27, సెప్టెంబర్ 2023, బుధవారం

Electromagnetic


 

Out Put


 

TV screen


 

Gas stove


 

Thompson cuppling


 

Garikapaati pravachan


 

DIY boat


 

Thonder


 

Rotation


 

Almost flew


 

Gaatrm


 

Abhista vinayak

 https://youtu.be/M-eaaYYnNtk?si=usXs6_abOm6zWnE1


మహాలయ పక్షాల ప్రాధాన్యత

 మహాలయ పక్షాల ప్రాధాన్యత


భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.


పితృదేవతలకు ... ఆకలా?


అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


అన్నాద్భవంతి భూతాని - పర్జన్యాదన్న సంభవః

యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....

అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.

మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.

దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.


తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.

Panchaag


 

శ్రీ మా పాతాళ భైరవి మందిర్

 🕉 మన గుడి : నెం 191





⚜ ఛత్తీస్‌గఢ్ : రాజ్‌నంద్‌గావ్‌


⚜ శ్రీ మా పాతాళ భైరవి మందిర్ 



💠 భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే రాష్ట్రంగా కూడా పిలుస్తారు. 

భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన అనేక మతపరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని పుణ్యక్షేత్రాలలో  బమలేశ్వరి , దంతేశ్వరి  పాతాళ భైరవి, జట్మై ధామ్, ఘటరాణి ధామ్ మరియు అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి.


 💠 ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన రాజ్‌నంద్‌గావ్‌లో ధార్మిక ప్రదేశాలకు కొరత లేదు.

 రాజ్‌నంద్‌గావ్ నగరంలోని ప్రసిద్ధ పాతాళ భైరవి ఆలయం ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంది. ఛత్తీస్‌గఢ్ నుండి మాత్రమే కాకుండా సమీప రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఈ దేవాలయం మూడు విభాగాలుగా నిర్మించబడడం విశేషం.


💠 ఈ కాళీమాత ఆలయం 28 సంవత్సరాల క్రితం పూర్తయింది.అప్పటి నుండి నేటి వరకు ఈ ఆలయానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూనే ఉన్నాయి. శ్రావణ మాసం మరియు నవరాత్రి సందర్భంగా, ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడ నిర్వహించే పూజలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.


💠 దుర్గామాత దుర్మార్గులను సంహరించేందుకు భీకర యోధురాలిగా అవతరించిందని చెబుతారు. 

రక్తబీజ అనే రాక్షసుడిని చంపడానికి ఆమె ఈ రూపాన్ని ధరించారని చెబుతారు.


💠 రక్తబీజుడు అనే రాక్షసుడు, అతని రక్తం ఒక్క చుక్క కూడా నేలపై పడితే అది కొత్త రాక్షస రూపాన్ని సంతరించుకుంటుంది.

ఈ సమస్యను పరిష్కరించడానికి, దుర్గా దేవి కాళీ దేవి రూపాన్ని ధరించి రక్తబీజను చంపి అతని రక్తాన్ని త్రాగింది. 

ఈ ఆలయంలో, గర్భగుడిలో ఉన్న మాత కాళి రూపంగా ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుంది.


💠 ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. 

ఆలయ ప్రాంగణం పెద్ద శివలింగ ఆకారంలో నిర్మించబడింది. ఇందులో మూడు విభాగాలు తయారు చేయబడ్డాయి.

ఎగువ భాగంలో భక్తులకు 12 శివలింగాల దర్శనం ఉంటుంది. 

మధ్య భాగంలో, మా రాజరాజేశ్వరి తొమ్మిది గొప్ప రూపాలలో కొలువై ఉంది.

చివరి భాగంలో, పాతాళ భైరవి కాళి రూపంలో దర్శనమిస్తుంది.


💠 మా పాతాళ భైరవి ఆలయం భూమి నుండి 15 అడుగుల దిగువన నిర్మించబడింది.

 విగ్రహం ఎత్తు సుమారు 15 అడుగులు. ఆలయంపై ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది, దాని ముందు ఒక పెద్ద నంది విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇటీవల ఆలయంలో స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు.


💠 ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తారు, వారు ఆలయానికి వచ్చి తమ కోరికలు కోరతారు, వారి కోరికలు నెరవేరిన తరువాత, వారు ఆలయానికి వచ్చి దేవత ఆశీర్వాదం తీసుకుంటారు. 


💠 ఈ ఆలయం అనేక విధాలుగా ప్రత్యేకమైనది.ఈ ఆలయం భక్తులకు విశ్వాస కేంద్రంగా మిగిలిపోయింది. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చాలా విశిష్టత ఉంది. ఈ విగ్రహాన్ని ఎవరైనా మొదటిసారి చూస్తే ఆశ్చర్యపోయే విధంగా తయారు చేశారు. మా కాళి యొక్క ఈ ఉగ్ర రూపం చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఆలయ గర్భగుడి ఆలయం నుండి దాదాపు 15 నుండి 18 అడుగుల లోతులో ఉంది. గర్భగుడిలో ఉన్న విగ్రహం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతారు మరియు ఈ విగ్రహం 11 టన్నుల బరువు ఉండే భారీ రాతితో తయారు చేయబడింది.


💠 పాతాళ భైరవి మాత విగ్రహం భూమికి 18 అడుగుల దిగువన ఉండడానికి కారణం

పురాణాలు మరియు గ్రంధాలలో కాళీమాత భూగర్భంలో నివసించేదని, అందుకే దీనికి పాతాళ భైరవి అని పేరు వచ్చిందని అంటారు.


💠 నవరాత్రులలో ఈ ఆలయంలో జ్యోతి కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చేసే జ్యోతి కలశ స్థాపనకు విశేష ప్రాముఖ్యత ఉంది. 

