11, అక్టోబర్ 2022, మంగళవారం

Srimadhandhra Bhagavatham

 [11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 18 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు. అనంతరము శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి ‘నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమందిని చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే ఆర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి. అని సూటీపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు. పాపం భీష్ముడు, ఆ వయస్సులో అన్నిమాటలు విని ఒకరోజు దుర్యోధనునితో ‘దుర్యోధనా! ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని!’ అని మండలాకారమయిన ధనుస్సును పట్టుకున్నాడు.

ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్నివేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధమునకు పాండవులు గజగజ వణికి పోయారు. అర్జునుడిని భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వచ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారధ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుస్సు పట్టనని ఏ విధమయిన అస్త్ర శస్త్రములను పట్టాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు. భీష్ముడు ‘సర్వ సైన్యాధిపతిగా నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను’ అన్నాడు.


కృష్ణుడు పరమాత్మని భీష్ముడికి తెలుసు. కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది.


కృష్ణుని మోదుగచెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు కారిపోతున్నది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి క్రిందికి దిగిపోయాడు. భీష్ముడు తన కోదండమును పక్కనపెట్టి కృష్ణుడికి నమస్కరించాడు.


పదిరోజుల యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజుగారు కృష్ణుడిని పిలిచి ‘పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు అరివీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా? అని కృష్ణ పరమాత్మని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు ‘దీనికి ఒక్కటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు. నేను మీతో వస్తాను పదండి’ అన్నాడు.


అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజుగారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ‘ధర్మజా ! ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదయినా కోరుకో’ అని చెప్పాడు. ధర్మరాజు ‘తాతా ! నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాతా?’ అని అడిగాడు. భీష్ముడు ఒక నవ్వు నవ్వి ‘నా చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞచూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుస్సును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీవచ్చి బాణం వేస్తే, ఎవరిదయినా పతాకం క్రిందికి జారిపోతే, వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకము క్రిందకు జారిపోదు. మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. శిఖండి బాణములు వేస్తే నేను ధనుస్సు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను. వెనకనుండి అర్జునునితో బాణపరంపరను కురిపించి, నా శరీరమును పడగొట్టండి’ అని చెప్పాడు. పాండవులు ‘అలాగే తాతా’ అని చెప్పి వెళ్ళిపోయారు.


శిబిరములోకి వెళ్ళిన తరువాత అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ‘మహానుభావుడు! తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్నా అని మేము ఎవరిని పిలవాలో తెలియక కౌరవులు మమ్మల్ని బాధపెడుతుంటే మాపట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి మేము నాన్నని పిలిస్తే నేను నాన్నను కాను నేను తాతనని చెప్పి ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తియై తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి పోయాడు. సవ్యసాచియై గాండీవం పట్టుకుని, శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్యా?’ అని అడిగాడు. కృష్ణుడు ‘కొట్టక తప్పదు ధర్మం కోసం కొట్టవలసిందే. నీవు కొట్టు’ అన్నాడు.


యుద్ధమునకు శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరుబాణములు వేశాడు. భీష్ముని కవచం పిట్లి పోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతేలేదు. భీష్ముని శరీరములో బొటనవేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే! మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపులనుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు. ఒక్క తలవెనక మాత్రం బాణములు తగలలేదు. ఒంటినిండా బాణపరంపరను వేసిన తరువాత సూర్యుడు అస్తమిస్తున్న సమయములో భీష్ముడు రథం మీదనుంచి పడిపోయినపుడు ఆయన శరీరము భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు. యుద్ధం ఆపి అందరు పరుగు పరుగున భీష్ముని దగ్గరకు వచ్చారు. భీష్ముడు ‘నాపని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరమును విడిచిపెట్టను. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత రథసప్తమినాడు రథం ఉత్తరదిక్కుకు తిరిగాక, ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచి పెడతాను’ అని అర్జునుని పిలిచి, ‘నా తల వెనక్కి వ్రేలాడి పోతున్నది. నా మర్మ స్థానములు అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు’ అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు. ‘ఈ తలగడలు కాదు. నాకు కావలసింది యుద్ధ భూమియందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు’ అని భీష్ముడు అంటే అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని ‘నేను ఈ యుద్ధభూమి యందే పడి ఉంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి’ అని కందకం తవ్వించుకుని ఆ భూమిమీద పడి ఉండిపోయాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 17 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

ఒకచోట అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కొనడం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ‘ఏమిటి నీ కోరిక’ అని అడిగాడు. ఆమె ‘భీష్ముడిని నిగ్రహించాలి’ అని చెప్పింది. ఆయన ‘అది నేను చెప్పలేను. భీష్ముడికి వరం ఉన్నది. చేతిలో ధనుస్సు ఉండగా ఆయనను ఎవరూ చంపలేరు. పైగా ఆయన మహాధర్మజ్ఞుడు. నేను నీకొక పుష్పమాలను ఇస్తాను. ఈ పుష్పమాల మెడలో వేసుకొని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు’ అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందరో రాజులను అడిగింది. వాళ్ళు ‘మహాధర్మాత్ముడయిన భీష్మునితో మేము ఎందుకు యుద్ధం చేయాలి? ఆయనను ఎందుకు సంహరించాలి? ఆ మాలను మేము వేసుకోము. ఆయనతో యుద్ధం చేయము’ అన్నారు. ఆమె మా మాలను ద్రుపద రాజుగారి ఇంటి రాజద్వారము మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యి ఏమికావాలి? అని అడిగాడు. అంటే ‘భీష్ముడిని సంహరించాలి’ అన్నది. రుద్రుడు ‘నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు. వచ్చే జన్మలో నీకోరిక తీరుతుంది. నీ శరీరము విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమ' ని చెప్పాడు. ఆమె యోగాగ్నిలో శరీరమును వదిలివేసి మరల పుట్టింది.

ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదయి పుడితే భీష్ముడు యుద్ధం చేయడు. మగవాడిగా మారాలి. మళ్ళీ తపస్సు చేసి మగవానిగా మారింది. శిఖండి అని పేరు పెట్టారు. శిఖండి వెనుక అంత కథ ఉన్నది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవపక్షములో చేరాడు. మహానుభావుడు భీష్ముడు తన జీవితములో ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్ర వీర్యునికి అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమయిన కొంతకాలమునకు విచిత్ర వీర్యునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక, అంబాలిక విధవలు అయిపోయారు. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీ దేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆమె కొడుకులు, మనవలు లేక వంశం ఆగిపోయింది. సత్యవతీదేవి భీష్ముడిని పిలిచి ‘భీష్మా! వంశము ఆగిపోయింది. యుగధర్మము అనుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళయిన అంబిక, అంబాలికలయందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తరువాత నీవు వారితో సంగమిస్తే మరల వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా చేయడములో దోషం లేదు.

భీష్ముడు –‘అమ్మా! నేను ఆనాడు ప్రతిజ్ఞచేశాను. నేను బ్రహ్మచర్య నిష్ఠయందు ఉన్నవాడిని. వంశము లేకపోతే నేను ఏమీ చేయలేను. నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే పరిష్కారం ఎవరైనా శరీరమునందు అటువంటి కోర్కె లేని ఒక బ్రాహ్మణుని, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో’ అన్నాడు. సత్యవతీ దేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకి పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారయి గడ్డాలు నెరిసిపోయి మహాధర్మజ్ఞుడయి భీష్ముడు వీళ్ళందరికీ ద్రోణాచార్యులను గురువుగా పెట్టి విలువిద్య నేర్పించి ఆ వంశమును సాకుతూ నడిపిస్తున్నాడు.

ఆయన కళ్ళముందే పాండురాజు పుత్రులకు, ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య కలహం బయలుదేరింది. ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవపక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అంటే అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు. సర్వసైన్యాధిపత్యం ఇచ్చేప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చి భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తాను యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు.

భీష్ముడు ఎన్నోమార్లు ‘అర్జునుని ఎవరూ గెలవలేరు. పాండవుల పట్ల ధర్మం ఉన్నది వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు. భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకుని వ్రేలాడవలసిన అవసరం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే కురుక్షేత్రం జరిగేది కాదు కదా! భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? ‘భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ’ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు.

అలా కొట్టడానికి ఒక కారణము ఉన్నది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే! భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రియ జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అన్న తరువాత ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తరువాత శకునికి గుర్తువచ్చింది ‘నీ భార్య ద్రౌపది ఉన్నది కదా! ఆవిడని ఒడ్డు’ అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు ‘దౌపదిని ఒడ్డడములో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం నాకు పట్టదు. నాకు శకుని యజమాని. నేను అయన దాసుడిని. దోషం ఆయనకీ వెడుతుంది’ అనుకుని ధర్మరాజు ద్రౌపదికి ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడతీస్తుంటే ఆవిడ ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసినది’ అని ఒక ప్రశ్న అడిగింది. భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి శపిస్తే, ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు వలుస్తున్నారు. ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా! తెలియక చెప్పాడా! అన్నది తెలియకుండా ఒక మాటని ఊరుకున్నాడు. 'ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమన్నది చెప్పడము కష్టం' అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడము కూడా ధర్మాచరణము నందు వైక్లబ్యమే! ఈ దోషమునకు కొట్టవలసి వచ్చి బాణములతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంతో గహనంగా ఎంతో కష్టంగా ఉంటుంది.

ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధమునకు వచ్చాడు. దుర్యోధనునితో ఒకమాట చెప్పాడు. ‘నీవు పాండవులవైపు ఉన్న వాళ్ళలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను. పాండవుల జోలికి మాత్రం వెళ్ళను’ అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి నమస్కరించాడు. ‘తాతా! మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం. మాకు విజయం కలగాలని ఆశీర్వదించు’ అన్నాడు.

భీష్ముడు ‘నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవమునకు పొంగిపోయాను. మీ అయిదుగురి జోలికి రాను’ అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడయిపోయాడు. తన కళ్ళ ముందు తనవాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వసైన్యాధిపతియై నిలబడ్డాడు. ధర్మరాజు ‘తాతా! నీకు స్వచ్ఛందమరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నిన్ను యుద్ధంలో ఎలా పడకొట్టడము’ అని చేతులు నులిమాడు. భీష్ముడు ‘ఇప్పుడు ఆ విషయం అడుగకు. కొన్నాళ్ళు పోయాక చూద్దాం’ అన్నాడు భీష్ముడు. ‘మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాతా’ అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 19 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవపక్షం గెలిచింది. భీష్ముడు అంపశయ్య మీదనే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగి ‘దాహం వేస్తోంది’ అన్నాడు. నీళ్ళు పట్టుకు వచ్చారు. అంపశయ్య మీద పడుకున్న వాడు లౌకికమయిన జలములు త్రాగడు. ఏ నీళ్ళు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. ‘అర్జునా! మంచినీళ్ళు ఇయ్యి’ అన్నాడు. అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోనుండి అమృతోదకం పైకిలేచి భీష్ముని నోటిలో పడిటే ఆ నీటిని త్రాగాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో ‘భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు. నీవు బయలుదేరి వెళ్ళి దర్శనము చేసుకుని, ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరల ధర్మం చెప్పేవాడు లేడ’ ని చెప్పాడు. భీష్ముడు చెప్పిన ధర్మములు భారతములో చెప్పారు తప్ప భాగవతములో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతములో మాత్రం వ్యాసుడు ఉత్తరగర్భం మీదికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భమును కృష్ణుడు రక్షించాడు అనే మాటను ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనేమాటను విని భీష్ముడు కాలమును ముందు స్తుతి చేస్తాడు.


పదినెలలు పూర్తయిన పిమ్మట ఉత్తరగర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు. యధార్థమునకు అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవసంతతి అంతరించిపోయింది. ఆ వంశము ఆక్కడితో ఆగిపోయింది. బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. ధర్మరాజు అంతటివాడు తనకు వంశములేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా, తనను తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి, గర్భస్థమయిన పిండమును రక్షించాడు. కృష్ణభగవానుని అనుగ్రహము చేత బ్రతికింప బడి బయటకు వచ్చిన పిల్లవాడు కనుక అతనికి ‘విష్ణురాతుడు’ అని పేరు పెట్టారు.


