శుద్ధి వేళలంటూ చింతపండు పెట్టి రాజుగారి సింహాసనాలంత ఉండే దేవుడి సింహాసనల్ని, సామాన్లనీ తోముకోవడాలు..


సాయంత్రమవుతూనే ముగ్గు పిండి,  మెత్తటి బట్టా పెట్టి లాంతర్లు తుడుచుకోవడాలు. కిరసనాయిలు పోసుకుని రెడీగా ఉంచడాలూ..


పాతచీరలతో బొంతలూ, పెరటిలో పండే బూరుగుదూదితో దిళ్ళూ, పరుపులూ కుట్టడాలు, కుట్టించడాలు...


ఇంట్లో బాలింతలో, పథ్యం వాళ్ళో ఉంటే వారికి ప్రత్యేక వంటలూ..


ఇంకా ఎన్ని మర్చిపోయానో నాకు గుర్తు లేదు.. 


ఇలా ఎడతెగని పనులతో అలుపెరగక తిరిగే అలనాటి అతివలు...


ఇంటివారి ఆకలినే కాక అభిరుచులనెరిగి వండి, వడ్డించే ఆ అన్నపూర్ణలు...


వీటన్నింటి మధ్యలో.. ఏడాదికో సారో, రెండుసార్లో పుట్టిళ్ళకి వెళ్ళేటప్పుడో, పేరంటానికి వెళ్ళేటప్పుడో తప్ప వీధిముఖం చూడని అసూర్యంపశ్యలు 


మా అమ్మమ్మతరం వాళ్ళు.. 


ఇప్పుడు లాక్ డవున్ పేరిట మనం పడుతున్నామనుకుంటున్న కష్టాలను, ‘తెల్లారింది.. వండామా, తిన్నామా, తోమామా’ అన్నట్లుగా గడుస్తున్న మన పరిస్థితిని చూస్తే ఏమంటారో? 


" ఇదీ ఓ పెద్ద విషయమేనటర్రా? అంటారో...


" ఇందులో ఇంత బాధ పడిపోవడానికేముందో అని ఆశ్చర్యపోతారో?


అనిపించి నవ్వొచ్చింది.. 

ఏదైనా నేర్పతరం కానీ మాన్పతరమా? అన్నట్టు.. ఆఫీస్ పనికో, మరొకదానికో బయటకు వెళ్తే కానీ గడవని తరం మనది.. అందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్టు ఈ విలవిల..


ఇదీ గడిచిపోతుంది.. 


మళ్ళీ అంతా మామూలవుతుంది.. 


నేడు మబ్బేసి,  మసకేసినా రేపు వెలుగొస్తుంది..


 ఇంట్లో ఉండవలసి వచ్చినందుకు బాధ పడక, క్షేమంగా ఉండడానికి మనకో చక్కటి ఇల్లు, మనతోడుగా మనదనుకునే ఒక కుటుంబం..


 నాలుగు నంబర్లు నొక్కితే కనిపించి, వినిపించడమే కాదు, మనకోసం కలత పడే నలుగురు స్నేహితులూ.. 


నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళే వెసులుబాటు ఉన్నాయని సంతోషిద్దాం.. 


మనకు కలిగింది కావలసిన వారితో పంచుకుందాం..


సర్వే జనా సుఖినోభవంతు..