చాలామంది అమ్మవారి ఆస్థానంలో దీపం వెలిగించి తమ కోరికల కోసం ప్రార్థించగా, చాలా మంది తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ దీపం వెలిగిస్తారు.


💠 ఈ ఆలయంలో, నవరాత్రులతో పాటు, శరద్ పూర్ణిమ రోజున, పాయసం లో  ఒక ప్రత్యేక మూలికను జోడించి, ఔషధ ఖీర్ ( ఔషధ పాయసం)  తయారు చేస్తారు. 

ఈ ఖీర్‌లో ప్రత్యేకమైన మూలికలు ఉన్నాయి, ఇవి ఉబ్బసం మరియు శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.

ఈ ఖీర్ ప్రసాదాన్ని పొందడానికి శరద్ పూర్ణిమ రాత్రి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.


💠 పాతాల్ భైరవి ఆలయం రాజ్‌నంద్‌గావ్ నగరంలో జాతీయ రాష్ట్ర రహదారి నెం 6 పై ఉంది. 

ఇది ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు నాగ్‌పూర్ (మహారాష్ట్ర) నుండి దాని దూరం 212 కిలోమీటర్లు.



©

Ganesh

 


Vsnkaya iguru


 

Ride


 

epitome of love..?"

 In class, the teacher asked the children:

 "Which place in the world is called the epitome of love..?"

 The whole class shouted in unison:


  "Taj Mahal"


  Only one student said:

 "RAMASETU"


  The teacher asked him to stand up.

 "What do you mean…?"


  The boy stood up and said, "Rama Sethu was built by Lord Rama not to bury his wife's dead body on the occupied land, but to bring back his wife!!!


  Moreover, Lord Rama gave full respect to those who built the bridge.  Sri Rama did not cut their hands so that nothing like this would happen again in the world."


  The teacher and other students were shocked.


 Indian history needs to be re-read from a new perspective.

 Rewrite Indian History.. Vande Bharat 🙏

LOANS

 📣LOANS

I a m B.N.MURTHY will provide these services ,

BEST RATE OF INTEREST 

               🚘CAR LOANS 1)New car purchase loan,

2) Refinance for old,

3) Secondhand purchase    

      Finance ,

4) Take over from other bank and top up ,

5) Car insurance

          🏠HOME LOANS

1)New home loan,

2)Take over from other bankand Top up,

   🏢MORTAGAGE LOANS

     PROPERTY AGAINST

1)Commercial properties

2)Residential properties 

3) DOD(DROP LINE OD)

4) CC LIMITS,OD

5) Take over from other bank and top up

       📈BUSINESS LOANS

1) Un secured loan

      👨‍👧PERSONAL LOANS

1) For salaried 

    Government or private Employee.

 


𝙂𝙊𝙇𝘿 𝙇𝙊𝘼𝙉𝙎


   

📱📟

Message R call 

9676600088

9849020149

Hyderabad


Disclaimer.Author of the blog is not concerned

ఆఫర్‌ ధర కేవలం రూ. 25,000

 సప్తమోక్ష క్షేత్ర యాత్రలో ఆఖరి అవకాశం


కేవలం అప్పర్‌ బెర్తులు  మాత్రమే కలవు 


రైల్వే వారి సూచనల మేరకు టిక్కెట్‌ ధరపై భారీ తగ్గింపు


థర్డ్‌ ఏసీ టిక్కెట్‌ ధర రూ. 50000/-లు


@@@ ఆఫర్‌ ధర కేవలం రూ. 25,000 @@@


** బుకింగ్‌ ఆఖరు తేదీ -సెప్టెంబర్‌ 28, శుక్రవారం**


యాత్రా సమయం 

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు 


క్షేత్రాలు

ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, బృందావనం, మధుర, ఉజ్జయిని - నాగేశ్వర-ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలు


అక్టోబర్‌ 1న చెన్నైలో బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, గుంటూరు, మిర్యాలగూడ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం స్టేషన్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొనును. 


ఈ రైలులో ప్రయాణించే వారికి క్షేత్ర సందర్శన సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. ఏసీ తరగతుల వారికి ఏసీ రూమ్‌లు, స్లీపర్‌ క్లాసుల వారికి నాన్‌ ఏసీ రూములు ఏర్పాటు.

రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయాలకు, మరలా స్టేషన్‌ చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును..


ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం అందించబడును


భద్రత

----

1. యాత్రికుల సేవల కోసం వంద మంది రైల్వే సిబ్బంది, ప్రత్యేక వాలంటీర్లు

2 . క్షేత్ర దర్శనాల్లో ఒక్కో బోగి నుంచి ఇద్దరు వాలంటీర్ల సహాయం

3. రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

4. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళవచ్చును, సెక్యూరిటీ సౌకర్యం కలదు.

5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

6. ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్‌ అసిస్టెంట్‌


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ అమౌంట్‌ జిపే, ఫోన్‌ పే, అకౌంట్‌ పే

3. బుకింగ్ సమయంలో మీకు బెర్తు నెంబరు కేటాయించబడును.

4. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ''ఎల్టీసీ'' వర్తించును.


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686

Photo





 

తిరుమల శ్రీవారి భక్తులకు


తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.  నిన్నటి వరకు మూడు రూపాయలతో విక్రయిస్తున్న లడ్డూ 'కవర్'ను   ఫాస్టర్ , ముల్లాలకు ప్రభుత్వం నెల నెలా ఇచ్చే జీతాల కోసం   కేవలం 7 రూపాయలు మాత్రమే పెంచి  పది రూపాయలు చేశారు అంతే  కావున  హిందూ భక్తులారా  ప్రతి ఒక్కరూ తప్పకుండా కనీసం ఒక 5 కవర్లను అయినా కొని రాష్ట్రంలో హిందూ దేవాలయాల ఆదాయంతో బిక్చం యెత్తుకుంటున్న వారికి సహకరిస్తారని ప్రఘాడ నమ్మకం .  గోవిందా.... గోవింద.

రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పై రిపేర్

  - రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పై రిపేర్ నిమిత్తం నేటి నుండి నెల రోజులు రాకపోకలు నిషేధం.

దీనితో కొన్ని బస్సు లు గామన్ వంతెన మీదుగా, కొన్ని ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్ళిస్తున్నారు.కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపో ల పల్లె వెలుగు బస్సు లు గామన్ వంతెన పై నుంచి RTC కాంప్లెక్స్ కు వచ్చి వెళ్తాయి. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు డిపో ల పల్లె వెలుగు బస్సు లు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా రైల్వేస్టేషన్ మీదుగా కాంప్లెక్స్ కు వచ్చి వెళ్తాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బ్యారేజ్ రోడ్, గామన్ వంతెన పై వెళ్లొచ్చు అని అధికారులు తెలియ చేస్తున్నారు.

సంస్కృతిని ఆచరిస్తున్నారా


 మీరు నన్ను నిందించినా ఫరవాలేదు.మన దగుల్బాజీ హిందువులలో కనీసం పదిశాతం మందైనా మన సంస్కృతిని ఆచరిస్తున్నారా?ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటున్నారా?జడవేసుకుంటున్నారా?సంప్రదాయ వస్త్రధారణ చేస్తున్నారా?భగవద్గీత చదువుతున్నారా?ముస్లిమ్స్ ను తప్పుపట్టే హక్కు మనకెక్కడిది?

Sisyudu


 

Tharmal science


 

Agarbatti manufacturing


 

Geneva mechanism


 

One stroke engine


 

Jobs gor inter and iti candidates


 

నవగ్రహా పురాణం🪐* . *37వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *37వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ జననం - 4*


వృషపర్వుడు అన్నట్టే మహా వైభవంగా ఉశనుడి స్వీకారం జరిగింది. అసురు బాలకుల విద్యా బోధనకూ , రాజసభలో మంత్రాలోచనకూ ఉశనుడు ఆరోజే నాందీ ప్రస్తావన పలికాడు.


దేవతల పట్ల అసూయ అంతస్సూత్రంగా సాగుతున్న ఉశనుడి విద్యాబోధన అసురలందరికీ మహదానందాన్ని కలిగిస్తోంది. 


అచిరకాలంలోనే తన మేధస్సుతో వృషపర్వుడిని కూడా శాసించే స్థితికి చేరుకున్నాడు. ఉశనుడు. అసుర గురువుగా ఆయన ప్రస్థానం విజయ పథంలో సాగిపోతోంది.


నిర్వికల్పానంద నీళ్ళు తాగి , రాగి పంచపాత్రను అరుగు మీద పెట్టాడు. శిష్యుల వైపు చిరునవ్వుతో చూసి , ప్రారంభించాడు. 


*"నవగ్రహ దేవతలలో ఒకడైన బుధుడి జన్మవృత్తాంతం చంద్రుడు , బృహస్పతి , శుక్రుడు (ఉశనుడు) అనే ముగ్గురు గ్రహ దేవతల చరిత్రలతో ముడిపడి ఉందని చెప్పాను కదా ! ఆ ముగ్గురి జన్మ వృత్తాంతాలూ మీరు విని ఉన్నారు. ఇప్పుడు అన్వయ క్లిష్టతకూ , గందరగోళానికీ అవకాశం లేని విధంగా - బుధుని జననగాధ వినవచ్చు !*


అనసూయ , అత్రి దంపతుల కుమారుడిగా చంద్రుడు జన్మించిన కథాంశం మీకు గుర్తుండే ఉంటుంది. అత్రి మహర్షి , తగిన వయసులో చంద్రుడికి విద్యాభ్యాసం

ప్రారంభించాడు.


*"చూడచక్కని వాడైన తన ముద్దుల కుమారుడ్ని అనసూయ మురిపెంగా చూసుకుంటోంది. తన అందంతో , ప్రవర్తనతో తల్లినీ , విద్యార్జనతో తండ్రినీ సంతోషపెడుతూ , చంద్రుడు , బాల్యాన్ని అధిగమిస్తూ , యవ్వనం వైపు అడుగులు వేస్తున్నాడు. తల్లి అనసూయ కుమారుడి వివాహ విషయం భర్త అత్రి ముందు ప్రస్తావించింది. చంద్రుడు తన దగ్గర అభ్యసించిన విద్య గోరంతనీ , ఇంకా కొండంత నేర్చుకోవాల్సి ఉందనీ , విద్యాభ్యాసం పూర్తి కానిమ్మనీ అన్నాడు అత్రి... "నిర్వికల్పానంద తన కథనాన్ని కొనసాగించాడు.*


*"ఓమ్!"* అన్నాడు ఆ పూట పాఠం ముగించిన అత్రి మహర్షి తండ్రిని అనుసరిస్తూ చంద్రుడు కళ్ళు మూసి , ప్రణవ ధ్యానం చేశాడు. ఆశ్రమం ముందు చల్లని చెట్టు నీడలో విద్యాభ్యాసానికి కూర్చున్న చంద్రుడు లేవబోయాడు. *"చంద్రా... నీతో మాట్లాడాలి , కూర్చో !"* అత్రి అన్నాడు.


చంద్రుడు అలాగే కూర్చుని , తండ్రి వైపు మౌనంగా చూశాడు.


