30, జనవరి 2023, సోమవారం

ప్రతిరోజూ పరీక్షయే

 ప్రతిరోజూ పరీక్షయే 

విద్యార్థి దశలో వున్నప్పుడు ప్రతి విద్యార్థికి ప్రధాన పరీక్షలు సంవత్సరానికి ఒక సారి మాత్రమే వస్తాయి.  తెలివయిన విద్యార్థులు పరీక్షలకు ముందు రెండు మూడు నెలల నుండి ఏకాగ్రతతో, కష్టపడి చదివి పరీక్షలలో ఉతీర్ణత సాధించవచ్చు. కొంతమంది చివరి నిమిషం వరకు చదవకుండా వుండి రేపు పరీక్ష అన్నప్పుడు యేవో చిన్న గైడుపుస్తకాలు కొనుక్కొని చదివి పరీక్ష వ్రాస్తారు. ఇదొక పద్దతి. విద్యార్థి చురుకైనావాడు, తెలివయిన వాడు సుక్మాగ్రహి అయితే ఆలా చేసికుడా పరీక్షలు ఉతీర్ణత  సాధించవచ్చు. కానీ దీక్షగా చదివిన విద్యార్థి సాదించినన్ని గణములు పొందకపోవచ్చు. ఆలా కాకుండా రోజు పరీక్ష అయితే అప్పుడు విద్యార్థులు చక్కగా ఏ రోజు పాఠం ఆ రోజే చదివి అవగాహన  పొందవచ్చు. కానీ ఎప్పటికి ఆలా ఉండదు. 

మోక్షార్ధి అయిన సాధకుని జీవితం చాలా కఠినమైనది నిజానికి సాధనకు అనేక విధాలా అవరోధాలు కలుగుతాయి. అయినా వాటినన్నిటిని తానూ ఓర్పుతో, పట్టుదలతో, నిరంతర కృషితో అధిగమించి అను క్షణం భగవంతుని ధ్యాసలో గడిపి తన సాధనను సాగిస్తాడు. సాధకునికి వచ్చే ఆవరమోదాలు  ఏమిటో చూద్దాము. 

1) ఆద్యాత్మికం: అంటే సాధకుని శరీరం సాధనకు సహకరించక పోవటం అందులో మొదటిది 

తామాస ప్రవ్రుత్తి : తామాస ప్రవ్రుత్తి సాధారణంగా ప్రతి సాధకునికి ప్రారంభంలో ఎదురయ్యే ప్రధాన  అవరోధం.  నీవు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో లేచి సాధన చేద్దామనుకుంటావు. గడియారంలో అలారం పెట్టుకొని నిద్రించావు అలారం మోగింది కానీ నీవు తెల్లవారుజామున 4గంటల సమయంలో మంచి నిద్రలో వున్నావు కాబట్టి నిద్రాభంగం అయినట్లుగా భావించి అలారం నొక్కి మరల పడుకుంటావు. తెల్లవారిన తరువాత ఏ 6 లేక్ 7 గంటలకు మెలకువ వచ్చింది కానీ ప్రయోజనం ఏముంది ఊరు మొత్తం మేలుకుంది నీకు సాధన చేయటం కుదరలేదు.  అంటే ఒక రోజు నీ సాధనకు భంగం కలిగినట్లే కదా 

రాత్రి భోజనం : సాధకుడు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలో కృష్ణ భగవానుడు చెప్నట్లుగా  రాత్రి భోజనం విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మితాహారం, సాత్విక ఆహరం తీసుకోవాలి.  సాత్విక ఆహరం అంటే ఏమిటి శాఖాహారమా అని చాలా మంది అడుగుతారు.  నిజానికి సాత్విక ఆహరం అంటే శాఖాహారం అనికాదు అది ఏమిటంటే తక్కువగా ఉప్పు, కారం వుండి  ఎటువంటి మసాలాలు లేకుండా వున్నటువంటిది ఇంకొక మాట చెప్పాలంటే త్వరగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. కృష్ణ భగవానుడు ఒక్క మాటలో పూర్తి వివరణ ఇచ్చారు. అదేమిటంటే ఆహరం తీసుకున్న వెంటనే దాహం కాకూడదు. ఉదాహరణకు నీవు నూనెతో కూడిన పదార్ధం అంటే పూరీలు తిన్నావనుకో నీ దృష్టిలో పూరీలు పూర్తిగా శాకాహాహారమే కానీ అవి తిన్న వెంటనే దాహం అవుతుంది అంటే అవి శాకాహారంమే  కానీ సాత్విక్ ఆహరం కాదు. నూనెతో చేసిన ఆహారం జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది.  అలాగే మాసాలతో చేసిన పదార్ధాలు కూడా త్వరగా జీర్ణం కావు. సాధకుడు కొంత సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు ఏ పదార్ధం తినాలో, ఏ పదార్ధం తినకూడదో తన మనసుకు తనకే తెలుస్తుంది. అదే విధంగా ఎంతపరిమాణంలో ఆహరం తీసుకోవాలో కూడా అవగాహనకు వస్తుంది.  పదార్ధం చాలా రుచికరంగా ఉన్నాకూడా మితి మీరు ఎట్టి పరిస్థితిలో సాధకుడు భుజించడు.

తొందరగా పడుకోవటం: సాధకుడు రాత్రిపూట సాధ్యమైనంత వరకు తొందరగా నిద్రకు  ఉపక్రమించాలి. రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం వలన తొందరగా లేవలేడు .ప్రతి మనిషి తన వయస్సు ప్రకారం కొన్ని గంటల నిద్ర అవసరం అని శాస్త్రం చెపుతుంది.  కాబట్టి తొందరగా నిద్రిస్తే సాధకుడు తొందరగా నిద్రనుంచి లేవగలుగుతాడు.

ఆరోగ్య పరిరక్షణ: సాధకుడు శరీరం మీద మమకారం వహించకూడదు కానీ శ్రర్ధ వహించాలి ఈ రెండిటికి  చిన్న తేడా వున్నది శరీరపు మమకారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం మీద మోజు అంటే ప్రతివారు వారి శరీరం సమాజంలో అందంగా కనపడాలి అని అనుకోవటం మమకారం అప్పుడు వెంట్రుకలకు రంగు వేయటం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు రాసు కోవటం విలువైన ఆభరణాలు ధరించటం లాంటి పనులు చేయటం అనేది శరీర మమకారం. అదే శరీర శ్రర్ధ అంటే ప్రాతఃకాలంలో నిద్రలేచి దంతధావన చేసి పరిశుభ్రంగా చన్నీటి స్నానం చేయటం, ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించటం. సాత్విక ఆహారం సమయానుకూలంగా భుజించటం, మిత భాషణం, ధార్మిక జీవనం చేయటం. ఇత్యాదివన్నీ శరీరపు శ్రర్ధగా పేర్కొన వచ్చు. 

