13, జులై 2020, సోమవారం

*అర్థనారీశ్వర స్తోత్రం*

 
*చాంపేయగౌరార్థశరీరకాయై*
*కర్పూరగౌరార్థశరీరకాయ*
*ధమ్మిల్లకాయై చ జటాధరాయ*
*నమః శివయై చ నమః శివాయ*
*కస్తూరికాకుఙ్ముమచర్చితాయై*
*చితారజఃపుఞ్జ విచర్చితాయ*
*కృూతస్మరాయై వికృూతస్మరాయ*
*నమః శివయై చ నమః శివాయ*
... *శుభోదయం*....

*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*

*శ్లోకం:*
*అల్పతోయశ్చలత్కుమ్భో హ్యల్పదుగ్ధాశ్చ ధేనవః ।*
*అల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితః ॥*
        సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా

*ప్రతిపదార్థం:*
అల్పతోయః = తక్కువ నీరు కల, కుమ్భః = కుండ, చలత్ = చలిస్తుంది, చ = మరియు, ధేనవః = ఆవులు, అల్పదుగ్ధాః = తక్కువ పాలు కల విగా ఉంటాయి,  
అల్పవిద్యః = తక్కువ విద్య కలవాడు , మహాగర్వీ = గర్వం కలవాడుగా ఉంటాడు, కురూపీ = అంద విహీనుడు, బహుచేష్టితః = ఎక్కువ చేష్టలు చేస్తూ ఉంటాడు,

*Meaning:*
The less water in the pot makes it to shake. The cows that are active will give less milk. The person with less education has more egoistical. The person who is ugly does more advances. 

*తాత్పర్యం:*
నీరు తక్కువగా ఉన్నచో ఆ నీరు కుండని కుదిపేస్తుంది. నీళ్ళు తక్కువ ఉన్న కుండ తొణుకు తుంది.  చాలా హుషారుగా ఉండే ఆవులు పాలు తక్కువ ఇస్తాయి. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలు ఇస్తుంది. అలాగే చదువు తక్కువైన కొలది గర్వం ఎక్కువ. ఎక్కువ చదువుకోని వాడు ఎంతో గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. అంద విహీనుడు ఎక్కువ (శృంగార) చేష్టలు చేస్తూ ఉంటాడు. అనాకారికి వికార చేష్టలు ఎక్కువ. 

బాగా చదువుకున్న వాడూ, అన్నీ తెలిసిన వాడు మిడిసిపాటు పడకుండా ఉండడము అణకువగానూ మంచి నడవడితో ఉండడమూ  లోకంలో చూస్తూ ఉంటాం. అలాగే విద్యాశూన్యుడు అతిగా మిడిసిపడుతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాము. అటువంటి వారిని ఉద్దేశించే జనబాహుళ్యంలో ప్రచారంలో *అల్పుడెపుడు పల్కునాడంబరము గాను* మరియు *నిండుకుండ తొణకదు* అనే నానుడులు వెలసాయి.  

చదువు గలిగి నమ్రతతోనూ వినయవిధేయులుగా ఉండడానికీ   పిల్లలకి తగురీతిలో శిక్షణ ఈయవలసిన బాధ్యత తల్లిదండ్రులది. *విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం* అని మన పెద్దలు ఎలాగూ చెప్పనేచెప్పారు

భౌమాశ్విని

జయ జయ శంకర - హర హర శంకర

భౌమాశ్విని - 16th-Jun-2020 & 14th-July-2020

భౌమాశ్విని (అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం అరుదుగా లభ్యమయ్యే యోగం.) నాడు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు. కంచి కామకోటిపీఠ మూలామ్నాయ సర్వజ్ఞపీఠాధిపతులు, జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి సందేశ సారం

భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!

భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 16 Jun 2020 మంగళవారం, ఏకాదశి తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం సర్వులూ శంకరులు కైలాసం నుంచు తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి, లలితా సహస్ర నామ పారాయణం, విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి పారాయణం, దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం, అచ్యుతానంతగోవింద నామజపం యథాశక్తి చేయవలెను. చండీపాఠ పారాయణం, జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించాలి. ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ..

రోగానశేషా నపహంసి తుష్టా దుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!

స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యం అమద్వైరి వినాశనం !!

ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం తో పరాశక్తి అనుగ్రహంచేత మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన - ప్రయత్నం రెండూ చేసుకోవాలి...

- కంచి కామకోటిపీఠ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి

*కాళీకాదేవి విగ్రహం అలా ఎందుకు ఉంటుందో తెలిపే కథ*

*ఒకసారి శివపార్వతులు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నారు. శివునితో ఆమె అన్నదట.... "చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా కావాలి." శివుడు జాప్యం చేసాడు. మళ్లీ మూడు నాలుగు సార్లు అడిగిందామె. కాని ఆయన మౌనంగానే ఉండిపోయాడు. ఆమెకి ఆకలి భరించలేనంతగా పెరిగిపోయింది. అమాంతంగా మహాదేవుడినే ఎత్తి పట్టుకుని మింగేసింది. ఆమె శరీరం నుండి ధూమరాశి చిమ్ముకుని బయటకి వచ్చింది. లోపల నుండి శివుడు ఇలా అన్నాడు. పార్వతీ! సుందరమైన నీ తెల్లని దేహాన్ని నన్ను మింగి నల్లని పొగలతో కప్పేసుకున్నావు ఇప్పటినుండి ఈ నీ అవతారం ధూమ్ర లేక ధూమావతి అని ప్రసిద్ది కెక్కుతుంది అని చెప్తాడు శంకరుడు.*

*వందలకొలది నక్కలు అరిచినట్లుగా అరిచే ఉగ్రచండికను తన దేహం నుండి పార్వతి ఉత్పత్తి చేసింది. ఆమెను శివదూతగా ఉపయోగించింది. ఈమెకి ఎవరూ పురుషుని స్వామ్యత్వం లేదని చెప్పడానికే శివుణ్ణి ఆమె మింగేసిన్దని ఉగ్గడించడంలోని భావం. ఆమె అంగ భూతాలైన నక్కలు, అసురుల పచ్చిమాంసంతో తృప్తి చెందాయి. ఇదే దేవికి ఆకలి వేసినది అనడంలోని రహస్యం. సప్తసతిలోని ఎనిమిదవ అధ్యాయంలో  ఈ వ్యాఖ్యానం దొరుకుతుంది.*

