6, జూన్ 2023, మంగళవారం

ఒడిబియ్యం

 


పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?


'పెళ్లి' అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని, కూతురును మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసు కుని, మనసారా ఆశీర్వదించి.. ఆమెకు ప్రీతి పాత్రమైన దుస్తులు, పసుపు-కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని 'ఒడిబియ్యం' పోయడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు.

కురువంశ పాలకులు -

 కురువంశ పాలకులు -






భారత  దేశాన్ని పాలించిన కురు వంశం మహా భారత యుద్ధం తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడనీ  అందరికీ తెలుసు. కలి శక పూర్వం ధర్మరాజు  ముప్పది ఆరేళ్ళు ధర్మపాలన చేశారు. పిమ్మట అభిమన్యుని కుమారుడు అయిన పరీక్షిత్తును  పట్టాభిషిక్తుని  చేసారు .     పరీక్షిత్తు కలిశకం ఆరంభమయిన బిఫోర్ కామన్ ఎరా  3101  నుండీ బిఫోర్ కామన్ ఎరా 3041  వరకు  దాదాపు  అరువది ఏళ్ళు పరిపాలించాడు . సర్పదష్టుడై పరీక్షిత్తు మరణం తర్వాత అతని కుమారుడు జనమేజయుడు పాలనకు వచ్చాడు. జనమేజయుని తర్వాత వచ్చిన కురువంశ రాజులు అంత  చాకచక్యం కలవారు, దక్షత కలవారు కారు . పిమ్మట భారత దేశం మగధ రాజధానిగా జరాసంధుని వంశం అయిన బార్హద్రధ వంశము పాలనలోకి వెళ్ళింది . వారే చక్రవర్తుల అయ్యారు. కురు వంశ పాలకులు సామంతులు అయ్యారు. ఆ పాలకులు దాదాపు 29  మంది హస్తినాపురం రాజధానిగా  మగధకు సామంతులుగా పరిపాలించారు. జనమేజయుని తర్వాత పాలనకు  వచ్చిన  పాలకుల పేర్లు 


శతానీకుడు

అశ్వమేధాదత్త 

అధిసింహ కృష్ణ

నిచక్ను 

ఉష్ణ 

చిత్ర రధుడు 

శుచి రధుడు 

వృష్ణి మంతుడు 

సుషేణుడు 

సునీధ

నృపేగాక్షు

శుఖిబల  

పరిప్లవ 

సునయ

మేధావి 

రిపుంజయ 

ఉర్వ 

తిగ్మ 

బృహద్రథ 

కసూదన

శతానీక 2 

ఉదయన

కిహినార 

దండపాణి 

నిరామిత్ర 

క్షేమకుడు 

 

ఈ కురు వంశ పాలకులు మహా భారత యుద్ధానంతరం మొత్తం 1504  సంవత్సరాలు పరిపాలించారు . బిఫోర్ కామన్ ఎరా  1634  లో  క్షేమకునితో కురువంశ పాలన అంతమైంది .  జనమేజయుని తర్వాత  వచ్చిన పాలకులు తమ రాజ్యములో ఒక్కో ప్రాంతాన్ని కోల్పోతూ వచ్చారు . ఉదయనుని కాలములో వారు వత్స దేశాన్ని కోశాంబి రాజధానిగా పాలిస్తున్నాడన్న కథ మనకు  భాస కవీంద్రుడు రచించిన స్వప్న వాసవ దత్తము ద్వారా సుపరిచితమే.. ఉదయనుడు కురు వంశానికి చెందిన పాలకుడే.

be careful

 These sections can be implemented if you behave inappropriately on social media..!!


IT Act 2000 IT Act Section 66 IPC Section 292 Section 354A 354D (Nirbhaya Act) Section 499 Section 66D For trolls..


1. Trolling (Nasty, rude, jokes on women. Putting their names on pics).


2. Defamation (Posting comments about girls or married people..comments to harm their family reputation..defamation).


3. Stalking (Making objectionable comments and posts on women.)


Those who have committed the above 3 acts.. their friends.. close relatives.. are considered as criminals according to the IT Act 2000..


Under Punishment for Violation of Privacy under Section 66 of the IT Act. Harassment via Electronic Communication under Section 354A, 354D of the Nirbhaya Act.


1. If you share an indecent photo on social media..?


Punishable under IPC Section 292. According to this section, anyone who shares obscene content, be it video, photo or texts, will be punished with imprisonment up to 2 years. If he commits the same act again then he will have to serve 5 years in jail concurrently.


2. If a comment or post is made insulting any religion or sect..?


In such matters, a case is filed under the IT Act. Along with that, if the matter is related to religion, section 295 will be added. If in such matters the honor of the other person is violated, a case is also filed under Section 499.


3. If another person uses the photo without permission..?


If someone uses his/her photo without the other person's permission, a case will be filed under Section 499 of the IT Act. A case of cheating will be filed because the photo was used. Also if morphing there is a possibility to file additional cases.

@run

4. If a fake profile is created..?


  Fake profiles are mostly created on Facebook and Twitter. But if this is done, a case will be filed under section 499. A case will also be filed under Section 66D of the IT Act. Most people think that no one knows what they are doing. But that is wrong. Because whatever anyone does on the internet is recorded. Police and cyber experts can easily track any wrongdoing by the victims if the victims report it.


They track the IP address of whatever phone or computer you use when you open the internet on it.


If the posts we make on social media are not offensive to others then you will have no problem.


Please be careful while posting comments.


Assuming that they are taking it lightly, if the suspects complain, the existing jobs will be lost and the bail will not come.