తామరాకు మీద నీటి బొట్టు: తామరాకు మీద నీటి బొట్టు:లాగ కుటుంబ సంబంధాలు కలిగి  ఉండటం. ఇది ఆధ్యాత్మిక జగతిలో తరచుగా వినపడే ఉపమానం. తామరాకు మీద నీటి బొట్టు ఉన్నాకూడా అది తామరాకుకు అంటుకొని ఉండదు కేవలం దాని అస్తిత్వం దానిది తామరాకు అస్తిత్వం దానిది. సాధకుడు సంసారాన్ని నిర్వహిస్తున్నా కూడా కుటుంబ బండలను కేవలం యాదృచ్చికంగా తీసుకొని బాధ్యతలను నెరవేయాలి కానీ బంధాలను మనస్సుకు తీసుకొని బాధపడటం ఆనందపడటం చేయకూడదు. నీవు నీ మిత్రుడు కలసి వీధిలో వెళుతున్నావు అక్కడ ఒక బాలుడు స్కూటరు నడపటం చాటగాక క్రిందపడి దెబ్బలు తాకించుకున్నాడు. చూసినవారు అందరు వాడి తల్లిదండ్రులని అనాలి ఇంత చిన్న పిల్లవానికి స్కూటరు ఇస్తారా వాళ్లకు బుద్ధిలేకపోతే సరి అని ఆనుతున్నారు.  నీవు కూడా వాళ్లలాగే అని నీ మిత్రుని పోనీయరా నీ బండిని ఇటువంటివి రోజు అనేకం జరుగుతుంటాయి వీటిని చూస్తూ మనం కాలయాపన ఎందుకు చేయాలి అని నీ మిత్రుని మోటారు సైకిల్ నడపటానికి ప్రేరేపిస్తావు.  అంతలో ఆ గుంపులోంచి నీకు తెలిసిన ఒకడు వచ్చి పరంధామయ్యగారు ఆ స్కూటరు మీదినించి పడింది మీ పిల్లవాడే అని చెపితే అప్పుడు నీ లోంచి తండ్రి ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చి అమాంతం మోటారుసైకిల్ దిగి వెంటనే నీ కొడుకు వద్దకు వెళతావు. అదే బంధం అంటే అదే ఆ పడినాబాలుడు పరాయి వాడు అంటే బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించావు. ఇలా ప్రతి వక్కటి మనసుకు పెనవేసుకొని ఉంటుంది. కోటిలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా ఇలానే వుంటారు. ఆ ఒక్కరు ప్రస్తుతం మనకు మన సభ్యసమాజంలో ఉండకుండా హిమాలయాలలోనో, లేక ఇతర పర్వతాలమీదో తపస్సు చేసుకున్తున్నారు. 

గృహస్ట జీవనం చేస్తున్న మనం పర్వతాలలో తపస్సు చేసుకునే యోగులంతగా మన మనస్సును నియంత్రించలేము.  కానీ ప్రయత్నించటం మన ధర్మం.  ఆపైన భగవదానుగ్రహం. కాబట్టి తామరాకు మీద నీటి బిందువులాగా ఉండటం అనేది  చెప్పినంత సులువు కాదు అనంతమైన కృషితో మాత్రమే సాధ్యం. అయినా సాధకుడు ప్రయత్నం చేయాలి. 

వస్తు వ్యామోహం: సాధకుడు వస్తువ్యామోహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫలానా వాహనం కావలి, స్నానానికి చక్కటి వేడినీళ్లు ఉండాలి, ఆహారంలో ఫలానా కూర మాత్రమే ఉండాలి. అలాగే నాకు ఖరీదైన దుస్తులు, వస్తువులు గృహాలు వుండాలనె  వ్యామోహం పెంచుకోకూడదు. సాధన బలపడితే సాధకునికి ప్రకృతి పూర్తిగా సహకరిస్తుంది.  ఉదాహరణకు నీకు చలి అంటే చాలా బాధాకరం. నీవు చలిని తట్టుకోవాలేవు.  కానీ నీలో సాధన బలపడుతుంటే నీకు తెలియకుండానే యెంత చలి వున్నా కూడా నీవు నిర్బయంతరంగా నిర్విరామంగా సాధన చేయగలుగుతావు. 

భయం: భయం అనేది కూడా సాధకునికి కలిగే ఒక అవరోధంగా మాన్యులు చెపుతారు. నేను వంటరిగా ఉండి సాధన చేయలేను. నాకు భయం అని కొంతమంది సాధకులు ఆశ్రమాలకు, బాబాలదగ్గరకు వెళ్లి సామూహిక సాధనలో కూర్చుంటారు.  నిజానికి కొన్ని రోజులు అంటే సాధనలో పట్టు లభించేవరకు అలా చేస్తే పరవాలేదు కానీ అటువంటి జీవనానికి అస్సలు అలవాటు పడకూడదు.  సాధకుని సాధన కేవలం ఒంటరిగానే చేయాలి. ఇతరులతో సంబంధం పెట్టుకోకూడదు.  ఇంకొక విషయం సాధనలో కొంత ముందుకు వెళ్లిన తరువాత సాధకునికి కొన్ని అతిన్ద్రియ శక్తులు వస్తాయి.  వాటిని తాను గమనించి కూడా గమనించకుండా ఉండి సాధనను కొనసాగించాలి. సంపూర్ణంగా సాధనలో సమాధి స్థితి వచ్చినప్పుడు సాధకుడు అనన్య ఆనందాన్ని పొందగలడు. శరీరానికి సంబంధించి ఈ నియమాలు తీసుకుంటే సాధకుడు మొదటి అవాంతరాన్ని అధిరోహించినట్లే.  కానీ మరల చెపుతున్నా ఆచరించటం చాలా కష్టం. 

ఇక రెండవది ఆధిభౌతికం: సాధకునికి బయటి ప్రపంచంనుండి ఎదురయ్యే సమస్యలు. సాధకుడు అతి కష్టంగా తెల్లవారుఝామునే లేచి సాధన మొదలు పెడితే ప్రక్కనే వున్న దేవాలయంలో పూజారిగారు ధనుర్మాస పూజ అని అదే సమయంలో చక్కగా అర్చన చేస్తున్నారు. మీకు మైకు శబ్దంతో సాదన కుదరటం  లేదు. నీవు వెళ్లి దేవాలయంలోని పూజారిగారిని మైకుపెట్ట వద్దని చెప్పలేవు.  ఆలా అంటే నీకు భక్తి లేదా నీవు హిందువు కాదా అని నిన్ను ప్రశ్నిస్తారు.  అక్కడ దేవాలయంలో వున్న ఇతరప్రజలు కూడా నీ మీద అదోలా చూసి ఈ రోజుల్లో పూజలు చేయరు, చేస్తుంటే అడ్డగిస్తున్నారు నాస్తికత్వం బాగా పెరుగుతున్నది అని నీ మీద పరిహాసాలు చేయట తథ్యం. తెల్ల మొహం వేసుకొని వెనుతిరిగి రావటం మినహా ఏమి చేయలేవు.  ఈ రోజుల్లో ఇతర మతస్తుల మైకులు కూడా ఎక్కువ అయ్యాయి.  వారిని నీవు అస్సలు అడగలేవు. ఇది ఒకరకం ఐతే ఇక ఏ మైకులేదు నీవు ప్రశాంతంగా సాధన చేసుకుంటూవున్నావు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఒక వీధి కుక్క మొరుగుతుంది అంతే కుక్కలన్ని ఒక్కసారిగా ఒకదానిమీద ఒకటి పది పెద్దగా అరుస్తుంటాయి. వాటిని నీవు ఆపలేవు. ఇక నీ సాధన ఆ రోజు సాగాదు . ఇక పొతే ఈ రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో వివాహాలలో ఫంక్షన్ హాలులో రికార్డులు రాత్రి అని లేక పగలు అని లేక  వేస్తున్నారు. ఆ శబ్దాలు యెంతగా వుంటున్నాయంటే గుండె మీద కొట్టినట్లుగా ఉంటున్నాయి.  నీవు వారితో పోరాడ లేవు.  అధవా పొలిసు స్టేషనుకు వెళ్లి ఫిరియాదు చేసినా పోలీసువారు కూడా నిన్నే నిందించి పంపుతారు. ఈ రకంగా అనేక విధాలుగా అధిభౌతిక అవాంతరాలు వస్తూవుంటాయి. వాటిని సాధకుడు అత్యంత తెలివి తేటలతో దాటాలి. సాధకుడు సదా సాత్విక్ ప్రవృత్తిని కలిగి ఉండాలి, ఎట్టిపరిస్థితుల్లోనూ, రాజస, థామస్ ప్రవృత్తిని దరి చేరనీయకూడదు. ఇది చాలా కాలం అభ్యసిస్తేనే లభిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది రాజసప్రవృత్తిలో, థామస ప్రవృత్తిలో వుంటారు.  వారి మధ్యన వుంటూ సాత్వికంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది.  కానీ సాధకుడు భగవంతుని మీద భారం వేసి ప్రయత్నించాలి.

అది దైవికం: అనగా ప్రకృతి అవాంతరాలు, వర్షాలు కురవటం, భూకంపాలు రావటం, పెనుగాలులు వీయటం ఇత్యాదివన్నీ ఈ కోవకు వస్తాయి.  నీవు సాధనకు కూర్చున్నావు చక్కగా ఫాను వేసుకొని ఫాను క్రింద నీ సాధన మొదలు పెట్టావు.  నీ చుట్టుప్రక్కల ఎటువంటి అవరోధాలు లేవు. కానీ నీకు ఎంతో దూరంలో పెనుగాలులు వీచాయి నీకు ఆ విషయంకూడా తెలియదు.  కానీ దాని పర్యవసానంగా అక్కడ విద్యుతు స్తంబాలు పడిపోయాయి. దానితో నీకు విద్యుత్ సరఫరా నిలిచి నీ ఫాను తిరగటం లేదు. అది నీకు సాధన భంగాన్ని కలుగ చేసింది. ఇటువంటి అనేక ప్రత్యక్ష, పరోక్ష అవరోధాలు అనేకం సాధకునికి ఎదురుపడుతాయి. ఏ సమయంలో ఏరకంగా అవరోధం కలుగుతుందో సాధకుడు ఉహించలేడు.  సాధకుడు ఒక దృఢ సంకల్పం చేయాలి ఎటువంటి అవరోధాలు ఏర్పడ్డాకూడా తన సాధనను మధ్యలో ముగించనని తలంచి. సాధనంకు ఉపక్రమించాలి.  అప్పుడే సాధకుడు అవరోధాలను దాటి తన సాధన చేయలేడు. 

సంసార జీవనం సాధనకు ఉపయుక్తమా: చాలామంది గృహస్తులకు కలిగే సాధారణ సందేహం.  నిజానికి సంసారం సాధనకు ప్రతిబంధకం కాదని మాన్యులు చెపుతారు.  కానీ సంసారం మాత్రం తప్పకుండా సాధనకు ఒక ప్రతిబంధకమే అవుతుంది. దీనిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను. నీవు ఒక సైకిలు పోటీలో పాలుగొన్నావనుకో  మిగితా వారంతా ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఉంటే నీవు ముందు గొట్టం మీద నీ భార్యను, చిన్న పిల్లవాడిని వెనుక క్యారియర్ మీద నీ ఇద్దరు కొడుకులను కూర్చోపెట్టుకొని సైకిలు తొక్కుతూ పోటీలో పాల్గొన్నావనుకో అప్పుడు నీవు విజయాన్ని యెంత సులువుగా పొందగలవో ఆలోచించు అలానే సంసారిక జీవనం చేస్తూ సాధన చేయటం కూడా. 