*ధూమావతి, బగళా, తారా, కాళీ దేవతలు ఘొర కర్మలకై ఉపయుక్తులౌతారని చెప్తారు. ఈమె ధ్యానమూర్తి. వివర్ణ, చంచలా, నల్లని దేహం కలిగి మురికి గుడ్డలు చుట్టుకుని ఉంటుంది. విరబోసుకున్న జుట్టు, కోపిష్టి, విధవ కాకధ్వజం కల రధంమీద కూర్చోడం, చేతిలో చేట, ఆకలిదప్పులతో వ్యాకుల పడుతూ ఉండటం ఇవి ఈమె లక్షణాలు.*

*నిర్మలమైన కళ్లు కలిగిన దేవిగా పిప్పలాద మహర్షి ఈమెని దర్శించిన ఉపాసకుడు. విపత్తి నాశనం, రోగనాశనం కలగడానికి, యుద్దంలో విజయం పొందడానికి, ఉచ్చాటన, మారణ క్రియలకూ, భూత ప్రేత ప్రయోగాలకు ఉపయోగించే దేవత. "మహాపది, మహాఘోరే, మహారోగే, మహారణే, శత్రూచ్ఛాటనే, మారాణాదౌ జాంతూనామ్మోహనే తధా".*

*ఈమె ఉపాసకుల మీద దుష్టాభిచార ప్రభావాలు ఉండవు.*

*ధూమావతి పేలకుండా ఉన్న చీకటి పేలిన తరువాత సూర్యబింబం. సుఖంలోని మాధుర్యంవైపు మన మనస్సులను ఈడ్చుకొనిపొయే విరూప మోహిని ధూమావతి. ఈమె నిత్యానంద ప్రదాయిని. సంసార జంబాలంలో చిక్కుకున్న వాళ్ళ పాలిట ధూమావతి అవిద్యయే కాదు, దుఖదాయిని కూడా. లలితా సహస్రనామాలలో విద్యాయై నమః ప్రక్కనే అవిద్యాయై నమః అని కూడా ఉంది.*
        
*ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని మాయలో రెండు భేదాలు ఉన్నాయి. ఉన్నదాన్ని ఆవరించుకొని లేనట్లుగా చూపేది ఆవరణ శక్తి. లేనిదాన్ని ఉన్నట్లుగా ప్రదర్శించి భ్రమింపచేసేది విక్షేప శక్తి. ధూమావతి ఈ రెండు పనులనూ చేస్తుంది. మనజీవితాలలో కాంతిమయమైనది మధ్యదశ ఒక్కటే. పుట్టుకకు ముందు చావుకు పిదప అంతా అవ్యక్తమే. ఈ అవ్యక్త దశే ధూమావతి. దైహిక వ్యాపారాలలోని సౌఖ్యాన్ని మోహాన్ని ఆనందాన్ని అసత్యమనుకున్న మరుక్షణమే దేహాతీత భావాతీత శూన్యత్వం మనముందు ధూమావతిగా ప్రత్యక్షం అవుతుంది.*

*వృద్దకాళియే ధూమావతి, కాలానికి కాలాతీత తత్వానికి, ప్రాణానికి ప్రాణాతీత అనుభవానికి, వ్యక్తానికి ప్రతిబింబమైన అవ్యక్తానికి అగ్నిలక్షణ దౌహృదమైన ధూమావతి ప్రతీక. హృదయంలోని దహరాకాశం ధూమావతికి నివాస స్థానం. కాని ఎక్కడా స్థిరపడి ఉండకుండా అంతటా వ్యాపించి తిరగటమే ఆమె స్వభావం.*

*చేట, తట్ట మనం సుఖాలనుకునే భావాలను చెరిగి జల్లించి యధార్ధాన్ని నిరూపించే ప్రయత్నానికి ప్రతీకలు. వికార రూపానికి ఒక సుందర రూపం దాగి ఉన్నదని చేసే బోధ మాంత్రికురాలి ఆకారం కల ధూమావతి మంత్రోద్దిష్ట నిరూపణం. ఈమె శివుడు లేని నిఖార్సైన శక్తితత్వం. పిప్పలాదుడు అధర్వవేదాన్ని ప్రశ్నోపనిషత్తును దర్శించి సృష్టించిన మహర్షి. ఆయన ఈ మహావిద్యకు ద్రష్ట. ఈ వ్యాసం అకాడమిక్ ఆసక్తితో మాత్రమే ప్రచురించడమైనది.*

# # తెలకపిండి # #


బలము పుష్టి కలిగించును.
వాతమును శ్లేష్మమును హరించును.
బాలింతలకు ఉబ్బురోగులకు మేలు చేయును.
శరీరమునందలి చెడు నీటిని హరించును.
.        దీనికి మంచి జోడీ మినప్పప్పు. 
     చాయ మినప్పప్పు కొంచెం ఉడికిన తరువాత..కొన్ని నీళ్ళు ఉండగానే తెలకపిండి గుండ వేసి కూర వండి .. వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పోపు  సామాను, వేసి వేయించి తాళింపు పెట్టాలి.  ఆ కూర అన్నంలో వేసుకుని, ఇంగువ వేసి కాచిన పప్పునూనె చేతిమీద వేసుకొని కలిపి తింటే అమోఘమైన  రుచి. ఆరోగ్యం బాగుంటుంది. శరీరం తేలిక పడుతుంది. 
ఆకలి పెరుగుతుంది. వాత దోషం,నంజు, హరిస్తాయి. మంచి రుచి. అన్న హితవు కలుగుతుంది. 
     మినప్పప్పు చాలా బలకరం. శుక్లవృద్ధి.శరీర పుష్టికరమైనది. క్షయ వ్యాధిని సైతం నిర్మూలిస్తుంది. 
     ఈ సీజన్లో ఈ కాంబినేషన్ చాలా మంచిది. 
(రిఫరెన్స్ ధన్వంతరి నిఘంటువు మొదలగునవి)
                    సుఖీభవ

*పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

 *మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం*

 ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం,అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం

 *జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం*

 ఫలితం: దీనివల్ల (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) 
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం‌ ఆచరించాకే మిగతావి)
 కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం

*ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం*

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం

*తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం*

ఫలితం: దీనివలన 
బంధు ద్వేషం ఆర్థిక ఇబ్బదులు

 *బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం*

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం

 బఫే భోజనాలు

ఫలితం:
దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం*
*వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం*