*"నీ చదువు - నా పరిమితిలో మాత్రమే పూర్తయింది. ఇంకా పరిణతిని అందుకోలేదు'* అత్రి నవ్వుతూ అన్నాడు. *"ఎందుకంటే , విద్యా భాండాగారంలో ఎంతో ఉన్నది. పూర్వాంశమే నేను బోధించాను. ఉత్తరాంశాన్ని గురు శుశ్రూష చేస్తూ నువ్వు అభ్యసించాలి."*


*"నాకు తెలీదు. అందువల్ల అడుగుతున్నాను. మీకు తెలియని విద్య ఉందా. చెప్పండి !"* అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ అడిగింది అత్రిమహర్షిని. *"మీ కన్నా జ్ఞానులు ఎవరున్నారని ?”*


*"అదే మన చంద్రుడికి చెప్పబోతున్నాను !"* అత్రి అనసూయ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. *"మా సోదర మానస పుత్రులు అంగిరసులున్నారు కదా. ఆయనకు 'బృహస్పతి' అనే కారణజన్ముడు పుత్రుడుగా పుట్టాడు. ప్రజ్ఞకూ , ఉపజ్ఞకూ , ఆ బృహస్పతి పుట్టినిల్లు. అనన్య సామాన్యమైన మేథ ఆ బృహస్పతిని దేవ గురువుగా చేసింది..."* 


*"ఔనౌను ! అతని వివాహానికి వెళ్ళాం కూడా. మనం !"* అనసూయ అంది.


*"బృహస్పతి ప్రస్తుతం ఆశ్రమ విద్యాలయం నెలకొల్పి , అర్థులకూ , అర్హులకూ అత్రి విద్యాదానం చేస్తున్నాడు. మన చంద్రుణ్ణి ఆయన వద్దకు పంపుతున్నాను...."* అన్నాడు.


అనసూయ కొడుకుని వాత్సల్యంతో చూస్తూ అంది. *"మన చంద్రుడికి ఆ బృహస్పతి తగిన గురువు !"*


*"గురువుకు తగిన శిష్యుడు అని మనవాడు అనిపించుకోవాలి. అనసూయా !"* అత్రి చిరునవ్వుతో సరిదిద్దాడు. *"నీ ప్రయాణం రేపే, చంద్రా !"*


చంద్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అనసూయ ప్రయాణం చేయబోతున్న కుమారుడికి శాస్త్రోక్తపద్ధతిని పాటిస్తూ పరమాన్నం వండి పెట్టింది.


*"చంద్రా ! నా దగ్గర ప్రేమనూ , భక్తినీ , చనువునూ జతచేసి , ఇంత కాలం విద్య అభ్యసించావు. గురువుగారి వద్ద అలా కాదు. భక్తినీ , గౌరవాన్నీ , శ్రద్దనూ జత చేయాలి. అతి చనువు కూడదు , సుమా ! గురువు ముందు తల వాల్చుకునే మాట్లాడాలి. ఏం ?"* అత్రి ప్రవర్తనా విధానం వివరిస్తూ అన్నాడు.


*"అలాగే , నాన్నగారూ !!"* చంద్రుడు వినయంగా అన్నాడు.


*"గురుపత్ని పట్ల కూడా నువ్వు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి నాయనా ! గురుపత్ని తల్లితో సమానం ! అమ్మ స్థానాన్ని ఆక్రమించి ఆమె విద్యార్థులకు అన్నం పెడుతుంది !"* అనసూయ అంది. *"అవకాశం చిక్కినప్పుడు గురుపత్నికి కూడా ఆశ్రమ కార్యకలాపాల్లో సహాయం చేయాలి !"*


*"అలాగేమ్మా !"*


*"అనన్య సామాన్యమైన ప్రవర్తనతో , ఆదర్శవంతమైన విద్యార్జనతో అమ్మకూ , నాకూ కీర్తి తీసుకు రా , నాయనా !"* అన్నాడు అత్రి , నమస్కరిస్తున్న చంద్రుణ్ణి దీవిస్తూ.


పాదాభివందనం చేస్తున్న కుమారుణ్ణి అలాగే లేవనెత్తి , అతని నుదురు మీద సున్నితంగా ముద్దుపెట్టింది అనసూయ. 


*"నా ఆలోచనలు నీకు తోడుగా ఉంటాయి. జాగ్రత్త సుమా !"* అంది కన్నీళ్ళు ఆపుకుంటూ.


చంద్రుడు వెనుదిరిగి వెళ్తున్నాడు. అత్రీ అనసూయా ఇద్దరూ జంటగా నిలబడి దూరంగా వెళ్తూ , తమకు అడుగు అడుగుకీ దూరమవుతున్న చంద్రుణ్ణి అర్థం కాని ఉద్వేగంతో చూస్తున్నారు. అశ్రువులు అనసూయ కళ్ళకు తెరలాగా అడ్డుపడి , చంద్రుడు కనిపించకుండా చేశాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


*రేపటి నుండి బుధగ్రహ జననం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

Hindu


 

Hinduism


 

మూడు పనులు చేయరాదు

 


మూడు పనులు చేయరాదు

 🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸


*ವಾಗ್ವಾದಮರ್ಥಸಂಬಂಧಂ*

*ಪರೋಕ್ಷೇದಾರದರ್ಶನಮ್ |* 

*ಯದೀಚ್ಛೇದ್ವಿಪುಲಾಂ ಪ್ರೀತಿಂ* 

*ತ್ರೀಣಿ ತತ್ರ ನ ಕಾರಯೇತ್ ||*


ಒಬ್ಬನಲ್ಲಿ ಗಾಢವಾದ ಪ್ರೀತಿ ಬಯಸುವುದಾದರೆ ಅವನೊಡನೆ ಮಾತಿಗೆ ಮಾತು (ವಾಗ್ವಾದ) ಆಡುವುದನ್ನೂ, ಹಣದ ವ್ಯವಹಾರವನ್ನೂ, ಅವನಿಲ್ಲದವೇಳೆ ಅವನ ಹೆಂಡತಿಯನ್ನು ಕಾಣುವುದನ್ನೂ - ಈ ಮೂರನ್ನೂ ಬಿಡಬೇಕು.