Even if you delete the post, a previous conversation with him/her is enough to book the case.👆😷

జాగ్రత్త తీసుకోండి..*

 *💥 సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు..!!*


ఐటీ ఆక్ట్ 2000ఐటీ ఆక్ట్ సెక్షన్ 66ఐపీసీ సెక్షన్ 292సెక్షన్ 354A 354D (నిర్భయ చట్టం) సెక్షన్ 499సెక్షన్ 66D ట్రోల్ చేసే వారి కోసం..


*1.* *ట్రోలింగ్* (ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం.వారి పేర్లు pics కి పెట్టడం).


*2.* *డిఫమేషన్* (ఆడపిల్లలు లేదా పెళ్లి అయిన వారి ని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం.. వారి కుటుంబ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం.. పరువు నష్టం కలిగించడం).


*3.* *స్టాకింగ్* (ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం, పోస్ట్లు పెట్టడం.)


ఈ పై 3 పనులకు పాల్పడిన వారు.. వారి స్నేహితులైనా.. సన్నిహితులైన.. బంధువులైనా… ఐటీ ఆక్ట్ 2000 ప్రకారం నేరస్థులు గా పరిగణింపబడుతారు.. 


ఐటీ ఆక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలాషన్ ఆఫ్ ప్రైవసీ కింద.. నిర్భయ చట్టం లోని సెక్షన్ 354A, 354D ప్రకారంహారాస్మెంట్ వయా ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం..


*1. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటో షేర్ చేస్తే..?*


ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని వీడియో, ఫొటో, టెక్ట్స్ ఏదైనా సరే షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.


*2. ఏదైనా మతాన్ని, వర్గాన్ని కించపరుస్తూ కామెంట్, పోస్ట్ పెడితే..?*


ఇలాంటి విషయాల్లో ఐటీ చట్టం కింద కేసు పెడతారు. దానితో పాటుగా మతానికి సంబంధించిన అంశం గనక అయితే 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కూడా కేసు పెడతారు.


*3. అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫొటో వాడితే..?*


అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని/ఆమె ఫొటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. అలాగే మార్ఫింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

@run

*4. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే..?*


 ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసు పెడతారు. చాలా మంది తాము ఏమేం చేస్తున్నా అది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు. అయితే అది తప్పు. ఎందుకంటే ఇంటర్నెట్‌లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్‌గా ఉంటుంది. ఎవరైనా ఏ తప్పు చేసినా దాన్ని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు, సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు.


ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్‌ను వారు ట్రాక్ చేస్తారు. 


సోషల్ మీడియాలో మనం పెట్టె పోస్టులు వేరేవర్ని భాదించనివి అయితే మీకు ప్రాబ్లం ఉండదు. 


*దయచేసి పోస్ట్స్ కామెంట్స్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి..* 


లైట్ గా తీసుకుంటున్నారులే అని అనుకోoడి, భాదితులు కంప్లైంట్ ఇస్తే ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది.


మీరు పోస్ట్ డిలీట్ చేసినా సరే అంతకుముందు అతను / ఆమెతో జరిగిన ఒక సంభాషణ చాలు కేసు బుక్ చెయ్యడానికి.

పరమాత్మ స్థితి...*

 *శుభోదయం*

🙏💐🙏💐🙏


*మనసు - క్షీర సాగరము* 


*అహంకారం - మందర పర్వతం..*


*విషయ వాసనలు - రాక్షసులు...*

 

*ఇంద్రియాలు - దేవతలు...*


*బంధం వాసుకి...* 


*భయము - హాలాహలం...*


మనసును మధించడం మొదలు పెడితే


*భయము అనే హాలాహలం బయటపడి, మనసును పవిత్రం చేస్తుంది..* 


ఆ తరువాత 


*విశ్వాసము, భక్తి, ప్రేమ, భూతదయ, కరుణ, క్షమ, తృప్తి ఒక్కొక్కటిగా బయటపడతాయి...*  


చివరిగా *ఆనందం అనే అమృత కలశం లభిస్తుంది...*


*అదే పరమాత్మ సాక్షాత్కారం..*


*ఆ చిదానందమే పరమాత్మ స్థితి...*


*ఆ స్థితిని పొందడమే మోక్షం...*


ఓం అరుణాచల శివ

🙏🙏🙏🙏🙏🙏

పుణ్యకర్మలు శాశ్వతం

 .

                  _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*శిక్షాక్షయం గచ్ఛతి కాలపర్యయాత్*

*సుబద్ధమూలా నిపతన్తి పాదపాః |*

*జలం జలస్థానగతం చశుష్యతి*

*హుతం చ దత్తం చ తథైవ తిష్ఠతి॥*

                             ~భాసమహాకవి.


తా|| కాలం అనేది గడుస్తూ వుంటే నేర్చుకున్న విద్యలన్నీ మరుపుచే మరుగున పడిపోతాయి. భూమి లోతుల్లోకి అతిదృఢంగా పాతుకుపోయిన మొదళ్లు ఉన్నా చెట్లు కూలిపోతాయి. చెరువుల్లోని నీరూ ఎండిపోతుంది. కానీ చేసిన యజ్ఞాలూ, దానాలూ మంచి పనులుగా, పుణ్యకర్మలుగా శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 82*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 82*


"ఇప్పుడు ఈత ఏమిటి ? దాని అమ్మమ్మ కూడా వచ్చేస్తుంది" అని చాణక్యుడు అంటుంటే అప్పటిదాకా నవ్వుని బిగబట్టుకున్న చంద్రగుప్తుడు పక్కున నవ్వేస్తూ "పాపం మన భటులు మీ శిష్యుడిని ఒడ్డుకి రానివ్వరేమో ? అర్ధరాత్రి నదిలో మునిగి ఏమైపోతాడో..." అంటుంటే చాణక్యుడు నవ్వి "ఆ భటులు కూడా నా శిష్యులే. ఏంచెయ్యాలో వాళ్ళకి సూచించాను" అని చెప్పాడు. 