సన్యాసులంతా సులభంగా మోక్షం పొందగలరా: ఈ ప్రశ్నకు కూడా అవును అని  చెప్పలేము. ఈ రోజుల్లో మనం అనేకమంది సన్యాసులను చూస్తున్నాము వారు దైవచింతనకన్నా రాజకీయాలు, ధనాపేక్ష, సామాజిక విషయాలమీద శ్రర్ధ చూపుతూ ఖరీదైన కాషాయవస్త్రాలు ధరిస్తూ పాదపూజలు చేయించుకుంటూ పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతూ అనేక సుఖాలు అనుభవిస్తున్నారు.  వారు ఒకరకంగా సంసార జీవనం చేసే సాధకులకన్నా ఇంకా అధోపాతాళంలో వున్నట్లుగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక సైకిలు మీద సంసారి భార్య పిల్లలను ఎక్కించుకొని తొక్కుతుంటే ఇటువంటి సన్యాసులు ముందొక ఇసుక బస్తా వెనుక ఒక మట్టి బస్తా పెట్టుకొని సైకిలు తొక్కే వాడిగా అభివర్ణించవచ్చు. అంటే గృహస్తు తన బంధాలను మోస్తువుంటే ఇటువంటి సన్యాసులు తనకు ఏమాత్రం సంబంధము లేని తనకు పట్టని వాటిని అతికించుకొని లేని బంధాలను కలిగించుకొని సాధనలో చాల వెనుక పడివుంటారు. పైపెచ్చు వారు మనలాంటివారికి అనేక విధాలుగా ఉద్బోధలు చేయటం విడ్డురం. సాధకులు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాధకునికి కలిగిన ఒక అనుభవం తెలుపుతున్నాడు.  ఒకసారి ఒక మిత్రుడు నేను ఫలానా గురువుగారి వద్ద యోగ విద్య నేర్చుకున్నాను నాకు చాలా మంచిగా వున్నది అని తెలిపితే అదేమిటని దానిగూర్చిన వివరాలను సేకరిస్తే తెలిసింది ఏమిటంటే అందులో చేరటానికి తగు ద్రవ్యం ఫీజుగా చెల్లించాలట. తరువాత కొన్ని రోజులు ఆ గురువుగారొ లేక అయన శిష్యగణమో శిక్షణ ఇస్తారట అంతవరకూ బాగానే వున్నది శిక్షణ పూర్తి అయినతరువాత తానూ నేర్చుకున్న యోగం ఇతరులకు నేర్పనని ప్రమాణం చేయాలట.  చూసారా ఇటువంటివి ఇప్పుడు సమాజంలో అనేక సంస్థలు పుట్టగొడుగులులాగ పుడుతూ సామాన్యులకు రోజు ప్రక్కదోవ పట్టిస్తున్నాయి. ఇటువంటివి కేవలం నీ నుంచి ద్రవ్యాన్ని పొందేవి మాత్రమే అని గమనించాలి. మనకు శ్రీ కృష్ణ పరమాత్మను మించిన గురుదేవులు లేరు. ఆది శంకరులను మించిన మార్గదర్శకులు లేరు. ఈ విషయం గమనించి వారు బోధించిన మార్గాన్ని అనుసరిస్తే సాధకుడు మోక్షం పొందటం తధ్యం.

యదార్ధంగా సన్యాసి అంటే కౌపీనం తప్పించి ఏమి లేకుండా ఉండి ఉండటానికి ఎటువంటి ఆశ్రమాలు లేకుండా చెట్ల క్రింద, గుహలలో వుంటూ అడవిలో ఆకులు అలమలు భుజిస్తూ, వాగులు వొర్రెలలో నీటిని తాగుతూ, భౌతిక ప్రపంచానికి దూరంగా వుంటూ జీవనం గడిపే సాధకులు. వారు  సత్వరంగా వారి గమ్యాన్ని చేరుకోగలరు. 

నిజానికి సాధకుని జీవనం కఠినమైనది, అనేక వడిదుడుకులు కలిగి ప్రతిక్షణం ఒక పరీక్షగా ఉంటుంది. బాహ్యంగా అనైక రకాలుగా విమర్శలు, వత్తిళ్లు వస్తాయి.  వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే సాధనలో పురోగతి సాధించగలం. సాధకుడు అకుంఠిత దీక్ష, భగవంతునిమీద అనన్య ప్రేమ దాస్య ప్రవ్రుత్తి, కలిగి త్రికరణ శుద్ధిగా దైవచింతనలో నిరంతరం గడిపితేనే జీవన్ముక్తిని పొందలేరు. భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే సాధకుడు ఎటువంటి పరిస్థితిలోను భగవంతుని మీదినుంచి మనస్సును  మళ్ళించకూడదు. ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకొని నిరంతర దైవ చింతనలోనే జీవనం గడపాలి. అప్పుడే మోక్ష సాధన కలుగుతుంది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిఁ 

మీ 

భార్గవ శర్మ

నేడుమధ్వనవమి

 _*నేడుమధ్వనవమి*_

 

*మధ్వనవమి విశిష్టత* 

మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం.

త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం. శ్రీమధ్వాచార్యులు.

ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు.

మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట , వేదవతిలుగా పేర్కొన్నారు.


ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ , ఆనందతీర్థ , మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.


పన్నెండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.

బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. 

చిన్నవయసులోనే సకల శాస్త్రజ్ఞానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు.


ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.

గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. 

రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే.


శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు, వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. 

ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది, ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జీవుడు వేరు , బ్రహ్మము వేరు , జీవుడు మిథ్య కాదు , అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు.

ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం , భక్తి ఒక్కటే ముక్తిదాయకం , అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి. అని మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు.


దేశంలో వైష్ణవమత వ్యాప్తికి , ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు , జగత్తు మాయ మాత్రమే , జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.


పరమాత్మ సర్వస్వతంత్రుడు , జీవాత్మ అస్వంతంత్రుడు , జీవోత్తముడు ఆచార్యుడు , ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి , అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం.

మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.

మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. 

తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు.


ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు , తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు. 

మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. 

వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.


ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా , ఓడలోని ముఖ్య నావికుడు భక్తభావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.


శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు , ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3 ద్వాదశస్తోత్రంగా పిలువబడింది.

ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. 

ఆ విగ్రహాన్నే 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. 

తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు. 

ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. 

మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు , యుక్తవయస్సులో కన్యాకుమారి , రామేశ్వరం , శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.  


జీవాత్మ , పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని , ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. 

అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వన్నెతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు.


పెజావర , పుత్తిగె , 

పాలిమార్ , ఆడనూరు , 

సోధె , కవియూరు , 

శిరూరు , కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు , మతపరమైన ఆచారాలకు , ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. 

పురందరదాసు , కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.


మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.

నమ్మకం లేనివాడు

 *సుభాషితమ్* 

*అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి* ।

*నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః||*

                          ~భగవద్గీత. 


తాత్పర్యము-

అజ్ఞాని, నమ్మకం లేనివాడు, సంశయస్వభావుడు, వీళ్ళు నశిస్తారు. సంశయాత్మకు (అడుగడుగునా సంశయించేవానికి) ఇహలోకమూ లేదు, పరలోకమూ లేదు, సుఖం అసలే లేదు.