ఫలితం: 
దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి.... 
అందరికి చెప్పండి, చెప్పక పోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచన తో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి. అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరే టట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇది శాస్త్ర ప్రమాణాలు ను అనుసరిస్తూ observe చేసినది. Stright గా శాస్త్రం లో ఎక్కడా లేదు🙏🌹🙏🌹🙏🌹



నిర్గుణోపాసన

మహాత్ములు ఏ రకమైన పూజలు, నోములు, వ్రతాలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటె వారు ఆ దశలన్నీ దాటి పరబ్రహ్మతో తాదాప్యం చెందే దశలో వుంటారు.  ఆ స్వామి ఆ పూజ ఎందుకు నిర్వహించారు అని సందేహం రావచ్చు. ఇదే ప్రశ్న గీతలో అర్జనులవారు శ్రీ కృష్ణుల వారితో అడిగారు.  దానికి భగవానుడు ఉత్తములు ఏదయితే ఆచరిస్తారో అది సామాన్యులు అనుసరిస్తారని తెలిపివున్నారు.  కాబట్టి ఇక్కడ కంచి పరమాచార్య స్వామి కూడా ఉపాసనకు విగ్రహంలేకుండా కూడా చేయవచ్చని చెప్పి ఉండొచ్చు.
. సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన అనే వాటిపై ఏ మానవుడు తెలుసుకుంటాడో అతను ఆత్యాత్మిక జీవనంలో మొదటి స్థాయి చేరుకుంటాడు. స్థూల దృష్టితో చుస్తే విగ్రహారాధన సగుణ ఉపాసన అని విగ్రహం లేకుండా చేసే ఆరాధనను నిర్గుణ ఉపాసన అని అనుకుంటాము.  కానీ నిజానికి నిర్గుణ ఉపాసన అనేది లేదు. ఇది కొంచం చిత్రంగా అనిపిస్తుంది కదూ.

తపస్సు కూడా సద్గుణ ఉపాసనే.  ఇదేమిటి ఇట్లా అన్నాను అని అనుకుంటారా కానీ ఇది నిజం. ఇక్కడ ఉపాసన అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు తరువాత ఈ రెండు విషయాలు తెలుస్తాయి. ఉపాసన అనే సంయుక్త పదం రెండు పదాల కలయిక 1) ఉప, 2) ఉపాసన ఈ రెండు పాదాలకు అర్ధం ఉప అంటే సమీపంలో ఉపాసన అంటే ఉండటం అని. దేనికి సమీపంలో అంటే భగవంతునికి సమీపంలో అని జవాబు. ఎప్పుడైతే భగవంతునికి సమీపంలో అన్నారో ఇక్కడ ద్వేతం గోచరిస్తుంది. ద్వేతం అంటేనే నీవు వేరు, భగవంతుడు వేరు అనే భావన కనపడుతుంది. అక్కడ నీకన్న భిన్నంగా భగవంతుడు వున్నాడు అంటే అక్కడ సగుణాత్మకంగా భగవంతుడు వున్నాడు.  ఆ భగవంతుడు నీకు బౌతికంగా ఉండక పోవచ్చు కానీ నీ మనస్సులో నీకన్నా భిన్నంగా భగవంతుడు వున్నాడు. కాబట్టి అది సూక్ష్మ దృష్టితో చుస్తే సగుణాత్మకమైన ఆరాధనే కానీ ఇంకొకటి కాదు.
మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిర్గుణోపాసన అనేది ఉన్నదా? ఉంటే అది యెట్లా వుంది.
వున్నది కానీ అది ఉపాసన రూపంలో లేదు. అందుకే దానిని నిర్గుణ ఉపాసన అనరాదు.
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య పిల్లలు ఇవ్వన్నీ సామాజిక మైనవి. సాధకుడు ఈ బంధాలను ఒకదాని తరువాత ఒకటిగా వదులుకుంటారు. అంటే బౌతికంగా అందరు వుంటారు. కానీ తన మనసులో వీరందరిపట్ల సాంగత్యాన్ని త్యధిస్తాడు అన్న మాట. ఈ ప్రపంచం కోసం మాత్రమే బంధాలు, తనకు మాత్రం ఏ బంధం లేకుండా ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక జీవనంలో తదుపరి మెట్టు. ఈ స్థితిలో నేను అనే ఒక్క భావన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మొదలైతుంది అస్సలు కధ. ఆ నేను ఎవరు అనే ప్రెశ్న ఉదయిస్తుంది.  దయచేసి నేను గతంలో పోస్టు చేసిన "నేను" అనే పోస్టును ఓసారి తిలకించగలరు.

