18, ఆగస్టు 2021, బుధవారం

మహాభాగవతం

 *


*వేదవ్యాసుల వారి  మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*89.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*తత్రాశ్వాః శైబ్యసుగ్రీవమేఘపుష్పబలాహకాః|*


*తమసి భ్రష్టగతయో బభూవుర్భరతర్షభ॥12099॥*


మహారాజా! శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, బలాహకము అను పేర్లుగల శ్రీకృష్ణుని రథాశ్వములు ఆ ఘోరాంధకారమున దారీతెన్నూ తెలియక తడబడసాగెను.


*89.50 (ఏబదియవ శ్లోకము)*


*తాన్ దృష్ట్వా భగవాన్ కృష్ణో మహాయోగేశ్వరేశ్వరః|*


*సహస్రాదిత్యసంకాశం స్వచక్రం ప్రాహిణోత్పురః॥12100॥*


మహాయోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన రథాశ్వముల దురవస్థను గమనించెను. వెంటనే ఆ భగవానుడు వేయి సూర్యులయొక్క కాంతులతో తేజరిల్లుచున్న తన సుదర్శన చక్రమును రథమునకు ముందుభాగమున నడపెను.


*89.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*తమః సుఘోరం గహనం కృతం మహద్విదారయద్భూరితరేణ రోచిషా|*


*మనోజవం నిర్వివిశే సుదర్శనం గుణచ్యుతో రామశరో యథా చమూః॥12101॥*


భగవత్కల్పితమైన ఆ గాఢాంధకారము ఏమాత్రమూ చొఱరానిదై భయంకరముగా నుండెను. అత్యద్భుతమైన కాంతిపుంజముతో వెలుగొందుచున్న ఆ సుదర్శనచక్రము మనోవేగముతో సాగుచు, శ్రీరాముని ధనుస్సునుండి ప్రయుక్తమైన బాణము శత్రుసైన్యమునువలె ఆ చిమ్మ చీకట్లను చీల్చుకొనుచు పురోగమించెను.


*89.52 (ఏబది రెండవ శ్లోకము)*


*ద్వారేణ చక్రాఽనుపథేన తత్తమః పరం పరం జ్యోతిరనంతపారమ్|*


*సమశ్నువానం ప్రసమీక్ష్య ఫాల్గునః ప్రతాడితాక్షో పిదధేఽక్షిణీ ఉభే॥12102॥*


సుదర్శనచక్రకాంతులను అనుసరించుచు ఆ రథము తమోమండలమును దాటెను. పిదప అది అపారముగా విస్తరించియున్న జ్యోతిర్మండలమున ప్రవేశించెను. ఆ కాంతిపుంజములు కనులలోబడి బాధించుచుండుటతో అర్జునుని కన్నులు చూడలేక మూతబడిపోయెను.


*89.53 (ఏబది మూడవ శ్లోకము)*


*తతః ప్రవిష్టః సలిలం నభస్వతా బలీయసైజద్బృహదూర్మిభూ|*


*తత్రాద్భుతం వై భవనం ద్యుమత్తమం భ్రాజన్మణిస్తంభసహస్రశోభితమ్॥12103॥*


ముందునకు సాగిపోవుచున్న శ్రీకృష్ణభగవానుని దివ్యరథము ఒక జలరాశియందు ప్రవేశించెను. ప్రచండమైన వాయువులధాటికి ఎగసిపడుచున్న తరంగములు ఆ జలధికి ఆభరణములై ఒప్పుచుండెను. ఆ జలములకు అథోభాగమునగల ఒక అద్భుత భవనమునందు ఆ రథము ప్రవేశించెను. ఆ మహాభవనము వేలకొలది మణిస్తంభములతో విరాజిల్లుచుండెను. వాటి కాంతులు నలువైపుల ప్రసరించుచు ఆ భవనశోభను ఇసుమడింప జేయుచుండెను.


*89.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*తస్మిన్ మహాభీమమనంతమద్భుతం సహస్రమూర్ధన్యఫణామణిద్యుభిః|*


*విభ్రాజమానం ద్విగుణోల్బణేక్షణం సితాచలాభం శితికంఠజిహ్వమ్॥12104॥*


ఆ మహాభవనమునందు ఆదిశేషుడు విలసిల్లుచుండెను. ఆయన శరీరము మిగుల అద్భుతమై భయంకరముగా నుండెను. ఆ స్వామి తన వేయిపడగలపైగల దివ్యమణికాంతులతో తేజరిల్లుచుండెను. ఒక్కొక్క శిరమునందుగల రెండేసి కన్నులు మిక్కిలి భయానకముగా ఉండెను. ఆ ప్రభువుయొక్క దేహము శ్వేతకాంతులను వెల్లివిరియజేయుచు స్ఫటిక పర్వతతుల్యమై అలరారుచుండెను. కంఠము, నాలుకలు నీలవర్ణ శోభితములై యుండెను. వారికి అట్టి ఆదిశేషుని దర్శనమయ్యెను.