"ఆ ! కావలివాళ్ళు కూడా మీ శిష్యులేనా ?" అని చంద్రుడు విస్తుబోతే.. 


చాణక్యుడు నవ్వి "మరి ...? ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియని స్థితిలో నీ రక్షణ ముక్కూ మొహం ఎరుగని వాళ్ళకి అప్పగిస్తానా ?" అని ఎదురు ప్రశ్నించాడు. 


చాణక్యుడు తన రక్షణ కోసం పడుతున్న శ్రమకి, తన పట్ల చూపిస్తున్న వాత్సల్యానికి చంద్రుని నేత్రాల్లో అశ్రుబిందువులు గిర్రున తిరిగాయి. 


అంతలో... "గురుదేవా ... ! గురుదేవా ....!" అంటూ నీళ్లు కారుతున్న దుస్తులలో సిద్ధార్థకుడు హడావిడిగా లోపలికి వచ్చి "ఆ రాక్షసామాత్యుడు మగధ సింహాసనం ఎక్కడానికి సర్వార్ధసిద్ధిని ఒప్పించాడు" అని చెప్పాడు. 


"సర్వార్తసిద్ది అంటే...?" అనుమానంగా ప్రశ్నించాడు చంద్రుడు. 


"నందుల తండ్రి మహాపద్మానందుడే... మీ తండ్రి మహానందుల వారిని అగ్ని ప్రమాదంలో తన కుమారులు అమానుషంగా కడతేర్చారని విని, జీవితం మీద వ్యామోహం నశించి సన్యాసం తీసుకుని సర్వార్ధ సిద్ధిగా తపస్సు చేసుకుంటున్నాడు" అని చెప్పి, శిష్యుని వైపు తిరిగి "అతనికి ఎంత లేదన్నా డెబ్బైయెళ్ళ  పైనే వుంటుంది వయస్సు.. ఆ వయస్సులో మళ్ళీ రాజ్యాధికారానికి ఒప్పుకున్నాడా ?" అడిగాడు చాణుక్యుడు. 


సిద్ధార్థకుడు నవ్వి "అతను ఒప్పుకోలేదు. రాక్షసుడే బ్రతిమాలి బామాలీ ఎలాగో ఒప్పించాడు. చాణక్య శపథాన్ని వమ్ము చెయ్యడమే తన లక్ష్యమన్నాడు. నందుల హత్యకి ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవితాశయం అని చెప్పి, ఏడ్చి, ఒప్పించాడు" అని చెప్పాడు. 


"పాపం... సర్వార్థ సిద్ధి .... మహానందుల వారికి చేసిన ద్రోహానికి ఫలితంగా, పాప పరిహారార్థం వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకుంటూ 'కృష్ణారామా' అనుకుంటూ పోవాల్సినవాడు ... ప్చ్... రాక్షస నామం జపిస్తూ పోతాడు కాబోలు..." అనుకున్నాడు చాణుక్యుడు జనాంతికంగా. 


ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు చంద్రుడు. అంతలో శార్జరవుడు తడి బట్టలతో హడావిడిగా వస్తూ "గురువుగారూ...! ఈత కొట్టడం వచ్చేసింది. ఇప్పుడు సముద్రాన్ని కూడా ఎదురీదగలను. చెప్పండి... ఆజ్ఞాపించండి. ఏం చెయ్యమంటారు..." అన్నాడు ఉత్సాహంగా. 


"ఆ తడి బట్టలు మార్చుకొని అఘోరించు. లేకపోతే జలుబు చేస్తుంది" అంటూ విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్లిపోయాడు చాణక్యుడు. 


"ఆ..... ! " అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు శార్జరవుడు.


మర్నాటి ఉదయం చాణక్య చంద్రగుప్తులు స్నానాధికాలు ముగించుకుని ఫలహారాలకి ఉపక్రమించబోతుండగా సేవకుడు ఒకడు వచ్చి "జయము, జయము.. చాణక్యులవారికి ! అమాత్యా రాక్షసుల వారు ఈ మధురఫలాలను చంద్రగుప్తుల వారికి ప్రత్యేకంగా పంపించారు. వారు త్వరలో దర్శనం చేసుకుంటామని చెప్పమన్నారు" అని మనవి చేసుకున్నాడు. 


చాణక్యుడు తలపంకించి "చంద్రగుప్తుల వారికోసం... ప్రత్యేకంగా ... సరే ..." అన్నాడు. సేవకుడు నమస్కరించి నిష్క్రమించాడు. చాణక్యుడు అలా కొన్ని పదాలు విడగొట్టి మాట్లాడడం వెనక ఏదో అంతరార్థం ఉందని భావించాడు చంద్రుడు. 


అంతలో మరో సేవకుడు ఫలాలతో వచ్చి "రాజమాత మురాదేవి చాణక్య చంద్రగుప్త కోసం పంపించారు" అంటూ వాటిని సమర్పించి నిష్క్రమించాడు. పక్కనే ఉన్న సిద్ధార్థకుడు ఆశ్చర్యంగా ఆ వింత చూస్తున్నాడు. 


చాణక్యుడు రెండు పళ్లేల్లో ఉన్న ఫలాలను గమనించాడు. ఒకే రకమైన మామిడి పళ్లు. పళ్ళములే తేడా. 


చాణక్యుడు తలెత్తి సిద్ధార్థకుని వైపు చూసి "అటువి యిటూ, యిటువి అటూ మార్చు" అని ఆజ్ఞాపించాడు. సిద్ధార్థకుడు పళ్లని మార్చి వేశాడు. ఇప్పుడు రాక్షసుడు పంపిన పళ్లెంలో మురాదేవి పంపిన ఫలాలు, మురాదేవి పంపిన పళ్లెంలో రాక్షసుడు పంపిన ఫలాలు తారుమారయ్యాయి. 


