30, మార్చి 2026, సోమవారం

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌ద్వాదశి -‌ మఘా -‌‌ ఇందు వాసరే* (30.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వాల్మీకి రామాయణం - 20)

  శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 20)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (29-3-'26 పోష్టు తరువాయి భాగము)


పరశురాముడు, దశరథరాముడితో ఇంకా ఇలా అన్నాడు.

ఒకానొకప్పుడు దేవతలందరు శివ, విష్ణువుల బలాబలములను గురించి బ్రహ్మదేవుని అడుగగా ,

అతడు, శివ విష్ణువులకు మిథ్యావైరము కల్పించెను.

అంతట పరస్పర జయాభిలాషులైన శివుడు, విష్ణువుల మధ్య భయంకరమైన పోరాటము జరిగెను.

శ్లో // తదా తు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమమ్ /

హుం కారేణ మహాదేవః స్తంభితో ౽ థ త్రిలోచనః //

( అప్పుడు విష్ణువు ' హుం ' కారము చేయగా భయంకరమైన పరాక్రమము గల శివధనస్సు జృంభితం = ఆవులించినది, అనగా జడప్రాయమైనది.

త్రిలోచనుడైన శివుడు కూడా, స్తంభితః = కదలలేక పోయెను)

శివుడు తెప్పరిల్లి తిరిగి యుద్ధసన్నద్ధుడవగా దేవతలు ప్రళయం సంభవిస్తుందని భయపడి శివ, విష్ణువు లిరువురిని ప్రార్థించి శాంతింపజేసిరి.


శ్లో// దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః /

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ //

(అప్పుడు దేవతలు, ఋషులు, చారణులు, వచ్చి ప్రార్థింపగా ఆ దేవతాశ్రేష్ఠులైన శివ విష్ణువులు శాంతించిరి)

విష్ణువు యొక్క ' హుం ' కారమునకు శివధనస్సు జడమై పోవుటవలన దేవతలు, విష్ణువు అధికుడని భావించిరి.

యుద్ధంలో జడత్వం పొందినందుకు కోపించినవాడై, శివుడు ఆ ధనస్సును బాణసహితంగా విదేహవంశములోని 'దేవరాతు'నికి ఇచ్చివేసెను.

విష్ణువు కూడా తన ధనస్సును భృగువంశీయుడైన ఋచీక మహర్షికి న్యాసముగా ఇచ్చెను.

ఋచీకుడు ఆ ధనస్సును తన కుమారుడైన జమదగ్ని మహర్షికి ఇచ్చెను.

నా తండ్రియైన జమదగ్ని నుండి ఆ ధనస్సు నాకు సంక్రమించినది.


క్షత్రియ జాతికి చెందిన కార్తవీర్యార్జునుని పుత్రులు, తపోబలసంపన్నుడైన నా తండ్రి అస్త్రసంన్యాసము చేసి తపమొనర్చుచుండగా అతనిని చాలా దారుణంగా, శిరస్సు ఖండించి చంపివేసిరి.


దానికి ప్రతీకారంగా నేను వారందరినిసంహరించాను.

అంతేకాదు,పుట్టిన ప్రతి క్షత్రియుడిని కూడా సంహరించాను.

ఈ భూమినంతా కశ్యపునకు దానమిచ్చి, మహేంద్ర పర్వతముమీద నివసిస్తున్నాను.


నీవు చేసిన శివ ధనుర్భంగం గురించి విని నీతో ద్వందయుద్ధం చేయడానికి ఇప్పుడు వచ్చాను.


క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, నీవు ఈ వైష్ణవ ధనస్సును స్వీకరించి ఎక్కుపెట్టు.

నీవు అలా ఎక్కుపెట్టగలిగితే నీతో ద్వందయుద్ధం చేస్తాను" అన్నాడు పరశురాముడు.



శ్రీరాముడు, సహజముగా మితభాషి.

మహారాజు,తండ్రి, అయిన దశరథుడు దగ్గర వుండుటచే, ఆయనమీద ఉన్న గౌరవముతో ఇంకా మితముగా మాట్లాడుతూ, పరశురామునితో ఇలా అన్నాడు.


శ్లో// శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ/

అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితమ్//


(ఓ భార్గవా!నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మము నిర్వహించి ఋణవిముక్తుడవైన నిన్ను అభినందించుచున్నాము).


(సాటి క్షత్రియజాతిని నాశనం చేసినందుకు,పరశురాముని మీద రామునకు కోపం రాలేదు సరికదా!తన ధర్మం తాను నిర్వహించినందుకు, ఆయనను అభినందిస్తున్నాడు రాముడు.

ధర్మం ముందు స్వ, పర, పక్షపాత బుద్ధి ఉండకూడదు.