పరీక్షిత్తు పుట్టిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజుగారు సభతీర్చి ఉన్నారు. పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడమీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతివాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడు అనగా ‘మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రమువచ్చి అగ్నిహోత్రమును వెదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ ఉన్న సమయములో ఎవరో ఒక అంగుష్ఠమాత్రమయిన మూర్తి శంఖ చక్ర గద పద్మములతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెదతాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడయినా కనపడతాడా’ అని సభలో చూసేవాడు. విష్ణురాతుడు అని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘పరీక్షిత్’ అని పిలిచారు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు పిల్లవాని జాతకము చూసి ‘ఇతడు రామచంద్రమూర్తి వంశమునకు మొదటివాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబిచక్రవర్తి వలె దానములు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను, బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణములను విడిచి పెడతాడో అలా బాణములను విడిచి పెడతాడు. కార్తవీర్యార్జునుడు వేయిచేతులతో ధనుస్సును పట్టుకుని బాణములను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధనైపుణ్యముతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్టచివర శరీరము విడిచి పెట్టవలసిన సమయము ఆసన్నమయిన నాడు ఆవుపాలు పితికినంత సేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని, ఈ పిల్లవాడి ఆర్తిచూసి కృష్ణ భగవానుని పాదములయందు బుద్ధిరమిస్తూ ఉండగా శరీరమును విడిచిపెట్టి, మోక్షమును పొందుతాడు. మహోత్కృష్టమయిన వ్యక్తి మీ వంశములో పుట్టాడు’ అని చెప్పారు.

ధర్మరాజు గారు పొంగిపోయారు. ‘నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను కొన్ని కోట్లమందిని తెగటార్చాను. ఎందరో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. పాపము పోగొట్టుకోవడము కోసమని అశ్వమేధయాగం చేయాలి. అశ్వమేధయాగమునకు కావలసినటువంటి సంభారములు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి?’ అని భీమార్జునులను పిలిచి అడిగాడు. భీమార్జునులు ‘అన్నయ్యా! దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఇంతకు పూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తనే రాజు అశ్వమేధయాగం చేసి తత్సంబంధమయిన కాంచనపాత్రలు మొదలయిన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనాధికారము ఉన్నది కనుక ఆ ప్రాంతం మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది. ఆ సంపదను సంభారములను మేము తీసుకువస్తాము. నీవు అశ్వమేధయాగము చేయవలసింది’ అన్నారు.


ధర్మరాజు గారు మూడు అశ్వమేధయాగములు చేశారు. ఆ యాగములకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించి సమున్నతముగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. కృష్ణపరమాత్మ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. ఆయనను ఈ హస్తినాపురములో ఉన్నవాళ్ళు స్తోత్రం చేశారు ద్వారకానగరములోని ప్రజలు స్తోత్రం చేశారు. హస్తినాపురములో అందరూ సంతోషముగా కాలం గడుపుతున్నారు.


విదురుని ఆగమనము


ఒకరోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యములు ఇచ్చి తీసుకొని వచ్చాడు. విదురుడు చక్కటి భోజనము చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళదగ్గర కూర్చుని మహానుభావా ! మీరు చాలాకాలమునకు తిరిగి వచ్చారు ఇది మా అదృష్టం. మీరు మేము చిన్నపిల్లలుగా ఉండగా మా తండ్రిగారు మరణిస్తే, ఒక పక్షి తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా రెక్కలక్రింద పెట్టుకుని కాపాడి ఆహారమును నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్కఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేదద్దామని అనుకున్నప్పుడు, అనేక ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు మా రక్షణ కోరుకున్నారు. మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఈ తీర్థములకు వెళ్ళారో, ఏమి చూసారో మాకు చెప్పవలసింది’ అని అడిగాడు.


తీర్థయాత్ర చేసివచ్చిన వాడి విషయములో ఎలా ఉండాలో భాగవతము చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడిపాదములకు నమస్కరిస్తే ఇవతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహము కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతమును కొన్ని కోట్లజన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన్నఫలితము వ్యర్థమై పోదు.


ధృతరాష్ట్రుని వానప్రస్థము


ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో ‘నామాట విని ఉత్తర క్షణములో లేచి ఉత్తరదిక్కుకి వెళ్ళిపో ఎవరికోసం చూడకు. ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట జీవితము చాలు. ఇప్పటికయినా నామాట విను. వెళ్ళిపోయి ఈశ్వరునియందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగమార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది’ అన్నాడు.

ధృతరాష్ట్రుడు ‘గొప్పమాట చెప్పావు ! నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? భీముడు మొదలయిన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటికూడు తిని ఇంకా సంతోషముగా బ్రతికేస్తున్నానా? ఛీ నాకు రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను’ అని బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఉదయం ధర్మరాజుగారు స్నానానుష్ఠానము లన్నీ పూర్తి చేసుకున్న తరువాత వచ్చి పెదతండ్రిగారయిన ధృతరాష్ట్రుడికి, గాంధారి పాదములకు తల తాటించి నమస్కరించేవాడు. ఆరోజుకూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురమునకు వచ్చాడు. ఆయన కనపడక ‘నావల్ల ఏదో అపకారము జరిగి వుంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలు అందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో! నాకు చాలా బెంగగా ఉన్నది. గాంధారీమాత కూడా కనపడడము లేదు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు’ అని ధర్మరాజు అంతటివాడు ఏడ్చాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 20 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ఉత్తరదిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా తెలుసా? అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి ‘నాకు నిద్ర పట్టడము లేదు. ఏదయినా మంచిమాటలు చెప్పు’ అనేవాడు. విదురుడు ‘నీకు ఎందుకు నిద్ర పట్టడము లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు’ అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు ‘నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను? నేను ఈ మోహములోనుంచి బయటకు రాలేను’ అనేవాడు. కనీసము ఒక మంచివ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని, బుర్రకి పట్టినా పట్టకపోయినా రాత్రి మంచిమాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు విశ్వరూప సందర్శనములో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనము చేయించాడు. జీవితములో ఒక సత్పురుషుడి సహవాసము ఎంతో గొప్పది.

ధృతరాష్ట్రుడు, గాంధారి ఉత్తరదిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ‘ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదని కన్నుల నీరు పెట్టుకున్నాడు. ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్కళ్యాణము. ఎందుకు ఏడుస్తున్నావు? అని ధర్మరాజుని అడిగితే పాపం మా పెదనాన్న గారికి కళ్ళు లేవు. ఉత్తరదిక్కుకి తపస్సుకని వెళ్ళిపోయారు. ఆయన ఏమి తింటారు? ఎవరు పెడతారు? అన్నాడు. నారదుడు ఈ పిచ్చి ప్రశ్న మానెయ్యి. ఎవరు పెడతారని అంటావేమిటి? రెండుకళ్ళు ఉన్న దానిని నాలుగుకాళ్ళు ఉన్నది తినేస్తోంది. నాలుగుకాళ్ళు ఉన్న దానిని రెండుకాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లుకాయలు కాసి, పళ్ళుపండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తరదిక్కున ఋషులు ఉండే ఆశ్రమమును చేరుకున్నాడు’ అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అన్న మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు.

ఇవాల్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటిని వశం చేసుకొని అంతర్ముఖుడయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టి శరీరమును శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్ల జేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్నియందు తన శరీరమును బూడిద చేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరము వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు’ అని చెప్పాడు. అర్జునుడు కృష్ణభగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు వెళ్ళి ఇప్పటికి ఏడునెలలు అయింది. ఇప్పటికీ రాలేదు ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది?’ అని ఆశ్చర్యపోతూ విదురుడిని ‘మీరు తీర్థయాత్రలు చేసారు. అనేక క్షేత్రములకు వెళ్ళారు. ద్వారకానగరం ఎలా ఉన్నది? కృష్ణ భగవానుడు క్షేమమేనా?’ అని అడిగాడు.

కృష్ణుడు నిర్యాణం పొందాడని విదురునికి తెలుసు. కృష్ణ భగవానుని నిర్యాణం చెందాడన్న అప్రీతికరమయిన వార్త విదురుడు చెప్పలేదు. వాక్కుకి ఒక నియమం ఉన్నది.

‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం’

సత్యమయినా అప్రియమయిన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంతతాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు.

ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తే అవతార పురుషుడై, ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజములమీద పెట్టుకుని రాక్షససంహారం చేయించిన మహానుభావుడయిన కృష్ణుడు శరీరము విడిచి పెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేముకూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చిందని నాకు అనుమానముగా ఉన్నది’ అని బాధపడ్డాడు.

ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అర్జునుడు ‘అన్నయ్యా! మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తమయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా! ముల్లుకాలిలో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్న వాడు ఆ ముల్లు తీయడానికి వేరొక ముల్లును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరించి, శరీరములో ఉన్న ముల్లు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముల్లు, చేతిలో వున్న ముల్లు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి ప్రసంగముల యందు జీవితమును పాడుచేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముల్లును ముల్లుతో తీసినట్లు తాను లోకమునకు గీత చెప్పి నడవడి నేర్పి మనలను ఉద్ధరించి అని అంటూ ఆశ్చర్యము ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకొని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడము తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు కేవలం కడవలో నీళ్ళు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించ్నంత తేలికగా గాండీవము ఉన్న నన్నుఓడించి కృష్ణపత్నులను నావద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. నేను ఈ గాండీవము పట్టుకుని ఈ రథమునే కదా ఎక్కాను.

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః!

తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!!

ఏనాడు నీ జీవనరథం లోంచి కృష్ణుని తీసివేశావో ఆ నాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే!

‘అన్నయ్యా! ఇవ్వాళ కృష్ణుడు లేడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను. ఖాండవవనమును దహించడానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధము చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి’ అన్నాడు.

ఈ మాటలను విని ధర్మరాజు ‘ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడయితే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. యుగానికి అవకాశం చూపాడు. మనం ఉండవలసిన అవసరం లేదు’ అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు.

తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమయిన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి, కేశ పాశములకు ఉన్న ముడినివిప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టి మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకువెళ్ళి అపానమనబడే మృత్యువాయువునందు పెట్టాడు. అపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమయిన శరీరమునందు పెట్టాడు. ఈవిధముగా ఇప్పుడు శరీరము పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమయిన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు. ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమయిన శరీరములోకి హోమము చేసారు శరీరములు పడిపోయి కృష్ణపరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీ దేవి. తన భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఇంక తను ఉండకూడదని తానుకూడా ఉత్తరదిక్కుగా ప్రయాణము చేసి ఆవిడా శరీరమును విడిచి పెట్టింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను, ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులయిన ఘట్టమును విన్నవారికి చదివినవారికి జీవితములో నిర్హేతుక కృపగా కృష్ణపరమాత్మ తన పాదారవిందములయందు భక్తిని కృప చేస్తాడు’ అని పోతనగారు అభయం ఇచ్చారు. ఆ ఘట్టము అంత మహోత్కృష్టమయినది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

రామాయణానుభవం_ 176*

 [11/10, 3:05 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 176* 


రాముని కోపావేశం చూసి 

సముద్రమధ్యంనుంచి మేరువుమీద సూర్యుడులాగా సముద్రుడు ఆవిర్భవించాడు. ఎర్రని పుష్పమాలలు అలంకరించుకొని, పద్మపత్రవిశాలాక్షుడై పూలమాలను శిరస్సుపై ధరించి, బంగారు ఆభరణాలతో, రత్నమాలికలతో సముద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. శ్రీరామునికి సవినయంగా నమస్కరిస్తూ


"రఘురామా ! పంచభూతాలూ వాటివాటి స్వభావాలకు అనుగుణంగా సంచరిస్తుంటాయి. ఇవి తమ స్వభావాలను విడిచిపెట్టడానికి వీలులేదు. నేను సముద్రుడను. అగాధమైనవాడను. దాటశక్యం కానివాడను. ఇది నా స్వభావం. అయినా భయలో భమోహాదులకు అతీతంగా పలుకుతున్నాను. నీవూ నీ సైన్యమూ దాటి వెళ్లడానికి వీలుగా, నన్ను ఆశ్రయించుకుని జీవకోటికి హాని కలగని రీతిగా మీకు సహకరిస్తాను."


సాగరుడి ఈ మాటలకు రాముడు అంగీకరించాడు. "అయితే ఈ సంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఎవరిమీదకు వదలమంటావో చెప్పు" అని అడిగాడు. 