*89.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*దదర్శ తద్భోగసుఖాసనం విభుం మహానుభావం పురుషోత్తమోత్తమమ్|*


*సాంద్రాంబుదాభం సుపిశంగవాససం ప్రసన్నవక్త్రం రుచిరాయతేక్షణమ్॥12105॥*


*89.56 (ఏబది ఆరవ శ్లోకము)*


*మహామణివ్రాతకిరీటకుండలప్రభాపరిక్షిప్తసహస్రకుంతలమ్|*


*ప్రలంబచార్వష్టభుజం సకౌస్తుభం శ్రీవత్సలక్ష్మం వనమాలయా వృతమ్॥12106॥*


అచట ఆదిశేషుని దేహమును తల్పముగా జేసికొని, దేదీప్యమానుడై వెలుగొందుచున్న శ్రీమన్నారాయణుని అర్జునుడు దర్శించెను. మహాప్రభావశాలియైన ఆ శ్రీహరి బ్రహ్మాదిదేవతలలో ఉత్తమోత్తముడు. ఆ స్వామి శరీరము దట్టమైన మేఘమువలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను. పట్టుపీతాంబరధారియైన ఆ ప్రభువుయొక్క వదనము ప్రసన్నమై, మనోహరమైన విశాలనేత్రములతో అలరారుచుండెను. ఆ దేవదేవుని ఫాలభాగమునగల అసంఖ్యాకములైన ముంగురులు మణిమయ కిరీటకుండలములకాంతులచే ద్విగుణిత శోభలను వెలార్చుచుండెను. ఆ సర్వేశ్వరుని అష్టభుజములు దీర్ఘములై, బలిష్ఠములై, మనోహరముగా నుండెను. శ్రీవత్స చిహ్నముతో ఒప్పుచున్న ఆదిదేవుని వక్షస్థలమునందు కౌస్తుభమణి, వనమాల అలంకృతములై చక్కగా విరాజిల్లుచుండెను.


*89.57 (ఏబది ఏడవ శ్లోకము)*


*సునందనందప్రముఖైః స్వపార్షదైశ్చక్రాదిభిర్మూర్తిధరైర్నిజాయుధైః|*


*పుష్ట్యా శ్రియా కీర్త్యజయాఖిలర్ధిభిర్నిషేవ్యమాణం పరమేష్ఠినాం పతిమ్॥12107॥*


బ్రహ్మాది సకల దేవతలకును అధిపతియైన ఆ శ్రీమన్నారాయణుని నందసనందాదులైన ప్రముఖ పార్షదులు, ఆకృతిని దాల్చిన శంఖచక్రాది ఆయుధములు, ఫుష్టి, శ్రీ, కీర్తి, అజ అను శక్తులు, అణిమాది సకలసిద్ధులు సేవించుచుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

పదపల్లవాలలో కొన్ని.

 *తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం...*


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం 

విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ 

ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 

*నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు 

కింకరుడే రాజగు’’ 

*బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 

వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*కాళ్ళకూరినారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’ 

*బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*బాలాంత్రపు రజనీ కాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*చలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*నండూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*నందిని సిధారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*మిట్టపల్లి సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)


వీరినందరినీ మీ పిల్లలకు పరిచయం చేయండి.....

Glimpses of the Book "Advice and Dissent"

 *✓RAHUL GANDHI who has an endless list of ADVICES for PM Modi - on how to Govern the Country - must read the BOOK - "ADVICE & DISSENT" by former RBI Governor Mr Reddy to understand how Congress Misrule brought the Indian Economy to the Brink of BANKRUPTCY.*


*✓RAHUL'S Father , RAJIV GANDHI HAD LEFT The GOVT "TIJORI" - "SAFE" - EMPTY..*

 *& The Situation was so DESPERATE that*

 

*✓CONGRESS had to PLEDGE 47 TONNES OF GOLD with ENGLAND for a LOAN OF JUST 40 CRORES !*

*✓ Read below, the Shamefully Pathetic manner in which the GOLD was transported to the Airport.*


*✓Mr .Reddy wrote that*

 *In the 70-year history of Hindustan, the ONLY years in which the Govt of India DID NOT TAKE ANY LOAN FROM WORLD BANK = From 2015 to 2019 = under MODI GOVT.*

 

*✓UNDER SONIA RAJ - IN 2013 - the UPA/ CONGRESS Govt with ECONOMIST PM MMS & the "Great" RRR as RBI Governor,*

*Most Shamefully reduced INDIAN Economy to the - ●FRAGILE FIVE LIST - ie Indian Economy was Right at the Bottom - along with South Africa, Turkey, Brazil & Indonesia.*


*✓ Within Just 5 years in 2019 - under PM MODI & BJP -The Indian Economy made it to the ●TOP 5 LIST - leaving behind even UK.*


*✓READ to KNOW HOW CONGRESS RUINED INDIAN ECONOMY*


*✓ Former RBI GOVERNOR Mr.Y.V.REDDY wrote about it in his Book, "ADVICE & DISSENT"*


■■■■■■■■■■■■■


*forwarded as recd :-*


*Glimpses of the Book "Advice and Dissent" by India's  former RBI Governor Mr Y. V. Reddy published in 2017.* 


*Excerpts:*


*In those difficult periods of Congress, RBI had to PLEDGE around 47 Tons of Gold for just Rs 40 CRORES. This was the situation of the Indian economy during those days.*


*I remember that  Indian Economy had to see the Day in the early 90's, when a country like India had to deposit its Gold in the World Bank.*.