చాణక్యుడు అదోలా సిద్ధార్థకుని వైపు చూసి "ఏం చెయ్యాలో అర్థం అయిందా ?" అడిగాడు. సిద్దార్థకుడు నవ్వి తలూపి రాక్షసుడు పంపిన ఫలాలతో వెళ్ళిపోయాడు. 


"ఏమిటి ఇదంతా ?" అడిగాడు చంద్రుడు. 


చాణక్యుడు నవ్వి "ఏమిటో... కాసేపు ఆగితే తెలుస్తుంది..." అన్నాడు నర్మగర్భంగా. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:

 182వ రోజు: (జయ వారము) 06-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ముద్ద ముద్ద కలిపి ముద్దుగారెడునట్లు 

బోసినోటిలోన బువ్వ పెట్టు 

అమ్మమించునట్టి ఆరాధ్యులేలేరు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


పసిప్రాయములో ముద్దలు చేసి అన్నముతోపాటు ప్రేమ ఆప్యాయతలు అందజేసి మనకు మంచిచెడులను నేర్పిన అమ్మ కంటె వేరు దైవము లేరు ఇలలో నిత్య ఆరాధనకు. 

 

ఈ రోజు పదము. 

అశ్వ శాల: అశ్వకుటి, అశ్వఘోష్ఠము, తబేలా, మందడి, మందర, పాగా.

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 82*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 82*


"ఇప్పుడు ఈత ఏమిటి ? దాని అమ్మమ్మ కూడా వచ్చేస్తుంది" అని చాణక్యుడు అంటుంటే అప్పటిదాకా నవ్వుని బిగబట్టుకున్న చంద్రగుప్తుడు పక్కున నవ్వేస్తూ "పాపం మన భటులు మీ శిష్యుడిని ఒడ్డుకి రానివ్వరేమో ? అర్ధరాత్రి నదిలో మునిగి ఏమైపోతాడో..." అంటుంటే చాణక్యుడు నవ్వి "ఆ భటులు కూడా నా శిష్యులే. ఏంచెయ్యాలో వాళ్ళకి సూచించాను" అని చెప్పాడు. 


"ఆ ! కావలివాళ్ళు కూడా మీ శిష్యులేనా ?" అని చంద్రుడు విస్తుబోతే.. 


చాణక్యుడు నవ్వి "మరి ...? ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియని స్థితిలో నీ రక్షణ ముక్కూ మొహం ఎరుగని వాళ్ళకి అప్పగిస్తానా ?" అని ఎదురు ప్రశ్నించాడు. 


చాణక్యుడు తన రక్షణ కోసం పడుతున్న శ్రమకి, తన పట్ల చూపిస్తున్న వాత్సల్యానికి చంద్రుని నేత్రాల్లో అశ్రుబిందువులు గిర్రున తిరిగాయి. 


అంతలో... "గురుదేవా ... ! గురుదేవా ....!" అంటూ నీళ్లు కారుతున్న దుస్తులలో సిద్ధార్థకుడు హడావిడిగా లోపలికి వచ్చి "ఆ రాక్షసామాత్యుడు మగధ సింహాసనం ఎక్కడానికి సర్వార్ధసిద్ధిని ఒప్పించాడు" అని చెప్పాడు. 


"సర్వార్తసిద్ది అంటే...?" అనుమానంగా ప్రశ్నించాడు చంద్రుడు. 


"నందుల తండ్రి మహాపద్మానందుడే... మీ తండ్రి మహానందుల వారిని అగ్ని ప్రమాదంలో తన కుమారులు అమానుషంగా కడతేర్చారని విని, జీవితం మీద వ్యామోహం నశించి సన్యాసం తీసుకుని సర్వార్ధ సిద్ధిగా తపస్సు చేసుకుంటున్నాడు" అని చెప్పి, శిష్యుని వైపు తిరిగి "అతనికి ఎంత లేదన్నా డెబ్బైయెళ్ళ  పైనే వుంటుంది వయస్సు.. ఆ వయస్సులో మళ్ళీ రాజ్యాధికారానికి ఒప్పుకున్నాడా ?" అడిగాడు చాణుక్యుడు. 


సిద్ధార్థకుడు నవ్వి "అతను ఒప్పుకోలేదు. రాక్షసుడే బ్రతిమాలి బామాలీ ఎలాగో ఒప్పించాడు. చాణక్య శపథాన్ని వమ్ము చెయ్యడమే తన లక్ష్యమన్నాడు. నందుల హత్యకి ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవితాశయం అని చెప్పి, ఏడ్చి, ఒప్పించాడు" అని చెప్పాడు. 


"పాపం... సర్వార్థ సిద్ధి .... మహానందుల వారికి చేసిన ద్రోహానికి ఫలితంగా, పాప పరిహారార్థం వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకుంటూ 'కృష్ణారామా' అనుకుంటూ పోవాల్సినవాడు ... ప్చ్... రాక్షస నామం జపిస్తూ పోతాడు కాబోలు..." అనుకున్నాడు చాణుక్యుడు జనాంతికంగా. 


ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు చంద్రుడు. అంతలో శార్జరవుడు తడి బట్టలతో హడావిడిగా వస్తూ "గురువుగారూ...! ఈత కొట్టడం వచ్చేసింది. ఇప్పుడు సముద్రాన్ని కూడా ఎదురీదగలను. చెప్పండి... ఆజ్ఞాపించండి. ఏం చెయ్యమంటారు..." అన్నాడు ఉత్సాహంగా. 


"ఆ తడి బట్టలు మార్చుకొని అఘోరించు. లేకపోతే జలుబు చేస్తుంది" అంటూ విశ్రాంతి కోసం తన గదిలోకి వెళ్లిపోయాడు చాణక్యుడు. 


"ఆ..... ! " అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు శార్జరవుడు.


మర్నాటి ఉదయం చాణక్య చంద్రగుప్తులు స్నానాధికాలు ముగించుకుని ఫలహారాలకి ఉపక్రమించబోతుండగా సేవకుడు ఒకడు వచ్చి "జయము, జయము.. చాణక్యులవారికి ! అమాత్యా రాక్షసుల వారు ఈ మధురఫలాలను చంద్రగుప్తుల వారికి ప్రత్యేకంగా పంపించారు. వారు త్వరలో దర్శనం చేసుకుంటామని చెప్పమన్నారు" అని మనవి చేసుకున్నాడు. 


చాణక్యుడు తలపంకించి "చంద్రగుప్తుల వారికోసం... ప్రత్యేకంగా ... సరే ..." అన్నాడు. సేవకుడు నమస్కరించి నిష్క్రమించాడు. చాణక్యుడు అలా కొన్ని పదాలు విడగొట్టి మాట్లాడడం వెనక ఏదో అంతరార్థం ఉందని భావించాడు చంద్రుడు. 


అంతలో మరో సేవకుడు ఫలాలతో వచ్చి "రాజమాత మురాదేవి చాణక్య చంద్రగుప్త కోసం పంపించారు" అంటూ వాటిని సమర్పించి నిష్క్రమించాడు. పక్కనే ఉన్న సిద్ధార్థకుడు ఆశ్చర్యంగా ఆ వింత చూస్తున్నాడు. 


చాణక్యుడు రెండు పళ్లేల్లో ఉన్న ఫలాలను గమనించాడు. ఒకే రకమైన మామిడి పళ్లు. పళ్ళములే తేడా. 


చాణక్యుడు తలెత్తి సిద్ధార్థకుని వైపు చూసి "అటువి యిటూ, యిటువి అటూ మార్చు" అని ఆజ్ఞాపించాడు. సిద్ధార్థకుడు పళ్లని మార్చి వేశాడు. ఇప్పుడు రాక్షసుడు పంపిన పళ్లెంలో మురాదేవి పంపిన ఫలాలు, మురాదేవి పంపిన పళ్లెంలో రాక్షసుడు పంపిన ఫలాలు తారుమారయ్యాయి. 


చాణక్యుడు అదోలా సిద్ధార్థకుని వైపు చూసి "ఏం చెయ్యాలో అర్థం అయిందా ?" అడిగాడు. సిద్దార్థకుడు నవ్వి తలూపి రాక్షసుడు పంపిన ఫలాలతో వెళ్ళిపోయాడు. 


"ఏమిటి ఇదంతా ?" అడిగాడు చంద్రుడు. 


చాణక్యుడు నవ్వి "ఏమిటో... కాసేపు ఆగితే తెలుస్తుంది..." అన్నాడు నర్మగర్భంగా. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆలంకారిక చమత్కారం!

 ప్రాచీన కవుల ఆలంకారిక చమత్కారం!


చం.కినిసికుచాననాంగ రుచి గిన్నెలతో నెలతో లతోన్నతిన్


ఘన కచ కంఠ రూపము లు కందరమై దరమై రమైక్యమై


గొనబగు వాక్కటీక్షలటు కోయిలకో యిలకో లకోరికో


వనితనొసల్ వళుల్ నడుము బాలహరిన్ లహరిన్ హరిన్ నగున్.


అహల్య వర్ణన.

 క్రమాలంకారము.కుచాననాంగ రుచి గిన్నెలతో. గితొలగిన నెలతో, నె తొలగిన లతో.అవుతుంది.ఇదే విధముగా మిగిలిన పాదములలో (ఉపమలను) ఒకొక్క అక్షరము తొలగించిన అర్థములు వచ్చును. 

కఠిన పదములకు అర్థములు.కచ=వెంట్రుక లు (కురులు) కందరము=గుహ,(గుహలోపల గాడాంధకారము ఉంటుంది)దరము =శంఖము,రమైక్యమై =అందమైన,లకోరిక=బాణము,బాలహరి= బాల చంద్రుడు,లహరి=సముద్రపుఅలలు, హరి=సింహము.

భావము:--అహల్య స్తనములు గిన్నెల వలె,ముఖము చంద్రుని వలె,శరీరము నున్నగా (మృదువుగా) సన్నగాను,కురులు నల్లగా,మెడ సన్నని శంఖము వలె, రూపము మనోహరముగా,మాటలు కోయిల వలె, పిరుదులు పెద్దవి (భూగోళములవలె,)

చూపులు బాణములవలె,నొసలు బాల చంద్రునివలె,కడుపుమీది ముడతలు సముద్రపు అలలు వలె,నడుము సింహము వలెఉన్నది. అద్భుత వర్ణన.

రచన:--- సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు


అహల్యా సంక్రందనముకావ్యములోనిది.

సేకరణ:--పి.మోహన్ రెడ్డి.

విద్యాశంకర_దేవాలయం

 శుభోదయం🙏


విద్యాశంకర_దేవాలయం


సంస్కృతీ వైభవం!!


 ఇది అద్భుతాలలో అద్భుతం అని చెప్పొచ్చు. ఈ దేవాలయం 12 స్తంభాలతో ఉంటుంది. వాటి మీద సూర్యుడి శాసనాలు ఉంటాయి.


ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు పడగానే. అందులోని ప్రత్యేక స్థంభం దానికి సంబంధించిన నెలను, సంవత్సరాన్ని చూపిస్తుంది.


శ్రింగేరి పర్యాటకులు విద్యా శంకరులు కల దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ యాత్రా స్ధలం విద్యారణ్య స్వామి అనే రుషి చే విజయనగర రాజుల కాలంలో  1338లో నిర్మించబడింది. దేవాలయం ద్రవిడ, చాళుక్య, దక్షిణ భారత మరియు విజయనగర శిల్ప శైలులు ప్రదర్శిస్తుంది. దీనిపై అనేక శిలా శాసనాలు విజయనగర రాజ్యానికి సంబంధించి చూడవచ్చు. నలుచదరం కల ఈ దేవాలయానకి 12 స్తంభాలు కలవు. ఇవి 12 రాసులను తెలుపుతాయి.