నేను అనే భావన ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు నీవు మిగులుతావు కేవలం నీవు మాత్రమే మిగులుతావు. ఆ నీవే ఈ సర్వ జగత్తుకు మూలకారణం ఐన భగవంతుడు.  నిత్యం సాధకుడు ఆ భగవంతుని గూర్చే ఆలోచిస్తాడు. చివరికి తానె భగవంతుడుగా మారుతాడు.  ఈ స్థితిని త్వమేవ అహం అంటారు.  ఈ స్థితియే మోక్షం. ఇదే ఆధ్యాత్మిక జీవనానికి పరాకాష్ట చివరి మెట్టు.  ఈ మెట్టుకి చేరిన వారికి మరల జన్మ ఉండదు. ఇటువంటి సాధనే  నిర్గుణ ఉపాసన అని మనం స్థూలంగా అంటాము.  కానీ ఇది నిర్గుణ ఉపాసన కాదు దీనిని నిధి జాస అంటారు. అంటే నేనే భగవంతుడిని అనే  భావన దీనిని "అహం బ్రాహ్మాస్మి"  అనే మహావాక్యంతో ఉపనీసుత్తులు గోషిస్తున్నాయి . ఈ స్థితిని చేరుకోటమే జిజ్ఞాసువు లక్ష్యం. నిత్యం నిష్కామ కర్మలు చేస్తూ నిది జాసలో జీవనం గడపటం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలం. మనం ప్రతీ విషయానికి స్పందిస్తూ ఉంటాము. అంటే మనం అరిషడ్వార్గానికి బానిసలంగా వున్నాము ఎప్పుడైతే వాటిని బానిసలుగా చేసుకోగలుగుతాడో అప్పుడు జిజ్ఞాసువు ముముక్షువు అవుతాడు తరువాత మోక్షార్ధి అవుతాడు ఆ తరువాత సాక్షాత్తు మోక్షం పొందుతాడు. జీవన్ముక్తుడు అవుతాడు.
సంసార జీవనం చేస్తూ దానితో పాటు ఆధ్యాత్మిక జీవనం సాగించ వచ్చు అని అంటారు. కానీ అది కేవలం ఏ కొద్దీ మందికో మాత్రం సాధ్యం అవ్వచ్చు అవ్వక పోవచ్చు. అటువంటప్పుడు రెండు జీవనాలను చేయటం రెండు పడవల ప్రయాణం అని నేను అనుకుంటాను. ఎందుకంటె మొదటిది స్వార్ధం, స్వలాభం, నేను, నాకు, నాది తో కూడినది. రెండవది వీటినన్నిటిని వదులుకొని నీ గూర్చు కేవలం నీగూర్చు మాత్రమే చింతించటం. అది యెట్లా సాధ్యం. కేవలం జనక మహారాజు లాంటి మహోన్నత వ్యక్తులకు మాత్రమే ఈ రెండు కలుపుకొని జీవించటం సాధ్యం కావచ్చు. మరి మనం ఈ విధిలో ఏచోట వున్నాము అన్నది ప్రతి వారు తమకు తాము ప్రశ్నించుకోవలసిన విషయం.
మన నిత్యా జీవితంలో ఒక పరిక్ష ఉత్తీర్ణుడు కావటానికి రోజుకు ఒక గంట చదివే వాడు పాస్ అవుతే రోజుకు పది గంటలు చదివే వాడు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు.  ఇది సామాజికం. మరి ఆధ్యాత్మికత దీనికన్నా ఎన్నో రేట్లు కష్ట సాధ్యమైనది.  ఈ పరీక్ష కొన్ని వందల లేక్ కొన్ని వేల ఏళ్ళు కష్టపడితే మాత్రమే ఉత్తీర్ణత  సాధ్యం. అటువంటి అప్పుడు సంసార జీవనం చేస్తూ ఒక సాధకుడు రోజుకు ఎన్ని గంటలు ఆధ్యాత్మిక జీవితం కోసం కేటాయంచగలడు. ఆ సాధన తన గమ్యాన్ని చేర్చటానికి ఎంతవరకు ఉపయోగ పడుతుంది. ప్రతి సాధకుడు  . తనకు తానూ వేసుకోవలసిన ప్రశ్న. 

ఓం శాంతి శాంతి శాంతిః
సర్వే జానా సుఖినోభవంతు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి - శ్రీ దత్త నామ కవచం - ఫలితాలు 

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి*

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః 
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే 
నమో నమః 108

 ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే  ఈ దివ్య నామములు  దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని  దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు. తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను.

#శ్రీ దత్త నామ కవచం*

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

#భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

#భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

#భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభింస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

#భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనమునందు,అరణ్య ములందు,మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

#భావము: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

#భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం,కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ  నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

#భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో  చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

#భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు,బొటనవేళ్ళు,చేతుల యొక్క అగ్రభాగములకు,నామములతో కవచము చేసుకొనవలెను.నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: భుజస్కంధముల యందు,భుజముల మూలలయందు,హస్తముల సందులయందు,వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

#భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

#భావము: రోమమలయందు,హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం::: 

#పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.

        *శుభమస్తు*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

మధ్యతరగతి ఆర్భాటాలు - కధ.

మధ్యతరగతి ఆర్భాటాలు కి భేషిజాలకి మచ్చుతునక ఈ కధ...

సండే స్పెషల్

కొన్ని కార్ల మీద, ఆటోలు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్ల మీద -” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా చాలా వ్రాసి ఉండడం చూస్తూంటాం.

కుటుంబసభ్యులు కొని ఇచ్చారనో, లేదా దేవుడు కరుణించి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఈ వాహనం తనకు ఏర్పడిందని చెప్పుకోడం కోసం అలా వ్రాస్తారు అనేది సహజమైన ఆలోచన/అర్ధం/భావం.

మొన్న ఒక బట్టల దుకాణం దగ్గర -  “పక్కింటోళ్ళ చలవ” అనే Sticker కనపడిందో కారుమీద. 

దానర్ధం బోధ పడ్లేదు - ఎందుకంటే ప్రక్కింటోడు  కారెందుకు కొనిస్తాడెవరికైనా? అనే ఆలోచనతో.

దానర్ధం ఎంటో తెల్సుకోవాలని ఉత్సుకత కలిగి పెరిగి పోడంతో ఆ బండి యజమాని వచ్చే వరకు అక్కడే తచ్చాడాను. 

ఒక అరగంట తర్వాత ఆయన వచ్చి తలుపు తీయబోతుంటే “excuse me Sir “ అంటూ ఆయన్ని పలకరించాను.

“ఏం కావాలి” ఏదో అర్ధించి వచ్చేవాడిని చూసినట్లు చూస్తూ అన్నాడు. ఆయన తప్పేంలేదు, ఎవరికైనా అదే అనుమానం వస్తుంది ఆ సమయంలో.

“ఏం లేద్సార్ … చిన్న సందేహం. మీకు అభ్యంతరం లేకపోతే….” అని కొంచెం low voice లో అన్నాను.

నా వల్ల ఆయన కొచ్చే ఆర్ధిక ఇబ్బంది ఏమీ లేదని గ్రహించి, మొహం కొంచం తేట చేసుకొని -” ఏంటండీ మీ సందేహం?” అన్నాడు.

“ఏం లేద్సార్ , మీ కారు వెనక - పక్కింటోళ్ళ చలవ - అని వ్రాసి ఉందే దాని అర్ధం తెల్సుకోవాలని” బయట పెట్టాను అరగంటకి పైగా బుర్ర తొలిచేస్తున్న నా సందేహాన్ని.

“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, నాకు చాలా చాలా సుఖాలు కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అప్పు చేసి మరీ కొన్న కారు. చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా! అందుకని అలా రాయించా” ఓపిగ్గా చెప్పాడు కారు యజమాని.

చాలా రోజులకి ఓ సరదా మనిషి తారస పడ్డాడన్పించింది.