*In the Regime of Rajiv Gandhi, the Country's "Safe" was empty and then. . .the assassination of Prime Minister Rajiv Gandhi by LTTE terrorists...*


*Then, Shri Chandrasekhar  became the new Prime Minister. The "Tijori" was empty. The government was  nervous and didn't know What to do?*


*Mr Y.V.Reddy writes that there was a frustrating atmosphere in the entire country. The Rajiv Gandhi Regime had NOT GIVEN EMPLOYMENT - Lakhs were Jobless.*


*New Businesses were not coming through and even to enter a Business, one had to get NOC from around 20 to 30 places, to get a Buisness started- LICENCE RAJ.*


*Unemployment & Frustration was there all around at the time of License Permit Raj set by the Congress Government.*


*From the 80's to the 90's, the Congress had put an end to the economy. At that point of time the case of Brokerage in Bofors Guns leaked out*


*In the Book, Mr Reddy writes that it was the  immense loot of the Gandhi family and his Corrupt Colleagues which had brought the Economy of our Country to the brink of Bankruptcy*


*In those days India's Foreign Exchange Reserves was so low that the Reserve Bank of India decided to Mortgage its Gold to the World Bank*


*The situation was so Bad  that the Country had only 15 Days of Reserve's of worth Foreign Exchange Fund to Import*.


*Then by the order of then Prime Minister Chandrashekhar, India pledged 47 tonnes of Gold to Bank of England*


*An interesting incident and an embarrassment to the Indian Public was reported. RBI had to pledge 47 Tons of Gold in the Bank of England. This was the time when there was no Mobile Phone nor Internet was there and only available mode of Communication was Land Line phone.*


*It was such a bad situation for the Reserve Bank that 47 Tonnes of Gold from the Reserve Bank Building was to be delivered by a van and the gold was to be transfered to a Ship which was sailing to England.*


*47 tonnes of Gold was sent on a very old RBI Private Van and was sent with just 2 Security Guards and a Driver. On It's way to Airport, its 2 tyres got punctured and it took nearly Hours to get the Tyres changed and the entire Gold was guarded by Two aged Security Guards.*


*After this great effort, 47 Tons of Gold reached England and Britain gave a Loan of Rs 40.05 crores to India*.


*One must know as to why Mr. Reddy gave example of this sad incident related to the Indian Economy. So that, people should know that the shameful leaders of Congress, who now accuse Modi of spoiling the Economy of the country, know all these incidents and the  contributions made by great Gandhi family and his Collegues. Because of this Family's odds, the whole country had to Mortgage its Gold -- only to get a loan of just 40 crores*


*For a country like India, what else could be more shameful and disastrous situation than this?*


*Mr Y. V. Reddy further goes and writes that he was shocked & angry when people who earlier Mortgaged the whole country for just Rs 40 crore are now blaming and say that Modi Government has ruined India's economy.*


*In the 70-years history of Hindusthan, there are only 4 years in which the Govt of India did not take any Loan from World Bank.*


*And these are the Four  years:*


*2015-16*, 

*2016-17,*

*2017-18*

*2018-19*


*Yes, those are the 4 Years which are the Gifts to Indian Public by a CHAIWAALA's Government.*


*According to Ex Governor of RBI Modi is God gift to India which few idiots still don't want to recognise......*

-----------------------------------------------

*Reddy served as governor of the Reserve Bank of India (RBI) (India's central bank) from 6 September 2003 until 5 September 2008; NOT during Modi's time.*


(Pl circulate to as many contacts as possible)!

ప్రశ్న పత్రం సంఖ్య: 20

  ప్రశ్న పత్రం సంఖ్య: 20 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

 1) భారతం లో " కృష్ణ "పేరుతో ఎందరున్నారు? ఎవరువారు? 

2) రుక్మిణి తండ్రి పేరు ఏమిటి ? 

3) ద్రోణాచార్యుని భార్య పేరు ఏమిటి ? ఆమె ఎవరికి సోదరి?

 4) పార్వతి తండ్రి పేరు ఏమిటి?

 5) నారాయణుడు సృష్టించిన అప్సరస ఎవరు ? 

6) ఇంద్రుని వద్ద ఉన్న గుర్రం పేరు ? 

7) పరీక్షిన్మహారాజు ఏ యాగాన్ని చేసాడు ? 

8) పరీక్షత్తు మహారాజు చేసే యాగాన్ని ఆపిన వారెవరు ? 

9)ఖాండవ వనమును అగ్నిచే దహింప చేసిన వారెవరు ? 

10) యోజన గంధి అని ఎవరికి పేరు కలదు?

 11) వినత కుమారులెవరు? 

12) భీమసేనుని శంఖం పేరు ఏమిటి?

 13) అర్జునుని పెండ్లాడిన నాగకన్య ఎవరు ? 

14) గాధేయుడు అంటే ఎవరు? 

15) భీముని పెండ్లాడిన రాక్షస కాంత ఎవరు ? 

16) ఉపపాండవులను చంపినదెవరు? 

17) భీష్ముని అసలు‌పేరు ఎమిటి?

 18) వికర్ణుడు ఎవరు? 

19)ధృతరాష్ట్రుని కూతురు ఎవరు ‌?

20)పాండవుల పురోహితుడు ఎవరు ?


బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు

 ఇంద్రియములను నిగ్రహించడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, తపస్సు చేయడం అంటే అనుకున్న పనిని ఒక తపస్సు లాగా శ్రద్ధాభక్తులతో చేయగలగాలి, శరీరాన్ని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం, తన జీవనానికి కావలసిన వరకే సంపాదించుకోవాలి కాని ఎక్కువ సంపదలు, సుఖాల జోలికి పోకూడదు. శరీరమును, మనస్సును శుచిగా ఉంచుకోవడం, ఓర్పువహించడం, కపటం లేకుండా, సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండటం, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనసులో అనుకున్నది, మాటలతో చెప్పేది, చేతలతో చేసేది ఒకే విధంగా ఉండాలి. నిరంతరం వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, తద్వారా జ్ఞానం సంపాదించడం, సంపాదించిన జ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకొని, ఇతరులకు మార్గదర్శకం చేయడం, దేవుడిని నమ్మడం, వేదముల మీద, శాస్త్రముల మీద నమ్మకం కలిగి వాటిని నిరంతరం అధ్యయనం చేయడం, గురువు గారి యందు భక్తి కలిగి ఉండటం, ఇవి అన్నీ బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణునికి స్వభావ సిద్ధంగా పుట్టినవి. ఈ కర్మలు ఆచరిస్తేనే అతడిని బ్రాహ్మణుడు అని


స్థూలంగా చెప్పాలంటే వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిని ఆచరించడం, వాటిని శిష్యులకు బోధించడం, ఆ విధంగా వేదవిజ్ఞానాన్ని గురుశిష్య పరంపరగా, తల్లితండ్రులు తమ కుమారులకు ఇచ్చే వారసత్వసంపదగా తరతరాలుగా వ్యాప్తి చెందించడం, మానవులను ధర్మమార్గంలో నడిపించడం..దీనినే బ్రాహ్మణ కర్మలు అని అంటారు. ఇవి చేయని వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా, కర్మరీత్యా, స్వభావ రీత్యా బ్రాహ్మణుడు కాడు అనే విషయం చెప్పనక్కరలేదు.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

ఒకరికొకరుగా

 *మంత్రాల్లోమనోశక్తిలా, 

వాక్యాలకి వాక్కులా,

మాటల్లో మనసులా,

భాషకి భావాలపలుకై,

కళ్ళకి మనసుచూపులై,

కనులరక్షణకి రెప్పలయి,

అర్ధనారీశ్వరులు ఆలుమగలు,

సార్ధక అనుబంధంచేతనాలు.

*తారాపధంకి వెన్నెలమమతై,

పూలతోటఅందాలకిసుగంధం.

స్వరాల్లో అక్షర శృతిగీతాలై,

జీవనరాగాల గమ్యంగతులు.

*ఆత్మీయానురాగాల మతులు,

అన్యోన్యానుబంధఅనుభూతై.

ఒకరికొకరుగా ఒక్కటైనసఖ్యత,

ఒక్కరైభార్యభర్తలసుఖజీవితo


.*dr.Vedula sriramasarma,

'Sirisha',

సహృదయ,కాకినాడ.

(Happy national couples day)

పరమార్థ కథలు* గురుదక్షిణ

 006


*పరమార్థ కథలు*

 పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీశుకబ్రహ్మాశ్రమము, 


శ్రీకాళహస్తి.


*గురుదక్షిణ* 


పూర్వము జనకమహారాజు మిథిలానగరమున రాజ్యమేలు చుండెను. రాజ్యకార్యములతో పాటు దైవచింతన పరమార్థ విచారణ అతడు లెస్సగా సలుపుచుండెను. అధ్యాత్మతత్త్వ జిజ్ఞాస తీవ్రతరము కాగా ఒకనా డాతడు తన దేశములో నలుమూలల నొక ప్రకటన గావించెను. “ఈ దేశములో గల పండితులు, తత్త్యజ్ఞులు, వేదాంతులు ఎవరెవరు కలరో వారందయఱును రాజధానికి వచ్చి రాజునకు బ్రహ్మజ్ఞానోపదేశము చేయవలెను. అనుభవపూర్వకముగా బోధించ వలెనే కాని నోటిమాటలతో కాదు. గుఱ్ఱపు రికాబులో ఒక కాలుపెట్టి, మరియొక రికాబులో కాలు పెట్టులోపల - అనగా క్షణకాలములో (బ్రహ్మానుభూతిని గలిగించవలెను, అట్లు కలిగింపలేని వారందఱున్ను దేశమునుండి వెడల గొట్టబడుదురు” అని దండోరా వేయించెను. 


రాజుగారి యా ప్రకటన దేశములో గొప్ప సంచలనము గలుగజేసెను. పండితులు, కవులు, శాస్త్రవేత్తలు భూపాలునకు ఆత్మతత్త్వానుభూతి కలుగజేయ గల్గునంతటి సామార్థ్యము లేనివారగు టచే దేశబహిష్కరణ శిక్షకు భయపడి అత్యంత చింతాక్రాంతులై యుండిరి. భూపతిని సమిపించుట కెవరును సాహసింపలేదు. అత్తఱి అష్టావక్రుడను మహర్షి యెచటకో పోవు చుండెను. ప్రజలందరును విచారగ్రస్తులై యుండుట జూచి కారణమరయ వారు జరిగిన విషయమును సవిస్తరముగా తెలియజేసిరి. అష్టావక్రుడు వారలకు అభయమొసంగి వెంటనే రాజప్రాసాదమున కరిగి రాజుతో తాను బ్రహ్మజ్ఞానము నుపదేశిం చెదనని ధైర్యముతో బలికెను. భూపాలుడంగీకరించెను. “ఉపదేశము ఏకాంత స్థలమునందే చేయవలెను గాని బహిరంగముగ గాదు. కావున సమిపారణ్యమునకు బోవుదము రండు” అని యమ్మునీశ్వరుడు పలుక రాజు తన అశ్వమును, కొందరు సైనికులను వెంటనిడుకొని సమిాప కాననమునకు బయల్వెడలెను. 