*🌷🌺🙏ಶುಭದಿನವಾಗಲಿ!🙏🌺🌷*

ఎవరి తో నైనా గాఢ మైన మైత్రి చేయాలంటే 1. మాట కి మాట 2. ఆర్థిక వ్యవహారం 3. వాని పరోక్షములో వాని భార్య ని చూడటం

ఈ మూడు పనులు చేయరాదు

Nava Durga Dance


 

Kaakarakaya curry


 

Aratikaya vada


 

ధ్యానప్రస్థమ్

 ధ్యానప్రస్థమ్ మొదటి నియమం :

మన ముందు ప్రత్యక్షంగా లేని వ్యక్తుల గూర్చి పరోక్షంగా మాట్లాడుకోకుండా, యోగక్షేమాలు తెలుసుకోవడం అవసరం. కాలక్షేపం కోసం కబుర్లు, మందిపై ముచ్చట్లు, జరిగినవి పదే, పదే చెప్పుకోవడం కూడా నిషిద్ధం. పరోక్ష సంభాషణ మహా పాపం. మౌనమే అనగా అవసర పూర్తి మాట్లాడడం శ్రేయస్కరం.

Pendalam fry


 

Beach


 

Converyter


 

Lift maintenance


 

E scooter


 

💃Dance dance


 

Nbig bicycle


 

Sliding gate bolt


 

Chinless bicycle


 

Assembling of motor cycle engine


 

Master switch


 

Finger joint


 

Street indicator


 

బాధ్యతతో అర్థం చేసుకోండి.:-

 ప్రియమైన నిజమైన భారతీయులారా దయచేసి చాలా జాగ్రత్తగా మరియు బాధ్యతతో అర్థం చేసుకోండి.:-

 ● బీజేపీ ఓడిపోవాలని పాకిస్థాన్ కోరుకుంటోంది

 ● బీజేపీ ఓడిపోవాలని చైనా కోరుకుంటోంది

 ● బీజేపీ ఓడిపోవాలని ఆయుధ లాబీ కోరుకుంటోంది

 ● ఫార్మా లాబీ బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటోంది

 ● రాడికల్ ఇస్లామిస్ట్ BJP ఓడిపోవాలని కోరుకుంటున్నాడు

 ● బీజేపీ ఓడిపోవాలని జాతీయ వ్యతిరేకులు కోరుకుంటున్నారు

 ● బీజేపీ ఓడిపోవాలని మిషనరీలు కోరుకుంటున్నారు

 ● వామపక్షాలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నాయి

 ● బీజేపీ ఓడిపోవాలని ముస్లింలు కోరుకుంటున్నారు


 ఎందుకంటే...


 బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చింది...


 ● రామమందిరం

 ● CAA / NRC

 ● కొత్త విద్యా విధానం

 ● ఆర్టికల్ 370

 ● పటిష్ట రక్షణ

 ● బిగించిన NGOలు

 ● బిగుసుకుపోయిన నక్సల్స్

 ● బిగించిన మిషనరీలు

 ● 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

 ● కరోనా టీకా

 ● కాశీ కారిడార్

 ● SPACEని జయించారు

 ● బానిసత్వం యొక్క చిహ్నాలను చెరిపివేయడం

 ● మౌలిక సదుపాయాలు

 ● IITలు

 ● AIIMS

 ● మంత్రిత్వ శాఖ స్థాయిలో అవినీతి సున్నా

 ● GST

 ● డీమానిటైజేషన్

 ● జీరో బాంబ్ బ్లాస్ట్

 ● కాశ్మీర్‌లో శాంతి

 ● మొబైల్ తయారీలో 2వది

 ● రైల్వేల 100% విద్యుదీకరణ

 ● రైల్వే గేట్లను పూర్తిగా తొలగించడం

 ● వందే భారత్ రైలు

 ● ఎలాంటి తూటా పేల్చకుండా పాకిస్థాన్‌ను నాశనం చేసింది

 ● ప్రతి ఇంటి వద్ద నీరు

 ● ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమా

 ● సీనియర్ సిటిజన్ల కోసం చార్ ధామ్ యాత్ర


 మరియు...


 ● BJP దేశాన్ని అమ్మదు

 ● చైనాతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకోదు

 ● పాకిస్తాన్ పట్ల బిజెపి మెతకగా ప్రవర్తించదు


 బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపించాలి.


 2024 BJP🚩

 2029 అవును, BJP మాత్రమే🚩

 2034 BJP🚩

 మరియు అంతకు మించి.......