*..ప్రతి ఇల్లు ఒక క్వరంటైన్ కావాలి..*

        
*ఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ని, రాకుండా ఆపగలం....*

        *రోజు పొద్దున్నే 💥బయట ఎండలో 20 ని. సేపు మాస్క్😷 పెట్టుకుని  ఉండండి..*

*1.ప్రతి ఒక్కరూ ఇంట్లో కొంచెం గోరు వెచ్చని 🔥నీరు మాత్రమే తాగాలి...అది అరగంటకు ఒకసారి కొన్ని కొన్ని  చాలాసార్లు 5 లిటర్స్ వరకు త్రాగండి...*

*2.అల్లం..వెల్లుల్లి..మిరియాలు,శొంఠి,పసుపు..లవంగాలు,మిరియాల మొ.వి... బాగా వేడి చేసి రెండు,మూడు పూటలా తాగాలి..*

*3.రాత్రి పాలు 🥛,నీళ్లు తాగిన పసుపు కలుపుకుని తాగండి....*

*4.చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఇంట్లో కొంచెం జాగ్రత్తలు తప్పనిసరి చేయండి...*

*5.బలమైన ఆహరం కోడిగుడ్లు,పాలు,బాదం,జీడిపప్పు,కిస్మిస్ తినండి.....రాగి జావా...అంబలి....చేసుకోండి...*

*6.అత్యవసర మందులు ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి....*

*7.  ఆఫీసు లు , ఉద్యోగ ప్రాంతం ,రద్దీ ప్రాంతాల్లో  బయట నుండి ఇంట్లోకి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే అన్ని సానిటీజ్ చేసి ,బట్టలు dettol లో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి..*

*8.ఇంట్లోకి  బయట నుండి తేచ్చినా వస్తువులను తప్పనిసరిగా సానిటైజ్ చేయాలి...*

*9.బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి,సానిటైజర్స్ రాసుకుని దగ్గర పెట్టుకోండి...*

*10.బయటకు వెళ్ళినపుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును ,నోటిని ,కళ్ళను చేతులతో తాకరాదు..*

*11.ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి..*

*12.రోగనిరోధక శక్తి ని పెంచే పదార్థాలను తీసుకోండి...*

*11.రోజు రాత్రి  నోట్లో  నీళ్లలో ,బిటడిన్ ద్రావణం నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళేలాగా పుకిలించాలి.. గార్గ్ లించండి*

*12. రోజు కనీసం  6 -8 గంటలు నిద్ర😴😴 తప్పనిసరి...*

*13. ఈ పరిస్థితుల్లో మద్యపానం🍻🍻🙅‍♂️🙅‍♂️  జోలికి పోకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం..*

*ఇక నిర్లక్ష్యం తగదు...* 🙅‍♂️🙅‍♂️🙅‍♂️🙅‍♂️

*వీటితో పాటు పండ్లు...సీ విటమిన్ నిమ్మ,జామ, ఉసిరి ఎక్కువగా తీసుకోవాలి...*🍎🍋🍇🍓🥭🥝🧄🥕🧅🍍🍍
*ఆపిల్స్ , బొప్పాయి..నారింజ..మొ..వి..*

*మెడిసిన్ ఇంట్లో 💊💊ఉండవలసినవి....*

1. పారాసెటమాల్
2.సిట్రేజిన్
3.Cough Tabs
 4.మౌత్ వాష్ మరియు గార్గ్ల్ కోసం బీటాడిన్ 
5.విటమిన్ సి మరియు డి 3 
6.బి కాంప్లెక్స్ Zincovit
7. ఆవిరి కోసం ..జండూ బామ్.. పసుపు

 *8.శ్వాస వ్యాయామాలు...యోగ తప్పనిసరి...*

*ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!*
 *లక్షణాలు ఎక్కువైనా ...శ్వాసలో ఈబంధులు ఉన్న తక్షణమే వైద్యుల సలహాలు తీసుకోండి...* 

*మీరు కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి.......?*
 1. గొంతు దురద
 2. పొడి గొంతు
 3. పొడి దగ్గు
 4. అధిక ఉష్ణోగ్రత
 5. శ్వాస ఆడకపోవడం
 6. వాసన కోల్పోవడం ....

 *ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకుని......అందరూ బాగుండాలి..అందులో మనం కూడా ఉండాలి కాబట్టి... మీ కుటుంబం మరియు మీ స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయండి....*
😷😷

నిర్గుణోపాసన

పరమాచార్య స్వామివారు అప్పుడప్పుడు ఒక విలక్షణమైన పూజ నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా మహాప్రదోష సమయంలో. త్రయోదశి ఘటియలు సాయంత్రం వ్యాపించి ఉంటే ఆ సమయం మహాప్రదోషమని పిలవబడుతుంది. 

శ్రీవారు తమ ఎదురుగా ఆవుపేడతో అలికి ముగ్గు వేయబడి ఉన్న ప్రదేశంలో ఒక ఆకు పరచి దానిపై దేవతావాహన చేసేవారు. విగ్రహాలు ఏవీ ఉండేవికావు. కానీ మానసికంగా జరుగుతున్న ఆ పూజలో శ్రీవారి ముద్రలు హావభావాలు అక్కడ త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు విరాజమానులయి ఉన్నారన్న విషయం చూసేవారికి అవగతమయ్యేది. 

అభిషేకం చూసిన జ్ఞాపకం లేదుకాని ఉపచారములన్నీ వివిధ ముద్రలలో వారికి మాత్రమే కనిపించే జగత్పితరులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించడం నేను అనేక పర్యాయములు చూసిన అదృష్టాన్ని నోచుకున్నాను. భక్తులలో పండితులు రుద్రత్రిశతి చెబుతుంటే స్వామివారు అతిలాఘవంగా లేత బిల్వదళాలతో అర్చన చేసేవారు. దోసెళ్ళతో తుమ్మెపూలు సమర్పించేవారు. అనేక ఫలజాతులతో నైవేద్యం జరిగేది. ఈ పూజకు తుమ్మిపూలు, బిల్వదళాలవంటి సంభారాలు సమయ మెరిగి తీసుకొనివచ్చే మాతృమూర్తులు, శిష్యులు ఉండేవారు. 

పూజ ముగించి ప్రదక్షిణ చేసి మహాస్వామివారు నమస్కారం చేసేటప్పటి వారి ముఖంలో ఆర్ద్రతతో కూడిన భక్తిభావం ఈ రోజుకూ నాకనులకు కట్టినట్లు కనిపిస్తోంది. అంతటి స్వామికి ఎంతటి వినయం? ఎంతటి భక్తి? మా కనులకు దురదృష్టమావహించి స్వామి ఎదుటనున్న త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు మాకు కనిపించలేదు. కానీ ఆ సమయంలో పరివార దేవతలందరితో కూడిన చంద్రమౌళీశ్వరుడిక్కడ విరాజమానుడయి ఉన్నాడని నా ప్రగాఢ విశ్వాసం. 