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏🙏*

మాఘ పురాణం*_ _*8 వ అధ్యాయము*

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*ఆదివారం*_

    _*జనవరి 29, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*8 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


🌹🌷🕉️🔔🕉️🌷🌹


దత్తాత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు  ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు  కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహాత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మము లాచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణెములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.


_*ఎనిమిదవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*


🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*సోమవారం*_

    _*జనవరి 30, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*9 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*గంగా జలం మహిమ*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️

ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించెను. మరెందరో  మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక , పూజలో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను.


కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశాచాలగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని  భాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడు కొనుచుండిరి.


కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.


ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తేలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


_*తొమ్మిదివ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

శ్రీ రామదాసు గారు

 మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట

శ్రీ రామదాసు గారు


ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...


పూజ్య గురువులు అనేక ప్రవచనములలో శ్రీ రామదాసు గారి యొక్క భక్తి గురించి ప్రస్తుతించిన విశేషములు...శ్రీ రామదాసు గారి జయంతి సందర్భముగా...


మహానుభావుడు పరమ భాగవతోత్తముడు కంచర్ల గోపన్నగారు. ఆయనను రామదాసు గారు అంటూ ఉంటాము. ఆయన జీవితములో చాలా గొప్ప విశేషము - కష్టము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము సుఖము వచ్చినా ఈశ్వరుడుతోనే చెప్పుకోవడము. ఏది వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము. లౌకికముగా పైకి మాట్లాడరు. ఏదైనా మాట్లాడటము ఏదైనా సంతోషము వస్తే చెప్పుకోవడము బాధ వస్తే మాట్లాడటము అన్నీ సర్వేశ్వరుడికే చెప్పుకోవడము. జ్వరము వచ్చినా ఏమిటో ఈశ్వరా! జ్వరముగా ఉన్నది, కాలు చాలా నెప్పిగా ఉన్నది అని ఏదైనా ఈశ్వరుడుకి చెప్పడము అలవాటు అయితే ప్రాణోత్క్రమణము అవుతున్నా ఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటు అవుతుంది. ఊపిరి అందటము లేదు అని ఈశ్వరునికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏది చెప్పుకున్నా రామచంద్ర ప్రభువుకే చెప్పుకున్నారు. ఒకరోజు ఆయన ఏడుస్తూ పాడుకున్నారు -

నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జననీ జానకమ్మా

ఆయన ఆ బాధలు ఓర్వలేక సీతమ్మ తల్లిని అమ్మా ఇంత కష్ట పడుతున్నాను కాపాడమని చెప్పమ్మా అంటే తట్టుకోలేక పోయింది. ఆవిడ వెళ్ళి - అంత భక్తి తత్పరుడు కష్టపడి ఆలయము కట్టించాడు అటువంటి వాడిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు, ఆయన చేసిన అపరాధము ఏమీ లేదని, రామదాసు గారిని ఎందుకు రక్షించి బయటికి తీసుకుని రారు అని శ్రీ రాముడిని అడిగింది. రాముడు - సీతా నాకు కూడా రామదాసు కష్టములు చూసి గుండెలు అవిసి పోతున్నాయి. కానీ లోకములో వేదము చెప్పిన శాసనము ఒకటి ఉన్నది. గతజన్మలో ఉండగా ఒక చిలుకను తీసుకుని వెళ్ళి తొమ్మిది సం|| పాటు పంజరములో పెట్టి బాధ పెట్టాడు. పంజరములో ఆ చిలుక ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరముతో తీర్చేసుకోవాలి. ఎప్పుడు పూర్తి అవుతుందా కనపడదామని నేను కూడా అగ్గగ్గ లాడిపోతున్నాను. కానీ రామదాసు గారి కన్నా ముందుగా నాదర్శనమును ముందుగా తానీషా పొందుతాడు అంటే, అదేమిటి? మిమ్ములను ఇంతగా సేవించి పూజించి గుడి కట్టిన వాడు రామదాసు. ఆయనని బంధించిన వాడు తానీషా. అటువంటి తానీషాకు రామదాసుకన్నా ముందు దర్శనమా? ఎందుకు ఇస్తారు అని అడిగింది.

రామచంద్రమూర్తి దానికి కారణము చెపుతూ గత జన్మలో పరమ శివ భక్తుడైన ఒక వ్యక్తి శివా! నిన్ను సాకారముగా చూడాలని ఉన్నది. పరమ నియమముతో నిన్ను 365 రోజులు రుద్రమును స్వరము తప్పకుండా చెపుతూ గంగా జలములతో అభిషేకము చేస్తాను. నువ్వు దర్శనము ఇవ్వమని అడిగాడు. రోజులు తప్పు లెక్క పెట్టుకుని సం|| నకు ఒక రోజు తక్కువ పూజ చేసి దర్శనము అవలేదని కోపము వచ్చి బిందె తీసి శివలింగమునకు వేసి కొట్టి శివలింగమును బద్దలు కొట్టాడు. అప్పుడు నువ్వు నియమము తప్పి, నన్ను నింద చేసి బిందె పెట్టి కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేద ప్రమాణము అంగీకరి0చని సిద్ధాంతము ఉన్నచోట జన్మించెదవు కాక అన్నాను. అతను నన్ను ప్రార్ధన చేసాడు శివా ! ఇంత కష్టపడి 364 రోజులు అభిషేకము చేసాను. ఒక్క రోజు తక్కువ అయినందుకు ఇంత శిక్షా అంటే, నువ్వు చేసిన అభిషేకమునకు కూడా ఫలితము ఉంటుంది. శివుడనైన నేను రామభక్తుడైన రామదాసు కన్నా రాముడిగా మొదటి దర్శనము నీకే ఇస్తాను అని వరమిచ్చాను. అందుకని మొదటి దర్శనము తానీషాకి ఇవ్వాలి. ఆయన కోటకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రభువు అంత ఎత్తులో కూర్చుని కనపడుతూనే ఉంటాడు. ఎవరైనా ఆయనకి ఆపద కలిగించాలి అనుకుని ధనస్సుకి బాణము సంధించి విడచి పెట్టినా, కత్తి విసిరినా ఆయనక తగలదు. మధ్యలో దేనికో తగిలి పడిపోతుంది. ఎందుకనగా అది వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారములు అడ్డు ఉంటాయి. ఆ రోజులలో అంత చిత్ర విచిత్రమైన శిల్పకళా నైపుణ్యముతో కట్టారు. తానీషా రాత్రి నిద్రపోతే పన్నెండు ప్రహారములు దాటితే తప్ప ఆయన నిద్రపోతున్న గదిలోకి వెళ్ళడము సాధ్యము కాదు. ఆయన భార్యతో కలసి ఏకశయ్యా గతుడై గాఢ నిద్రలో ఉండగా రామచంద్రమూర్తి భక్తుడైన రామదాసు గారిని రక్షించుకోవాలి అనుకున్నారు. ఆయన తలచుకుంటే కష్టము ఏమి ఉన్నది? రాజకుమారుల వేషము వేసుకుని గుఱ్ఱముల మీద ప్రహరాలు దాటి తానీషా పడుకున్నగదిలోకి వెళ్ళారు. తానీషా ఉలిక్కి పడి లేచాడు. భద్రాచల వృత్తాంతములో ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అనగా నిద్ర లేచిన ప్రభువు ఎవరు నువ్వు? అనలేదు. ఎవరక్కడ? అని గంట కొట్టలేదు. ఎదురుగా ఉన్న రాజకుమారుల అందమును చూసి ఏమి అందము ఎవరు వీళ్ళు అని చూస్తూ అలా ఉండిపోయాడు. అది పరమేశ్వరుని దర్శనము అంటే ! ఆ స్థితిలో కన్నుల నీరే కానీ నోట మాట ఉండదు. రాముడే మాట్లాడారు. మేము రామదాసు గారి దాసులము, ఆయన సేవకులము అన్నారు.. అది భద్రాచల క్షేత్రము యొక్క వైభవము. భద్రాచలములో రామదాసు గారు అంటాము. రామదాసు గారు రాముడికి దాసుడు కాదు, రాముడు రామదాసుగారికి దాసుడు! భగవంతుడిని నమ్ముకున్నవాడికి ఆయన ఎంత దాసుడైపోతాడో భద్రాచల క్షేత్రము చూపిస్తుంది.