 మీ చుట్టూ ఉన్న కనీసం 11 మందికి అవగాహన కల్పించి, బీజేపీయేతర ఓట్లను బీజేపీకి మార్చండి


 మా పిల్లలు సురక్షితంగా ఉన్నారు


 మన జీవితం ముగిసింది


 మేము మంచి జీవితాన్ని గడిపాము


 మేము ఇవ్వాలి ఒక

 సురక్షిత సమాజం

 సురక్షిత జీవితం

 సురక్షిత భవిష్యత్తు


 మన తర్వాతి తరం కోసం


 దీన్ని అర్థం చేసుకోండి మరియు 11 విభిన్న ప్రాంతాల సమూహంలో భాగస్వామ్యం చేయండి మరియు


 దీన్ని 11 మంది స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు వారికి ఆవశ్యకతను వివరించండి

 మీ స్వంత భద్రత & స్వేచ్ఛ కోసం ఓటు వేయండి.  జై హింద్🇮🇳

 ధన్యవాదాలు🙏


పిల్లాడి రుద్రయ్య

బిజెపి ఓబీసీ మోర్చా

ఆంద్రప్రదేశ్

SUPPORT BJP

Web Design*

 *Web Design*


👉Web Design all kinds


👉 Print on demand website 


👉 News website ( Auto blogging)


👉Ecommerce Web Site


👉Membership Web site


👉Matrimony Web Site


👉 Real estate website


👉 Online learning management website


👉 Just Dial type website



*Contact us for above services*


*Ramanakumar Palakodeti*


*Cell.No.86881 34897*

రియల్ ఎస్టేట్

 Hyderabad నగరములో కొత్తగా రియల్ ఎస్టేట్ రంగములో రావలనుకొనే వారికి ఆహ్వానం.


పెట్టుబడి లేకుండా మీ సమయమే పెట్టుబడిగా  రియల్ ఎస్టేట్ లో సంపాదించుకొనే అవకాశం.

*అర్హత* :21years &above

 *Qualification* : SSC & above

*Salary* : ₹12000/- నుంచి ₹14000/- & Insentive. *గమనిక* : కష్టపడు వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత.

ప్రసాద్ : 9494616197

Mahalaya


 

Telugu song dance


 

Bottu change


 

Kalimaa temple


 

Screw base


 

☀️Sun to earth distance


 

Amazing Robert roti maker


 

Cross transmission


 

Viveka


 

Vivekaprakaranam


 

Mrutyumjaya mantram


 

SD card working prenciple


 

నిర్మల భక్తి!*

            *నిర్మల భక్తి!*

                   


*మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు అలా ఒక రోజు  తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి, వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు.*


*ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు.*


*హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలినుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు.*


*అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు.*


*తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు.* 


*కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలునిదగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు.*


*“ఎవరు నువ్వు? ఈ వాన,చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు?” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువుననుసరించాడు.*


*గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు.*


*గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు.*


*ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు.*


*కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి.*


*అసలు కారణం     వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు.* *ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది?  తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం.*


*ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు.*


*ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి.*


*అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గురువుగారు.* 


*ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలోనుండి అనంతుడిని గమనించసాగాడు.*


*ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు. కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు.*


*అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు.* 


*వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు.*


*అనంతుడు మందిరం మధ్యలో వున్న  శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు..*

*"కృష్ణా! అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు.. నాకు చదువురాదు.. పూజలు రావు..*

*స్తోత్రాలు రావు.... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నున్ని చేసుకోవాలని వచ్చాను.    రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి  నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో..*

*"కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి...*

*"మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు.*


*"తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు.*


*బయటనుండి ఈ దృశ్యం చూసి…                 శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు.*


*తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.*


*కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భాగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో...*


 *దైవానుగ్రహం పొందాలంటే కేవలం జప తపాదులు, యజ్ఞయాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు. వాటితో బాటుగా ముఖ్యంగా కావల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి.*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

Battery test


 

Door 🔐lock


 

Motor single weel truck


 

Break


 

Bike stand


 

Abadrataa


 

Spot wealding


 

Reaction


 

Wing bike


 

Helmet


 

Pass through switch


 

Sound associated water spring


 

Twin engine


 

Magnet


 

Double bed manufacturing


 

Stnok


 

Logo technology


 

Hindu


 

వామనావతారం

 


*వామనావతారం* 


అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.

ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రము లో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.

‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.


వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.


ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.


వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!


నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.


‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.


ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.


*సేకరణ:- మామిళ్లపల్లి శర్మ గారి పోస్టు*

🙏💐🌹🌺🌸🪷🌷🌻

Nimajjanam


 

 *🌿🌼🙏మహాలయ పక్షాలు పూర్తి వివరణ🙏🌼🌿*


🌿🌼🙏29.9.2023 నుంచి 14.10.2023 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.🙏🌼🌿


🌿🌼🙏పితృదేవతలకు.... ఆకలా...?🙏🌼🌿


అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


🌿🌼🙏తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?🙏🌼🌿


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


🌿🌼🙏మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?🙏🌼🌿


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.


🌿🌼🙏పితృకార్యాలు చేయకపోతే, ఏమవుతుంది? 🙏🌼🌿


స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|

     జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.


"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


వీలైతే ఈ మహాలయ పక్షాలలో ప్రతి రోజు పితృదేవతా స్తుతి పఠించాలి


🌿🌼🙏పితృ దోష నివారణ🙏🌼🌿


పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.


ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.


మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.


పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.


పితృ దేవతా స్తుతి


శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.


నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!

దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!

నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!

శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!

శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!

నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!

తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!

నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!

శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!

వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!

నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!

యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!

కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!

నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!

స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!

సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!

సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!

భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!

తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!


పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!

తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!

పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!

యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!

పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!

ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!

తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!

సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!

తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!

యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!

కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!

తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!

యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!

పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|

తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!

తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!

తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!

యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!

తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!

ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!


అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!

వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!

అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!

తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!

ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!

రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!

సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!

విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!

భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!

కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!

వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!

విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!

మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!

గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!

పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!

ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!

త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!


మార్కండేయ ఉవాచ

ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!

ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!

తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!

జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!


రుచిరువాచ

అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!

నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!

ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!

సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!

మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!

తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!

నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!

ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!

ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!

యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!

నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!

స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!

సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!

నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!

అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!

అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!

యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!

జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!

నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!


మార్కండేయ వువాచ

ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!

నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!

తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!

నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!

తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!

వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!


శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!

పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!

అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!

యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!

సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!

తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!

శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!


(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు).


పితృదేవతా నమోస్తుతే


ఓం నమో నారాయణాయ

Dakshanaa murti story


 

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-58🌹

 *🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-58🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల ప్రసాదం:*


తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది.

ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట.

ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.

ఏడుకొండలవానికి సమర్పించే నైవేద్యం

సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి కృత్రిమ స్టవ్వులమీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు.

సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు.

తిరుమల వేంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృ దద్దోజనం అంటారు.


*లడ్డు:*

తిరుమల వేంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని మరి స్వీకరిస్తారు.

తిరుమలలో ఆవు నెయ్యితో తయారు చేయబడే ఈ లడ్డు ఇక్కడకు వచ్చే భక్తులకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు పరిమితంగా అందజేస్తారు.

శ్రీవారి లడ్డూకు జీయోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిష్ట్రీ గుర్తింపు లభించింది. ప్రపంచ చరిత్రలోనే ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ప్రసాదానికి ఇంతటి గుర్తింపు రావడం ఇదే ప్రప్రథమం.

తిరుపతి లడ్డూలది ఓ ప్రత్యేకత. ఇక్కడ ఏ గదిలో లడ్డులుంటే ఆ గదిలో సువాసనలు గుబాలిస్తుంటాయి. 

లడ్డూల తయారీలో వాడే పదార్ధాలు, ఫార్మూలాలు ప్రత్యేకంగా ఉంటాయి.

ఈ తరహలో లడ్డూను తయారు చేయాలని ప్రయత్నించిన చాలా సంస్థలు కూడా ఆ రుచిని సాధించలేకపోయాయి. అందుకే టీటీడీ వీటి తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ ఆధీనంలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీలో మాత్రం స్థానం దక్కింది. ఒక ప్రాంతంలో తయారయ్యే వస్తువులకు, ఉత్పత్తులకు జీయోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిష్ట్రీ గుర్తింపునిస్తుంది.

తిరుమలలో 1942 నుంచి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు. మొదట్లో భూందీగా ఇచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారు.

51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట.

ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు,80 ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి.

రోజుకు లక్షా పాతికవేల లడ్డూలను తితిదే పోటు కార్మికులు తయారుచేస్తున్నారు. భవిష్యత్ లో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచి భక్తులు అడిగినన్ని లడ్డూలు పంచాలనేది టీటీడీ ఆలోచన.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *37వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *37వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ జననం - 4*


వృషపర్వుడు అన్నట్టే మహా వైభవంగా ఉశనుడి స్వీకారం జరిగింది. అసురు బాలకుల విద్యా బోధనకూ , రాజసభలో మంత్రాలోచనకూ ఉశనుడు ఆరోజే నాందీ ప్రస్తావన పలికాడు.


దేవతల పట్ల అసూయ అంతస్సూత్రంగా సాగుతున్న ఉశనుడి విద్యాబోధన అసురలందరికీ మహదానందాన్ని కలిగిస్తోంది. 


అచిరకాలంలోనే తన మేధస్సుతో వృషపర్వుడిని కూడా శాసించే స్థితికి చేరుకున్నాడు. ఉశనుడు. అసుర గురువుగా ఆయన ప్రస్థానం విజయ పథంలో సాగిపోతోంది.


నిర్వికల్పానంద నీళ్ళు తాగి , రాగి పంచపాత్రను అరుగు మీద పెట్టాడు. శిష్యుల వైపు చిరునవ్వుతో చూసి , ప్రారంభించాడు. 


*"నవగ్రహ దేవతలలో ఒకడైన బుధుడి జన్మవృత్తాంతం చంద్రుడు , బృహస్పతి , శుక్రుడు (ఉశనుడు) అనే ముగ్గురు గ్రహ దేవతల చరిత్రలతో ముడిపడి ఉందని చెప్పాను కదా ! ఆ ముగ్గురి జన్మ వృత్తాంతాలూ మీరు విని ఉన్నారు. ఇప్పుడు అన్వయ క్లిష్టతకూ , గందరగోళానికీ అవకాశం లేని విధంగా - బుధుని జననగాధ వినవచ్చు !*


అనసూయ , అత్రి దంపతుల కుమారుడిగా చంద్రుడు జన్మించిన కథాంశం మీకు గుర్తుండే ఉంటుంది. అత్రి మహర్షి , తగిన వయసులో చంద్రుడికి విద్యాభ్యాసం

ప్రారంభించాడు.


*"చూడచక్కని వాడైన తన ముద్దుల కుమారుడ్ని అనసూయ మురిపెంగా చూసుకుంటోంది. తన అందంతో , ప్రవర్తనతో తల్లినీ , విద్యార్జనతో తండ్రినీ సంతోషపెడుతూ , చంద్రుడు , బాల్యాన్ని అధిగమిస్తూ , యవ్వనం వైపు అడుగులు వేస్తున్నాడు. తల్లి అనసూయ కుమారుడి వివాహ విషయం భర్త అత్రి ముందు ప్రస్తావించింది. చంద్రుడు తన దగ్గర అభ్యసించిన విద్య గోరంతనీ , ఇంకా కొండంత నేర్చుకోవాల్సి ఉందనీ , విద్యాభ్యాసం పూర్తి కానిమ్మనీ అన్నాడు అత్రి... "నిర్వికల్పానంద తన కథనాన్ని కొనసాగించాడు.*


*"ఓమ్!"* అన్నాడు ఆ పూట పాఠం ముగించిన అత్రి మహర్షి తండ్రిని అనుసరిస్తూ చంద్రుడు కళ్ళు మూసి , ప్రణవ ధ్యానం చేశాడు. ఆశ్రమం ముందు చల్లని చెట్టు నీడలో విద్యాభ్యాసానికి కూర్చున్న చంద్రుడు లేవబోయాడు. *"చంద్రా... నీతో మాట్లాడాలి , కూర్చో !"* అత్రి అన్నాడు.