"ప్రభూ! నాకు ఉత్తరతీరంలో ద్రుమకుల్య అని ఒక ప్రసిద్ధస్థలం ఉంది. అక్కడ దస్యులు నా నీరు త్రాగేస్తున్నారు. వాళ్ళవల్ల నాకు వీడగా ఉంది. వాళ్ళ స్పర్శను నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నీ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళమీదకు వదల" మని సముద్రుడు ప్రార్ధించాడు. రాముడు అలాగే బాణం వదిలాడు.


"ఇక్ష్వాకుకులవర్ధనా ! మీ సైన్యంలో నలుడు ఉన్నాడు. అతడు విశ్వకర్మకొడుకు. తండ్రివల్ల వరాలు పొందినవాడు. అతడు నామీద సేతువును నిర్మించగలడు. ఆ సేతువును నేను ధరిస్తాను" ఈ మాటలు చెప్పి సముద్రుడు నిష్క్రమించాడు.


*ఔరసస్తస్య పుత్రో అహం సదృశో విశ్వకర్మణా* 

*స్మారితో అస్మ్యహమేతేన తత్త్వమాతత్త్వమాహ మహోదధిః* 

*న చ అపి అహమ్ అనుక్తో వై ప్రబ్రూయాం ఆత్మనో గుణాన్*

 మహాబలుడైన నలుడు రామునికి మ్రొక్కి "మాతండ్రి ఆశీస్సులవల్ల నేను సేతువును నిర్మించగలను. సాగరుడు చెప్పినమాట నిజమే.

నీకు భయపడిన సముద్రుడు సేతువును ధరిస్తానన్నాడు కనుక నా నిర్మాణం మునిగిపోదు. ! అనుజ్ఞయిస్తే మొదలుపెడతాను" అన్నాడు. 


రాముడు సంతోషంగా అనుజ్ఞ ఇచ్చాడు. సేతునిర్మాణం ప్రారంభమయ్యింది.

*

[సముద్రుడిని ప్రపన్నం చేసుకోవడానికి శ్రీరాముడు చేసిన శరణాగతి ఎందుకు విఫలం అయింది.?


 రామాయణంలో దేవతలు, ఋషులు, లక్ష్మణుడు, భరతుడు, హనుమ శ్రీరాముడికి శరణాగతి చేసి రక్షణ పొందారు. అయితే శ్రీరాముడు సముద్రుడికి చేసిన శరణాగతి మాత్రం ఫలించలేదు. కారణం ఏమిటి? 

శరణాగతి చేయడానికి తగిన లక్షణాలు రాముడికి లేవు. శరణాగతిని ఇచ్చే అర్హత సముద్రుడికి లేదు. 


ఎలా సముద్రాన్ని దాటి లంకకు చేరడమా అని ఆలోచిస్తున్న రాముడికి, సముద్రుడిని శరణాగతి చెయ్యమని విభీషణుడు సలహా ఇస్తాడు. తన శరణాగతి పొందిన విభీషణుడి ముచ్చట తీర్చడం కోసం శ్రీరాముడు సముద్రం ఒడ్డున పడుకొని మూడురోజులు దర్భలమీద ప్రాయోపవేశం చేశాడు. సముద్రుడు కనబడలేదు. లంకకు దారి ఇవ్వలేదు. రాముడికి కోపం వచ్చి సముద్రాన్ని ఇంకింపచేయడానికి బాణం పట్టుకుంటాడు. 

అపుడు సముద్రుడు పైకి వచ్చి రాముడికి నమస్కరిస్తాడు. 'పిలిస్తే రావడానికి మూడురోజులు పట్టిందే?' అని రాముడంటే సము ద్రుడిలా విన్నవిస్తాడు. 'శ్రీరామా! నీ స్వరూపాన్ని (రక్షకత్వం, కరుణ) కించపరచడం నాకిష్టంలేదు. అలాగే నా స్వరూపాన్ని (దాసత్వం) చెడగొట్టుకోవడం నాకిష్టంలేదు. *శరణాగతి ఇచ్చేవాడే (శరణ్యుడే) శరణాగతి కోరడం భావ్యంకాదు* అని. 

అందుకే రాముడి శరణాగతి ఫలించలేదు.


సముద్ర శరణాగతి వేదాంత పరంగా చాల ప్రధానమైనది.


శరణాగతి నియమాలలో "విషయ నియమము" చాల ముఖ్యమైనది. ఎవ్వరిని ఆశ్రయిస్తే మనకు కోరిన రక్షణ లభిస్తుందో చూచుకొని, వారికే శరణాగతి చేయాలనేది విషయ నియమము.


రాముడు సముద్రుని శరణువేడితే ఫలించలేదు. సముద్రుడే రాముని శరణువేడితే తక్షణమే ఫలించింది.


అసమర్ధునికి చేసిన శరణాగతి ఫలించదని రాముని ప్రాయోపవేశం తెలిపింది. రాముడు స్వయంగా పరమాత్మ. పరమాత్మ విషయంలో ఇతరులు చేసిన శరణాగతి ఫలిస్తుందని సముద్రుని, కాకాసురుని, విభీషణుడు ,సుగ్రీవాదుల శరణాగతి నిరూపించింది.]

[11/10, 3:06 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 177* 


సముద్రుడు సేతు నిర్మాణం గురించి తెలిపిన తరువాత నలుడు శ్రీరాముని వద్దకు వెళ్లి "ప్రభూ! నేను సాగరుడు తెల్పినట్లు విశ్వకర్మ పుత్రుడను, మాతల్లికి" నీపుత్రుడునా అంతటి వాడవుతాడు" అని మా తండ్రి వరమిచ్చాడు. 


మా తండ్రి వర ప్రసాదంగా ఆయన నిర్మాణ కౌశల్యమంతా నాకు వారసత్వంగా లభించింది. అయితే సముద్రుని కంటే ముందే నేను నాగురించి మీముందు చెప్పుకొంటే "ప్రగల్బాలు పలుకుతున్నాడు." అని మీరు అనుకొంటారని నేను మీ ముందుకు రాలేదు. సముద్రుడు వరమిచ్చినట్లు వానరవీరులు నాకు "శిలలను, వృక్షాలను" అందిస్తే వాటితో సేతువును నిర్మిస్తానని" మనవి చేసుకొన్నాడు.


నలుని మాటలను విని రామకార్యం కొరకు సమస్త వానరులు పెద్ద పెద్ద శిలలను,

గిరుల శిఖరాలను, మహా వృక్షాలను పెకిలించి తెచ్చారు. వాటిని నలుడు సముద్రంలో వేస్తూ ఇటు అటు అంచులను పగ్గాల సహాయంతో సరిచూస్తూ, తీగల సహాయంతో తరులను, గిరులను బంధిస్తూ సేతువును నిర్మించ సాగాడు.


*కృతానితాని ప్రథమేనాహ్నా యోజనాని చతుర్దశ* 

*ప్రహృష్టైర్గజ సంకాశైస్త్వరమాణైః ప్లవంగమైః*

మొదటి రోజు కావడం వలన కొంతపని ఆలస్యంగా మొదలై పదునాలుగు యోజనాల దూరము సేతువు కట్టబడింది. రెండవ రోజు ఇరువై యోజనాలు, మూడవ రోజు ఇరువై __ఒకటి, నాల్గవ రోజు ఇరువై రెండు, అయిదవ రోజు ఇరువై మూడు యోజనాల దూరముతో పదియోజల వెడల్పుతో సేతు నిర్మాణం పూర్తి అయింది. (14+20+21+22+23=100)


*త దచింత్య మసహ్యం చ అద్భుతం* *రోమహర్షణం, దదృశు స్సర్వభూతాని* 

*సాగరే సేతుబంధనమ్*


ఊహింప తరము కానిది ,ఆశ్చర్యాన్ని, గగ్గుర్పాటుని కలిగించే సముద్రమునందలి సేతునిర్మాణమును సర్వ ప్రాణులు చూస్తుండగానే నిర్మాణం జరిగింది.


ఆకాశమార్గంలో సూర్యచంద్రులు సంచరించే మార్గము మధ్యలోని "స్వాతి పధము" (పాలపుంత) వలె ఉత్తరము నుండి దక్షిణంగా అద్భుతంగా లవణ మహాసముద్రముపై సేతు నిర్మాణం జరిగింది.

*

 [కట్టిన వాడు నలుడైనా రామకార్యం కొరకు నిర్మించబడింది. సముద్రుని వరము మేరకు అది రామసేతువుగా తరతరాలుగా యుగయుగాలుగా రామచరిత్రను భారతీయులకే కాక విశ్వమానవులందరికి అందిస్తూ వస్తున్నది.]

** 


సేతు నిర్మాణము తరువాత రాముడు వానర సేనా సమేతంగా లంకలోకి ప్రవేశించాడు. లంకా నగర సౌందర్యమునకు ఆశ్చర్యపడ్డాడు. సీతను తలచుకొని దుఃఖించాడు. 

*దృష్ట్వా దాశరథిర్లంకాం చిత్రధ్వజపతాకినీమ్*

*జగామ మనసా సీతామ్ దూయమానేన చేతసా*


యుద్ధ సమయంలో విచారము తగినదికాదని మనస్సును మరల్చుకొని వానరసేన నంతటిని రాముడు గరుడ వ్యూహముగా తీర్చాడు. 


నీలుని పరివారంతో కూడ అంగదుడు హృదయ భాగంలో ఉండాలి. ఋషభుడు, గంధమాదనుడు తమ తమ సేనలతో కుడి ఎడమలలో నిలుచోవాలి.


వేగదర్శి, సుషేణుడు, జాంబవంతుడు ఈ ముగ్గురు తమతమ సేనలతో గర్భభాగాన్ని రక్షించాలి. రామలక్ష్మణులిద్దరు శిరోభాగంలో రక్షకులుగా ఉండాలి. పశ్చిమ దిశను వరుణుడు కాపాడినట్లు వ్యూహము యొక్క చివర (తోక )భాగంలో సూర్యుపుత్రుడైన సుగ్రీవుడు తన సేనతో ఉండాలి.


ఇక లంకలోకి వెళదాం.

"సముద్రాన్ని దాటి, లంకలో సేనా వ్యూహమును ఏర్పరచాక శుకుడు చూచాడు. తిరిగి వెళ్లాక మన బలాల గురించి రావణునికి భయము కలిగేలా చెప్పుతాడు. కనుక ఆ చారుని విడిచి పెట్టండి" అని రాముడు వానరులకాజ్ఞాపించాడు. 

*తతో రామో మహాతేజాః సుగ్రీవ మిదమబ్రవీత్*

*సువిభక్తాని సైన్యాని శుక ఈష విముచ్యతామ్*


వానరులు విడిచిపెట్టారు. చారుడైన శుకుడు రావణుని దగ్గరకు వెళ్లాడు. దెబ్బలు తిని వచ్చిన జూచి రావణుడు, "ఓరి శత్రువులకు చిక్కావా ? ఏమైంది ?" అని అడిగాడు.


అప్పుడు శుకుడు "ప్రభూ మీరు చెప్పినట్లే నేను వానర సేన మధ్యలోకి వెళ్లి సుగ్రీవ మహారాజును రామపక్షము వదిలి వెళ్లుమని" మీ సలహాగా చెప్పాను.


"నేను మాట పూర్తి జేసేలోపే వానరులందరు నాపైబడి నన్ను నేలకు బాది, నన్ను బంధించారు. ఈ మధ్యలో శ్రీరాముడు సముద్రుని సలహా ప్రకారం సేతువును నిర్మించి, వానరసేనతో సముద్రము దాటి లంకలోకి వచ్చాడు. వారసేననంతా వ్యూహంగా విభజించాడు.


దయామయుడైన శ్రీరాముని ఆజ్ఞమేరకు వానరులు నన్ను వదిలారు. మహా రాజా ! ఇప్పుడు మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఏదో ఒకటి తప్పదు. భయంకరమైన వానర సేనా వాహిని ముట్టడిని తప్పించుకోవాలంటే శ్రీరామ చంద్రునికి సీతాదేవిని సమర్పించాలి.

*పురా ప్రాకారమాయాంతి క్షిప్రమేకతరం కురు*

*సీతామ్ వాస్మై ప్రయచ్ఛాశు యుద్ధమ్ వాపి ప్రదీయతామ్*

లేదా శ్రీరామ భద్రుని భయంకర బాణాగ్నిని ఎదుర్కోవడానికి సిద్ధము కావాలి.” 