మేము రామదాసుగారి సేవకులము ఆయన ఏ ద్రవ్యమును ఉపయోగించి ఆలయము కట్టాడని అభియోగము చేసారో ఆ వరహాలు పట్టుకుని వచ్చాము. తీసుకుని రశీదు ఇవ్వండి. రామదాసు గారిని విడిపించుకుంటాము అని అన్నారు.


ప్రభువు ఇంత రాత్రివేళ డబ్బు పట్టుకుని తిన్నగా నాదగ్గరకు రావడమేమిటి? రశీదు ఇమ్మని అనడము ఏమిటి? నిర్దానుడై చేతిలో రూపాయ కాసు లేకపోతే కదా కారాగారములో పెట్టాము. అటువంటి రామదాసు గారికి ఇన్ని లక్షల వరహాలు ఎలా వచ్చాయి. కారాగారములో ఉన్నవాడి కోసము మీరు ఇంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారు? అని తానీషా అడగ లేదు రామ దర్శనముతో అలా ఉండిపోయాడు. రామ లక్ష్మణుల దర్శనము పొందడము మాటలు కాదు. ఆనంద పారవశ్యములో ఉండిపోయి డబ్బు పుచ్చుకున్నాడు. డబ్బు ముట్టినది విడచి పెట్టమని తానీషా రశీదు వ్రాసి ఇచ్చేసాడు. రాముడు ఉన్నాడని అనడానికి రామచంద్రమూర్తి ఇచ్చిన డబ్బే సాక్ష్యము. ఆ రశీదు పట్టుకుని రామదాసు గారిని విడిపించారు. నాకు సేవకులు ఎవరు? దాసులు ఎవరు? వాళ్ళు ఇన్ని లక్షల వరహాలు పట్టుకుని వచ్చి నన్ను విడిపించడము ఏమిటి? అని ఆయన తెల్లబోయారు. వెంటనే నేను నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి ఉంటారు అనుకున్నారు. వారు తమ పేర్లు దాచలేదు. రామోజీ, లక్ష్మోజీ అని చెప్పారు. ఇద్దరూ రామదాసు గారిని విడిపించి తీసుకుని వచ్చారు. ప్రభువు కూడా అనేక రకములైన ఈనాములు కానుకలు ఇచ్చి దివ్యస్నానము చేయించి పట్టుబట్టలు కట్టి పల్లకీలో తీసుకుని వచ్చి భద్రాచలమునకు తాహసీల్దారు పదవిని ఇచ్చాడు. ఆయన వాడిన ఆరు లక్షల వరహాలు కూడా ఇచ్చాడు. ఆ డబ్బంతా పెట్టి రామచంద్రమూర్తికి నగలూ పాత్రలూ వైభవాలూ ఉత్సవాలు ఎన్నో చేయించారు.


వృద్దాప్యములోకి వచ్చిన తరవాత ఆయనకి శరీరము బడలిపోయి కొండ ఎక్కలేక పూజామందిరములో కూర్చుని రామా! ఎప్పటికి నిన్ను చేరుకుంటాను? ఇందులో ఉండలేక పోతున్నాను, డొల్ల బారిపోయింది అని ప్రార్ధన చేస్తే భద్రాచలమునకు శ్రీ వైకుంఠము నుంచి దివ్య విమానము వచ్చి రామదాసు గారి ఇంటి ముందు దిగింది. అందులో నించి విష్ణు పార్శదులు దిగి, లోపలి వచ్చి, అయ్యా గోపరాజు గారూ శ్రీమన్నారాయణుడు మీకోసము విమానము పంపించారు. మిమ్ములను సశరీరముగా విమానము అధిరోహించి రమ్మన్నారు అంటే విని ఆయన సంతోషముగా బయటికి వెళుతూ భార్య కమలాంబని పిలిచి కమలా వైకుంఠము నుంచి విమానము వచ్చింది వెళ్ళిపోతున్నాను నువ్వూ వస్తావా? అన్నారు. ఎప్పుడూ రామనామము చెపుతూ విమానము వచ్చింది నారాయణుడు వచ్చాడు అని అనడము అలవాటు అయినా కమలాంబ గారు ఏదో పలవరిస్తున్నారు అనుకుని అలాగే నేను పనిలో ఉన్నాను మీరు బయలుదేరండి నేను తరవాత వస్తాను అంటే మహానుభావుడు బయటికి వచ్చి విమానము ఎక్కి అందరి వంకా చూసి భద్రాచల క్షేత్రములో అందరితో రామనామము చెప్పించారు.


భండన భీముడార్త జనబాంధవుడుజ్జ్వల బాణతూణ కో

దండకలాప్రచండభుజతాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవసాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా

డాండ డడాండ దాండ నినదంబులజాండము నిండ మత్తవే

దండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !


రాముడున్నాడని నాకు ఎంత నమ్మకమో తెలుసా? ఉన్నాడని చెప్పడము కాదు, నాలుగు వీధుల కూడలిలో నాలుగు స్తంభములు పాతి, మధ్యలో పెద్ద భేరి కట్టి, ఏనుగు ఎక్కి, వచ్చి ఢామ్ ఢామ్ అని భేరి మ్రోగిస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు అలా మ్రోగిస్తున్నారు అని అడిగితే, నా రాముడు సాటి దైవము ఇంక లేడు! ఆయన యొక్క భుజములు శత్రువులను మర్దనము చేసేటప్పుడు తాండవము చేస్తాయి! ఎప్పుడు ధనుస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణము తీసి వింటి నారికి సంధిస్తాడో, ఎప్పుడు విడచి పెడతాడో తెలియదు! అటువంటి వాడు రాముడు! అని చెప్పుకున్న మహానుభావుడు రామదాసు గారు. 


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage 


instagram.com/pravachana_chakravarthy

 సర్ స్టఫోర్డ్ క్రిప్స్ ఏం చెప్పారు?


మా నాన్నగారు ఆలంగుడి ఆపత్సకాయం అయ్యర్ పరమాచార్య స్వామివారికి ‘బానిస’. మహాస్వామివారిపై వారికి అచంచలమైన భక్తిప్రపత్తులు. 1920లో ఉమామహేశ్వరపురం తాలూకా గ్రామాధికారిగా ఉన్నప్పుడు మాహాత్మా గాంధి గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ, పన్ను నిరాకరణ ఉద్యమాలకు అధ్యక్షత వహించారు. కుంబకోణం, పాపనాశం తాలూకాలలో ఇవి నిర్వహించినందుకు వారిని గ్రామాధికారి పదవి నుండి తొలగించారు.


1950లలో పరమాచార్య స్వామివారు కొన్నిరోజులపాటు మా ఊర్లో మకాం చేసారు. మొత్తం ఊరిప్రజలంతా ఆనందోత్సాహాలతో, దర్శనానికి వస్తున్న భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. ఒకరోజు పూజ పూర్తైన తరువాత మధ్యాహ్నం సమయంలో మఠం క్యాంపు ఉన్న స్థలంలో కొద్దిగా అలజడిగా ఉంది. మా ఇంటి ముందర నిలబడి ఉన్న నేను ఏమి జరిగిందో చూద్దామని అటుగా వెళ్లాను.


కుంబకోణం నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పులతో, చొక్కాలు వేసుకుని లోపలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న కావలివాడు వారిపై అరుస్తూ లోపలికి వెళ్ళకుండా వారిస్తున్నాడు. కాని వారు మాట వినకపోవడంతో అక్కడున్న వారి సహాయంతో నేను వారిని పట్టుకున్నాను. అక్కడున్న కొబ్బరి చెట్లకు కట్టేసి, అటువైపు వచ్చిన పోలీసులకు వారిని అప్పగించాము. ఆ ఇద్దరినీ తిరువిడైమరదూర్ పొలీస్ స్టేషనుకు తీసుకుని వెళ్ళారు.


ఆరోజు రాత్రి పూజ మొత్తం పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు నాకు కబురు చేశారు. మధ్యాహ్నం జరిగిన విషయం అడిగి, “అది సరే! అప్పుడే అక్కడకు పోలీసులు ఎలా వచ్చారు?” అని అడిగారు.


“నేను కమ్యునిష్టు పార్టి వ్యక్తిని కావడం వల్ల నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదని కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి విన్నపం చేశారు. (అప్పుడు నేను పక్కఊరిలో గ్రామాధికారిగా ఉన్న మా నాన్నగారికి సహాయకుడిగా ఉండేవాణ్ణి). దాని గురించి విచారించడానికి ఒక అధికారి వచ్చారు. ఆయనతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా వచ్చారు. అప్పుడు వారిని ఉపయోగించుకున్నాను” అని చెప్పాగా, “ఓహో! అలాగా?” అని ఆశ్చర్యపోయారు స్వామివారు.


తరువాత స్వామివారు లబ్రేరియన్ ను పిలిచి, “నేను నిన్ను అప్పుడు కొనమని చెప్పిన కమ్యునిజం గురించిన ‘సిక్స్ ఆథర్స్’ పుస్తకాన్ని రేపు ఇతనికి ఇవ్వు” అని చెప్పారు. నావైపు చూసి, “వారంరోజుల లోపల ఆ పుస్తకాన్ని చదివి అందులో ఏముందో నాకు చెప్పు; ఎవరైనా అడిగితే ఆ పుస్తకాన్ని చదువుతున్నానని చెప్పు” అని ఆదేశించారు.


అది నిఘంటువులా చాలా పెద్ద పుస్తకం. నాకు గుర్తు దాని వెల నలభై రూపాయలు. అప్పుడు పౌండు స్టెర్లింగ్ పదిహేను రూపాయలు. అది సర్ స్టఫోర్డ్ క్రిప్స్, అనువిన్ బెవన్, లూయిస్ ఫిషర్ మరియు ముగ్గురు ఇతర పాశ్చాత్య ప్రముఖులు వ్రాసిన పుస్తకం. దాన్ని చూడగానే నాకు వణుకు పుట్టింది. ఓకే వారం గడిచిపోయింది. ఒకరోజు పరమాచార్య స్వామివారు అడగనే అడిగారు, “ఏమిటి? ఆ పుస్తకాన్ని చదివావా? అందులో దేని గురించి చెప్పారు” అని.


“అది చాలా పెద్ద పుస్తకం పెరియవ. కొన్ని విషయలు నాకు అర్థం కాలేదు. స్టఫోర్డ్ క్రిప్స్ వ్రాసిన భాగం మాత్రం చదవగలిగాను” అని చెప్పాను.


“సరే! అతను ఏమి చెప్పారు?”


“అన్ని ఇజాలు మానవాళికి ఎదో ఒకటి ఇస్తాయి. కాని కమ్యునిజం మాత్రం మనుషుల నుండి అన్నిటిని తీసుకుంటాయి”


పరమాచార్య స్వామివారు అప్పుడు చూసిన చూపు, “ఏంటి అర్థమైందా?” అన్నట్లు ప్రశ్నిస్తున్న వారి చూపులు ఇప్పటికి నా కళ్ళముందు కదలాడుతున్నాయి.