స్వామివారి కృపాదృష్టి మాపై సోకిఉంటే పౌర్ణమినాటి రాత్రి మాంగాడు కామాక్షీ దర్శనాన్ని తమ పారిషదులకు అనుగ్రహించినట్లు మాకనుగ్రహించకపోదురా!

అది మాంగాడు కామాక్షీదేవి కుంభాభిషేకం సమాయం - స్వామివారు కుంభాభిషేకం చేయడానికి అక్కడ వేంచేసి ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక ఝాముకాలం చంద్రుని చూస్తూ లలితాసహస్రనామం పారాయణం చేయడం స్వామివారి అలవాటు. ఆరోజుకూడా అలానే పారాయణం జరుగుతోంది. ప్రక్కన పన్నెండుగంటలకు గాలిగోపురం నెత్తిమీదకు చంద్రుడు వచ్చాడు. పారాయణం చేస్తున్న స్వామి ఆనంద సంభ్రమాలతో నిలుచుని చేతులు జోడించి పారిషదులతో ‘చూడరా అమ్మ’ అన్నారట. వారికి అర్థమయింది. స్వామికి అమ్మ కామాక్షి సగుణరూపంలో దర్శనం ఇస్తోంది. చేతులు జోడించి “ఎక్కడ” అన్నారు. అదిగో అన్నారు స్వామి. అంతే! ఆ పారిషదునికి గోపురమంతా అమ్మగా దర్శనమిచ్చింది. అప్పటి ఆ పారిషదుని హృదయస్థితి ఎలా ఉండి ఉంటుంది? 

అయ్యయ్యో! మహాపెన్నిధిని అతి దగ్గరగా పెట్టుకొని వారిని ఉపయోగించుకొని అమ్మను చూడలేకపోయానే అని దుఃఖం కమ్ముకొని వస్తుంది నాకు. అంతలో ఆ అమ్మ ఈ స్వామికదా! ఇప్పటికీ నాలో లేదా అనిపిస్తుంది. చదువరులలో ఉన్న మహాతపస్సంపన్నులారా నా స్వామిని నాలో నిరంతరం నిరంతరాయంగా దర్శించుకొనే అనుగ్రహం చేయరూ? 

కొంతమంది అనుకుంటారు. భక్తి అనేది ద్వైతభావంలోనిది. జ్ఞానికి కర్మ, భక్తి, పూజ అనేవి లేవని ఉద్ఘాటిస్తూ ఉంటారు. స్వామివారు జ్ఞాని కూడా భక్తిభావంలో లీనమయి ఉంటారని నిరూపించారు. వీరికి ముందే శుకాచార్యులు వారు, సదాశివబ్రహ్మేంద్రులు, మధుసూదనానంద సరస్వతి స్వామివంటి వారు కూడా ఈ విషయాన్ని తాము భక్తిభావంలో లీనమయి రూఢిపరచారు. 

శుకాచార్యులవారు జ్ఞాని కాని భక్తుడు పరమేశ్వరుణ్ణి ముక్తికోసం ఆరాధిస్తుంటే ముక్తుడైన జ్ఞాని భక్తిని భక్తికోసమే పెంపొందించుకుంటాడంటారు. జ్ఞానికి ఇటువంటి విశిష్టమైన భక్తి ప్రసాదించడం అంబికలీల అంటారు మహాస్వామివారు. నిజానికి జ్ఞానికి ఇటువంటి భక్తిని నెరపడం వలన ప్రయోజనముండకపోవచ్చు. ఆచార్య పదంలో ఉన్న స్వామివారివంటి జ్ఞానులు ఇటువంటి భక్తి కలిగిఉండటం మన మార్గదర్శకత్వానికే కావచ్చు. 

మహాస్వామివారు తుదినాళ్ళలో కేవల సమాధ్యవస్థలో ఉంటూ కూడా బాహ్యస్మృతిలోనికి వచ్చినప్పుడు సంధ్యావందనాద్యనుష్టానములు గతి తప్పక నిర్వహిస్తూ ఉండేవారు.

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Y U W యీ అక్షరముల మూల తత్వము

Y U W  యీ అక్షరముల మూల తత్వమును పరిశీలన. యు అనే చిహ్నం విషు విష్ణు నామంగా మనకు తెలియుచున్నది ఎదీనినే ఆజ్ఞా చక్ర స్థానమైన నుదిటి యందు ధరించుట. దీని తత్వం శక్తి క్షేత్రమునకు అనగా మూలమని నివాసమని  కూడా తెలియును. నుదుటిపై యీ చిహ్నం వలన యితరుల దృష్టి కి మనం ప్రభావితం గాకుండా తిలక్ ధారణ వలన తెలియును. వై అనే అక్షరం తలక్రిందులుగా  వ్రాసిన శక్తి కి గరిమనాభికి భూమిపై స్ధిరంగా నిల బడుటకు చిహ్నముగా గనుక అక్షరం శక్తి వ్యాప్తికి సంకేతంగా తెలియుచున్నది. వై డబ్ల్యు త్రిశూలం శక్తికి సంబంధించిన శక్తికి గుర్తుగా దీని శక్తి అనంతము పరిమాణము అనగా కొలతకు అందనిది.విష్ణు తత్వ మైన యు తెల్లని నామం మధ్యలో ఎరుపు 🔴రంగా గుర్తుగా ఊర్ధ్వ పండ్రెండు నామంగా వైష్ణవ సంప్రదాయం. అనగా యిది కూడా ఆజ్ఞా చక్రము వద్దనే. (బిగ్ బాంగ్) పదార్ధ విచ్చేదనకు త్రిశూలం శక్తి యే మూల కారణంగా అనగా యు, డబ్ల్యు రెండును శివ విష్ణు తత్వము లుగా మనకు తెలియును. లవ్ సింబల్ కూడా శక్తికి మూలంగా యీ రెండిటి  కలయికయే సమస్త శక్తి తత్వం గా గతి చిహ్నముగా తత్వంగా తెలియుచున్నది. అందుకే యీ గుర్తుల వివరణ. యు, వి, అనే అక్షరములులో వి వైగా మారి త్రశూలంగా  మారి శక్తి వ్యాప్తికి మూలంగా తెలియును. యువి (అల్ట్రా వైలెట్) అనగా కిరణ లక్షణము ప్రకృతి.