చంద్రుడు అలాగే కూర్చుని , తండ్రి వైపు మౌనంగా చూశాడు.


*"నీ చదువు - నా పరిమితిలో మాత్రమే పూర్తయింది. ఇంకా పరిణతిని అందుకోలేదు'* అత్రి నవ్వుతూ అన్నాడు. *"ఎందుకంటే , విద్యా భాండాగారంలో ఎంతో ఉన్నది. పూర్వాంశమే నేను బోధించాను. ఉత్తరాంశాన్ని గురు శుశ్రూష చేస్తూ నువ్వు అభ్యసించాలి."*


*"నాకు తెలీదు. అందువల్ల అడుగుతున్నాను. మీకు తెలియని విద్య ఉందా. చెప్పండి !"* అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ అడిగింది అత్రిమహర్షిని. *"మీ కన్నా జ్ఞానులు ఎవరున్నారని ?”*


*"అదే మన చంద్రుడికి చెప్పబోతున్నాను !"* అత్రి అనసూయ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. *"మా సోదర మానస పుత్రులు అంగిరసులున్నారు కదా. ఆయనకు 'బృహస్పతి' అనే కారణజన్ముడు పుత్రుడుగా పుట్టాడు. ప్రజ్ఞకూ , ఉపజ్ఞకూ , ఆ బృహస్పతి పుట్టినిల్లు. అనన్య సామాన్యమైన మేథ ఆ బృహస్పతిని దేవ గురువుగా చేసింది..."* 


*"ఔనౌను ! అతని వివాహానికి వెళ్ళాం కూడా. మనం !"* అనసూయ అంది.


*"బృహస్పతి ప్రస్తుతం ఆశ్రమ విద్యాలయం నెలకొల్పి , అర్థులకూ , అర్హులకూ అత్రి విద్యాదానం చేస్తున్నాడు. మన చంద్రుణ్ణి ఆయన వద్దకు పంపుతున్నాను...."* అన్నాడు.


అనసూయ కొడుకుని వాత్సల్యంతో చూస్తూ అంది. *"మన చంద్రుడికి ఆ బృహస్పతి తగిన గురువు !"*


*"గురువుకు తగిన శిష్యుడు అని మనవాడు అనిపించుకోవాలి. అనసూయా !"* అత్రి చిరునవ్వుతో సరిదిద్దాడు. *"నీ ప్రయాణం రేపే, చంద్రా !"*


చంద్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అనసూయ ప్రయాణం చేయబోతున్న కుమారుడికి శాస్త్రోక్తపద్ధతిని పాటిస్తూ పరమాన్నం వండి పెట్టింది.


*"చంద్రా ! నా దగ్గర ప్రేమనూ , భక్తినీ , చనువునూ జతచేసి , ఇంత కాలం విద్య అభ్యసించావు. గురువుగారి వద్ద అలా కాదు. భక్తినీ , గౌరవాన్నీ , శ్రద్దనూ జత చేయాలి. అతి చనువు కూడదు , సుమా ! గురువు ముందు తల వాల్చుకునే మాట్లాడాలి. ఏం ?"* అత్రి ప్రవర్తనా విధానం వివరిస్తూ అన్నాడు.


*"అలాగే , నాన్నగారూ !!"* చంద్రుడు వినయంగా అన్నాడు.


*"గురుపత్ని పట్ల కూడా నువ్వు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి నాయనా ! గురుపత్ని తల్లితో సమానం ! అమ్మ స్థానాన్ని ఆక్రమించి ఆమె విద్యార్థులకు అన్నం పెడుతుంది !"* అనసూయ అంది. *"అవకాశం చిక్కినప్పుడు గురుపత్నికి కూడా ఆశ్రమ కార్యకలాపాల్లో సహాయం చేయాలి !"*


*"అలాగేమ్మా !"*


*"అనన్య సామాన్యమైన ప్రవర్తనతో , ఆదర్శవంతమైన విద్యార్జనతో అమ్మకూ , నాకూ కీర్తి తీసుకు రా , నాయనా !"* అన్నాడు అత్రి , నమస్కరిస్తున్న చంద్రుణ్ణి దీవిస్తూ.


పాదాభివందనం చేస్తున్న కుమారుణ్ణి అలాగే లేవనెత్తి , అతని నుదురు మీద సున్నితంగా ముద్దుపెట్టింది అనసూయ. 


*"నా ఆలోచనలు నీకు తోడుగా ఉంటాయి. జాగ్రత్త సుమా !"* అంది కన్నీళ్ళు ఆపుకుంటూ.


చంద్రుడు వెనుదిరిగి వెళ్తున్నాడు. అత్రీ అనసూయా ఇద్దరూ జంటగా నిలబడి దూరంగా వెళ్తూ , తమకు అడుగు అడుగుకీ దూరమవుతున్న చంద్రుణ్ణి అర్థం కాని ఉద్వేగంతో చూస్తున్నారు. అశ్రువులు అనసూయ కళ్ళకు తెరలాగా అడ్డుపడి , చంద్రుడు కనిపించకుండా చేశాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


*రేపటి నుండి బుధగ్రహ జననం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