 లోపలి భాగంలో దుర్గామాత, విద్యా గణేశ విగ్రహాలుంటాయి. విగ్రహాలే కాకబ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర దేవతలు కూడా అందమైన విగ్రహాలుగా రూపొందించబడ్డాయి. దేవాలయంలోని సీలింగ్ అందమైన శిల్ప చెక్కడాలు ప్రదర్శిస్తుంది. దేవాలయ గోడల కింది భాగంలో అందమైన శివ, విష్ణు, దశావతారాలు, షణ్ముఖ,  మాత కాళి,  వివిధ రకాల జంతువులు ఉంటాయి. ఈ దేవాలయంలో కార్తీక శుక్ల పక్షంలో జరిగే విద్యాతీర్ధ రధోత్సవం ప్రసిద్ధి గాంచిన వేడుక...🙏🙏🙏

ధర్మసూక్ష్మాలు

 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు.


అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. 


"ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.

'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. 


అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.


అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది.  ఇదేనా!! ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా, సన్యాసి అతనికొక సూది ఇచ్చి  ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.


ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. 


ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. 


ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. 


ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు.


 ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.

గుమాస్తా చదవడం ప్రారంభించాడు.


1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!

2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 

3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?


అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయాడు. 


సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.


1వ వాడు: అన్నదాతా సుఖీభవ!

2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.

3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు వారి బిడ్డలు అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.


దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.

కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. 

ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.


*సర్వే జనా సుఖినోభవంతు*

⚜ *శ్రీ #వీరభద్రస్వామి ఆలయం*

 ⚜ *అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి*


⚜ *శ్రీ #వీరభద్రస్వామి ఆలయం*


💠 వీరభద్రస్వామి ఉగ్రరూపుడై కాకుండా... ప్రశాంతమైన రూపంలో దేవతలకే జ్ఞానభిక్ష పెట్టగల దక్షిణామూర్తి రూపంలో వెలసిన క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటి.


💠 వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయాలకి మూలవిరాట్‌గా పేర్కొంటుంటారు.

 

⚜ స్థల పురాణం ⚜


💠 దక్షప్రజాపతి  శివద్వేశంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు.తన భర్త మాటమీరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దేవతలందరి సమక్షంలో ఆత్మాహుతి గావించుకుంది. 

అది తెలిసిన మహోగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరికి నేలకు విసిరితే  ప్రళయ భీకరాకర వీరభద్రుడు ఉద్భవించి రుద్రగణ సహితుడైన యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు. 


💠 ధక్షుని శిరస్సును తన ఖడ్గంతో ఖండించి అగ్నికి ఆహుతి ఇచ్చారు. వీరభద్రుడు సృష్టించిన బీభత్సానికి శివుడు సంతోషించారు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకుని వీరులకు వీరేశ్వరుడువై వర్ధిల్లుగాక అని దీవించాడు.


💠 దక్ష యజ్ఞం విధ్వంసం జరిగాక దేవతలలో పశ్చాత్తాపం కలిగి శివుడిని జ్ఞానభిక్ష పెట్టమని 'అప్పుడు శంకరుడు వీరభద్రుణ్ని పిలిచి వారి కోరిక తీర్చమని ఆదేశించాడట.

దాంతో రుద్రాంశ సంభూతుడైన వీరభద్రుడి ఉగ్రం తగ్గింది. 

తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని పరమశివుని అవతారమైన దక్షిణామూర్తి రూపంలో రామేశ్వర, శ్రీశైల క్షేత్రాల నడుమ రాయచోటి ప్రాంతంలో వీరేశ్వరుడుగా వెలసి దేవతలకు జ్ఞానభిక్ష పెట్టి అవతార పరిసమాప్తి గావించాడని స్థలపురాణం. 


💠 తన కర్తవ్యం ముగియగానే భూలోకంలో పరమేశ్వరుడి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ చిట్టచివరకు మాండవ్య మహాముని తపోబలంతో పునీతమైన మాండవ్యనదీ తీరాన భద్రకాళీ సమేతుడై అర్చా విగ్రహమూర్తిగా అవతార సమాప్తి పొందాడు. 

అందుకే వీరభద్రస్వామి ఆలయాలన్నింటిలో ఈ దివ్యక్షేత్రం మూలస్థానమై ప్రసిద్ధి చెందింది. 


💠 రాజాధి రాజులెందరో విడిది చేసి తమ వీరఖడ్గాలను అర్పించి, నిత్యం రాజోపచారాలను చేసిన ఈ వీరభద్రస్వామి రాచరాయుడిగా పేరు పొందాడు. 

ఈ కారణంగానే, రాచరాయుడి నివాసమైన ఈ ప్రాంతం ‘రాచవీడు’గా పేరు పొంది కాలక్రమేణా ‘రాయచోటి’గా మారింది.


💠 ఆలయంలో స్వామి మూల విరాట్టుకు మీసాలూ, కోరలూ ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహానికి అలంకారంగా మాత్రమే వెండి మీసాన్ని పెడతారు. గర్భగుడిలో స్వామితో పాటు వీరేశుడనే పేరుతో శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. 

ముఖ మండపం లోపల రెండు నందులు ఉంటాయి. పెద్దనందిని ‘శివనంది’ అనీ, చిన్నదాన్ని ‘వీరనంది’ అనీ పిలుస్తారు. 