త్రోవలో నొకచోట సైన్యమును నిలిపివేసి, గురుశిష్యు లిరువు రును నిర్జన ప్రదేశమునకు పోయిరి. జనకు డచట తన గుజ్జపు రికాబులో కాలుపెట్టెను. “రెండవ రికాబులో కాలుపెట్టులోపల బ్రహ్మానుభూతి కలిగించవలెను”ఇది సమస్య. అత్తఱి అష్టావక్ర మునీంద్రుడు బోధకు ముందుగా గురుదక్షిణ నివవలసినదిగా రాజును కోరెను. తానేది కోరుకొనిన దానిని తప్పక నొసంగెదనని జనకుడు పలికెను. తక్షణమే అమ్మునివర్యుడు “నీ మనస్సును నా కొసంగుము' అని యాదేశింప జనకుడట్లే చేసెను. మనస్త్యాగముచే జనకుని శరీరము గుఱ్ఱముపై నిశ్చేష్టముగ నుండిపోయెను. డ్రైవరు లేని బండివలె దేహము కదలక మెదలక యుండెను. అట్టి స్థితిలో నాతని నచట వదలివైచి అష్టావక్రుడు వెడలిపోయెను. 


దూరముగా నున్న సైనికులు రాజుకై నిరీక్షించి వారి జాడ యెచ్చటను లేమి వారే స్వయముగా వెతకుటకై పయనమైరి. ఒకచోట గుఱ్ఱముపై రాజు నిశ్చేష్టుడుగ నుండుటజూచి వారాశ్చర్య నిమగ్నులై అష్టావక్రు డేదియో సమ్మోహ మంత్రమును ప్రయోగించెనని భావించి వెంటనే యాతనిని వెతికి తోడితెచ్చిరి. అష్టావక్రుడు జనకుని స్పృళింప గనే యాతనికి స్పృహ కలిగెను. జనక మహారాజా! నీవు ధన్వుడవు తృటికాలములో (బ్రహ్మానుభూతి కలుగుటకు అనువుగా నీ హృదయ మును అత్యంత పరిశుద్ధ మొనర్చుకొంటివి. మనస్సును ఒక పదార్థము వలె త్యజించివేయు సమర్థతను బడసితివి. ఇక నీకు క్రొత్తగా బోధించవలసినది లేదు. ఆత్మకు అడ్డుగా నున్న మనస్సన్నును తొలగించుటయే అన్ని బోధల యొక్క సారాంశము, అన్ని సాధనల యొక్క పర్యవసానము, అదియే అమనస్కస్థితి. మనస్సు అను అడ్డు తొలగించిన శేషించునదే ఆత్మ. అట్టి ఆత్మానుభూతియే మోక్షము. మనోలయము ద్వారా, మనస్త్యాగము ద్వారా నీవట్టి మహోచ్ఛస్థితిని బడసితివి. కావున ధన్యుడవు అని అష్టావక్రమునీంద్రుడు జనకునితో పలుక, అంతట జనకుడు తన కట్టి సులభమగు మోక్షోపాయమును బోధించిన యా సద్గురువర్యునకు సాష్టాంగవందన మాచరించెను. తదుపరి యందఱున్ను తిరిగి నగరమునకు బోయిరి. 


*నీతి:- మనస్సును బహిర్ముఖముగ పోనీయక అంతర్ముఖముగ ఆత్మయందు లయింపజేసి ఆత్మరూపుడై వర్తించుటయే మోక్షము. అట్టి మనస్త్యాగరూప ఆత్మస్థితినే జీవుడు సాధించవలెను. అదియే వాస్తవమగు గురుదక్షిణ*.

*శ్రీలలితా సహస్రనామ భాష్యము* *972వ నామ

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*972వ నామ మంత్రము* 18.8.2021


*ఓం అశోభనాయై నమః*


అద్వితీయ సౌందర్యముతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అశోభనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం అశోభనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చించు భక్తజనులకు ఆ తల్లి కొంగుబంగారమై సకలాభీష్టములను సిద్ధింపజేయును.


జగన్మాత త్రిపురసుందరి. నిత్యయౌవనవతి. జగదేకసుందరి. కామేశ్వరుడే అత్యంత సుందరస్వరూపుడైతే, కామేశ్వరి (అమ్మవారు) ఆయనను మించిన అపురూప లావణ్యవతి. 


*ఉద్యద్భాను సహస్రాభ* ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బోలిన కాంతితో తేజరిల్లునది ఆ తల్లి.


*నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల* తన ఎర్రని శరీర కాంతితో సమస్త బ్రహ్మాండములను ప్రకాశింపజేయునది శ్రీమాత.


*చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ* సహజ సుగంధపూరితమైన తన కేశసంపదతో చంపకాశోకపున్నాగాది కుసుమములకు సుగంధములను అందజేయునది పరమేశ్వరి.


*కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత* పద్మరాగ మణులతో ప్రకాశించు కిరీటంతో భాసిల్లు లలితాంబిక.


*అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభిత* అష్టమితిథి నాటి చంద్రునివలె ప్రకాశించే లలాటము గలిగినది ఆ జగదీశ్వరి.


*వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక* జగన్మాత వదనము మన్మథుని మంగళప్రదమైన గృహము. అటువంటి మంగళప్రదమైన గృహమునకు అమ్మవారి కనుబొమలు మన్మథ మాంగల్య గృహమునకు తోరణములై ప్రకాశించుచున్నవి.


*వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన* ఆ శ్రీమాత తన ముఖకాంతి అనే జలప్రవాహమునందు సంచరించు మీనముల కన్నులవంటి నయనములు కలిగినది..


*నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత* పరమేశ్వరి నాసాదండము (ముక్కు ఆకారము) అప్పుడే వికసించిన సంపెంగ వలె అతి కోమలముగాను, సుందరముగాను ఉన్నది. అనగా సంపంగి వంటి నాసిక కలిగినది శ్రీమాత.


*తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర* ముక్కుకు ఉన్న ముక్కెర కాంతులు అత్యంత మనోహరమైన దేదీప్యమాన కాంతులను విరజిమ్ముతూ, శుక్రనక్షత్రకాంతులనే త్రోసిపుచ్చుచున్నంతగా భాసిల్లునది ఆ అమ్మవారు.


*కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా* కదంబ కుసుమముల గుత్తిని చెవులపై భాగంలో ధరించుడంచేత ఆ తల్లి రమణీయమగా భాసిల్లుచున్నది.


*తాటంక యుగళీ భూత తపనోడుప మండలా* అమ్మవారి చెవులకు ఉన్న చెవికమ్మలు రెండునూ సూర్యచంద్రులను తలపించుచున్నంత రమణీయమైన కాంతులను విరజిమ్ముచుండెను.


*పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః* పద్మరాగ శిలలను లేదా అద్దమును సైతం తిరస్కరించేటటువంటి నున్ననైన, నిర్మలమైన చెక్కిలి గలిగియున్నది ఆ శ్రీమాత.


*నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛద* అప్ఫుడే సాన బట్టిన పగడము లేదా దొండపండుల కాంతులను మించిన ఎర్రని కాంతులను జిమ్ముచూ ప్రకాశించే పెదవులతో తేజరిల్లుచున్నది ఆ పరమేశ్వరి.


ఇంకనూ చెప్పాలంటే అమ్మవారి దంతపంక్తులజంట శ్రీవిద్యయందున్న పదహారు వర్ణమలు (అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం ఆః) అను నట్లుగను, మల్లెమొగ్గల మాదిరిగను అలరారుచున్నవి. వర్ణింపనలవి గాని చుబుకము, అంగద, కేయూరములు అను కాంచనాభరణములతో రాజిల్లు భుజములతోను, రత్నములు, ముత్యములతో చేయబడిన బంగారు కంఠాభరణములతోను, ఎర్రని వస్త్రమును ధరించిన భాసిల్లుచున్న కటిప్రదేశముతోను, చిఱుగంటలతో కూడిన వడ్డాణముతోను, మాణిక్యాలచే నిర్మితమైన కిరీటం వంటి మోకాలు చిప్పలతోను, ఎర్రని ఆరుద్రపురుగులచే చెక్కబడిన అమ్ములపొదులవంటి జంఘలు (పిక్కల) తోను, బలిష్ఠమైన చీలమండల సౌందర్యముతోను, పద్మములను సైతము ధిక్కరించే మృదువైన, సుకుమార లక్షణములతో కూడిన పాద ద్వయంతోను - పరమేశ్వరి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లుచున్నది. గనుకనే *అశోభనా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అశోభనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బ్రాహ్మణ ఉవాచ*


*89.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*సంకర్షణో వాసుదేవః ప్రద్యుమ్నో ధన్వినాం వరః|*


*అనిరుద్ధోఽప్రతిరథో న త్రాతుం శక్నువంతి యత్॥12081॥*


*89.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*తత్కథం ను భవాన్ కర్మ దుష్కరం జగదీశ్వరైః|*


*చికీర్షసి త్వం బాలిశ్యాత్తన్న శ్రద్దధ్మహే వయమ్॥12082॥*


*అంతట బ్రాహ్మణుడు ఇట్లనెను* ""అర్జునా! బలరాముడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు ధనుర్ధాలలో అగ్రేసరులు. అనిరుద్ధుడు తిరుగులేని యోధుడు. అంతటివారే మా పుత్రులను రక్షింపజాలరైరి. ఆ జగదీశ్వరులకే అసాధ్యమైన ఈ పనిని నీవు ఎట్లు చేయగలవు? అజ్ఞానమువలన నీవు దీనికి సాహసించుచున్నావు. ఈ విషయమున మేము నిన్ను విశ్వసింపము".