ఏపీలో క్రైస్తవ మత మార్పిళ్లు



ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన  


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచించింది.

దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, పొంచివున్న ప్రమాద ఘంటికలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో చట్టాలు ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు:
రోజురోజుకూ అధికమవుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. వీటి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నానికి గురవుతున్నాయి, సామాజిక జీవనానికి ఆటంకం కలుగుతోంది, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. అంతేకాదు.. జాతి భద్రతకు సైతం ఇది పెనుప్రమాదంగా పరిణమించింది.

తమకు ప్రత్యేక దేశం కావాలంటూ కొందరు పాస్టర్లు చేస్తున్న ప్రసంగాలు మతం మారుతున్న వారి మెదళ్లలో దేశవ్యతిరేక బీజాలు నాటుతున్నాయి.. మరికొందరిలో సాటి మతాల పట్ల ద్వేషభావం కలిగిస్తున్నాయి. దేశభద్రతకు మాత్రమే కాదు. సామాజిక భద్రతకు కూడా ఇది ముప్పే.

మతమార్పిడి చేస్తున్న వారి మాయలో పడ్డ అమాయకులు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరుఅవ్వడం మానేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చిచ్చుకు కూడా ఇవి కారణం అవుతున్నాయి.

ప్రొటెక్షన్ ఫోరమ్ నివేదిక పరిశీలిస్తే అర్ధమవుతుంది .
నివేదికలో ఉదహరించిన దాని ప్రకారం.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చర్చిల సంఖ్య సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగింది. ఈ సంఖ్య పరిశీలిస్తే ఆ మండలంలో మొత్తం 68 చర్చిలు ఉన్నాయి. ఆ మండలంలో ఉన్న గ్రామాల సంఖ్య మాత్రం 11.  అంటే.. సగటున గ్రామానికి 6 చర్చిలన్న మాట!!

2011 జనాభా గణన ప్రకారం రెడ్డిగూడెం మండలలోని క్రైస్తవ జనాభా 630. కానీ ఇదే మండలంలోని మద్దులపర్వ  గ్రామాన్ని తీసుకుంటే.. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ శాఖ ఇచ్చిన సమాచారం నివ్వెరపరుస్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఆ గ్రామంలో క్రైస్తవ జనాభా సున్నా (0). కానీ అక్కడ ఉన్న చర్చిల సంఖ్య మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం 11!

క్రైస్తవులే లేని గ్రామంలో 11 చర్చిలు ఏ విధంగా సాధ్యం? అసలు అధికారులు ఆ చర్చిలకు ఏవిధంగా అనుమతి మంజూరు చేశారు? ఆ చర్చిలను నిర్వహిస్తున్నవారు, ఆ చర్చిలకు వెళ్తున్నవారు తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోవడం లేదన్న విషయం మనకు తెలుస్తుంది. ఇది ప్రభుత్వాలను మోసగించడం కాక మరేమిటి? అసలు అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు సదరు చర్చిలకు ఏవిధంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు? ఈ నేరంలో వాళ్ళుకూడా పాత్రధారులే అన్నది ఇక్క స్పష్టమవుతోంది.

నివేదిక నుండి గ్రహించిన మరొక ఉదాహరణ చూద్దాం.. గత ఏపీ ప్రభుత్వం క్రైస్తవుల కోసం ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు అని సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నకు.. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగివున్న ప్రతి వ్యక్తిని ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ పధకం కింద లబ్దిదారుగా ఎంపిక చేస్తామంటూ గుంటూరు జిల్లా అచంపేట్ మండల రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తుంది. ఎస్సీ కుల ధ్రువీకరణ కలిగిన వారు క్రైస్తవులు ఎలా అవుతారు?

క్రైస్తవ మతమార్పిడులను కట్టడి చేసే విధానాలేవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించడం లేదన్న విషయం ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ జనాభాపై కొన్ని వార్తా ఛానెళ్లలో పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యలు అనేక అనుమానాలు కలుగజేస్తున్నాయి. రాష్ట్రంలో 30% క్రైస్తవులు ఉన్నారని కొందరు బహిరంగంగా చెప్తుంటే.. 2 కోట్ల మంది క్రైస్తవులు, 5 లక్షల పాస్టర్లు కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ఏపీ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఓకే ఎమ్మెల్యేకు చేసిన సన్మాన కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి

2011 జనాభా గణన అధికారిక లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6.82 లక్షలుగా ఉన్న క్రైస్తవ జనాభా ఈ 9 సంవత్సరాలలో ఏకంగా 2 కోట్లకు ఎలా చేరుతుంది? దీని బట్టి చూస్తే మతం మారిన క్రైస్తవులు తమ రిజర్వేషన్ల లబ్ది కోసం జనాభా గణనలో తప్పుడు లెక్కలు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఏమైపోతున్నారు?” (What happened to Christians of AP) అంటూ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ తయారుచేసిన నివేదిక ఇక్కడ గమనించాలి. ఎస్సీ రిజర్వేషన్లు ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయి అనే విషయాన్ని ఆ నివేదిక బయటపెట్టింది.

1971 నుండి 2011 కాలంలో రాష్ట్రంలోని క్రైస్తవ జనాభా ఏవిధంగా తగ్గుతూ వచ్చింది, అదే సమయంలో రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఏవిధంగా వృద్ధిచెందిందో అది తెలుపుతుంది.  విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు పొందే ఉద్దేశంతో క్రైస్తవంలోకి మారినప్పటికీ అధికారిక రికార్డుల్లో ఆ విషయాన్ని తెలియజేయకుండా దాచిపెడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు, తమకు విషయం తెలిసిన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనకు అర్ధమవుతుంది.

దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద అవినీతిగా తేలుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకుని ఈ వ్యవహారంపై సమగ్ర కసరత్తు చేసి, అక్రమ మతమార్పిళ్లు, రిజర్వేషన్ల దుర్వినియోగం అరికట్టేందుకు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, అందుకోసం ఒక నిజనిర్ధారణ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాల్సిందిగా ఫోరమ్ తమ నివేదికలో కోరింది.

*ఏపీ కోవిడ్-19*

*కమాండ్ కంట్రోల్ రూమ్*
*మాస్కుతో ఆటలొద్దు.. కరోనాను శరీరంలోకి ఆహ్వానించవద్దు:*

దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వ్యాప్తి పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో కొంతమంది  నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు.