💠 ఈ క్షేత్రంలో వీరేశ్వరుడికి పూర్వమే గ్రామ దేవతగా వెలసిన మాండవీ మాత (ఎల్లమ్మ)కు ప్రథమ పూజ తరువాత వీరేశలింగ పూజ, అనంతరం వీరభద్రుడి పూజ చేయడం ఆచారంగా వస్తోంది.


💠 ఆలయంలో ద్వారపాలకులైన నందికేశ్వర, మహాకాళేశ్వరులతో పాటు సూర్యభగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు, కాలభైరవులు కొలువయ్యారు.


💠 ఏటా మాఘ బహుళ దశమి లేదా ఏకాదశి నుంచి 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల వేళ మహానైవేద్య (అన్నకూటోత్సవం) ఘట్టం నిర్వహిస్తారు. రోజుకు 5 పావుల చొప్పున 365 రోజులకు లెక్కించి నైవేద్యం తయారు చేసి రాసిపోస్తారు. 

ఆలయ నిర్మాణంలో నైపుణ్యతను,

ఆలయాన్ని దోచుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు వడియరాజులు అడ్డుకున్నట్లు చెబుతారు. అందుకే నేటికీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. 


💠 బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి బంగారంతో చేసిన మూడో నేత్రాన్ని అలంకరిస్తారు. అప్పుడు స్వామికి నైవేద్యంగా పెట్టేందుకు అన్నం, గారెలూ, బూరెలూ పెద్ద రాశిగా పోస్తారు. తర్వాత స్వామివారి మూడో నేత్ర దృష్టి ప్రసాదంపై పడి ఆరగించిన వెంటనే కుప్పగా ఉన్న అన్నప్రసాదం పలుచబడి మెత్తగా తయారవుతుంది. 

డప్పు వాయిద్యాలతో వచ్చే వడియరాజులు

ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ముందుగా ఆ ప్రసాదాన్ని కొంత తీసుకుని మరో ద్వారం గుండా వెళ్లిపోతారు. తర్వాతే మిగతా భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ తంతు తిలకించడానికి లక్షల్లో జనం హాజరవుతారు. 

 

💠 బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి నెలలో 26 నుండి 31వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చాతుర్యానికి అది నిదర్శనమని చెప్పవచ్చు.


💠 ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటారు.


💠 కడప నుంచి 50 కిమీ దూరం


🙏 జై వాసవి 🙏

తల్లి తండ్రుల గురించి

 


తల్లి తండ్రుల గురించి ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది.*


*(1) ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.*


*(2) ఆకాశము కన్నా ఉన్నతుడు జన్మనిచ్చిన తండ్రి.*


*(3) ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.*


*(4) సత్యం తల్లి - జ్ఞానం తండ్రి.* 


*(5) పదిమంది ఉపాధ్యాయులు కన్నా ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది మనకి  జన్మనిచ్చిన తల్లి.*


*(6) తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.*


*(7) ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునకమాంసము కన్నా హీనం.*


*(8) ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.*


*(9) తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది.*


*(10) ఈ లోకంలో తల్లిని మించిన దైవం లేదు,లేదు.*


 పదిహేనేళ్ళ తరువాత 


అప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయం. సూర్యతాపం వల్ల ఎక్కడచూసినా విపరీతమైన వేడి. బెంగాల్ నుండి ఒక ముసలాయన వచ్చాడు. రావడం రావడంతోనే “పెరియవ ఎక్కడున్నారు?” అని కఠినంగా అడుగుతున్నాడు. 


మఠంలోని శిష్యులొకరు, “సాయింత్రం పరమాచార్య స్వామి దర్శనం చేసుకోవచ్చు” అని చెప్పారు. ఆ ముసలాయన సాక్షాత్ దూర్వాసో మహర్షి అవతారం లాగా ఉన్నాడు. 


“ఏంటి? సాయింకాలం రావాలా? నన్ను రమ్మని పిలిచి ఎక్కడికి వెళ్ళారు? వారికిష్టమైనప్పుడే రమ్మను. నేను వెళ్ళిపోతున్నాను” అని చెప్పి రైల్వేస్టేషను వైపు వెళ్తున్నాడు. 


ఇదంతా చూసి శిష్యుడికి చాలా కోపం వచ్చింది. ఆ ముసలాడితో, “ఏమిటి? ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నావు? ఎవరు రమ్మన్నారు నిన్ను అసలు? నువ్వు నీ అవతారం. కాషాయం, నెరిసిన గడ్డం, జడలు కట్టిన జుట్టుతో సాధువులాగా వేషం కట్టి, ఇలా అరవడం ఏమి బాగోలేదు” అని చెప్తుండగా పరమాచార్య స్వామివారు చెరుకు పంటపొలంలో కనిపించారు. ఆ శిష్యుడు వెంటనే స్వామి వద్దకు పరిగెత్తాడు. 


దాదాపు గంట పాటు ఆ బెంగాల్ సాధువు స్వామివారు మాట్లాడుకున్నారు. తరువాత ఆఅ సాధువుకి కొంత ఆహారం కొనిపెట్టి రైల్వేస్టేషనులో వదిలిపెట్టవలసిందిగా ఆదేశించారు. ఆ శిష్యుడు స్వామివారు చెప్పినట్టు చేసి తిరిగొచ్చారు. 


అతణ్ణి చూసి మహాస్వామివారు, “నేను కాశీయాత్రకు వెళ్ళినప్పుడు మేము బెంగాల్ మిడ్నాపూర్ మీదుగా తిరిగొస్తున్నాము. అప్పుడు ఈ సాధువు మా వద్దనే కొద్ది రోజులు ఉన్నాడు. అతను ఒక యోగ పురుషుడు; సిద్ధుడు, కాని అందరిలాగే తన కోపాన్ని నిగ్రహించుకోలేడు” 


వెళ్తుండగా మరలా నా దర్శనం ఎప్పుడు అని అడిగాడు. పదిహేనేళ్ళ తరువాత దక్షిణ భారతంలో నన్ను నువ్వు కలుస్తావు అని చెప్పాను. భరతుడు ఎలాగైతే రాముడి కోసం ఎదురుచూసాడో అలాగే ఈ సాధువు కూడా ఇన్నేళ్ళు రోజులు లెక్కపెట్టుకుంటూ సరిగ్గా పదిహేనేళ్ళకి వచ్చాడు నన్ను వెతుక్కుంటూ. 