ఈ ఘటన తరువాత నా ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అటు తరువాత పరమాచార్య స్వామివారికి సంపూర్ణ శరణాగతి చేశాను.


సాయంత్రం పూజ తరువాత స్వామివారు ఎందఱో పండితులు, ఘనాపాఠీలతో వేద చర్చలు చేసేవారు. మధ్యలో అయిదడుగుల ఎత్తు ఉన్న రెండు పెద్ద కంచు దీపాలు వెలుగుతూ ఉండేవి. ఆ వెలుగులో నుంచుని చదవమని నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చి, స్వామివారు ఇష్టాగోష్టిలో మునిగిపోయారు. ఆ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో అక్కడ చాలా గందరగోళంగా ఉంది. నేను పుస్తకం చదువుతూ, 'meditation' కు బదులుగా 'mediation' అని చదివాను. వెంటనే స్వామివారు పెద్దగా నవ్వి, “ఇతను ఒక అకౌంటెంట్. అందుకే 'meditation' ని 'mediation' అని చదివాడు” అని అన్నారు. తరువాత స్వామివారు దాదాపు అరగంట పాటు meditation గురించి వివరిస్తూ మానసికంగా భారత దేశం మొత్తం తీసుకునివెళ్ళారు. అక్కడున్న గందరగోళంలో నేను ఏమి చదువుతున్నానో ఎవరికీ వినబడే అవకాశమే లేదు. కాని ఈ శతావధాని చెవులకు నా తప్పు వినబడింది.


కొద్ది రోజుల్లోనే శ్రీమఠం మకాం ‘శ్రీధర అయ్యార్ వాళ్’ వారి తిరువిసైనల్లూర్ చేరుకుంది. మఠం ఏనుగుకు అక్కడ మదమెక్కింది. గుడిసెలను కూల్చి విసిరేస్తున్న ఆ ఏనుగును నియంత్రించడం ఎవరివల్ల కాలేదు. చాలా ఇళ్ళు కూడా పాడయిపోయాయి. ఆ ఏనుగు ఆగ్రహానికి కార్లు, బస్సులు కూడా తప్పించుకోలేదు. ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఆ ఏనుగును అడ్డగించి, రెండు నదుల గుండా మా ఊరికి తీసుకురావడానికి సంబంధించిన విషయమై నన్ను రమ్మని పిలవడానికి మఠం నుండి ఒక వ్యక్తి నాకోసం మా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నేను ఇంటిలో లేకపోవడంతో నాకు ఆ విషయం తరువాత తెలిసింది. ఆ సాయంత్రం పూత ఏనుగును రెండు నదులను దాటించడం కాస్త కష్టమైన విషయం. అందునా నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. మరుసటిరోజు ఉదయం శ్రీమఠానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా పోలీసులు ఏనుగును కాల్చి చంపారన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. ఒక్కసారిగా బాధ, అసహ్యం వేసింది. రాత్రే నేను వెళ్ళాల్సి ఉన్నింది అన్న ఆలోచనలతో స్వామివారి దగ్గరకు వెళ్లాను.


పూజ, ఆహారం వదిలివేసి ఎవరితోనూ మాట్లాడక, ఎవ్వరినీ చూడటానికి ఇష్టపడనట్టుగా శ్రీమఠం వెనకాల ఒక్కరే కూర్చున్నారు. అంతా శోకసంద్రంలా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు; స్వామివారి వద్దకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. మెల్లిగా ఒక్కొక్కరే స్వామివారు కూర్చున్న చోటుకు వెళ్ళాము. నేను అపచారం చేశానని ఏడుస్తూ స్వామివారి పాదాలపై పడ్డాను. ఏమి చెయ్యాలో తెలియక అందరూ అలా నిలబడి వున్నారు. అలా అరగంట గడిచిపోయింది. తరువాత స్వామివారు నిదానంగా వారికి కలిగిన నష్టం గురించి ఎంతో బాధతో కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లి పడే వేదనతో అందరికీ వినబడేటట్టు ఆ ఏనుగు పుట్టినప్పటి సంగతి, దాని ఎదుగుదల, శరీరంపై మచ్చలు, దాని గుణాలు, ఇలా ఎన్నో విషయాలు తెలిపి, దాని జీవితకాలం అంతే అని తెలిపి, ఎంతో బాధ, శోకంతో మరలా స్వామివారు మౌనం వహించి, గోడకు చేరగిలబడ్డారు.


మహాస్వామి వారు చూపించిన ఈ కరుణకు అక్కడున్నవారందరమూ కదిలిపోయము. మాటలు రాని ఒక జీవిపై స్వామి కరుణ చూపారు అని కాదు. ప్రపంచంలోని అన్ని జీవరాసులపై స్వామివారికి ఉన్న ఆర్తి గురించి తలచుకుని. 


ఇది జరిగి దాదాపు యాభై సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు నాకు ఎనభైనాలుగేళ్ళు. తలచుకుంటే ఇప్పటికి హృదయం ద్రవిస్తుంది.


ఆలంగుడి (గురు స్థలం) అన్న పేరు వినగానే, స్వామివారి కళ్ళల్లో వచ్చే వెలుగును మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మహాస్వామి వారు సాక్షాత్తు ఆ గురు స్వరూపమే కదా! ఎంత రద్దీ ఉన్నప్పటికీ, “ఏమిటి, ఆలంగుడి నుంచా?” అని నన్ను అడగగానే, నాకు అది నాకు ఒక దివ్యమైన అనుభూతిలో కరిగిపోయాను. మాణిక్యవాచకులు చెప్పినట్టుగా, “ఉళ్ళంతాళ్ నిండ్రు ఉచ్చి అళవుం నెంజాయ్ ఉరుకత్తన్” కాలి నుండి తలదాకా కరిగి నీరైపోవడం.


--- నడువక్కరై ఎ. నారాయణ స్వామి అయ్యర్, మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ప్రశాంతంగా నిద్రపోలేడు

 శ్లోకం:☝️

*న చ రాత్రౌ సుఖం శేతే*

 *ససర్ప ఇవ వేశ్మని ।*

*యః కోపయతి నిర్దోషం*

 *సదోషోఽభ్యంతరం జనం ।।*

-మ.భా. ఉద్యోగపర్వం 38.40


భావం: ఇంట్లో పాము దాగి ఉందని తెలిస్తే సుఖంగా ఎలా నిద్రపట్టదో - అలాగే తాను దోషియై యుండి నిర్దోషులకు కోపం తెప్పించేవాడికి కూడా ప్రశాంతంగా నిద్రపోలేడు.