శుకుని మాటలు విని రావణుడు కోపంతో "ఏమిరా భయంతో నేను సీతాదేవిని రామునికి అప్పగించాలా?

దేవదానవులందరు కలసినన్నెదిరించినా నేను భయపడను. రామునికి నా పరాక్రమము తెలియక నాపై యుద్ధానికి వచ్చాడు. ఆయన తమ్మునితో సహా, సమస్త వానర సేనతో సహా నా బాణాగ్నికి భస్మము కాకతప్పదు. ఇక నీవు వెళ్ల వచ్చు" నని ఆయనను బయటకు పంపివేశాడు....

[11/10, 3:06 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 178* 


గతం లో విభీషణాదులు 

శుక చారుడు,ఇప్పుడు శుకసారణ మంత్రులు అందరూ సీతను అప్పగించు అదే మాట చెప్పారు.... అయినా రావణుడు అంత మొండివాడు ఎవ్వడూ ఉండడు.


"నా శత్రువులందరిని చూడాలని అనుకొంటున్నాను. నా వెంట వచ్చి వాళ్లను నాకు చూపండి" అని శుక సారణులతో కలిసి రావణుడు అనేక తాటి చెట్ల అంత ఎత్తున్న తన మేడపైకి వెళ్లి తనకు ఎదురుగానున్న సువేలా పర్వతముపై విడిది చేసిన వానర సేనావాహినిని చూడసాగాడు.


సారణుడు మొదట అంగదుని చూపి "ఈయన తన సైన్యంతో వానర సేనను హృదయ భాగంలో ఉండి రక్షిస్తాడని, ఆయన తన తండ్రి అయిన వాలి అంతటి

పరాక్రమము కలవాడని" తెలిపాడు.


సేనకు ముందుండి నడుపుతున్న వాడు లక్షల వానర సేనాధిపతి అయిన మహా పరాక్రమ శాలి నీలుడు, అంగదుని వెనుక ఉన్నవాడు నలుడు. ఆయనే సేతునిర్మాత. చందన పర్వతము పైన

ఉండే వేయి కోట్ల సైన్యానికి స్వామి. ఆయన మహాక్రోధంతో నీపైకి ఉరికి వస్తున్నాడు..


అలాగే శ్వేతుడు, కుముదుడు రంభుడు, శరభుడు పనసుడు, వినతుడు, క్రోధనుడు

మొదలైన వారు మహా పరాక్రమోపేతులు, కోట్లకొలది సైన్యాలకు అధిపతులు,


వీరేకాక మరి కొంతమంది యూధపతులున్నారు. వారందరు శ్రీ రాముని కొరకు ప్రాణములను తెగించి వచ్చారు.


వానరయూధపతి ధూమ్రుడనే ఆయన భల్లూకయూధపతి ఆయన తమ్ముడు జాంబవంతుడు అతిలోక భయంకరుడు. వామనుని కాలములో ఆయన చుట్టు అనేక పర్యాయాలు మూడు లోకాలు తిరిగాడు. దైవాసుర యుద్ధంలో అనేక సమయాల్లో దేవతలకు సహాయపడినవాడు. ఆయన యముని కూడ యుద్ధంలో ఓడింపగల్గిన వీరుడు.


యుద్ధమునందు మహావేగము కలవాడు, తన పరాక్రమంతో ఇంద్రుని సైతము

సంతోషపరచువాడు అదిగో దంభడు.


అడ్డు వచ్చిన దేనినయినా అతిక్రమించగలిగినవాడు, తన పరాక్రమంతో ఇంద్రుని జయించిన వాడు, దానధర్మములలో మిక్కిలి ఆసక్తిగలవాడు, బల దర్పము గలవాడదిగో సన్నాదుడు.


ఇదిగో ఈయన కథనుడు ఒక గంధర్వ స్త్రీకి అగ్నిదేవుని వలన జన్మించినవాడు. దేవాసుర యుద్ధంలో దేవతలకు సహాయపడినవాడు. కుబేరుడుండే కైలాస పర్వతమందు ఉంటాడు.


అదిగో ఆ కనబడేవాడు ప్రమాధి అనే వానర యూధపతి. యుద్ధంలో కఠిన పరాక్రములైన కోటి వానరులకు ఈయన అధిపతి. ఈయన గవాక్షుడు బలవంతులైన కొండముచ్చులకు అధిపతి. ఇదిగో ఆయన కేసరి అనే మహావీరుడు. ఏనుగు ఆకృతితో దేవతలను బాధించుచున్న శంబసాధనుడనే రాక్షసుని సంహరించి దేవతలకు ప్రియమైన వాడు


తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో ఉండి మదించిన సింహమువలె నాలుగు కోరలను కలిగియుండి, పామువంటి రోషముగల్గి, ఏనుగంత ఎత్తు గలిగి, ఎఱ్ఱని కళ్లుగల వానర శ్రేష్ఠుల మధ్య మహావీరుడై ప్రకాశించే ఇతడు శతవలి. ఈయన ప్రతిరోజు సూర్యోపాసన చేస్తాడు. రామసుగ్రీవులకు అత్యంత ప్రియుడు నీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు.


గవాక్షుడు, నీలుడు, గవయుడు, నలుడు ఒక్కొక్కరు పదికోట్ల వానర వీరులకు నాయకులు.....

** 


సారణుడు ముగించిన తరువాత శుకుడు వానర వీరుల వివరాలను మరింత తెలుపసాగాడు. కిష్కింధానగరంలో వేయి శంఖములు, నూరు బృందములు ఇరువై ఒక్కకోట్ల వానరవీరులున్నారు. వీరందరు కామ రూపులు.


వీరిలోమైంద ద్వివిదులు మహాకాంతి సంపన్నులు. బ్రహ్మవర ప్రసాదం చేత అమృతం త్రాగిన వారు. ఎప్పుడు చిన్న వయస్సు వారుగానే ఉంటారు. నీపైకి ఉత్సాహంతో ఉరికివస్తున్నారు. ఇదిగోమైంద ద్వివిదుల ప్రక్క పర్వతాకారాలతో ముందుకొచ్చే అపరిమిత బలసంపన్నులు సుముఖుడు, అసుముఖుడు. వీరిద్దరు యముని కుమారులు తండ్రి అంతవారు.


అందరికంటే ముఖ్యమైన వానిని చూస్తున్నావా ? అంజనాదేవికి వాయుదేవుని ప్రసాదంగా జన్మించిన మహానుభావుడు. పుట్టగానే ఉదయిస్తున్న అరుణబింబాన్ని చూచి ఎఱ్ఱని పండనుకొని ఆకలితో సూర్యుని మ్రింగాలని పైకి ఎగిరినవాడు, తనయుడు, శ్రీరామచంద్రుని మహా భక్తుడు. నూరుయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి లంకలోనికి ప్రవేశించి సీతాదేవిని చూచి తిరిగి వెళ్లుతూ అసంఖ్యాకులైన రాక్షసవీరులను, లంకానగరాన్ని మొత్తము దహించినవాడు, నీకు సింహస్వపమైనవాడు ఇదిగో హనుమంతుడు.

*సత్యం ఆగమ యోగేన మమ ఈస విదితో హరిః*

*న అస్య శక్యం బలం రూపం ప్రభావో వా అనుభవాసితుమ్*


అదిగో ధీమంతుడైన హనుమంతుని చేత సేవింపబడుతున్నవాడు. నల్ల కలువల వంటి మేను ఛాయ గలవాడు, ఎఱ్ఱకమలాల వంటి విశాల నేత్రాలు కలవాడు, ధర్మావతారుడు, సహనంలో భూమితో సమానుడు, ఆగ్రహంతో అమరులను కూడ కంపింపజేయగల మహానుభావుడు శ్రీరామచంద్రుడు,

*యస్య భార్యా జన్స్థానాత్సీతా చాప హృతా త్వయా*

*స ఏష రామస్త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే*


ఆయన ప్రక్కనే ఉంటూ బంగారు రంగు మేనిఛాయ గలవాడు, అన్నిటిలో రామసమానుడు. ఆకలితో బుసలుగొట్టుతున్న పాముల వంటి అమ్ములుగలవాడు శ్రీరామ సోదరుడైన లక్ష్మణుడు,


ఇక మీ తమ్ముడు విభీషణునిని చూస్తునే ఉన్నావు కదా ! ఆయన ఇప్పుడు. రామాశ్రయంతో మహోత్సాహంతో ఉన్నాడు. సముద్ర తీరంలోనే శ్రీరామ చంద్రుని చేత లంకాధిపతిగా పట్టాభిషేకం చేయబడినవాడు. నీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాడు.


ఇక మిగిలినవాడు వానర మహా సామ్రాజ్యాధిపతి అయిన సుగ్రీవుడు. నిన్ను తోకతో చుట్టి నీళ్లు త్రాగించిన వాలితో సమాన బలుడు.


శ్రీరామ చంద్రస్వామి సహాయంతో అన్నను వధింపజేసి నిష్కంటకంగా వానర రాజ్యాన్ని ఏలుతున్న వాడు. వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేసి ఆయనను తన వశంలో ఉంచుకొన్నవాడు. స్వయంగా సూర్యనందనుడు.....

[11/10, 3:07 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 179* 


శుకసారణుల వివరణ విన్న రావణాసురుడు కోపంతో ఊగిపోయాడు. గొంతు గద్గదమయ్యింది. శత్రుసైన్యాన్ని కీర్తించడమే పనిగా పెట్టుకున్న మూర్ఖులు మీరు. ఇటువంటివారు మంత్రులుగా ఉండీ నేను అదృష్టవశాత్తూ జీవించి ఉన్నాను. మీ నాలుకలు కోసి తలలు తరిగెయ్యాలి. కానీ మీరు చేసిన సేవలు మరిచిపోలేక వదిలేస్తున్నాను. పొండి. తక్షణం తొలగిపొండి అని బిగ్గరగా అరిచాడు....


రావణుడు తన దగ్గర ఉన్న మహోదరుని చూచి తక్షణమే సమర్థులైన చారులను రప్పించుమని ఆజ్ఞాపించాడు. శార్దూలాదిచారులు క్షణంలో రావణుని ముందువాలారు. శత్రువులకు భయపడనివారు

తనకు విధేయులు చార విద్యా కుశలురైన శార్దూలాదులను చూచి:


"మీరు తక్షణమే రామలక్ష్మణులున్న చోటికి మారు వేషాలతో వెళ్లండి. వాళ్ల స్వభావాలను, అలవాట్లను, బలహీనతలను గమనించి తిరిగిరండి.


ఎంత గొప్పవాడికైనా ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని మనము కనుక్కొంటే ఎంత గొప్ప శత్రువునైనా వశపరుచుకోవచ్చు.


రామలక్ష్మణులు ఎప్పుడు పడుకుంటారు? ఎప్పుడు మేలుకొంటారు? పడుకొన్నప్పుడు, లేచినప్పుడు ఒంటరిగా ఉంటారా? లేక వాళ్లకు తోడు ఎవ్వరైనా ఉంటారా ? ఈ విషయాలన్ని కనుక్కొనిరండని పంపాడు. వారు "మహారాజుకు జయము జయము" అని పలుకుతూ వెళ్లారు.


వారు మారువేషాలతో వానరవీరుల దగ్గరికి వెళ్లారు. రామలక్ష్మణుల వానరసేనా సముద్రాన్ని చూడగానే వారి గుండెలు అవిసి పోయాయి. భయంతో అక్కడి నుండి పారిపోవాలి అనుకొంటు ఉండగానే విభీషణుడు వారిని గమనించి నాయకుడైన శార్దూలుని బంధించి, మిగిలిన వారిని వదిలి పెట్టాడు.

వానరులందరు శార్దులుని పైబడి ఆయనను చితుక బాదారు. బాధలను తట్టుకోలేక బిగ్గరగా ఏడుస్తుండగా దయామయుడైన దాశరధి ఆశార్దూలుని విడిపించి పంపాడు. 


శార్దూలుడు రావణుని సమీపించి "మహారాజా ! వానర బలము సంఖ్యాతీతము వారిని లెక్కించుట తరముగాదు. వారు వేరు వేరుగా ఉంటారు. అందరు కలిసే ఉంటారు. ఆ విధంగా ఒంటరిగా ఉండని వారి ప్రత్యేక స్వభావాలను, బలహీనతలను గమనించడమెలా?