*అర్జున ఉవాచ*


*89.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*నాహం సంకర్షణో బ్రహ్మన్ న కృష్ణః కార్ష్ణిరేవ చ|*


*అహం వా అర్జునో నామ గాండీవం యస్య వై ధనుః॥12083॥*


*89.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*మావమంస్థా మమ బ్రహ్మన్ వీర్యం త్ర్యంబకతోషణమ్|*


*మృత్యుం విజిత్య ప్రధనే ఆనేష్యే తే ప్రజాం ప్రభో॥12084॥*


*అర్జునుడు ఇట్లనెను* "బ్రాహ్మణోత్తమా! నేను బలరాముడను కాను, కృష్ణుడనుగాను, ప్రద్యుమ్నుడను కానేకాను. నేను జగత్ప్రసిద్ధమైన గాండవ ధనుస్సును చేబూనిన అర్జునుడను. భూసురశ్రేష్ఠా! ముక్కంటినే సంతోషపఱచిన (ముక్కంటియే మెచ్చుకొనిన) నా పరాక్రమమును చులకన చేయవలదు. మృత్యుదేవతనైనను యుద్ధమున జయించి, నీ సంతానమును తీసికొనివచ్చి నీకు అప్పగించెదను"


*89.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఏవం విశ్రంభితో విప్రః ఫాల్గునేన పరంతప|*


*జగామ స్వగృహం ప్రీతః పార్థవీర్యం నిశామయన్॥12085॥*


మహారాజా! అంతట ఆ విప్రునకు అర్జునుని మాటలపై విశ్వాసము కుదురుకొనెను. పిమ్మట అతడు పార్థుని పరాక్రమమును కొనియాడుచు సంతోషముతో తన గృహమునకు చేరెను.


*89.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*ప్రసూతికాల ఆసన్నే భార్యాయా ద్విజసత్తమః|*


*పాహి పాహి ప్రజాం మృత్యోరిత్యాహార్జునమాతురః॥12086॥*


కొంతకాలమునకు ఆ విప్రుని భార్యకు ప్రసవకాలము సమీపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆతురతతో అర్జునుని కడకు వచ్చి, "మహాత్మా! నా సంతానమును మృత్యువునుండి రక్షింపుము' అని వేడుకొనెను.


*89.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*స ఉపస్పృశ్య శుచ్యంభో నమస్కృత్య మహేశ్వరమ్|*


*దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సజ్యం గాండీవమాదదే॥12087॥*


వెంటనే అర్జునుడు పవిత్రజలములను ఆచమించి, పరమశివునకు నమస్కరించెను. పిదప అతడు దివ్యాస్త్రములను సంస్మరించి, గాండీవధనుస్సును చేబూని అల్లెత్రాడును సంధించెను.


*89.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*న్యరుణత్సూతికాగారం శరైర్నానాస్త్రయోజితైః|*


*తిర్యగూర్ధ్వమధః పార్థశ్చకార శరపంజరమ్॥12088॥*


పిదప పార్థుడు వివిధములగు అస్త్రములను అభిమంత్రించి, సూతికా గృహమునకు అన్నివైపుల యందును శరపంజరమును నిర్మించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 22

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 22       

                           SLOKAM : 22

                                   


भक्तापाय भुजङ्ग गारुडमणि:  

                              त्रैलोक्यरक्षामणि:

गोपीलोचन चातकाम्बुदमणिः 

                             सौन्दर्यमुद्रामणिः I   

यः कान्तामणि रुक्मिणी घनकुच  

                              द्वन्द्वैक भूषामणिः     

श्रेयो देवशिखामणिर्दिशतु नो 

                              गोपालचूडामणिः ॥ २२॥


భక్తాపాయ భుజంగ గారుడమణి: 

                      త్త్రైలోక్యరక్షామణి:

గోపీలోచన చాతకామ్బుద మణిః   

                  సౌందర్యముద్రామణి: I

య: కాన్తామణి రుక్మిణీ ఘన కుచ 

                  ద్వన్ద్వైకభూషామణి:

శ్రేయో దేవ శిఖామణి ర్దిశతు నో 

              గోపాలచూడామణి: ॥ 22    



    సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు.    

    దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! 

    దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. 

    అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. 

    సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి.    

    వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. 

    అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. 

    ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామణి.  

    లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. 

    ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. 

     ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. 

    ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను(పాములను) దరిచేరకుండ తొలగించును.  


    He is the jewel riding on the back of Garuḍa, who carries away the Lord’s devotees on his wings. 

    He is the magic jewel protecting the three worlds,    

    the jewel like cloud attracting the cātaka-bird eyes of the gopīs, and 

    the jewel among all who gesture gracefully. 

    He is the only jeweled ornament on the ample breasts of Queen Rukmiṇī, 

   who is herself the jewel of beloved consorts. 

   May that crown jewel of all gods, the best of the cowherds, grant us the supreme benediction.  



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*కుమార్తె కాదు..కుమారుడు!*


శ్రీ మీరాశెట్టి గారికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మీద విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉండేవి..తాను నిర్మించిన ఆశ్రమం లోనే శ్రీ స్వామివారు వుంటున్నారనే భావన ఆయన మనసులో ఉండేది కాదు..అందరిలాగానే తాను కూడా శ్రీ స్వామివారి భక్తులలో ఒకడిగా ఉండడానికి ఇష్టపడేవారు..ఎవరికి ఏ సమస్య వచ్చినా..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారి సమాధి వద్ద మొర పెట్టుకోమని చెపుతూ వుండేవారు..ధనవంతుడిగా వున్నా..అత్యంత సాధారణ జీవనం గడిపేవారు శ్రీ మీరాశెట్టి గారు..అందిరితోనూ కలుపుగోలు గా వుండేవారు..


ఒకసారి శ్రీ మీరాశెట్టి గారు వింజమూరు వెళ్లారు..అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది పన్నెండేళ్ళ పైనే అవుతోంది..తనకు తెలిసిన వారింటివద్ద కూర్చుని లౌకిక వ్యవహారాలు మాట్లాడుకోసాగారు..సుమారు ఐదారుగురు కూర్చుని వున్నారు..అందులో ఉన్న నారాయణ అనే వ్యక్తి ని చూసి.."ఏరా..నీ భార్య కు ఇప్పుడు ఎన్నో నెల?..కాన్పు కు ఈ వూరిలోనే ఉంచుతున్నావా?..నెల్లూరు తీసుకెళుతున్నావా?.." అన్నారు..