ఇప్పటికీ ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్న భావన కలుగుతోంది. ముఖ్యంగా జనసంవర్థమైన ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు ముఖానికి మాస్కు ధరించడం లేదు. 

మరికొంత మంది మాస్కులు ధరించినా.. వాటిని వినియోగించడంపై సరైన *అవగాహన లేకపోవడం*, *మాస్కును నిమిషానికి ఒకసారి తడుముకోవడం*, *కిందకు లాగడం*, *పైకి పెట్టడం*, *ముక్కు కిందకు లాగడం*, *మెడపైన, తలపైన ఉంచడం* చేస్తున్నారు.

 మరికొందరు వాటిని జనం సమూహాల్లోనే ఎక్కడపడితే అక్కడ తీసేస్తూ.. ముఖాన్ని చేతులతో తుడుచుకుని మాస్కును తిరిగి పెట్టుకుంటున్నారు. *ఇలా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది*.

మరోవైపు కొంతమంది మాత్రం తాము చాలా జాగ్రత్తగా ఉంటున్నామని.. అయినా వైరస్ బారిన ఎలా పడ్డామో తెలియడం లేదని చెబుతున్నారు. 

కానీ వారికి తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో మాస్కులు ధరిస్తూనే ప్రజలు చేస్తున్న పొరపాట్లను ఇక్కడ వివరించడం జరుగుతోంది. *మాస్కులను ధరించే ప్రతిఒక్కరూ వీటిని గమనించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది*. 

*మాస్కు ధరించినపుడు ఎక్కువమంది చేస్తున్న పొరపాట్లు:*

1) ఆఫీసులో రోజూ సహచర సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. అందరం కలిసే ఉంటున్నాం కదా.. ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో మాస్కు అవసరం లేదనుకుంటాం. అది తప్పు. ఆఫీసులో ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కు  ధరించాలి. 

2) మనం మన ప్రాణ స్నేహితులతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాం. వాళ్లు నా ఆప్త మిత్రులేకదా. వారితో మాట్లాడేతప్పుడు మాస్కు అవసరం లేదనుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడినా మాస్కు ధరించడం శ్రేయస్కరం. 

3) కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాస్కు అవసరం లేదనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు.  ఇంట్లోనూ ఎవరైనా పెద్దవారుంటే వారితో మాట్లాడినా మాస్కు ధరించడం మంచిది. 

4) మరికొంత మందికి మాస్కు నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచాలన్న విషయం కూడా తెలియడం లేదు. చాలామంది మాస్కులను చేతితో పట్టుకుని, చెవికి వేలాడదీస్తూ ఇతరులతో కబుర్లు చెప్తూ ఉంటారు. అలా చేయకూడదు. 

జనంలోకి వెళ్లినపుడు వైరస్ బాధితులు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపర్లు మన ముఖంపై పడకుండా చూసే రక్షణ కవచమే మాస్కు.  

5) మాస్కును ధరించిన తర్వాత తరచూ చేతితో మాస్కును ముట్టుకోవడం, కళ్లు, ముక్కు, నోటి దగ్గర చేతిని పెట్టుకుని రుద్దడం అస్సలు చేయకూడదు.

 కరోనా వైరస్ అనేది 99శాతం మన చేతుల ద్వారానే ముక్కు, నోరు, కంటిలోనికి ప్రవేశించి శరీరంలోకి వెళ్తుంది. 

ఇప్పటికీ చాలా మంది ప్రజలు ప్రతి నిమిషానికొకసారి మాస్కును చేతులతో రుద్దడం, ముఖాన్ని తాకడం చేస్తున్నారు. 

6) చేతులు కలపడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అస్సలు చేయవద్దని చెబుతున్నప్పటికీ ప్రజలు పెద్దగా ఈ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికీ చాలా మంది యువత జనసమూహాల్లోనూ చేతులు కలుపుతూ, ఒకరికొకరు ముఖం దగ్గరగా పెట్టుకుని మాట్లాడుకోవడం చేస్తూనే ఉన్నారు. 

7) సెల్ ఫోన్ లో మాట్లాడేతప్పుడు చాలా మంది మాస్కులు తొలగించి మాట్లాడుతున్నారు. ఒక్కరే ఉన్నపుడు అలా చేయడం తప్పులేదు. కానీ జనసంవర్థమైన ప్రాంతాల్లో కూడా ముఖానికి మాస్కు తొలగించి ఫోన్ లో మాట్లాడుతూ.. చేతితో ముఖాన్ని తాకుతున్నారు. అలా చేస్తున్నారంటే మన శరీరంలోకి కరోనాను రమ్మని మనమే ఆహ్వనించినట్టే.

8) చాలా మంది మాస్కు ధరించిన తర్వాత మధ్యలో తొలగించి చెమట తొలగించుకోవడం లాంటివి చేస్తున్నారు. చొక్కాతో, మెడలో ఉండే కండువాతో తుడుచుకుంటున్నారు. కరోనా బాధితులెవరైనా తుమ్మినపుడు తుంపర్ల రూపంలో వైరస్ వచ్చి మన చొక్కాలపై పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. చాలా మంది మాస్కును తొలగించి ఆ చొక్కాతో ముఖం తుడుచుకోవడం ద్వారా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. 

9) మరికొంతమంది మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించే వస్తున్నారు. అయితే తెలిసిన వారెవరైనా కనిపించగానే మాస్కును తలపైకి పెట్టుకుని కులాసాగా మాట్లాడుకుంటున్నారు. ఇదే తమను వైరస్ బారినపడేలా చేస్తుందనే విషయం తెలియక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. 

కాబట్టి మాస్కును ధరించడమే కాదు. మాస్కు ధరించినపుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటారు. 

ప్రతి ఒక్కరూ మాస్కును ధరించినపుడు పైన చెప్పిన అంశాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మనం అడ్డుకోగలుగుతాం.

=====================
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*

*అర్థనారీశ్వర స్తోత్రం*

*చాంపేయగౌరార్థశరీరకాయై*
*కర్పూరగౌరార్థశరీరకాయ*
*ధమ్మిల్లకాయై చ జటాధరాయ*
*నమః శివయై చ నమః శివాయ*
*కస్తూరికాకుఙ్ముమచర్చితాయై*
*చితారజఃపుఞ్జ విచర్చితాయ*
*కృూతస్మరాయై వికృూతస్మరాయ*
*నమః శివయై చ నమః శివాయ*