--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాదాకా మేలుకో -3 బాటసారులు

సాదాకా మేలుకో -3

 బాటసారులు 

ఒక ప్రదేశంలో ఒక చక్కటి శాఖలు కలిగిన వటవృక్షం కనపడితే వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాటసారులు ఎండలో నడిచి అలసి ఉన్నందున కొంత తడవు విశ్రాంతి తీసుకొని మరల ప్రయాణం చేద్దామని ఆ చెట్టుక్రిందకు వచ్చారట. అక్కడకు వచ్చిన వారికి ఒకరిగురించి ఇంకొకరికి ఇంతకు ముందు తెలియదు విశ్రాంతి తీసుకుంటూ ఒకరి గురించి ఇంకొకరు పరిచయం చేసుకున్నారు. ఒకరి వద్ద తెచ్చుకున్న త్రాగే నీరు ఇంకొకరు అలాగే ఒకరి వద్ద వున్న భోజనము ఇంకొకరు ఎంతో ఆప్యాయంగా పంచుకొని  భుజించారట. నిజానికి వారిలో ఏ ఒక్కరు కూడా ఇంకొక్కరికి ఏమి కారు  వారి అందరి సమిష్టి అవసరం ఎండలో కొంత తడువు వృక్ష ఛాయలో విశ్రాంతి తీసుకోవటమే. ఒక్కొక్కరు ఇంకొక్కరి గురించి తెలుసుకొని పిచ్చాపాటిగా సంభాషణలు చేసుకొన్నారు. కొంత ఎండ తీవ్రత తగ్గగానే ఒకరి వెంట ఇంకొకరు బయలు దేరి ఆ చెట్టును వదిలి తమ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తక్కువ అలసట చెందిన వారు ముందుగా కొంచం ఎక్కువగా అలసట చెందినవారు మరికొంత సమయం తరువాత ఆ చెట్టు నీడను వదిలి పయనమయ్యారు. సాయంత్రం అయ్యేసరికి ఒకరితరువాట్ ఒకరుగా చెట్టును వదిలి వెళ్లారు. ఆ తరువాత ఒక బాటసారికి ఇంకొక బాటసారి  కలవడు. అదే విధంగా ఒక బాటసారి ఇంకొక బాటసారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండడు.  వారి స్నేహం కేవలం కొద్ది సమయం మాత్రమే. 

ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ఈ భూమి మీద మన పయనం కూడా ఒక బాటసారి పయనానికన్నా ఏమి భిన్నంగా లేదు. కానీ మనం ఇదే శాశ్వితం అనుకోని ఇక్కడే మనం సదా ఉంటామని అనుకోని మనం జీవనాన్ని గడుపుతుంటాము.  నిజానికి ఈ చెరా చెర జగత్తులో ఏది ఎవిరిది కాదు ఏది శాశ్వితం కాదు.  శాశ్వితం అయినది చేరుకోవలసినది అయినది కేవలం అంటే కేవలం బ్రహ్మ పధం మాత్రమే.  కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ఈ క్షణం నుంచె మన సాధనను మొదలు పెట్టి మన దృష్టిని నిత్యమైనది, సత్యమైనది, శాశ్వితమైనది అయిన ఆ బ్రహ్మ పదాన్ని చేరటానికి సదా ప్రయత్నించాలి. 

నేను గృహస్తును నాకు అనేక బంధాలు, బాధ్యతలు వున్నాయి అనే భ్రాంతిలో ఉండకండి.  నిజానికి నీవు బంధాలు అనుకునేవి ఏవి బంధాలు కావు.  నీవు బాధ్యతలు అనుకునేవి కూడా నీ బాధ్యతలు కావు కేవలం అవన్నీ నీవు నీయంతటఁ కలిపించుకున్నవి మాత్రమే వాటన్నిటిని ఒక్కసారి చూడు తప్పకుండ అవి నీ కన్నా బిన్నంగా గోచరిస్తాయి. నిజానికి నీవు అనుకునే ప్రతి బంధము, బాధ్యత నీ దేహంతోటే ముడిపడి వుంది నీవు ఎంతవరకు నీ దేహమే నీవు అనుకుంటావో అంతవరకూ నీవు వాటినుండి విడి వడలేవు. సాధక మేలుకో నీవు దేహానివి కావు దేహంలో నిగూఢంగా నిక్షిప్తమై వున్న  దేహివి. ఈ విషయం తెలుసుకున్న నీకు ఈ దేహం కేవలం ఒక ఉపకరణం లాగ మాత్రమే గోచరించి ఈ దేహంతో నీవు సాధించాలిసిన నీ కర్తవ్యం నీకు గోచరిస్తుంది. అప్పుడు నీకు నీ బంధాలలో వేటిలో నీవు లేవనే సత్యం గోచరిస్తుంది. అప్పుడు  వేటిలోను నీవు కర్త్రుత్వం తీసుకోకుండా అన్ని కర్మలు నెరవేర్చగలుగుతావు.  కేవలం నీ కర్తవ్యం మోక్షపడాన్ని చేరటమే అని సదా తలుస్తావు. ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పటినుండే నీ సాధనను మొదలిడి శాశ్వితమైన బ్రహ్మపదాన్ని చేరే జిగ్న్యాసివిగా మారిపో.  

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు భార్గవ శర్మ