నారాయణ నిస్పృహతో చూసాడు..


"ఎన్నో నెల అయితే ఏమిటీ మామా?..ఆరోనెల నిండింది..ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని డాక్టర్ గారు చెప్పారు..ఇప్పటికి ముగ్గురు ఆడపిల్లలు వున్నారు..మొగపిల్లవాడు పుట్టాలని కోరుకున్నాము..మా దురదృష్టం..ఈసారీ కూతురే..ఈ కాన్పు తర్వాత, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తాను...ఈ నలుగురిని పెంచి..పెళ్లిళ్లు చేసి పంపిస్తే చాలు.."అన్నాడు..


మీరాశెట్టి గారు ఒక్కక్షణం ఆగి.."నారాయణా..నువ్వూ నీ భార్యా కలిసి..రేప్పొద్దున్నే మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్ద మొగపిల్లవాడు పుట్టాలని మొక్కుకోండి.. ఆ స్వామిని వేడుకోండి.. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది.." అన్నారు..


"మామా!..డాక్టరు గారు ఆడపిల్లే పుడుతుందని తేల్చి చెప్పారు..ఇప్పుడు మనం మొక్కుకుంటే మాత్రం కడుపులో ఉన్న బిడ్డ మారుతుందా?..నువ్వు చాదస్తం గా చెప్పొద్దు..నా తలరాత ఇంతే..నన్ను సతాయించవద్దు..మామా..నట్టింట్లో ఆడపిల్ల తిరుగుతుంటే సంతోషంగా ఉంటుంది..కాదనను..కానీ పుట్టిన ముగ్గురూ ఆడపిల్లలే కదా..మొగపిల్లవాడు పుట్టాలని కోరుకోవడం లో తప్పులేదు కదా?..కానీ చేసేదేముంది?..డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పేసాక కూడా.. దేవుళ్లను మొక్కుకోవడం..ఆపైన ఆశపడటం..ఇవన్నీ శుద్ధ దండగ.." అన్నాడు నిరాశతో!..


"అది కాదురా..నా మాట విని రేపు మొగలిచెర్ల వెళ్లి ఆ స్వామి దగ్గర మొక్కుకోండి..నేను ఖచ్చితంగా చెపుతున్నాను..నీకు మొగపిల్లవాడు పుడితే..మొగలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద శని, ఆది వారాల్లో అన్నదానం చేయిస్తానని చెప్పు..పెద్దవాడిని.. చెపుతున్న మాట ఆలకించు.." అన్నారు..


"మామా..నీ మాటే వింటాను..కానీ నేను, నా భార్యా ఇద్దరమూ కూడా మా ఇంట్లోనే ఆ దత్తాత్రేయుడి పటం పెట్టుకొని..ఇక్కడే మొక్కుకుంటాము..నీ మాట ప్రకారం ఆ స్వామి దయవల్ల మాకు మొగ సంతానం కలిగితే..ఒక వారం కాదు మామా..మూడు వారాలు వరుసగా నేనే అన్నదానం చేస్తాను..ఎంతమందికైనా అన్నం పెడతాను..సరేనా?.." అన్నాడు నారాయణ..


మీరాశెట్టి గారు అలాగే చేయండి అని నారాయణ తో చెప్పి, శ్రీ స్వామివారి పటం తెప్పించి..వాళ్ళింట్లో పెట్టించారు..నారాయణ దంపతులు శుచిగా స్నానం చేసి, ఆ పటాన్ని తమ పూజాపీఠం లో పెట్టుకొని..మొగ సంతానం కలగాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు..


ఆ దంపతులు శ్రీ స్వామివారి పటానికి రోజూ భక్తిగా నమస్కారం చేసుకుంటూ వున్నారు..మరో మూడు నెలలు గడిచాయి..నారాయణ భార్య కు ప్రసవం జరిగి..మొగపిల్లవాడు పుట్టాడు..నారాయణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..ఉన్న ఫళంగా మీరాశెట్టి గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని..అక్కడికి వెళ్ళిపోయాడు..నేరుగా మీరాశెట్టి గారి కాళ్లకు నమస్కారం పెట్టి.."మామా..నువ్వు చెప్పినట్లే మాకు మొగపిల్లవాడు పుట్టాడు..అంతా ఆ స్వామి దయ.." అన్నాడు..


మీరాశెట్టి గారు నవ్వి.."ఆ దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటే న్యాయం చేస్తాడని నేను ముందే చెప్పాను కదరా!..నువ్వు స్థిమితం పొంది..వీలున్నంత తొందరలో మొగలిచెర్ల వెళ్లి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని.. అక్కడ అన్నదానం చేయించు.." అన్నారు..


మరో నెల తర్వాత నారాయణ భార్యా సమేతంగా మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నాడు.. తాను చెప్పిన విధంగానే..మూడు వారాల పాటు, ప్రతి శని ఆదివారాల్లో అన్నదానం చేసాడు..


మీరాశెట్టి గారికి శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తీ విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి..మీరాశెట్టి గారి ద్వారా తెలుసుకున్న మరో అనుభవం రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).