7, ఫిబ్రవరి 2021, ఆదివారం

విమల ఏకాదశి, షట్తిల ఏకాదశి

 07/02/ 2021 - ఆదివారం - 

విమల ఏకాదశి, షట్తిల ఏకాదశి 


ఈ రోజున స్నానం చేసే నీటిలో నువ్వులు కలుపుకుని చెయ్యాలి...

 నువ్వులను ఆహారంలో స్వీకరించడం, 

మంచినీటిలో నువ్వులను కలుపుకోవడం, 

నువ్వులతో హోమం చెయ్యడం,

నువ్వులతో దేవుని పూజించడం,

నువ్వులను దానం చేయడం చెయ్యాలి - 

ఈ విధంగా ఇది షట్తిల ఏకాదశి అయింది.....


షట్తిల మంటే...

1,తిల స్నానము,  

2,తిల దీపము,  

3,తిలహోమము,  

4,తిలతర్పణము, 

5,తిల భక్షణము, 

6,తిల దానము... 

[ఇది నాకు తెలిసినది.... దీని విధి విధానములు కూడా!?] 



మకర సంక్రాంతి లో షట్తిల విశేషము... అలాగే ఆ పక్షములో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అని వ్యవహరిస్తారు...



తిలస్నాయీ

తిలోద్వర్తీ

తిలహోమీ

తీలోదకీ

తిలభుక్

తిలదాతా చ

షట్ తిలాః పాపనాశనాః.

🙏✨💖🌷

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్* 🙏

🌸 *సుభాషితమ్* 🌸

 

శ్లో|| ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాన్తిరుత్తమా|

విద్యైకా పరమా తృప్తిః అహింసైకా సుఖావహా||


తా|| "ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును"...... 

🙏💖✨🌷

మొగలిచెర్ల

 *సమస్య..సత్వర పరిష్కారం..*


"ఒకసారి మొగిలిచెర్ల కు వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధి ని దర్శించాలని చాలా రోజుల నుంచీ అనుకుంటున్నాను..ఎలా రావాలో తెలియదు..మీకు ఫోన్ చేద్దామని ప్రయత్నం చేసిన ప్రతిసారీ..ఏదో ఒక అడ్డంకి రావడం..ఆ సమయానికి ఆ పనిలో మునిగిపోవడం..జరుగుతున్నది..ఈరోజు ఉదయం గట్టిగా నిర్ణయం తీసుకున్నాను..అందుకే నా నిత్యపూజ పూర్తి చేసుకొని..దత్తాత్రేయుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను..నా పేరు శ్రీవల్లి..మా వారు సాయిరాం గారు..బాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు..కొన్ని సమస్యలలో ఉన్నాము..ఆ స్వామివారి సమాధిని దర్శించుకొని గట్టిగా మొక్కుకుంటే..కొంతవరకూ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాము..దయచేసి ఎలా రావాలో చెప్పండి.." అని ఆవిడ నాతో ప్రాధేయపడింది..వాళ్ళు వుండే ఊరు కనుక్కుని..అక్కడినుండి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి రూట్ చెప్పి..గూగుల్ మాప్ లింక్ కూడా వాట్సప్ చేసాను..త్వరలోనే వస్తామని చెప్పింది..


మరో పదిరోజుల తరువాత ఒక మంగళవారం నాటి ఉదయం తొమ్మిది గంటల వేళ నేను స్వామివారి మందిరం లో కూర్చుని ఉండగా..ఇద్దరు వ్యక్తులు..వాళ్ళను చూడగానే దంపతులు తెలుస్తున్నది..లోపలికి వచ్చారు..నన్ను చూసి నేరుగా నా దగ్గరకు వచ్చి.."మీరు ప్రసాద్ గారే కదా..?" అన్నారు..అవును అన్నాను.."నేను శ్రీవల్లిని..పదిరోజుల ముందు మీతో మాట్లాడాను..మావారు సాయిరాం గారు..స్వామివారి దర్శనానికి వచ్చాము..వీలుంటే ఒక రూమ్ ఇప్పించండి..స్నానం చేసి వస్తాము.." అన్నారు..మా సిబ్బందికి చెప్పి రూమ్ కేటాయించాము..మరో గంట తరువాత ఇద్దరూ స్నానాదికాలు ముగించుకొని మందిరం లోకి వచ్చారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి,భక్తిగా నమస్కారం చేసుకొని..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి గది గడప ఇవతలి నుంచే..దాదాపుగా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ప్రణమిల్లి ఇవతలికి వచ్చారు..


"మాకు ఒక తీవ్రమైన సమస్య ఎదురైంది..ఏం చేయాలో తెలీక కొట్టుమిట్టాడుతున్నాము..ఒక రకంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాము..మావారు బాంక్ మేనేజర్ గా వున్నారు..తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశ్యంతో..అతను పాడుకొన్న చిట్ కు గ్యారెంటీ కోసం సంతకం చేశారు..ఆ స్నేహితుడూ ఈయన తో సమానమైన ఉద్యోగస్తుడే..కొన్ని నెలలు అతను చిట్ వాయిదాలు సక్రమంగా కట్టాడు..ఆ తరువాత ఆర్ధిక ఇబ్బందులు ఎదురై..చిట్ తాలూకు బకాయిలు కట్టలేదు..చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మా వారి మీద వత్తిడి తెచ్చారు..అంత డబ్బు కట్టే స్తోమత మాకు లేదు..స్నేహితుడు ముఖం చాటేశాడు..కంపెనీ వాళ్ళు కోర్టుకు వెళతామని బెదిరిస్తున్నారు..ఒక బాంక్ మేనేజర్ గా వుండి..కోర్టుకు వెళితే..పరువు పోతుందని బాగా బాధపడుతున్నాము..ఏ దిక్కూ తోచక..ఈ స్వామివారిని వేడుకొందామని వచ్చాము..రెండు రోజులు సెలవు పెట్టాము..ఈరాత్రికి, రేపు రాత్రికి ఇక్కడ నిద్ర చేసి..ఎల్లుండి గురువారం ఉదయం కూడా స్వామివారి సమాధి వద్ద మరొక్కసారి మొక్కుకొని వెళ్లిపోతాము.." అని చెప్పారు..సరే మీ ఇష్టం అన్నాను..


ఆరోజు సాయంత్రం స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేశారు..అలాగే ప్రక్కరోజు ఉదయం సాయంత్రం..మళ్లీ గురువారం ఉదయం..వరుసగా మూడురోజులూ 108 సారు మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు..అలా చేయమని మేమెవ్వరమూ చెప్పలేదు..ఆ దంపతులిద్దరూ అనుకోని ఆ విధంగా చేశారు..గురువారం ఉదయం శ్రీ స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని..నాతో వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత వచ్చే ఆదివారం ఉదయం..స్వామివారి మందిరం లో భక్తులు ఎక్కువగా వచ్చి వున్నారు..నేనూ మా సిబ్బందీ బాగా పనిలో ఉన్నాము..ఆ సమయం లో ఈ దంపతులు, వారితో పాటు మరో భార్యాభర్తలు వచ్చారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వారు..టికెట్ కొనుక్కొని వచ్చారు..నలుగురూ లోపలికి వెళ్లి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వచ్చారు.."ప్రసాద్ గారూ..సాక్షాత్తు స్వామివారు మా వెనుకే వుండి..మమ్మల్ని రక్షించారు..నేను గ్యారెంటార్ గా ఉన్నది ఇదుగో ఇతనికే..మొన్న శుక్రవారం నాడు ఇతని స్థలం ఒకటి అమ్ముడుపోయింది..చిట్ వాళ్లకు ఆరోజే కొంత సొమ్ము కట్టాడు..నా మీద ఉన్న పెద్ద బరువు దిగిపోయింది..స్వామివారిని మేము వేడుకున్న ఫలితమే ఇది..ఆ మాటే ఇతనికి చెప్పాను..ఆలస్యం చేయకుండా స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి బైలుదేరుతుంటే..వీళ్ళు కూడా వస్తామన్నారు..తీసుకొచ్చాము..ఇంత త్వరగా నేను గట్టున పెడతానని ఊహించలేదు..వత్తిడిలో వున్నప్పుడు..మా స్నేహాన్ని కూడా శంకించాను..కానీ అతని ప్రయత్నాలు అతను చేస్తున్నాడని గ్రహించలేదు..ఏది ఏమైనా..ఇద్దరమూ గట్టున పడ్డాము.." అంటూ చెప్పాడు సాయిరాం..శ్రీవల్లి గారు ఏకంగా కన్నీళ్లే పెట్టుకున్నారు..


"మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడింది.." అన్నాను..ఆరోజు మధ్యాహ్నం ఆ నలుగురూ స్వామివారి వద్ద భోజనం చేసి తిరిగి వెళ్లారు..రాబోయే కార్తీక మాసం లోని ఒక సోమవారం నాడు ఇక్కడికి వచ్చి, స్వామివారికి అభిషేకము చేయించుకొని..ఆరోజు అన్నదానం చేస్తామని చెప్పి వెళ్లారు..


స్వామివారిలీలలు, భక్తుల అనుభవాలు కళ్లారా చూస్తూనే ఉంటాము..కానీ ప్రతిసారీ మాకు కొత్తగానే ఉంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).