నన్ను చూడగానే విభీషణుడు గుర్తించాడు. మిగిలిన పనిని వానరులు చేశారు. పిడికిళ్లతో గ్రుద్దారు. పండ్లతో కొరికారు. క్రింద పడవేశారు. ఊపిరాడకుండా త్రొక్కారు.


"వీడు దొంగ ! వేగులవాడు" అని అరిచారు. అప్పుడు వానరులందరు గుమిగూడి నా ఎముకలను నుగ్గునుగ్గు చేశారు.


నేను నాబాధ తాళలేక శ్రీ రామచంద్రుని పాదాలపై పడ్డాను. 


"లంకాపురిని ఎట్లా

సాధించాలా?" అని తీవ్రంగా ఆలోచిస్తున్న రామభద్రుడు నన్ను ఒక గడ్డి పోచవలె

చూచి "వదలి పెట్టుడని" వానరులను ఆజ్ఞాపించాడు.


అదిగో అలా చావుదప్పి కన్నులొట్ట పోయి నీదగ్గరికి వచ్చాను.. ఇక నిర్ణయించు కోవలసింది నీవే. సీతాదేవిని అప్పగించడమా? రణాన్ని

ఆహ్వానించడమా?"

*పురా ప్రాకారం ఆయాతి క్షిప్రమ్ ఏకతరం కురు*

*సీతాం వా అస్మై ప్రయచ్ఛాశు సుయుద్ధం వా ప్రదీయతామ్*

రావణుడు వారి మాటలను విని "శార్దూలా! నేను సీతను తిరిగి ఇవ్వడము అనే మాటకల్ల.


ఆ వీరులు ఎవ్వరి పుత్రులు ? ఎవ్వరి మనుమలు ? ఎవ్వరికి సంబంధించిన వారో తెలుపు వారి సంబంధుల ద్వారా వారిని వశపరుచుకోవచ్చేమో?" అర్దూలుడు వానరవీరుల తల్లి దండ్రులను గురించి తెలుపసాగాడు.


హనుమంతుడు అంజనాకేసరుల కుమారుడు. కేసరి దేవగురువైన బృహస్పతి

కుమారుడు.అంగదుడు ఇంద్ర తనయుడైన వాలికి కుమారుడు. మైందద్వివిదులు అశ్వినీదేవతల (దేవవైద్యుల) కుమారులు. శ్వేత, జ్యోతిష్మతులు సూర్యుని పుత్రులు. హేమకూటుడు వరుణుని కొడుకు. నలుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ తనయుడు,దుర్దరుడు వసువు కుమారుడు.


రామలక్ష్మణులు పది దిశలలో ఎదురులేని దశరధ సార్వభౌముని తనయులు,


శ్రీరామచంద్రుడు ఖర, దూషణత్రిశిరస్కులనే అత్యంత వీర్యవంతులైన రాక్షసులను

పదునాల్గువేల మంది సైనికులతో రెప్పపాటు కాలంలో సంహరించిన మహావీరుడు.


నీతో సమాన బలులని ఖ్యాతిగాంచిన విరాధుని, కబంధుని హతమార్చిన మహా బలశాలి శ్రీరాముడు.


దేవతాంశలతో జన్మించి, కామరూపధారులై, మహాబల సంపన్నులైన వేలకోట్ల వానరుల సేనా వాహినితో రామలక్ష్మణులు లంకా పట్టణంలోని "సువేల" పర్వతముపై దిగి ఉన్నారని తెలిసిన రావణుడు మనస్సులో భయపడ్డాడు. అయితే తన మనస్సులోనే భయాన్నిదాచుకొని, ఇక యుద్ధాలోచన చేయడానికి మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయుమని చెప్పి ఆయన తన ఇంటికి వెళ్లాడు.......

** 


విద్యుజ్జిహ్వుడు అనే మహామాయావిని పిలిపించి రావణుడు అతనితో కలిసి అశోకవనంలో సీతాదేవిని సమీపించాడు. దారిలో వాడికి ఆజ్ఞలు జారీచేసాడు. నీ మాయలు ఉపయోగించి రాముని శిరస్సును సృష్టించు. దానితోపాటు ధనుర్బాణాలు సృష్టించు. నేను సీతతో సంభాషిస్తుండగా వాటిని తీసుకు రా. చిత్తమని విద్యుజ్జిహ్వుడు నిష్క్రమించాడు. రావణుడు సీతను సమీపించి–


భద్రే! నేను బతిమాలుతుంటే, పెద్ద గొప్పగా నా భర్త మహావీరుడు, ఖరుణ్ని చంపాడు దూషణుణ్ని చంపాడు అంటూ గొప్పలకు పోయావు. చూడు ఏమయ్యిందో. నీ భర్త నిహతుడయ్యాడు. నీ అహంకారం తొలగించాను. ఇప్పటికయినా నా భార్యవు కా. 


ఈ మూఢబుద్ధి విడిచిపెట్టు. నా అంతఃపురానికి రాణివి కా. వానరసైన్యంతో నా మీదకు దండెత్తి సముద్రందాటి ఈ గట్టుకు వచ్చాడు నీ భర్త. దేవేంద్రుడి చేతిలో వృత్రాసురుడులాగా నాచేతిలో నిహతుడయ్యాడు. అతడి సైన్యమూ అతడూ అలసిపోయి నిద్రిస్తూండగా అర్ధరాత్రిసమయంలో ప్రహస్తుని నాయకత్వంలో మా రాక్షససైన్యం వారిపైపడి ఘోరంగా అందరినీ మట్టుపెట్టింది. 


నిద్రిస్తున్న రాముని తలను ప్రహస్తుడు స్వయంగా ఖండించాడు. అలాగే విభీషణుడిని సంహరించాడు. లక్ష్మణుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హతశేషులైన వానరులతో పారిపోయాడు. సుగ్రీవుడు తలతెగి, హనుమంతుడు దవడలు ఊడి పడి ఉన్నారు. జాంబవంతుడు మోకాళ్ళు విరిగి చనిపోయాడు. మిగిలినవారూ ఇలాగే అంతా చనిపోయారు. విజృంభించిన మా రాక్షససైన్యం నిరాటంకంగా వీరవిహారం చేసింది. దుమ్ముకొట్టుకుపోయి నెత్తురు ఓడుతున్న నీ భర్త శిరస్సును చూస్తావా?


 విద్యుజ్జిహ్వా ! రాముడి శిరస్సునూ ధనుస్సునూ ఇటు తీసుకురా.....


విద్యుజ్జిహ్వుడు అవి తెచ్చి రావణుడి ఆజ్ఞమేరకు సీతముందుంచి మాయమయ్యాడు.

*స విద్యుజిహ్వేన సహైవ తచ్ఛిరో* |

*ధమశ్చ భూమౌ వినికిర్య రావణః* |

*విదేహరాజస్య సుతాం యశస్వినీమ్* |

*తతో అబ్రవీత్తం భవ మే వశానుగా*

సీతా ! చూశావుగా. ఇదిగో నీ భర్త శిరస్సు. రాత్రి ప్రహస్తుడు సంహరించి తెచ్చాడు. ఇవిగో నీ మగని ధనుర్బాణాలు. ఇక నైనా నాకు వశం కా......

[11/10, 3:08 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 180* 


సీతాదేవి శ్రీ రాముని ముఖాన్ని పరిశీలించింది. అవే కళ్లు, అవేకురులు, అదే ముఖము.


హనుమ సీతాదేవితో, తాను వెళ్లిన వెంటనే సుగ్రీవ, వానరసేనా సమేతంగా శ్రీ రామ లక్ష్మణులను తప్పక తీసిక వస్తానని చెప్పాడు. కనుక "రామలక్ష్మణులు, వానరసేన సముద్ర తీరానికి చేరుకొని ఉంటారు. అలసి పోయిన రామలక్ష్మణులు నిద్రపోతు ఉంటారు. అదే అదనుగా భావించి ప్రహస్తుడు రాముని శిరస్సును ఖండించి ఉంటాడు". ఈ విధంగా సాగుతున్నాయి. ఆమె ఆలోచనా పరంపరలు. అన్నిటికంటే ముఖ్యంగా తాను హనుమతో పంపిన చూడామణి శ్రీరాముని కేశములను అలంకరించి ఉంది. ఇంతకంటే ప్రబలసాక్ష్యము ఇంకేమి కావాలి?

*కేశాన్ కేశాంత దేశం చ తం చ చూడామణీం శుభం*

*ఏతైః సర్వైరభిజ్ఞానైరభిజ్ఞాయ సుదుఃఖితా*

ఆమెభర్త ముఖాన్ని చూస్తూ "నాధా! సకల సద్గుణశాలివైన నీవు అర్ధాయుష్కుడవు అగుట నా పాపరాశి ఫలమే. ఒక్క మాయా లేడి కొరకు నిన్ను పోగొట్టుకొన్నాను. ఇన్ని రోజులు నీకు దూరమై భరింపరాని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను.


నాపై దయవలన నీవు దూతగా పంపిన హనుమ రాక వలన నాకు కొంత దుఃఖము తగ్గింది. కాని నా గురించి తెలిసి నన్ను రక్షించడానికి వచ్చిన నిన్ను మృత్యు దేవత మ్రింగి వేసింది.


ఇంతకంటే మించిన పాపము ఇంకేమి ఉంటుంది ? నా పాపము నిన్ను కలళించడమేకాదు. నిన్నుగన్న లోకమాత కౌసల్యాదేవి కడుపులో చిచ్చుపెట్టింది. ఇక ఆ తల్లి ఒకే పుత్రుడవు, దైవ ప్రసాదమైన నిన్ను పోగొట్టుకొని ఎక్కువ కాలము జీవింపజాలదు.


నేనెంతటి పాపాత్మురాలిని? ఎంతటి నష్టజాతకురాలిని ?


అయినా రామభద్రా! వివాహానికి పూర్వము జ్యోతిష్కులు నా జాతకాన్ని చూచి "నాభర్త దీర్ఘాయువుతో వేల సంవత్సరాలు రాజ్యమేలుతాడని నేను నాభర్తతో కలిసి మహారాణినవుతానని, నేను పుత్రసంతానవతినవుతానని చెప్పారే" ? వారంత తెలియని వారా? వారి మాటలు నీటిమూలేనా?


ప్రాణవల్లభా! నేను నీ పాలిటి కాళరాత్రిని ప్రభూ! నీవు ఏకపత్నీవ్రతుడవే! నన్ను వదలి భూదేవిని కౌగిలించుకొనుట నీకు తగునా ? ప్రాణముల కంటె ప్రియుడైన మీ తండ్రిని కలువడానికి పితృలోకానికి వెళ్లావా ?

నీ వంశానికి ధృవతారవై ఆకాశంలో వెలుగుతున్నావా?


జీవితేశ్వరా ! నా వివాహ కాలములో ధర్మార్ధకామములను జీవితాంతము కలిసే అనుభవిస్తానని మాటిచ్చావే ? మధ్యలోనే నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం న్యాయమేనా?

*సంశ్రుతం గృహ్ణాతా పాణీం చరిష్షామీతి తత్వయా*

*స్మరతన్ మమ కాకుత్స్థ నయ మామపి దుఃఖితామ్*

మహాపరాక్రమశాలీ! ఇది నిజమా?నాపై ప్రేమతో మూడు గడియలలోపు పదునాలు వేల సేనతో కూడిన భయంకర పరాక్రములైన ఖరదూషణాదులను ఒంటరిగా సంహరించగలిగిన మహావీరుడవు. నీవు అల్బుడైన ప్రహస్తుని చేతిలో ప్రాణాలను కోల్పోవడమా ? ఇది సంభవమా?


నా వలన తమ వంశము విస్తరించునని అనుకొని మా మామగారు నన్ను తమ ఇంటి కోడలుగా చేసికొన్నారు. కాని ఆ అమాయకులు "తన కొడుకుకే నేను మృత్యువునవుతానని, పూలదండ రూపంలో కనబడిన మహాసర్పాన్ని" అని కలలో కూడ అనుకోలేదు". అని రాముని శిరస్సును చూస్తూ సీతాదేవి అమితంగా దుఃఖించింది.


వెంటనే రావణునివైపు చూచి "రాక్షస రాజా ! నేను రాముని శరీరంలో సగభాగాన్ని. శరీరములో సగము మాత్రమే కాలడం లోక విరుద్ధము కదా ! అందువలన నా నాధుని శిరస్సుతో పాటు నాశరీరానికి కూడ నిప్పు అంటించుమని" దుఃఖాతిరేకముతో మూర్ఛ

పోయింది.

*శిరసా మే శిరశ్శ్చాస్య కాయమ్ కాయేన యోజయ*

*రావణా అనుగామి స్వామి గతిం భర్తుర్మహాత్మనః*

అంతలో ద్వారపాలకుడు రావణుని సమీపించి "మహారాజా! మిమ్మల్ని చూడడానికి ప్రహస్తుడు మొదలైన మంత్రులందరు సభాభవనంలో ఎదురు చూస్తున్నారు. మీకు జయము జయము అని తెలిపాడు.


ఇక అశోకవనంలో చేయవలసిన పని ఏమిలేకపోవడం వలన రావణుడు మంత్రులతో యుద్ధాలోచన చేయడానికి సభాభవనానికి వెళ్లి పోయాడు. ఆయన అక్కడి నుండి వెళ్లిపోగానే ఆశ్చర్యంగా శ్రీ రాముని తెగిన శిరము, ధనుర్భాణాలు మాయమయ్యాయి.

*

[ "తన భర్త శిరస్సును చూచి, సీతాదేవి నిరాశతో తనను వరిస్తుందేమో ?" అని రావణుడు ఆశపడ్డాడు. కాని ఆయనకు అక్కడ కూడ నిరాశే ఎదురు అయింది. "తాను తన భర్త శరీరంతో పాటు కాలిపోవడానికి సిద్ధమైందేకాని ఆ మహాపతివ్రత రావణుని అంగీకరించ లేదు.]

** 


సీతాదేవికి విద్యుజ్జహ్వుడు రాముని మాయా శిరస్సును తెచ్చి చూపడం, రావణుడు సీతాదేవిని నిరాశపరచి తనను వరించుమని యాచించడం, రావణుని మాటలకు లొంగక సీతాదేవి భర్త గురించి అమితంగా బాధపడుతుండడము- వీటన్నిటిని తన యోగవిద్య వలన అదృశ్యంగా ఉండి సరమ చూచింది.


ఇప్పుడు రావణుడు రాజ సభకు వెళ్లి పోయాక సరమ సీతాదేవిని సమీపించి ఆమెను


"అమ్మా! నీ భర్త నిద్రిస్తుండగా అతని శిరస్సును ప్రహస్తుడు ఖండించడం అసాధ్యము. శ్రీరాముని ఒంటరిగా విడిచి వానరులందరు నిర్లక్ష్యంగా ఉండజాలరు. నాభర్త అయిన విభీషణుడు ఇక్కడ అన్నిటిని వదలి రాముని ఆశ్రయించారు. ఆయనను అన్నివేళలా నీడవలె అనుసరించే ఉంటారు.


మీరు అడవులలో తిరుగుతుండగా మీరు పడుకొన్నా. మెలకువతో ఉన్న అన్ని సమయాలలో కూడ మీ వెంట ఉండి మీకు సకలసేవలు చేస్తూ మిమ్మల్ని కళ్లరెప్పలవలె కాపాడిన సౌమిత్రి, అన్నను విడిచి క్షణమైనా ఉండగల్గుతాడా ? ఆయనకు అన్నను రక్షించడం కంటే కావలసినదేముంటుంది ? నిద్రాహారాలు కూడ లక్ష్మణుని రాముని నుండి దూరము చేయలేవు కదా!


"విశాల వక్షః స్థలము, దీర్ఘ బాహువులు, ధర్మమూర్తిత్వము, శత్రువులలో కూడ ప్రఖ్యాతి గలిగిన పరాక్రమము, నీతిశాస్త్ర విజ్ఞానము, చక్కని అవయవ సన్నివేశము ఇవన్ని సాముద్రిక శాస్త్రము తెలిపే మహారాజ లక్షణాలు, ఇటువంటి శుభలక్షణ సంపన్నునికి శత్రువు వలన మరణము సంభవింపజాలదు.


నిన్ను దుఃఖము పాలు చేసి, ఎట్లాగైనా నిన్ను తన వశంచేసికోవడానికి దురాత్ముడైన రావణుడు దుర్మార్గంగా పన్నిన పన్నాగమిది.

అందువలన దేవీ ! నీవు రావణుని మాటలు నమ్మవద్దు! దు:ఖవివశవు కావద్దు.


అంతేకాదు రావణుడు నీదగ్గరి నుండి వెళ్లిపోయినప్పటి నుండి లంకలో యుద్ధసన్నాహాలు జరుగుతున్నాయి. యుద్ధభేరీ ధ్వనులు వినవస్తున్నాయి. సైనికుల ధ్వనులను నీవు వినడం లేదా ? రామలక్ష్మణులే మరణిస్తే ఇక రావణునికి యుద్ధంతో ఏమి అవసరమమ్మా! వేలకోట్ల వానర సేనలతో శ్రీ రామలక్ష్మణులు సముద్రం దాటి లంకలోనికి

ప్రవేశించి సువేల పర్వతముపై నిలిచిఉన్నారు.


ఈ మాటలు కేవలము విని నేను చెప్పడం లేదు. నేను చూచివచ్చి చెప్పుతున్నాను. నన్ను నమ్ము


ఈ యుద్ధంలో రామభద్రుడు రావణుని సపరివారంగా సంహరించి నిన్ను తప్పక స్వీకరిస్తాడు. నీవు నీ భర్త సన్నిధిలో సకల శుభాలను, సంతోషాలను అనుభవిస్తావు. ఊరడిల్లు తల్లీ!" అని సరమ సీతాదేవి దుఃఖాన్ని తొలగించి ఆమెకు అమితంగా

సంతోషాన్ని కల్గించింది.

సీతాదేవికి మరొక సంతోషకరమైన మాట తెలిపింది.


"అమ్మా మాయా శిరస్సును చూపడం ద్వారానిన్ను లొంగ దీసికోవడానికి రావణుడు చేసిన ప్రయత్నాలన్నిటిని ఆయనకు కూడ కనుపడకుండా ఏవిధంగా చూడగలిగానో, అదే విధంగా ఎవ్వరికి కనుపడకుండా నేను సువేల పర్వతము పైకి వెళ్లి శ్రీరాముని సందర్శించి రాగలుగుతాను.

నేను వెళ్లేప్పుడు నాకు విమానాలతో అవసరంలేదు. ఎగిరే రథాలతో పనిలేదు.


నేను వేగంగా ఆకాశంలో అదృశ్యంగా వెళ్లుతుంటే నా వేగాన్ని వాయుదేవుడైనా

గరుత్మంతుడైనా అందుకోజాలరు".


సరమ మాటలు సీతాదేవిని మరింత సంతోషపరిచాయి. అయితే సీతాదేవికి శ్రీ రాముని ప్రయత్నాల గురించి తెలిసి కోవడం కంటే రావణుని ప్రయత్నాల గురించి తెలిసి కోవడమే ముఖ్యమనిపించింది.


శ్రీ రాముడెలాగూ తనను రక్షించే ప్రయత్నాలు తప్పక చేస్తాడు. వాటి గురించి ముందుగా తెలిసికొన్నా, తెలిసికోకున్నా తేడాలేదు.


కాని రావణుని ప్రయత్నాలు తెలియాలి. "యుద్ధ భయంకరతను చూచి, తన మనస్సును మార్చుకొని నన్ను రామునికి అప్పగించాలను కొంటున్నాడా ? లేక యుద్ధానికే కట్టుబడి ఉన్నాడా? లేక యుద్ధాని కంటే ముందే నన్ను చంపి, శ్రీ రాముని శోకములో ముంచి, యుద్ధ రంగం నుండే ఆయనను అయోధ్యకు త్రిప్పి పంపాలనుకొంటున్నాడా?" ఈ విషయాలు వెంటవెంటనే నాకు తెలియాలి. అందువలన నీవు రావణుని వద్దకు అదృశ్యంగా వెళ్లి అన్ని తెలిసికొనిరా" అని సరమను సీతాదేవి కోరింది......

*యది నామ కథా తస్య నిశ్చితం వా అపి యద్ భవేత్*

*నివేదయేథాః సర్వం తత్ పరో మే స్యాదనుగ్రహః*

హిందుత్వం పేరుతో

 🚩🛕🚩

*_హిందు సంఘాలు, హిందుత్వం పేరుతో పనిచేస్తున్న పార్టీ పెద్దలరా ఎందుకు దాక్కున్నారు...!!!_*

*_గరికపాటి వారు, చాగంటి వారు, సామవేదం వారు... ఇలాంటి సరస్వతీ పుత్రులూ, నిస్వార్ధ ప్రవచనకారులు ఇరు తెలుగురాష్ట్రాల్లో వున్న సమాజానికి గురుతరబాధ్యత వహించి ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు చేయకపోయి ఉంటే ఈ నీతి మాలిన సినిమా వాళ్ళ వలన మన సమాజం,హిందూ ధర్మం ఎప్పుడో సర్వనాశనం అయిపోయి ఉండేది. ఈనాడు వారి పైన ఈ సినీ హీరోల ప్రోద్బలంతో ఈ అభిమానులు చేస్తున్న నీచమైన దాడులు చూస్తూ ఉంటే ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇది మీరు కాదనగలరా!!!???_*

*_ఇటువంటి మంచి ప్రవచనకారులకూ,పండితులకూ ప్రభుత్వం రక్షణ కల్పించకపోయినా హిందూ సమాజమైనా సంరక్షణ కల్పించాలి లేకపోతే ఇలాంటి సినీ హీరోల అభిమాన బానిసలు హీరోల ప్రమేయంతోనే ఎటువంటి దాడులు అయినా చేయవచ్చు._*

 *_గతంలో చాగంటి వారిపైనా, గరికపాటి వారి పైనా దాడులు చేసి క్షమాపణలు చెప్పించిన విషయం మీకు గుర్తులేదా!!?? నిత్యం సోషల్ మీడియాలలో హిందూత్వం, తోటకూర కట్ట అని ప్రసంగాలు, వాట్సాప్ గ్రూప్స్ లో msg ల్లో వీడియోలు చేసి మరీ చెప్పే హిందూ పెద్దలు, హిందూ పులులు, సింహాలు, కాషాయ దళాలు ఇటువంటివి జరిగినప్పుడు బయటకు రాకుండా ముసుగులో ఎందుకు దాక్కుంటున్నారు...!! వాళ్ళని ఆ రకంగా బూతులు తిడుతూ మీడియాలలో, సభ్య సమాజంలో వారి పరువు తీసేస్తూ ట్రోల్ చేస్తుంటే మీలో కనీస చలనం కూడా రాలేదే...ఎందుకో..?? మీకు మీరే బోధించే హిందు ధర్మం, ప్రచారం దేనికోసం...??? ఆలోచించండి...!!!_*

 *_సమాజంలో ఆధ్యాత్మికంగా జరుగుతున్న నష్టానికి అడ్డుకట్ట వేయండి చేతయితే... ఈ సినీ అభిమానులకు, హీరోలకు భయపడి దాక్కోకుండా దయచేసి బయటికిరండి_*

 *_ధర్మ రక్షకులు కాలేనపుడు దాక్కొని మీ డబ్బా మీరు కొట్టుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు ఈ ఇరు తెలుగు రాష్ట్రలలో... ఇదే యదార్థం._*

🙏

అట్లతద్దినాడు

 పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.

రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.

ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.

అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

చండవేగుడు

 Srimadhandhra Bhagavatham -- 39 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు. నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.

కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’ దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమన్నది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడు వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో అన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఈకోట శిధిలం అయిపోయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది.

ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి' అని నారదుడిని అడిగాడు. నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పడడము ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.

పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర.

భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!

స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారదమహర్షి గురుత్వం లభించింది. నారదమహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా! నీకు పట్టాభిషేకము చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.

ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా! సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి ఉంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆయన – మహానుభావా ! మీరు వచ్చి ఈ మాట చెప్పారు. నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

నిదానంగా ఆలోచించి చూడండి

 ప్రతీ హిందూ పండగను, ఉత్సవాన్ని వెక్కిరించడం, ఆ పండుగ వల్ల అనర్ధాలు ఏమిటో ఏకరవు పెట్టడం, పుంఖాను పుంఖాలుగా దేశ, విదేశీ పత్రికల్లో వ్యాసాలు రాయడం, సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఈ విషయాలపై ట్వీట్స్ పోస్ట్స్ పెట్టడం,  కుదిరితే  విదేశీ నిధులు దిగమింగుతున్న NGO లను అడ్డం పెట్టుకొని కోర్టుల్లో , నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కేసులు వెయ్యడం గత కొద్ది సం.లుగా ఒక పద్ధతి ప్రకారం దేశంలో జరుగుతూ వస్తోంది.


ఒక్క సారి నిదానంగా ఆలోచించి చూడండి.. ఈ పండుగలు, ఆటలు, ఉత్సవాలపై దాడులు ఒక సం.కంటే మరో సం. ఏ విధంగా  పెరుగుతూ వస్తున్నాయో?


1. దీపావళి - వాయు కాలుష్యం, హానికర రసాయనాలు అనారోగ్యకారకాలు

2. వినాయకచవితి - నీటి కాలుష్యం, ప్రకృతి ధ్వంసం(పత్రి తెంపడం, నిమజ్జనం మొ..)

3. హొలీ - ప్రమాదకరమైన రసాయన రంగులు వాడకం, నీటి వృధా(సెమెన్ బెలూన్స్ లో పెట్టి అడవారిపై విసురుతారు, మగవారు అసభ్యంగా ప్రవర్తిస్తారు)

4. సంక్రాంతి - కోడి పందాలు, జల్లి కట్టు, పశువుల, ఎడ్ల బళ్ల పోటీలు -  ప్రమాదకరం, జీవహింస

5. రక్షా బంధన్, భగిని పండుగ - రేప్ ల దేశంలో సోదరీమణులకు ప్రేమ,గౌరవం చూపించడమా?

6.  కార్వా చౌత్ - భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం స్త్రీలు చేసే ఉపవాసం - ఆడవారిని అణగ దొక్కే హిందూ సమాజం లో మగవారిని పూజించమని ఆడవారిని అణగదొక్కే పండుగ

7. దసరా - ఆర్యులు ద్రావిడుల పై దాడి చేసినందుకు మూలవాసి  రావణాసురుడు ని చంపినందుకు అగ్రవర్ణాల వారు లేదా ఆర్యులు చేసుకుంటున్న పండుగ..

8. జన్మాష్టమి (దహి హాండి) - ఎత్తులో ఉన్న ఉట్టి కొట్టడం ప్రమాదకరమైన ఆట.

9. శివ రాత్రి - పాలాభిషేకాలు దండగ.


ఇలా వారు దాడి చెయ్యని హిందూ పండుగ ఒక్కటీ లేదు.


అసలు ఎందుకు జరుగుతోంది?

వీటి వెనకాల ఎవరు ఉన్నారు?

వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి?


నిజంగా పర్యావరణం, ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం అనుకుంటే మిగతా మతాల వారి పండుగల సమయంలో చెట్లు కొట్టనివ్వకుండా, బాణా సంచా కాల్చనివ్వకుండా, జంతు హింస జరగకుండా కూడా గొడవ చెయ్యాలి. అలాగే ధూమపానం, హుక్కాలు, మద్యపానం పై నిషేధం మొ.వాటి మీద అన్ని రోజుల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాలి.. కానీ అవేమీ చెయ్యరు. ఒక వేళ ప్రభుత్వం ఇటువంటి వాటిని అరికట్టడానికి ఏమైనా చర్యలు తీసుకుంటే ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై హద్దులు విధించి హక్కులు కాలరాస్తున్నారు అని మళ్ళీ వీళ్ళే వ్యాసాలు రాస్తారు. కానీ హిందువుల పండుగలు, ఉత్సవాలు దగ్గరకు వచ్చేసరికి ఈ హక్కులు, మత స్వేచ్చ వంటి విషయాలు వీరికి గుర్తుకు రావు.


ఈ దేశంలో పండగలు, సాంస్కృతిక ఆటలు, పాటలు, ఉత్సవాలు, వేషధారణ, అలంకరణ  ఇక్కడ అన్నీ దేవుడితో ముడిపడి ఉంటున్నాయి. ఇక్కడ సుమారు ప్రతీ నెలా ఎదో ఆధ్యాత్మిక సంరంభం తో ముడిపడి ఉన్నదే. 

ఇక్కడ సంస్కృతి లో దేవునితో ముడిపడని దైనిక కార్యక్రమం బహుశా ఉండదు అంటే అతిశయోక్తి కాదు.


ఈ ఉత్సవాలు, పండుగల కాలం లో ఎక్కువగా లాభపడే వర్గాలు ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారే.. ఏ పండుగ రోజు చూసినా ప్రతీ ఊర్లో కొన్ని వందల మంది అల్పాదాయా వర్గాల వారు (వారి మతం తో సంబంధం లేకుండా) జీవనభృతి పొందుతారు.. వారు ఇలా పండుగలు, ఉత్సవాల రోజులు వస్తున్నాయి అని వేల కళ్ళతో ఎదురుచూస్తూ వుంటారు.


మరి ఇలా అల్పాదాయ వర్గాలకు ఆదాయాలు ఇస్తున్న ఈ హిందూ పండగులను, ఉత్సవాలను తగ్గించాలి లేదా పూర్తిగా ఆపాలి అనే దుర్బుద్ధి ఎందుకు? వీటి వెనక ఏ ఎజెండా లేకుండానే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నారా?


దీని వెనుక కారణం, ఈ దేశాన్ని తమ భావ జాలంతో నింపేసి తమ గుప్పెట్లో కి తెచ్చుకోవాలి అని వామ పక్ష మేధావులు, పాపులైన హిందువులను అందరినీ తమ మత మార్పిడి చేసి తమ దేవుని రాజ్యాంగ భారత్ ని మార్చాలి  అని అబ్రహమీక్ మతాలు వాళ్ళు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు..కానీ తాము అనుకున్నది సాధించలేక పోవడానికి ఇక్కడ బలంగా పాతుకు పోయిన హిందూ లేక సనాతన సంస్కృతి అని గుర్తించి దానిపై దశాబ్దాలుగా మేధోపరంగా, సంస్కృతిక పరంగా, చట్టాలు ఆధారంగా, విదేశీ NGO ల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.


వీటి వెనుక కారణాలు ఉన్నాయి. 


1. మత, సంస్కృతిక పరమైనవి

2  ఆర్ధిక కారణాలు.


1. మతపరమైనవి -  ఎడారుల్లో పుట్టిన విదేశీ మతాలు ఈ దేశంలో వేళ్లూనుకోవడానికి అన్ని శక్తులు ఉపయోగిస్తున్నా అనుకున్నంత ఫలితాలు రావడం లేదు. ప్రపంచంలో  ఈ ఆబ్రహమిక్ మతాలు అడుగు పెట్టిన చాలా దేశాలలో అక్కడ ప్రాచీన మతాలను, ఆచార సంప్రదాయాలను మొ. వాటిని పూర్తిగా నిర్మూలించి తమ మత ఆధిక్యతను సాధించడానికి కొన్ని దశాబ్దాలు కాలం మాత్రమే పట్టింది.


కానీ ఈ పుణ్య భూమి లో ఇదేం మహత్యమో కానీ మొగలులు, బ్రిటిష్ వారు వెయ్యి సం.లకు పైగా పాలించినా, హిందూ ధర్మాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ 60 సం.లు 

పాలించినా ఇక్కడ స్థానిక ప్రాచీన ధర్మం అయిన సనాతన హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించి తమ అబ్రహమిక్ మత ఆధిక్యతను స్థాపించలేకపోయారు.  బహుశా వారి మతాల్లా ఒకే దేవుడు, ఒకే పుస్తకం అతి తక్కువ సంఖ్యలో పండుగలు, ఉత్సవాలు మొ. ఇక్కడ హిందూ ధర్మం లో ఉండకపోవడం ఒక ముఖ్య కారణం కావచ్చు. ఇక్కడ మతం ఆంటే పూర్తిగా ఒక జీవన విధానం. ఎదో ఒక అదివారమో, శుక్రవారమో ప్రార్ధనా మందిరానికి వెళ్లి వస్తే సరిపోదు. ఇక్కడ ప్రకృతిలో ప్రతీదీ దైవస్వరూపం లా కొలిచే విధంగా నిత్య దైనందినపు కార్యక్రమాల్లో  ప్రతీదానిలో దైవాంశ చొప్పించారు. అందుకే చెట్టు, పుట్ట ,రాయి, రప్ప, పాము ఎలుక, సింహం, ఆవు మొదలగునవే కాక , కాలువ తుడిచే వాని చీపురు దగ్గర నుండి పెద్ద ఫ్యాక్టరీలో మిషన్ వద్ద పనిచేసే వాడి వరకు తమ పనిముట్లను దేవుని ప్రతిరూపాలుగా భావించి కొలుస్తారు. అందుకే ఇక్కడ జీవన విధానం నుండి మతాన్ని వేరుచెయ్యడం అంత సులభం కాదు. ఆఖరుకు మంచినీరు తాగినా కూడా కృష్ణార్పణం అంటారు. ఉత్తర భారతంలో ఒకరినొకరు పలకరించుకుందుకు 'రామ్ రామ్' అంటారు. ఆంధ్రాలో ప్రతీ గ్రామంలో రామాలయం దానిలో రచ్చబండ సర్వసాధారణం.


అందుకే అష్టకష్టాలు పడి మిషనరీస్ మతం మారుస్తున్నా మతం మారిన వారి సనాతన ధర్మం మూలాలను తెంచలేక  ఈ మిషనరీష్ ఒక మెట్టు దిగి హిందూ పూజా పద్దతులు, మొక్కులు, వస్త్ర ధారణ, ఇతర సంప్రదాయాలను కూడా అనుకరిస్తూ మతం మారిన వాళ్ళను వెనక్కు పోకుండా అడ్డుకుంటూ కొత్త తరహా మతమర్పిడులకు పాల్పడుతున్నారు.


అందుకని అసలు మతం మార్చక ముందే ఇక్కడ హిందువుల మూలాలకు గల వేళ్ళు తెంచేస్తే మత మార్పిడి చెయ్యడం ఇంకా సులువు.  అంతేకాకుండా మారిన తరువాత కూడా మళ్లీ వెనక్కి తమ పాత మతంలోకి వెళ్లే ఆలోచన రాదు.  అలా జరగాలి అంటే ఇక్కడ ఉన్న హిందువులు తమ వేషధారణపై, తమ ఆచార వ్యవహారాలపై, పద్ధతులపై, పూజా విధానాలపై, పండుగలపై వారికి ఒక ద్వేష భావం కలిగించాలి. దానికి తమ చేతిలో ఉన్న దేశ విదేశీ మీడియా వారు, NGOs, హిందువులలోనే ఉదారవాద ముసుగు వేసుకునే వామపక్ష భావాలు కలవారు మొ. వారందరి చేత ఈ పైన చెప్పిన హిందూ సంబంధిత కార్యక్రమాల శాస్త్రీయతను ప్రశ్నించడం, పర్యావరణం మొ. అంశాలు లేవనెత్తడం, పండుగలలో దేవుళ్ళల్లో /రాక్షసుల్లో కుల విభజన చూపించి ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టడం, హిందూ స్త్రీలను రెచ్చగొట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.


దీనివల్ల హిందువులు తమ సంస్కృతి పై ద్వేషం పెంచుకొని దూరం జరిగితే వీళ్ళ ఎజెండా సగం సాధించినట్లే. ఇప్పటికే గమనిస్తే చాలా హిందూ కుటుంబాల్లో కొత్త తరం వారు కొంచం దూరం జరుగుతూ ఉండడం గమనించవచ్చు.


2. ఇక ఆర్ధిక కారణాలు - ప్రపంచంలో చవగ్గా శ్రామికులు, వనరులు దొరికే పెద్ద దేశాల్లో ముఖ్యమైనవి చైనా మరియు భారత్. చైనా కమ్యూనిస్ట్ నిరంకుశ పాలన కాబట్టి అక్కడ ఉత్పత్తి రంగానికి శ్రామిక, పర్యావరణ మొ. ఇబ్బందులు తక్కువ. అదే భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ అన్ని రూల్స్ పాటించాలి. అందువల్ల ఇక్కడ పరిశ్రమల ఉత్పత్తులు చైనా ఉత్పత్తుల ధరలతో పోటీ పడడం కష్టం.


అయినా కూడా ఇంకా ఇప్పటికే మన దేశంలో ఉన్న పరిశ్రమలకు ఎదో విధంగా మీడియా ద్వారా, NGOs ద్వారా, వామపక్ష అనుబంధ సంఘాల ద్వారా ఇబ్బందులు సృష్టించి మూత పడేటట్లు చేస్తే అంతమేరా చైనాకు లాభం మన దేశానికి నష్టం.


ఉదాహరణకు వామపక్ష సంఘాలు అక్కడ వున్న స్థానిక చర్చిలలో కుమ్మక్కు అయ్యి  ఇలాగే పర్యావరణ హాని అని అనవసరమైన ఆందోళనలు చేసి కోర్ట్ కేసులు వేసి తమిళనాడు లో స్టీరిలైట్ రాగి పరిశ్రమ మూయించారు . దాని వల్ల మన దేశం రాగి ఎగుమతి చేసే స్థాయి నుండి దిగుమతి చేసుకునే స్థాయికి పడిపోయింది. ఆ పరిశ్రమ అనుబంధ పరిశ్రమ ల మీద ఆధారపడ్డ 50 వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డారు.  ఆ మేరకు వేల కొట్ల లో చైనా లాభపడ్డది. అలాగే గమనించి వుంటారు ఎక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లేదా ఒక డాం లేదా ఒక పరిశ్రమ నిర్మిద్దాం అంటే ఈ ఈ ముఠా ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తుందో. ఈ ఆందోళన ల వెనుక సాధారణంగా వామపక్ష సంఘాలు, విదేశీ నిధులు పొందుతున్న NGO లు ఉంటాయి.


అలాగే తమిళనాడు లో బాణసంచా పరిశ్రమ కు శివకాశి పేరు. వెయ్యికి పైగా చిన్న తరహా పరిశ్రమలు సుమారు 80 వేల మంది వరకు కార్మికులకు ఉపాధి చూపిస్తున్నాయి. ఈ పరిశ్రమకు ప్రభుత్వ  ప్రోత్సాహం ఉంటే ఎగుమతులు చేయగల క్వాలిటీ బాణాసంచా తయారు చేయగలరు.  కానీ ఇక్కడ ఈ పరిశ్రమ బలపడితే ఎవరికి నష్టం. మళ్లీ మన వామపక్షాల చైనా దేశానికే. ఎందుకంటే అమెరికా, యూరోప్ వినియోగించే మందుగుండు సామగ్రిలో 90% పైగా చైనా నుండి దిగుమతి అవుతున్నాయి. మన దేశంలో గత సం.చైనా నుండి ఈ సామాను దిగుమతుల విలువ రు.40 వేల కోట్లు. అంటే ఇక్కడ శివకాశీ మందుగుండు పరిశ్రమ కు తరుచుగా ఇబ్బందులు సృష్టిస్తే ఇక్కడ పరిశ్రమలు మూతపడితే ఇంక వ్యాపార పెరుగుదల, ఎగుమతులు గురించి ఆలోచనే రాదు . అసలు మన దేశీయ మందుగుండు సామనుల వినియోగానికి కూడా దిగుమతుల కోసం చైనా పై ఆధారపడే పరిస్థితి తయారు అవుతుంది.


అందుకని  హిందూ పండుగలకు, ఉత్సవాలకు వచ్చే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పి కొట్టండి. అమాయకంగా అంతా మన మంచికే అన్న దృక్పథం నుండి బయట పడండి.


ఇవి వినడానికి నవ్వులాటగా అనిపించవచ్చు, లేదా ఊరికే ఊహించుకొని ఇటువంటి పోస్టుల ద్వారా అనవసర భయం సృష్టిస్తున్నారు అని అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం.


ఈ క్రింద ఫోటోలు గమనిస్తే ఈ ముఠా ఎంత పకడ్బందీగా తమ ప్రణాళికలు అమలు చేస్తున్నారో సులువుగా గ్రహించవచ్చు.


....చాడా శాస్త్రి...

భగవంతుడి లీల.

 ఏమిటి వింత.. భగవంతుడి లీల..కర్మ సింద్ధాంతం .. ఋణానుబంధం :-


 ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణానుబంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో 

భార్యగా…

భర్తగా....

సంతానంగా...

తల్లిదండ్రులుగా....

మిత్రులుగా /శత్రువులుగా ....

నౌకర్లుగా....

విడాకులకు పూర్వం మొదటి భర్త / మొదటి భార్యగా 

వివాహానికి పూర్వం ప్రియుడు /ప్రియురాలు గా 


ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.

ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో.....

మరణించడమో జరుగుతుంది.


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...

-- మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా...

లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో.....

మన సంపాదనతో పోషించబడే భార్యగా.....

సంతానంగా......

మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


ఉదాహరణకు ఒక జరిగినకథ:-

కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర....

అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు.

కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ,

రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...

పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు.




అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ:

ఒకసారి మహాత్ముడు బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి.



ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే,..... ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే,

పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు *...

”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె.....

వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది!” అన్నారు.

ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.


కర్మ ఎంత పెద్దదైనా....చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.

ఒక్క జన్మలో ఆ ఋణం తీరక పోతే, మరో జన్మ ఎత్తి అయిన ఆ మిగిలిన ఋణంని తీర్చలాసిందే !!

పూజ

 *ఎంత సేపు పూజ?*


*పూజ గదిలో - 30 నిమిషాలు*


*బయట - 23 గంటల 30 నిమిషాలు*


*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*


*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*


*3) నిద్ర లేవగానే -* 

    *i) శ్రీహరి గుర్తుకు రావాలి*

   *ii) భూమికి నమస్కరించాలి*

   *iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి*


*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*


*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.*


*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.*


*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.*


*8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.*


*9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.*


*10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.*


*11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.*


*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.*


*13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.*


*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.*


*15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.*


*అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.*🙏🕉️ 🕉️

దీపావళి నిర్ణయ వివరణ*

 సభాయైనమః💐🙏🏼


*దీపావళి నిర్ణయ వివరణ*

   🪔🪔🪔🪔🪔🪔


1)25-10-2022 మంగళవారం "అమావాశ్య" రాత్రి లేదు. అలాగే ఈ రోజున సూర్యగ్రహణం ఉన్నందున దీపావళి, పూజలు, నోములు, హారతులు వంటివి నిషేదం.


2) ఈ సంవత్సరం 24-10-2022 సోమవారం రోజున చతుర్దశి, రాత్రిగల అమవాశ్య  కావున *నరక చతుర్దశి మరియు దీపావళి*


నరక చతుర్దశి ప్రధానంగా ఈరోజున  ఉదయము మంగళహారతులు,  

ఉదయాత్ఫూర్వం హరతులు, అభ్యంగన స్నానాదుల ఆచరణ. నూతన వస్త్రధారణ, సాయంకాలం అమావాస్య వస్తుంది కాబట్టి మహాలక్ష్మి - ధనలక్ష్మి పూజలు విశేషంగా జరుపుకొనగలరు.


3) 26-10-2022 బుధవారం రోజున యధావిధిగా కేదారేశ్వర వ్రతములు చేసుకోవచ్చు...*ఈ సంవత్సరం శుక్ర మౌఢ్యమి (మూఢము) ఉన్నందున కొత్త నోములు లేవు.*

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


 మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 


  

కల్మషచిత్తం

 శ్లోకం:☝️

*అన్నదోషేణ చిత్తస్య*

  *కాలుష్యం సర్వదా భవేత్ l*

*కలుషీకృతచిత్తానాం*

  *ధర్మస్సమ్యఙ్న భాసతే ll*


భావం: ఆహారదోషంచే సర్వదా చిత్తమాలిన్యము కలుగును. కల్మషచిత్తం కలవానికి ధర్మము సరిగా గోచరించదు.

ఆయుర్వేద వైద్యం-బొమ్మల కొలువు

 ఆయుర్వేద వైద్యం-బొమ్మల కొలువు

              ➖➖➖


అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 


ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు. 


”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”


వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకోసం అక్కడినుండి వచ్చాను”


“సరే. నీ పేరు ఏంటి?” 


“హరిహర సుబ్రమణియన్”


“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”


అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.


”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.


మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు. 


”నేను అది చదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేక నీకే దానిపైన శ్రద్ధ లేదా?”


అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”


“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”


“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”


“నీకు వివాహం అయ్యిందా?”


“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”


“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”


అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”


“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”


అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. చాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తాకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”


“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపాయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”

పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెడ్తున్నావు కదూ?”


“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”


మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. 


ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తులసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు. 


కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్టబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు. 


అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.” 


మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.


హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. 


ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.


మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

అంతా మాయం*

 *అంతా మాయం*


క్లర్కులు మాయం

కూలీలు మాయం

పోస్టుమాన్ మాయం,

ఆసాంతం వినే వైద్యుడు మాయం

ఫామిలీ డాక్టరు మాయం.

కోడళ్ళ పనితనం మాయం,

అత్తమామల మాటసాయం మాయం,

అల్లుళ్ళ గౌరవ హోదా మాయం.

లంగా, ఓణీ మాయం,

చీర, రవిక, మాయం,

నల్లటి జడ మాయం,

జడలో పువ్వులు మాయం, 

గోచీ మాయం, 

పంచా గావంచా మాయం.

పుస్తక పఠనం మాయం

ఎక్కాలు మాయం,

గుణింతాలు మాయం,

పెద్దబాలశిక్ష మాయం,

చందమామ మాయం.

రేడియోకి శ్రోతలు మాయం

బాలానందం మాయం.

పెరడు, బావి అరటి మొక్కలు మాయం.

ఎండావకాయ మాయం 

కుంపటిపై దిబ్బరొట్టి మాయం 

మట్టివాసన మాయం 

పిడతకిందపప్పుబండి మాయం 

వందరోజులాడే సినిమాలు మాయం,

నాటకాలు బొత్తిగా మాయం. 

నిశ్శబ్దత లేని నిశిరాత్రులు మాయం 

ఉపాధ్యాయుడు మాయం 

కుంకుడుకాయ సీకాకాయ మాయం 

టెస్టు క్రికటర్ మాయం 

వాకిట పూలమొక్కలు మాయం ( నీ విషయంలో కాదులే)

పిచ్చుక, సీతాకోకచిలుక మాయం 

సత్తుగిన్నె చారు మాయం 

స్కూల్లో మైదానం మాయం 

సంఘంలో నిదానం మాయం

తరవాణి దబ్బాకు వాము పప్పునూనె మాయం 

వానపాము మాయం 

చెరువుల్లో ఈతలు మాయం 

బిళ్ళా కర్రా మాయం,

కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం 

సైకిలు మాయం,

ఎద్దులబండి మాయం,

గుఱ్ఱపు బండి మాయం

చింతపిక్కలు మాయం,

గచ్చకాయలు మాయం

నేలబండాట మాయం 

గుడుగుడుగుంచం మాయం

డబ్బుకు రెండూ ద్రాక్షా పళ్లు,

వానా వానా చెల్లప్ప మాయం, 

వైకుంఠపాళి మాయం

తల్లులు పిల్లలకు లాలించి బువ్వ పెట్టడం మాయం

అందరం అయోమయం

అంతా టెక్నాలజీ మయం

గమ్యము లేని జీవితగమనం.

🤔🤔🤔🤔🤔🤔

భోజన నియమాలు

 హిందూ సాంప్రదాయంలో  భోజన నియమాలు!! 

       

1. భోజనానికి ముందు, తరువాత తప్పక 

కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి. 

తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.


2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.


3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. 

చాలా దోషం.

  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.


5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.


6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.

  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. 

ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  


9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.


10  భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.


11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.


12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు 

ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.


13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు. 

(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)


14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. 

అతిథులకు పెట్టరాదు.


15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. 

(వెంట్రుకలు కత్తిరించుకోవడం)


16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే 

మనం తినగా మిగిలినవి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 


17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 


18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.


19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 


20. భగవన్నామము తలుచుకుంటూ లేదా 

భగవత్ కథలు వింటూ  వంట వండడం, 

భోజనం చేయడం చాలా ఉత్తమం. 


21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని 

ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 


22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  


23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. 

ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.


24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.


25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.


26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు. 

(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  

తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.


27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం.

(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    


28.  భోజనం అయ్యాక రెండుచేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. 

అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. 

నోరు నీటితో పుక్కిలించుకోవాలి.


29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి. (ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  


30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని 

కఠోర నియమము.  

పెద్దలు, సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,

పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. 

అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.


31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.  ద్విపాక దోషం వస్తుంది. 


32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.


  హిందూ సాంప్రదాయం లోని కొన్ని భోజన నియమాలు.