" రామో విగ్రహవాన్ ధర్మః " అనే నానుడికి ఈ శ్లోకం ఒక చక్కటి ఉదాహరణ).


రాముడు ఇంకా ఇలా అన్నాడు.

"నన్ను క్షత్రియధర్మం పాటించగల సమర్ధత లేనివానిగాను,పరాక్రమం లేని వానిగాను,భావిస్తూ నీవు నన్ను అవమానిస్తున్నావు".


శ్లో// ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్/

శరంచ ప్రతి జగ్రాహ హస్తాల్లఘు పరాక్రమ://


(ఇట్లు పలికి రాముడు శీఘ్రమైన పరాక్రమముతో,పరశురాముని చేతిలోనుండి 

ఆ విష్ణుధనస్సును, బాణమును గ్రహించెను).



(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

30-3-'26

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 66*


*దగ్ధషడద్వారణ్యం దరదలితకుసుంభసంభృతారుణ్యమ్।*

*కలయే నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యమ్||*


*భావము :*


*సకల జగము నామము, రూపము కలది. అనేక మార్గములలో దట్టమైన అరణ్యము వలె ప్రబలి ఉన్నది. అటువంటి అరణ్యమును దగ్ధం చేయడానికి అమ్మ అగ్ని నేత్రమునుండి వెలువడే ఒక్క అగ్ని కణము చాలు. కుసుంభా పుష్పమువలె రక్తవర్ణముతో యౌవనవతియై, వెలసివున్న దయాసముద్రురాలిని ధ్యానిస్తాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.



యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ ।

సర్వజ్ఞాన విమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ।। 32 ।।




ప్రతిపదార్థ:



యే — ఎవరైతే; తు — కానీ; ఎతత్ — ఈ యొక్క; అభ్యసూయంతః — లేని దోషాలు వెతుకుతూ; న, అనుతిష్ఠంతి — పాటించరో ; మే — నా యొక్క; మతం — ఉపదేశము; సర్వ-జ్ఞాన — అన్ని రకాల జ్ఞానం లో; విమూఢాన్ — భ్రాంతి నొంది; తాన్ — వారు; విద్ధి — తెలుసుకుంటారు; నష్టాన్ — భ్రష్టులైన వారు; అచేతసః — విచక్షణా జ్ఞానం లేని వారు.



తాత్పర్యము : 


 కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.

  


 వివరణ:


శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది. కానీ, మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది, కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ అన్నిసార్లూ అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోగలిగితే, అత్యల్ప జీవాత్మలమైన మనకు, మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది? అందుకే, భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం/విశ్వాసం అనేవి చాలా అవసరం. ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో, అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ (తప్పులు వెతుకుట) చేసే బదులుగా, మన బుద్ధిని సమర్పించాలి. ‘శ్రీ కృష్ణుడు అంతటి వాడు చెప్పాడే, అయితే అది తప్పకుండా సత్యమే అయిఉంటుంది, నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ఒప్పుకొని, ఆధ్యాత్మిక సాధన చేస్తా. సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చెసుకోగలను’; అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది.


జగద్గురు శంకరాచార్య, శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు : గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధా, ‘గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ.’ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు : శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ (చైతన్య చరితామృతము, మధ్య లీల, 2.62) ‘ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా, గురువు, దైవము పట్ల బలమైన నమ్మకమే, శ్రద్ధ.’ బ్రిటిష్ కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇలా అన్నాడు : ‘నిరూపించలేనప్పుడు, విశ్వాసము ద్వారానే నమ్మకాన్ని అలవరచుకో’. కాబట్టి, శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక, నిగూఢమైన అర్థం కాని భాగాలని, భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ, నమ్మకంతో విశ్వశించటమే.


కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వలన, దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో, దానిని తప్పు అని తిరస్కరిస్తుంది. శ్రీ కృష్ణుడి ఉపదేశాలు, జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ, జనులు దానిలో తప్పులు పడుతుంటారు, ఉదాహరణకి ‘దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు? ఆయన దురాశ కలవాడా? అహంకారి ఏమో, అర్జునుడిని తననే పూజించమంటున్నాడు?’ ఇలాంటి వారిని శ్రీ కృష్ణుడు 'అచేతసః' అంటే ‘విచక్షణా జ్ఞానం లేని వారు’ అంటున్నాడు, ఎందుకంటే వారికి – ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది; మంచేదో, చెడేదో; ధర్మానికి, అధర్మానికి; సృష్టికర్తకి, సృష్టింపబడిన వానికి; సర్వోన్నత యజమానికి, సేవకునికీ; తేడా తెలియదు. అలాంటి వారు ‘తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు’, ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు.