31, జనవరి 2024, బుధవారం

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 15*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 40*


*అంది యందనట్టి యచల స్వరూపంబు*

*పొందు పడగ బూని పొదలు వాడు*

*జెంది మిన్నకుండు జిన్మయాకారుడై* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*


అందీ అందని దాని కొరకు , ఆత్రుతపడక మానవుడు చిదానంద స్వరూపుడై ప్రవర్తించవలెను.


*💥వేమన పద్యాలు -- 41*


*అంది వేమన జెప్పిన యాత్మబుద్ధి* 

*దెలియలేనట్టి మనుజులు దేబె లరయ*

*తలను బాసిన వెండ్రుక ల్వలెను జూడ*

*భుక్తి ముక్తులు హీనమై పోవు వేమా*


*🌹తాత్పర్యము --*

వేమన చెప్పిన ఆత్మబుద్ధిని గ్రహించలేని మనుజులు వెఱ్ఱి వారగుదురు.

తలను వీడిన వెంట్రుకలు కళావిహీనమగునట్లు , భుక్తికి , ముక్తికి కూడా దూరమగుదురు.

కావున వేమన సూక్తులు ఆణిముత్యములని గమనించవలెను.


*💥వేమన పద్యాలు -- 42*


*అందు నిందు నుండు నఖిలుండు జూడగా*

*నెందు దానె నిండి యెరుగుచుండు*

*నతని పూజా ఫలము నందుటే ముక్తిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

 భగవంతుడు సర్వాంతర్యామి.

అన్నిట తానే ఉండి మానవుని తీరు గమనించుచూనే ఉండును.

దైవపూజ చేసి ముక్తి పొందుట కర్తవ్యము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*భూరి మదీయమోహతమముం బెడబాప సమర్థులన్యులె*

*వ్వారలు నీవు కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం*

*సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి*

*స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా!*


నాయనా! కపిలా! నన్ను చాలా ఎక్కువైన అజ్ఞానం అనే చీకటి క్రమ్ముకొని ఉన్నది. దానిని తొలగించివేయటానికి సమర్థులు నీకంటె వేరైనవారు ఎవ్వరూలేరు. ఎందుకంటే నీవు ఏ దోషాలూ లేనివాడవు. ఏ అంటుసొంటులూ లేనివాడవు. ఏ వికారాలూ నీకు లేవు. సంసారం అనే తీగలను కోసివేయగల కొడవలివంటివాడవు నీవు. సర్వమూ తెలిసినవారిలో మొదటి స్థానం నీది. అందరకూ నీవే దిక్కు. ధర్మాన్ని పెంపొందించే దైవస్వరూపుడవు నీవు. అన్ని లోకాలకూ శుభాలను ఇవ్వగలవాడవు. ఎన్నటికీ చెడిపోని మహిమలకు నాయకుడవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 07*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*కార్పణ్యదోషో పహతస్వభావః*

*పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః ।*

*యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే*

*శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।।*


*భావము:* 

నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శేయస్కరమో దానిని ఉపదేశించుము.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*జననీం జనకం సాధూన్, పుత్రాన్ దారాన్ గురూనపి*

*సమర్థః స్సన్న పుష్ణాతి, స ఏహ గతిక స్మృతః*!!             


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము - *తల్లిదండ్రులను, సాధువులను, కుమారులను, భార్యను, గురువును పోషించనివానికి ఇహలోకంలోను, పరలోకంలోను కూడా పుట్టగతులుండవు*......

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                 🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం -‌ పంచమి - హస్త -‌ సౌమ్య వాసరే* *(31-01-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/aqur1knF6lg?si=4BRZy2zsjT0feBpD


🙏🙏

Panchang


 

Technology


 

Murdeswar


 

31-01-2024 / బుధవారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*31-01-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


 కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

వృషభం


కొన్ని వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తు,వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంభంధిత సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

---------------------------------------

కర్కాటకం


 గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో అందుతాయి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమౌతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి.

---------------------------------------

కన్య


ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది.

---------------------------------------

తుల


ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

వృశ్చికం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. భూవివాదాల పరిష్కారమౌతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

---------------------------------------

ధనస్సు


కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవచింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలుంటాయి.

---------------------------------------

మకరం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తా. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తువులు బహుమతులుగా పొందుతారు.

---------------------------------------

కుంభం


వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

మీనం


వృత్తి వ్యాపారలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

. *భాగం - 53*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 4*


తత్ర శక్తిం న్యసేత్పశ్చాత్పార్థివీం బీజసంజ్ఞికామ్‌ | తన్మాత్రాభిః సమస్తాభిఃసంవృత్తం పార్థివం శుభమ్‌. 46


అఖణ్డం తద్భవం ధ్యాయేత్తదాధారం తదాత్మకమ్‌ |

తన్మధ్యే చిన్త యేన్మూర్తిం పౌరుషీం ప్రణావాత్మికామ్‌. 47


పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. 


సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను.


లిఙ్గం సంక్రామయేత్పశ్చాదాత్మస్థం పూర్వంసంస్కృతమ్‌ |

విభక్తేన్ద్రియ సంస్థానం క్రమాద్వృద్ధం విచిన్తయేత్‌. 48


పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్తమైన ఇందియములు, ఆవయవస్థితి కలదై వృద్ధిపొంది నట్లు చింతించవలెను.


తతో7ణ్డమబ్దమేకం తు స్థిత్వా విశకలీకృతమ్‌ | ద్యావాపృథవ్యౌ శకలే తయోర్మధ్యే ప్రజాపతిమ్‌. 49


జాతం ధ్యాత్వా పునః ప్రేక్ష్యప్రణవేన తు తం శిశుమ్‌ |

మన్త్రాత్మకతనుం కృత్వా యతాన్యాసం పురోదితమ్‌. 50


విష్ణుహస్తం తతో మూర్ధ్ని దత్త్వా ధ్యాత్వా తు వైష్ణవమ్‌ | ఏవమేకం బహూన్వాపి జపిత్వా ధ్యానమోగతః.


కరౌ సంగృహ్య మూలేన నేత్రే బద్ధ్వా తు వాససా | నేత్ర మన్త్రేణ మన్త్రీతాన్‌ సదశేనాహతేను తు. 52


కృతపూజో గురుః సమ్యగ్ధేవదేవస్య తత్త్వవాన్‌ | శిష్యాన్‌ పుష్పఞ్జవిభృతః ప్రాఙ్ముఖానుపవేశయేత్‌. 53


పిమ్మట అండము ఒక సంవత్సరముపాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. 


మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. 


ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. 


తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.


అర్చియేయుశ్చ తే7ప్యేవం ప్రసూతా గురుణా హరిమ్‌ | క్షిప్త్వా పుష్పాఞ్జలిం తత్ర పుష్పాదిభిరన న్తరమ్‌. 54


వాసుదేవార్చనం కృత్వా గురోః పాదార్చనం తతః | విధాయం దక్షిణాం దద్యాత్సర్వస్వం చార్ధమేవ వా. 55


ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.


గురుః సంశిక్షయేచ్ఛిష్యాంసై#్తః పూజ్యో నామభిర్హరిః | విష్వక్సేనం యజేదిశం శఙ్కచక్రగదాధరమ్‌. 56


తర్జయన్తం చ తర్జన్యా మణ్డలస్థం విసర్జయేత్‌. 57


విష్ణునిర్మాల్యమఖిలం విష్వక్సేనాయ చార్పయేత్‌.


గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. 


శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.


ప్రణీతాభి స్తథాత్మానమభిషిచ్య చ కుణ్డగమ్‌. 58


మహ్నిమాత్మని సంయోజ్మ విష్వక్సేనం విసర్జయేత్‌ | బుభుక్షుః సర్వమాప్నోతి ముముక్షుర్లీయతే హరౌ. 59


ఇత్యాతి మహాపురాణ ఆగ్నేయే కుణ్డనిర్మాణాద్యగ్ని కార్యాదికథనం నామ చతుర్వింశోధ్యాయః.


ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. 


ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.


అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 15*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 40*


*అంది యందనట్టి యచల స్వరూపంబు*

*పొందు పడగ బూని పొదలు వాడు*

*జెంది మిన్నకుండు జిన్మయాకారుడై* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*


అందీ అందని దాని కొరకు , ఆత్రుతపడక మానవుడు చిదానంద స్వరూపుడై ప్రవర్తించవలెను.


*💥వేమన పద్యాలు -- 41*


*అంది వేమన జెప్పిన యాత్మబుద్ధి* 

*దెలియలేనట్టి మనుజులు దేబె లరయ*

*తలను బాసిన వెండ్రుక ల్వలెను జూడ*

*భుక్తి ముక్తులు హీనమై పోవు వేమా*


*🌹తాత్పర్యము --*

వేమన చెప్పిన ఆత్మబుద్ధిని గ్రహించలేని మనుజులు వెఱ్ఱి వారగుదురు.

తలను వీడిన వెంట్రుకలు కళావిహీనమగునట్లు , భుక్తికి , ముక్తికి కూడా దూరమగుదురు.

కావున వేమన సూక్తులు ఆణిముత్యములని గమనించవలెను.


*💥వేమన పద్యాలు -- 42*


*అందు నిందు నుండు నఖిలుండు జూడగా*

*నెందు దానె నిండి యెరుగుచుండు*

*నతని పూజా ఫలము నందుటే ముక్తిరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

 భగవంతుడు సర్వాంతర్యామి.

అన్నిట తానే ఉండి మానవుని తీరు గమనించుచూనే ఉండును.

దైవపూజ చేసి ముక్తి పొందుట కర్తవ్యము.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

30, జనవరి 2024, మంగళవారం

అరిచేతిలోనే

 *యత్రాస్థి భోగో న చ తత్ర మోక్షః*

*యత్రాస్థి మోక్షో న చ తత్ర భోగః*

*శ్రీ సుందరీసేవనతత్పరాణాం*

*భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ*


అర్థము:

*యత్ర అస్తి భోగః* = ఎక్కడైతే భోగములను అనుభవించుట ఉంటుందో...

*న చ తత్ర మోక్షః* = అక్కడ మోక్షము ఉండదు. 

*యత్ర అస్తి మోక్షః* = ఎక్కడైతే మోక్షము ఉంటుందో...

*న చ తత్ర భోగః* = అక్కడ భోగములు అనుభవించుట ఉండదు. 


కానీ....


*శ్రీ సుందరీ సేవన తత్పరాణాం* = అమ్మవారిని సేవించుకొనుటలోనే మునిగి ఉండే వారికి...

*భోగః చ మోక్షః చ* =భోగము, మోక్షము రెండూ కూడా....

*కరస్థ ఏవ* = అరిచేతిలోనే ఉంటాయి (అందుబాటులో ఉంటాయి. )

తా॥

ఎక్కడైతే భోగములను అనుభవించుట ఉంటుందో... అక్కడ మోక్షము ఉండదు. ఎక్కడైతే మోక్షము ఉంటుందో... అక్కడ భోగములు అనుభవించుట ఉండదు. కానీ....  అమ్మవారిని సేవించుకొనుటలోనే మునిగి ఉండే వారికి... భోగము, మోక్షము రెండూ కూడా.... అరిచేతిలోనే ఉంటాయి (అందుబాటులో ఉంటాయి.)

*~శ్రీశర్మద*

8333844664

సూక్తులు

 🌸🪷 *~సూక్తులు~* 🪷🌸


శ్లో𝕝𝕝 

*స్పృశన్నపి గజో హన్తి*

*జిఘ్రన్నపి భుజఙ్గమః।*

*హసన్నపి నృపో హన్తి*

*మానయన్నపి దుర్జనః॥*


తా𝕝𝕝 ఏనుగు స్పృశిస్తున్నట్లుగా కనబడుతూనే చంపును....

సర్పము వాసన చూస్తున్నట్లుగా కనబడుతూనే కాటు వేయును....

రాజు నవ్వుతున్నట్లుగా నటిస్తూనే చంపును.....  దుర్జనుడు గౌరవిస్తున్నట్లుగా నటిస్తూ చంపును....

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


శ్లో|| 

*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః*

*సిద్ధమన్నఞ్చ యోషితః।*

*కిఞ్చిత్కాలోపభోగ్యాని*

*యౌవనాని ధనాని చ॥*


తా|| "మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు. స్థిరముగా ఉండవు.

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

అదే 'బ్రహ్మ

 శ్లోకం:☝️

*యన్మనసా న మనుతే*

  *యేనాహుర్మనో మతమ్ ।*

*తదేవ బ్రహ్మ త్వం విద్ధి*

  *నేదం యదిదముపాసతే ॥*

  - కేనోపనిషద్ 1.5


భావం: ఏది మనస్సుతో ఆలోచించదో, అసలు దేనివలన మనస్సు ఆలోచించ కలుగుతోందో, అదే 'బ్రహ్మ'మని నీవు తెలుసుకొనుము. అంతేగాని ఇక్కడ నరులు ఉపాసించేది (బ్రహ్మము) కాదు.🙏

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన

 మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.30.01.2024 

మంగళ వారం (భౌమ వాసరే) 

 **********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

పంచమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే  కృష్ణ పక్షే

పంచమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.37

సూ.అ.5.51

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం*. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు*

*పుష్య మాసం* 

*కృష్ణ పక్షం పంచమి పూర్తి*. 

*మంగళ వారం*. 

*నక్షత్రం ఉత్తర రా. 7.49 వరకు.* 

అమృతం ప.11.50 ల 1.36 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.51 ల 9.36 వరకు. 

దుర్ముహూర్తం రా.10.57 ల 11.48 వరకు. 

వర్జ్యం రా.తె.5.04 ల మరునాడు ఉ.6.50 వరకు. 

యోగం అతిగండ ప.9.15 వరకు. 

కరణం కౌలవ సా. 7.19 వరకు.   

కరణం తైతుల మరునాడు ఉ. 8.20 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ పంచమి. 

************

*బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి*:-

/\//\\//\\//\\///\\//\\//\\//\\//\\//\\//\\/\\_ 

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*కటి విరాజిత పీత కౌశేయ శాటితో; వితత కాంచీగుణ ద్యుతి నటింప*

*ఆలంబి కంఠహారావళి ప్రభలతోఁ; గౌస్తుభ రోచులు గ్రందు కొనఁగ*

*నిజ కాంతి జిత తటిద్ర్జ కర్ణకుండల; రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ*

*మహనీయ నవ రత్నమయ కిరీటప్రభా; నిచయంబు దిక్కుల నిండఁ బర్వ*


నడుముమీద మెరిసిపోతున్న పట్టుపీతాంబరం మీద మొలత్రాడు దీప్తి చిందులు త్రొక్కుతున్నది. చాలా పొడవుగా వ్రేలాడుతున్న హారాల కాంతులను కౌస్తుభమణి కాంతులు మించిపోతున్నాయి. తన కాంతులనే మెరపుల గుంపులను జయించిన చెవులకు ఆభరణాలైన కుండలాల కాంతులను చెక్కిళ్ళ వెలుగులు మరింత పెంపొందిస్తున్నాయి. చాలా గొప్పవి అయిన తొమ్మిది రకాల రత్నాలు పొదిగిన కిరీటం ప్రభలు దిక్కులందంతటా వ్యాపిస్తున్నాయి. విలాసంగా ఆస్వామి తన పాదాలదగ్గర ఉన్న గరుత్మంతుడి భుజంమీద ఎడమ చేతిని ఉంచాడు. ఆ చేతికున్న వలయాలు, కంకణాలు, కేయూరాలూ వెలుగులను వెదజల్లు తున్నాయి. రెండవ చేతితో ఒక సుందరమైన పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్థి -  ఉత్తరాఫల్గుణి -‌ భౌమ వాసరే* *(30-01-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/Oo3QyZyrfB4?si=kbnwobcgldzCRGIt


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*30-01-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో జాగ్రత్త అవసరం.  సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

---------------------------------------

వృషభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది . వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృ వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.  ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

---------------------------------------

కర్కాటకం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యం సాగుతాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

---------------------------------------

సింహం


ఉద్యోగులకు పని ఒత్తిడి  నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

---------------------------------------

కన్య


 ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.  నూతన ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

తుల


సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. 

---------------------------------------

ధనస్సు


భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

మకరం


వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రులను  కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

కుంభం


నూతన వాహనయోగం ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

---------------------------------------

మీనం


కుటుంబ సభ్యులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటాబయట ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది.  ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

క్రుంగిపోనివాడికి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝 *విపత్తిష్వవ్యథో దక్షో*

         *నిత్యముత్థానవాన్నరః*|

         *అప్రమత్తో వినీతాత్మా* 

         *నిత్య భద్రాణి పశ్యతి*||


తా𝕝𝕝 "*ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి, అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే చేకూరతాయి*"....

29, జనవరి 2024, సోమవారం

హిందువులకు

 



హిందూ సనాతన ధర్మ విశిష్టత కోసం ప్రతి ఒక్కరికి తెలిసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఏడాది పొడవునా కనీసం 15 పుణ్యక్షేత్రాలకు దర్శించిన వారికి వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయి వారికి తిరిగి ఇచ్చే విధంగా ఈ పధకం హిందువులకు ఉపయోగపడుతుంది


దయచేసి ప్రతి ఒకరు మన పేజిని లైక్ చేసి మాకు సపోర్ట్ గా నిలవండి :)🙏🙏🚩🚩🚩

హిందూ బంధువులకు

 సమస్త హిందూ బంధువులకు ఒక సూచన ! మనం ఒక విచిత్రమైన తప్పిదం చాలా కాలంగా చేస్తున్నాం .ఒకసారి కుటుంబ సమేతంగా తిరుపతి, శ్రీ శైలం, కనక దుర్గమ్మ ఆలయాలు దర్షించాక మళ్లీ మళ్లీ అవే ఆలయాలకు 15/20/25 వేలు ఖర్చులు పెట్టి, క్యూ లలో నిల్చుని, రూం.లు దొరకక, చంటి పిల్లలతో అవస్థలు పడి, 300/1000 రూ టిక్కెట్లు పెట్టీ వెళుతుంటే ప్రభుత్వాలు ఆ సొమ్ము ఇతర వర్గాలకు మళ్లిస్తున్నారు. అదే వెంకన్న, మల్లన్న, దుర్గమ్మ గుడులు మన వూళ్ళో ఉన్నా బాగు చేయడానికి మనసు రాదు.

మరి మనం ఇదే ఖర్చులో పావలా వంతు మన ఊరి గుడికి ఖర్చు పెట్టుకుంటే ఏ అలసట లేకుండా ,దర్శనం,ప్రసాదం, ఆశీర్వాదం లభిస్తాయి. పేద పూజారి కడుపు నిండుతుంది. కొంత సొమ్ము మీ దగ్గర లోని గోషాలలకు ఇస్తే గోమాతల కడుపు నిండి ఆశీర్వాదం,పుణ్యం లభిస్తాయి . కొన్నాళ్ళకు ప్రభుత్వాలు గుడులపై పెత్తనం వదులుకుంటారు. ఇది సాధ్యమే ! తిరుపతి వెంకన్న ,మనగుడిలో వెంకన్న ఒకరే కదా !! ఆలోచించండి ,అర్థం చేసుకోండి !!

పది మందికీ ఇదే విషయం చెప్పి మీ గుడి, మీ వూరు,మీ గోవులను కాపాడుకోండి !జై శ్రీ రామ్!!!

అన్నం విలువ

 *అన్నం విలువ*

🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚

ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు

తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని

ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకుకూడా

వదలకుండా తింటాడు"అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు, ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు.

"నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు.


"ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.

ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది

నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం.

అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను అడిగి వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,

వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి పనిచేసి ఆ సంపాదనతో సాయంత్రానికి తెస్తాడు.

ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.

అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా!

అందుకే నేను ఎవరు

నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను

అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది.

నా తల్లిదండ్రుల పుణ్యమా అని, అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "

అని చాలా చక్కగా చెప్పాడు.

ప్రతి ఉపాధ్యాయుడూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా విధానంలో మార్పుతేవలసిన అవసరం ఎంతైనా ఉంది.


అన్నం పరబ్రహ్మ స్వరూపం.

Panchang

  


గొప్ప సంస్కృతి

 ఎంత గొప్ప సంస్కృతి మనది!🙏🏵️🙏🚩


*దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రతో కలసి... సకుటుంబ సపరివారంగా, బంధు మిత్రుల సమేతంగా బయలుదేరి జనక మహారాజు గారి ద్వారం వద్దకు వెళ్తాడు.*


*అప్పుడు జనక మహారాజు తాను స్వయంగా ఎదురు వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు.*


*అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.*


*అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని... “రాజా! మీరు పెద్దవారు. పైగా వరుని పక్షంవారు. ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?” గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు.*


*అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెబుతాడు...*


*”మహారాజా! మీరు దాతలు... కన్యాదానం చేస్తున్నారు... నేనైతే యాచకుణ్ణి... మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను... ఇప్పుడు చెప్పండి. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప?” అని అంటాడు.*


*ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు... ”ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో... వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురి అదృష్టంలో తండ్రి తప్పక ఉంటాడు.”*


*ఇదీ ఘనమైన మన భారతీయత..!*   


*ఇదీ మహోత్కృష్ఠమైన మన సంస్కృతి..!* 


*ఇదీ రామాయణం నీతి..!*  

.

అమృతం త్రాగి

 అమృతం త్రాగి

భూమి మీదకు

ఎవరు రాలేదు


మహారాజు కూడ

మరణం పొందినాడు


ఒకడు చరిత్ర సృష్టించి

పోయినాడు


మరొకడు చరిత్రహీనుడై

మరణించినాడు


మంచిపనులు చేసి

నరలోకంలో

దేవుడు అయ్యాడు


చెడుపనులు చేసి

రాక్షసుడు అయ్యాడు


సమయం వస్తే అందరు

భౌతికదేహం వదిలి

పైకి పోతారు


అహంకారం వదిలేద్దాం

అవివేకం వదిలేద్దాం

మంచి ప్రజలను

ప్రతిభావంతులను

ప్రోత్సహిస్తు

ముందుకు పోదాం


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


అమృతం పీత్వా 

 కో2పి భూమౌ 

 న ఆగతవాన్


మహారాజః అపి

మరణం ప్రాప్తవాన్ 


కశ్చన చరిత్రం సృష్ట్వా

గతవాన్


కశ్చన చరిత్రహీనః భూత్వా

మృతవాన్


సాధుకార్యాణి కృత్వా

నరలోకే దేవః అభవత్


అసాధుకార్యాణి సమాచర్య

నరలోకే దైత్యః అభవత్


సమయమ్ ఆగచ్ఛతి చేత్

సర్వే భౌతికదేహం త్యక్త్వా

ఉపరి గచ్ఛంతి ఏవ


అహంకారం త్యజేమ

అవివేకం విసర్జయేమ

సజ్జనాన్ సత్పురుషాన్

ప్రతిభావతః జనాన్

సదా ప్రోత్సాహయన్తః

అగ్రే గచ్ఛేమ

గోవు వెనక వెళ్ళడమెందుకు

 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏


🕉️గోవు వెనక వెళ్ళడమెందుకు?🕉️


పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.


భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవాలి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.


ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.


కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.


చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.


ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.


చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.


స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.


స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.


స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.


స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?


🌹👏🌹

జయ జయ శంకర

హర హర శంకర

🌹👏🌹


అపార కరుణాసింధుం 

జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం

ప్రణమామి ముదావహం

మరణం ఎందుకు

 *మరణం ఎందుకు ముఖ్యం?*

🌷🌷🌷🌷🌷🌷🌷

      

    మరణం ఎందుకు ముఖ్యమైనది ? దాని ప్రాముఖ్యతను వివరించే  అందమైన కథనం. 


        మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా? ఈ కథ చదవండి... 


        ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి "ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడా సన్యాసి "ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా వున్న రెండు పర్వతాలను దాటండి.అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."అని చెప్పాడు. 


         రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా... 


        "నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను.అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."


          రాజు ఆలోచించాడు... "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి ? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. "నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలుపండి "అని


         సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు." 


         రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ  అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.


         నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం  అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. 


         రాజు దిగ్భ్రాంతికి గురై  సన్యాసి వద్దకు తిరిగి వచ్చి...


      *"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు"* అన్నాడు.  


        అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...


     _*మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది*_


        "మరణాన్ని నివారించే బదులు,మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది. 


1.మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది. 

2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది 

3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర  లాగా ఉంటుంది 

4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.

5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది .

6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. 

7.ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 04-05*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అర్జున ఉవాచ ।*

*కథం భీష్మమహం సంఖ్యే* 

*ద్రోణం చ మధుసూదన ।*

*ఇషుభి ప్రతియోత్స్యామి*

*పూజార్హవరిసూదన ।। 4 ।।*


*గురూనహత్వా హి మహానుభావాన్*

*శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే ।*

*హత్వార్థకామాంస్తు గురూనిహైవ*

*భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।*



*భావము:*

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తం తో కళంకితమై ఉంటాయి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.29.01.2024 

సోమ వారం (ఇందు వాసరే) 

 **********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

చతుర్ధ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే కృష్ణ పక్షే

చతుర్ధ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.37

సూ.అ.5.50

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ^

^ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు-

పుష్య మాసం 

God's పక్షం చవితి రా.తె.6.19 వరకు.

సోమ వారం. 

నక్షత్రం పుబ్బ సా.5.13 వరకు. 

అమృతం ప.10.07 ల 12.53 వరకు. 

దుర్ముహూర్తం ప.12.35 ల 1.20 వరకు. 

దుర్ముహూర్తం మ.2.49 ల 3.34 వరకు. 

వర్జ్యం రా.1.12 ల 2.58 వరకు. 

యోగం శోభన ఉ.8.38 వరకు. 

కరణం బవ సా. 5.13 వరకు.   

కరణం బాలవ రా. తె. 6.19 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం సా.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ప. 10.30 ల 12.00 వరకు. 

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ చవితి. 

************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

గరుడ పురాణం

 శ్లోకం:☝️

   *స్వస్థానాచ్చలితే శ్వాసే*

*కల్పాఖ్యో హ్యాతురక్షణః |*

   *శతవృశ్చికదంష్ట్రస్య*

*యా పీడా సాయనుభూయతే ||*

   - గరుడ పురాణం


భావం: మరణ సమయాన ప్రాణాధారమైన గాలి తన స్థలం నుండి కదులుతున్నప్పుడు, ఒక క్షణం కూడా ఒక యుగంలా గడుస్తుంది, మరియు నొప్పి వంద తేళ్లు కుట్టినంత సమానంగా ఉంటుంది.

జనాలు గరుడ పురాణం చదవాలంటే భయపడేది ఇందుకేనేమో?

పంచాంగం 29.01.2024

 ఈ రోజు పంచాంగం 29.01.2024

Monday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: చవితి తిధి ఇందు వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శోభన యోగ: బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి ఈ రోజు పూర్తిగా ఉంది.

పూర్వఫల్గుని సాయంత్రం 06:57 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:06


వర్జ్యం : రాత్రి 03:05 నుండి 04:54 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:51 నుండి 01:36 వరకు తిరిగి మధ్యాహ్నం 03:06 నుండి 03:51 వరకు.


అమృత ఘడియలు : పగలు 11:44 నుండి మధ్యాహ్నం 01:32


రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

నైమిశారణ్యం

 *నైమిశారణ్యం*

*పురాణాల పుట్టిల్లు నైమిశారణ్యం. గురువులకు, తపస్వులకు నిలయం. వేదకాలం నుంచి నైమిశారణ్యంలో ఎప్పుడూ ఏవేవో దివ్య క్రతువులు, జ్ఞాన సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మూడులోకాలలోని తీర్థాలలో ఉత్తమమైనది నైమిశారణ్యం. ఈ దివ్య తీర్థాన్ని దర్శిస్తే సకల తీర్థాలనూ సేవించిన ఫలితం లభిస్తుంది.*


 కురుక్షేత్రంలో ఒక క్రోసెడు దూరం నడిచినా, నైమిశారణ్యంలో ఒక అడుగు నడిచినా, యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందని మహాభారతంలోని అరణ్యపర్వం చెబుతుంది. నైమిశారణ్యం ఎనిమిదో వైకుంఠం అని తులసీదాసు రామచరిత మానస్ చెబుతోంది. 


1. దండకారణ్యం, 

2. సైంధవారణ్యం, 

3. జంబుకారణ్యం, 

4. పుష్కరారణ్యం, 

5. ఉత్పలారణ్యం, 

6. బదరికారణ్యం, 

7. జాంగలారణ్యం, 

8. ఉత్తరారణ్యం, 

9. నైమిశారణ్యం 


అనే తొమ్మిది అరణ్యాలలో ఇది ఉత్తమమైనది.


*నైమిశం ఇలా పుట్టింది*


పాంచాల రాజ్యానికి, కోసల దేశానికి మధ్యలో 84 క్రోసులు అంటే 252 కి.మీ. దూరం వ్యాపించిన సువిశాల అరణ్యమే *"నైమిశారణ్యం.* అనాదికాలం నుంచి మన రుషులకు తపోస్థలి. శౌనకాది మహామునులు ఇక్కడ చిరకాలం తపస్సులు చేశారు. యజ్ఞయాగాలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట పవిత్రమైనవే.


 పూర్వం కలియుగం ప్రారంభంలో రుషులు, మునులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి, “స్వామీ! రాబోయే కలియుగం సకల అనర్థాలకూ మూలం కదా! మాకు కలిప్రభావం లేని ప్రదేశాన్ని సూచించండి. మేమంతా అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుంటాం” అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు ద్వారా ఒక దివ్యచక్రాన్ని సృష్టించి భూమిపైకి పంపాడు. “మహాత్ములారా! మీరంతా ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్లండి. ఆ చక్రం నేమి (ఇరుసు) ఎక్కడ ఆగుతుందో అదే మీరు కోరుకునే పుణ్యప్రదేశం" అని చెప్పి పంపించాడు. అలా బ్రహ్మ వదిలిన చక్రం ఇరుసు ఆగిన ప్రదేశమే *నైమిశారణ్యం.*


 ఈ అరణ్యంలో శౌనక మహర్షి 84 వేలమంది మునులతో కలిసి భాగవత పారాయణ చేశాడని చెబుతారు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు కూడా ఇక్కడే ఒక యాగాన్ని చేసి మహాభారత పారాయణ చేశాడు. శ్రీరాముడు అశ్వమేధయాగం ఇక్కడే చేశాడు. ఇక్కడే లవకుశుల్ని కలుసుకున్నాడు.


*దర్శనీయ స్థలాలు:*


*చక్రతీర్థం:*


 బ్రహ్మదేవుడి చక్రం ఆగిన స్థలంలోనే చక్రతీర్థం అనే పుష్కరిణి ఏర్పడింది. నైమిశారణ్యంలో ఇది సుప్రసిద్ధ తీర్థం. ఇది వృత్తాకారంగా అందంగా కనిపిస్తుంది. ఈ దివ్యతీర్థంలో స్నానం చేసినవారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. అమావాస్య, సోమవారం కలిసి వచ్చిన రోజున సోమావతీ అమావాస్య (జూలై 17) అంటారు. ఆ రోజున ఎవరైతే చక్రతీర్థంలో స్నానం చేస్తారో వారి మనోవాంఛలన్నీ తప్పకుండా సిద్ధిస్తాయి. అందుకే, ఈ పుణ్యతిథినాడు లక్షలాదిమంది నైమిశారణ్యానికి వచ్చి, చక్రతీర్థంలో స్నానాలు చేస్తారు. ఈ చక్రతీర్థమే భూమండలానికి మధ్యభాగం అని మహాభారతం శాంతిపర్వం (343.2) చెబుతోంది. ఈ తీర్థం పక్కనే ప్రాచీనమైన శివాలయం కూడా ఉంది. స్వామిపేరు *భూతేశ్వరుడు.*


*వ్యాసగద్దె :*


భగవాన్ వేదవ్యాస మహర్షి వేదవిభజన చేసిన ప్రదేశమే ఈ వ్యాసగద్దె. వ్యాసుడు ఇక్కడే ఒక్కటిగా ఉన్న వేదరాశిని నాలుగు వేదాలుగా విభాగం చేశాడంటారు♪. జైమిని, వైశంపాయనుడు, పైలుడు, అంగీరసుడు వంటి శిష్యులకు వేదవిద్యను ఇక్కడే ప్రబోధించాడు. అష్టాదశ పురాణాలను అందించాడు. ఈ వ్యాసగద్దెను చక్కటి పట్టువస్త్రంతో అలంకరిస్తారు. ఈ గద్దె పక్కనే వ్యాస, శుకమహర్షుల పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ వ్యాసగద్దె సమీపంలోనే మరికొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. ఇది చక్రతీర్థానికి అరకిలోమీటరు దూరంలోనే ఉంది.


*సూతగద్దె :* 


 సూత పౌరాణికుడు ఎనభై ఎనిమిది వేలమంది మునులకు పురాణాలను వినిపించాడు. అంతేకాదు మన ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదటిసారిగా సూతమహర్షి శౌనకాది మునులకు బోధించిన స్థలం కూడా ఇదే. ఈ ప్రదేశంలో సూతమహర్షి పాలరాతి విగ్రహాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఒక పెద్ద దేవాలయంగా దీన్ని తీరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.


*శౌనక యాగశాల:* 


 సూతగద్దె సమీపంలోనే పూర్వం శౌనకాది మహామునులు దీర్ఘసత్రయాగం చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడ ఒక ప్రాచీనమైన యాగశాల మనకు కనిపిస్తుంది.


*లలితా శక్తిపీఠం:* 


పవిత్రమైన నైమిశారణ్య క్షేత్రంలో సతీదేవి హృదయభాగం పడిందని చెబుతారు. దక్షయజ్ఞ వాటికలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి శరీరాన్ని శ్రీహరి తన చక్రంతో 108 భాగాలుగా ఖండించగా అవన్నీ భూమండలంలో 108 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా మారిపోయాయి. తంత్రగ్రంథాలలో ఈ పీఠాన్ని *ఉడ్డీయనీ పీఠం* అంటారు. నైమిశారణ్యంలో కొలువున్న అమ్మవారిని *లింగధారిణీ* అనే పేరుతో ఆరాధిస్తారు. అయితే లలితాపీఠంగా ఇది ప్రసిద్ధి చెందడం విశేషం. దసరా నవరాత్రులు, చైత్ర నవరాత్రుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. చక్రతీర్థం నుంచి సుమారు ఒక కి.మీ. దూరంలో శక్తిపీఠం ఉంటుంది. 


ఇంకా నైమిశారణ్యంలో బాలాజీ మందిరం, దేవరాజన్ మందిరం, గోమతీ నది, దధీచి కుండం, రుద్రావర్త కుండం హత్యారణ్య కుండం తప్పకుండా చూడవలసినవి.

28, జనవరి 2024, ఆదివారం

362 year old man


 

శ్రీ మార్తాండ్ సూర్యదేవాలయం

 🕉 మన గుడి : నెం 314




⚜ జమ్మూకాశ్మీర్  : అనంతనాగ్


⚜ శ్రీ మార్తాండ్ సూర్యదేవాలయం



💠 మార్తాండ్ సూర్య దేవాలయం ... దురదృష్టవశాత్తు హిందువులు అందరూ మరిచిపోయిన ఒక పురాతన సూర్యదేవాలయం.


💠 మార్తాండ్ సూర్య దేవాలయం జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కాశ్మీర్ లోయలో అనంత్‌నాగ్ నగరానికి సమీపంలో ఉన్న కర్కోట రాజవంశానికి చెందిన లలితాదిత్యకు నిర్మించాడు అని శాసనాల ద్వారా తెలుపబడే హిందూ దేవాలయం.  


💠 ఇది 8వ శతాబ్దపు నాటిది మరియు హిందూమతం/సనాతన ధర్మంలో ప్రధాన సౌర దేవత సూర్య (సూర్యుడు)కి అంకితం చేయబడింది.


💠 సూర్య భగవానుడిని సంస్కృత భాషా పర్యాయపదమైన మార్తాండ్ (మార్తండ్, మార్తాండ) అని కూడా పిలుస్తారు.  

ఈ ఆలయాన్ని మహమ్మదీయ రాజైన సికందర్ షా మీరీ ధ్వంసం చేశారు.


💠 మార్తాండ్ సూర్య దేవాలయం అద్భుతమైన నిర్మాణ  మరియు కాశ్మీరీ వాస్తుశిల్పానికి గర్వకారణం, ఇది ప్రపంచంలోని నిర్మాణ అద్భుతాలలో ప్రముఖ స్థానాన్ని పొందింది.  

ఈ నిర్మాణాన్ని 370 - 500 మధ్య కర్కోట రాజవంశానికి చెందిన రామాదిత్య ప్రారంభించినట్లు చెబుతారు.  

725 - 756 మధ్య కర్కోట రాజవంశం యొక్క మూడవ పాలకుడు లలితాదిత్య ముక్తాపిడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.


💠 మిక్కిలి బ్రహ్మాండమైన ఈ సూర్య దేవాలయం పెద్ద పెద్ద స్తంభాలమీద దీర్ఘ చతురస్రాకారపు ఆవరణలో నిర్మించబడింది. ముందు మిక్కిలి ఎత్తుగా ఉండే గోడలతో చావడి గుండా లోపలికి ప్రవేశించాలి. 

ఈ గోడలకు నగిషీలతో వంపులు తీర్చిన ద్వారాలు ఉంటాయి.


💠 67 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు గల విశాలమైన ద్వార మంటపాలు మిక్కిలి దీనావస్థలో ఉన్నాయి. 

ద్వార మండపంలో విడిగా ఒక పూజా మందిరం ఉంది. ఈ మైదానంలో శిథిలమైన 84 స్తంభాలు ఉన్నాయి. రాశి చక్రంలోగల 12 రాశుల గుణిజమును సూచిస్తుంది.


💠 మార్తాండ్ సూర్య దేవాలయం కాశ్మీరీ నివాసుల కళ, నైపుణ్యాలు మరియు నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణ.  

ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం కాశ్మీరీ లోయ యొక్క అద్భుతమైన దృశ్య ప్రదేశాన్ని ఎంచుకున్నారు.  

ఈ ఆలయం చతురస్రాకారపు సున్నపురాయి ఆలయం మరియు గ్రీకు శైలిలో నిర్మించబడిన స్తంభాలను కలిగి ఉంది.  

ఈ ఆలయంలో రోమన్, గ్రీక్, చైనీస్, గుప్త, గాంధారన్ మరియు సిరియన్ - బైజాంటైన్ రూపాల మిశ్రమాలు ఉన్నాయి.


💠 ఒరిస్సాను పరిపాలించిన గంగ వంశపు రాజులలో ఒకటవ మహారాజా నరసింగదేవ 13వ శతాబ్దంలో కోణార్క్ దేవాలయం నిర్మించారు. 

కాశ్మీర్ శ్రీనగర్ మార్తాండ్ సూర్యదేవాలయం అప్పటికి సుమారు 500 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది.

కాశ్మీర్ లోయలో ఇస్లామ్ మతం స్థాపింపబడడానికి ముందే అశోక

చక్రవర్తి ఇచ్చట బౌద్ధమతాన్ని బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసాడు. 


💠 కాలక్రమేణా ఇక్కడ బౌద్ధమతం క్షీణించి మహమ్మదీయ పాలన పాతుకుపోయింది. 1346 ఇచ్చట మహమ్మదీయ పాలన ప్రారంభమైనది. 

కాశ్మీరును అప్పటివరకు అనేక హైందవ వంశాలు పరిపాలించినట్టు చరిత్ర వల్ల తెలుస్తుంది. 


💠 శ్రీనగర్ 68 కి.మీ. దూరంలో ఉన్న మార్తాండ్ అనేక నదులతో, కాలువలతో, మంచినీటి బుగ్గలతో ఆవరించబడి ఉంది. 

సుప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు, పరిశోధకుడు అయిన సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ ఈ దేవాలయాన్ని గురించి వివరిస్తూ ‘శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయం బ్రహ్మాండంగా విస్తరించుకున్న నిర్మాణం, శిల్పనైపుణ్యంతోను, వివిధ అలంకారాలతోను ఎంతో అద్భుతంగా ఉంది అని వ్రాసాడు.


💠 ఈ ప్రాచీన మార్తాండ తీర్థమే కాశ్యప మహాముని నివాసం అంటారు. 

మార్తాండ్లో మంచినీటి బుగ్గలు సాక్షాత్తు పరమశివుడు ఏర్పరచినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 

ఒకప్పుడు పవిత్రమైన పుణ్యతీర్థంగా వెలసిన మార్తాండ్ను నేడు ఏ కొద్ది మందో తప్ప యాత్రికులు ఎవరూ దర్శించడం లేదు.


⚜ విధ్వంసం ⚜


💠 దాదాపు 15వ శతాబ్దంలో షామీరి రాజవంశం యొక్క ఆరవ సుల్తాన్ అయిన సికందర్ బుత్షికాన్ అనే ఇస్లాం పాలకుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.  

ఈ క్రూరమైన పాలకుడు హిందూ మతాన్ని అణచివేయడానికి మార్తాండ్ సూర్య దేవాలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశాడు.


💠 మార్తాండ్ ఆలయాన్ని త్రవ్వి ధ్వంసం చేసిన తర్వాత, సికందర్‌కు పునాది క్రింద ఒక రాగి ఫలకం దొరికిందని ఒక ఆసక్తికరమైన సామెత ఉంది.  

అతను దానిపై ఉన్న సారాంశం చదివాడు మరియు అందులో ఇలా ఉంది "ఈ ఆలయాన్ని నిర్మించిన తరువాత, ఆలయం ఎంతకాలం ఉంటుందో రాజు తన జ్యోతిష్కుల నుండి తెలుసుకోవాలనుకున్నాడు మరియు పదకొండు వందల సంవత్సరాల తరువాత, సికుందర్ అనే రాజు నాశనం చేస్తాడని వారి ద్వారా తెలియజేయబడింది.  

"ఆ విషయం చదవడం ద్వారా సికందర్ ఆశ్చర్యపోయాడు, హిందూ పండితులు జరగబోయే నిజాన్ని అంచనా వేసి ప్రకటించాడు.  

రాగి ఫలకంపై ఉన్న ఈ లిపి గురించి రాజు సికందర్‌కు ముందే తెలిసి ఉంటే, హిందూ ప్రవక్తల అంచనా తప్పు అని నిరూపించడానికి అతను ఆలయాన్ని విధ్వంసం నుండి రక్షించేవాడు ఏమో..!


🔅 కొసమెరుపు :

హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పటి చాలా హిందీ చిత్రాలలో  ఈ అద్భుతమైన పురాతన హిందూ దేవాలయాన్ని "షైతాన్ కి గుఫా" (దెయ్యాల గుహ)గా ప్రదర్శించడం నిజంగా సిగ్గుచేటు , దౌర్భాగ్యం......

Panchang

 


Rama prasadam


 

Low water pressure tap


 

పంచకర్మ పద్ధతి

 ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 


     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 


       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 


       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నస్యకర్మ  - 


        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 


 *  వమనకర్మ  - 


       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 


 *  విరేచనకర్మ - 


       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 


 *  నిరూహవస్తి - 


        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 


 *  అనువాసనవ వస్తి - 


      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 


        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఏ దోషం ఉండదు

 *సుభాషితం*

*--------------*

🌺

*ఏకః క్షమావతాం దోషో*

 *ద్వితీయో నోపపద్యతే ౹*

     *యదేన క్షమయా యుక్త*

*మశక్తం మాన్యతే జనః ౹౹*. 🌺

  *భావం : సహనం ఉన్నవారిలో ఒక దోషం ఉంది. ప్రజలు తమ వైపే ఆశక్తులు అని భావిస్తారు. ఇది కాకుండా వారిలో ఏ దోషం ఉండదు.*

🌺✍🏽

సంపూర్ణమౌతాయి

 _*🕉️నేటి సుభాషితము🕉️*_ 

 


_*జలబిందు నిపాతేన*_

_*క్రమశః పూర్యతే ఘటః|*_

_*స హేతుః సర్వ విద్యానాం*_

_*ధర్మస్య చ ధనస్య చ||*_


*భావము:ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది. అలాగే, అన్ని విద్యలు, ధర్మము, ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తే సంపూర్ణమౌతాయి.*


   


 *📖 మన ఇతిహాసాలు 📓*



*బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది.* అవి 

బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. అవి 1. ఋగ్వేదము2. సామ వేదము3. యజుర్వేదము4. అధర్వణ వేదము వీటి నుండి 1. సంహితాలు దీని నుండి కర్మ కాండ 2. అరణ్యకాలు వీటినుండి జ్ఞాన కాండ3. ఉపనిషత్తులు వీటినుండి ఉపాసన కాండ అలాగే పై మూడింటినుండి 1. ఉపవేదాలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ, శిల్ప మొదలగున్నవిన్నూ.....2. వేదాంగాలు - శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్ప, జ్యోతిషం ఏర్పడ్డాయి. 3. ధర్శనాలు - వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత మ్దలగున్నవి ఏర్పడ్డాయి. 4. శాస్త్రాలు - నీతి, స్మృతి మొదలగున్నవి ఏర్పడ్డాయి. 5. ఆగమాలు - ఇందులో శైవ, శక్త మరియు వైశ్ణవాలూ అలాగే 6. పురాణాలు- అష్టాదశ పురాణాలు ఐ విధముగా వేదాలను సామాన్య మానవుడికి సులభముగా అర్ధమగు రీతిలో అమరిక చేయడం జరిగిన్ది. ఇక జ్యోతిషాన్ని కూడా కొన్ని శాఖలుగా విభజించడం జరిగినది.అవి 1. ప్రశ్నా శాస్త్రము, 2. హస్త రేఖా శాస్త్రము, 3. సంఖ్యా శాస్త్రము, 4. పాచికలు, 5. గవ్వలు, 6. ముఖము చూచి చెప్పుట, 7. చిలుక జ్యోతిషము మొదలగు శాఖలు

మన సీతమ్మ కథ..

 


శ్రీభారత్ వీక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹మన సీతమ్మ కథ.. సీతాదేవి చరిత్రను కళ్లకు కట్టినట్టు పరిచయం చేసే సీరియల్. సీతాయాశ్చరితం మహత్ అనే పరిశోధనా గ్రంథం రచించిన ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు ఎంతో రసరమ్యంగా అందిస్తున్న మనోహరమైన కథనం ఇది. అసలు సీత ఎవరు? వాల్మీకి రామాయణంలోను, మరికొన్ని రామాయణాల్లోను సీతమ్మను ఎంత ఉదాత్తంగా చిత్రీకరించారో వినండి. సీతమ్మ భారతీయుల ఆడపడుచు. భారతీయుల హృదయం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కొడుకే మోక్షకారకుడా?

: కొడుకే మోక్షకారకుడా?


కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై/

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్/

బడసెన్: పుత్రులులేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్/

చెడునే మోక్షపదంబపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి;


భావము:-లోకంలో జీవనభ్రాంతిలోమునిగిన జనం "అపుత్రస్య గతిర్నాస్తి"-యను వాక్యము నూతగొని సంసారమగ్నులై మోక్షపథమునకు దూరమగుచున్నారు.యదార్ధమునకు సంతానము మోకషపదమునకు సహకారమనుట యసత్యము.

       ధృతరాష్ట్రునకు నూర్గురు కుమారులుగలిగిరి వారివలన అతనికి గలిగిన సద్గతులెవ్వి?

ఆజన్మబ్రహ్మచారియైన శుకునకు సంతతిలేకపోవుటచేకలిగిన దుర్గతులేవి?

      సంతతి లేకుండుట మోక్షపదమునకు అవరోధము యెంతమాత్రముకాదు.అదియొకభ్రమ!

కేవలమూ పరమేశ్వరానుగ్రహమే సద్గతికి మూలము.


                           స్వస్తి!🙏

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 03*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*క్లైబ్యం మా స్మ గమః పార్థ*

*నైతత్త్వయ్యుపపద్యతే ।*

*క్షుద్రం హృదయ దౌర్బల్యం*

*త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।।*


*భావము:*

ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.

 

*వివరణ:* 

జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహించుతూ అర్జునుడి అంతర్గత శక్తిని పెంపోదిస్తున్నాడు.

ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంభోదించడం వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల ఆర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంభోదిస్తున్నాడు, తన క్షత్రియ ధర్మమయిన కర్తవ్యాన్ని విస్మరించాలనే ఆలోచనే, ఆ శత్రువు.

అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్త భ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనత. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన, ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 12*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 31*


*అంతరంగమందు నద్వైతమే యుండు*

*బాహ్యమందు ద్వైత భావముండు*

*యట్లుకాక తత్త్వ మలవడ నేరదు* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తత్త్వం తెలియాలంటే ద్వైత భ్రాంతి వీడాలి.

జీవాత్మ పరమాత్మలను వేరుగా చూడరాదు.

అభేద బ్రహ్మ బోధము కావాలి.


*💥వేమన పద్యాలు -- 32*


*అంతరంగ మెరుగ హరుడౌను గురుడౌను*

*యంతరంగ మెరుగ నలవికాదు*

*యంతరంగ మెరుగ నతడెపో శివుడయా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అది ఆ శివునికొక్కడికే శక్యము , ఎదుటి వాని మనసుననున్నది గ్రహించినవాడే శివస్వరూపుడౌతాడు.


*💥వేమన పద్యాలు -- 33*

      

*అంతరంగ హృదయమందగా సాధించి*

*చింత లూడబెరికి చిక్కుపడక*

*వింతజూచి మెలగి విజ్ఞాన మందరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఏ చీకూ చింతా లేకుండా , చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించి జ్ఞానమును పొందవలెను.

సత్ప్రవర్తునుడై మెలగవలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *151వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*కేతుగ్రహ మహిమ - 1*


*"పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ! రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !!”* 


నిర్వికల్పానంద చేతులు జోడించి ప్రార్థించాడు.


*“గురువుగారూ... 'పలాశపుష్పం' అంటే...”* సదానందుడు ప్రారంభించాడు.


*"మోదుగు పువ్వు నాయనా ! కేతువు వర్ణం మోదుగు పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ! ఇతర గ్రహాలకు లాగే నవగ్రహాలలో నవమగ్రహమైన కేతువుకూ అనేక కారకత్వాలున్నాయి. వాటిలో మహత్తరమైన కారకత్వం ఒకటుంది. అదే మోక్షకారకత్వం ! మానవుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి అనే 'ముక్తి' లభించాలంటే కేతుగ్రహ శుభవీక్షణ చాలా ముఖ్యం. ఆయన దయలేని కారణంగా విశ్వప్రయత్నం చేసినప్పటికీ . మోక్షాన్ని , అంటే స్వర్గాన్ని అందుకోలేకపోయిన పురాణ పురుషుడి గాథ చెప్పుకుందాం !”* నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించి , శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు.


విమలానందుడూ , చిదానందుడూ , సదానందుడూ , శివానందుడూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు.


*“ఇందాక మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకున్నాం. ఆయన తండ్రి ఎవరో తెలుసా ? సత్యవ్రత మహారాజు ! ఆయన మనకు 'త్రిశంకుడు'గా తెలుసు !”*


*"సత్యవ్రత మహారాజుకు 'త్రిశంకుడు' అనే పేరు ఎందుకు వచ్చింది , గురువుగారూ ?"*


*"వశిష్ఠ మహర్షి శాపం వల్ల ఆయన త్రిశంకుడయ్యాడు. 'త్రిశంకుడు' అంటే మూడు పాపాలు చేసినవాడు అని అర్థం...”*


*"ఆ మూడు పాపాలు ఏవి , గురువుగారూ ?”* సదానందుడు అడిగాడు.


*“యుక్తవయస్సులో ఉన్నప్పుడు సత్యవ్రతుడు వివాహవేదిక మీద నుండి మంగళ సూత్రధారణ జరిగే ముందు , ఒక వధువును ఎత్తుకు వెళ్ళిపోయాడు. అది ఒక పాపం !”*


*"ఆ నేరానికి శిక్షగా ఆయన తండ్రి అయిన త్రయ్యారుణ చక్రవర్తి సత్యవ్రతునికి రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. కన్నతండ్రి ఆగ్రహానికి గురి అవడం రెండవ పాపం.”*


*"దేశం వదిలి అరణ్యాలలో జంతువులను వేటాడి తింటూ నికృష్టమైన జీవనం సాగిస్తున్న సత్యవ్రతుడు , ఒకనాడు వశిష్ఠ హోమధేనువైన నందినిని చంపి , ఆ గోవు మాంసం ఆరగించాడు. గోమాంస భక్షణ మూడవ పాపం ! మూడు పాపాల కారణంగా - అంటే 'త్రిశంకల' కారణంగా అతన్ని 'త్రిశంకుడు'గా వ్యవహరించబడమని శపించాడు వశిష్ఠ మహర్షి. ఆనాటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడుగా ప్రఖ్యాతుడయ్యాడు !"* నిర్వికల్పానంద వివరించాడు.


*"ఒక్కగానొక్క కొడుకుని అరణ్యాల పాలు చేసినందుకు విచారించి త్రిశంకుడి తండ్రి త్రయ్యారుణ చక్రవర్తి అతన్ని రాజధానికి పిలిపించి , రాజుగా అభిషేకించాడు. చాలా ఏళ్ళ పాటు రాజ్యపాలన చేసిన త్రిశంకు చక్రవర్తికి జీవితం మీద విరక్తి కలిగింది. మరణించకుండా స్వర్గం చేరి , తద్వారా మోక్షాన్ని పొందాలన్న సంకల్పం బలంగా కలిగింది ఆయనకు. కులగురువైన వశిష్ఠ మహర్షితో ఆ విషయం గురించి చర్చించాడు...”* నిర్వికల్పానంద కథనం కొనసాగిస్తున్నాడు...


★★★★★★★★★★★★★★★★



*"గురుదేవా ! జీవితంతో విసిగిపోయాను ! రాజ్య పాలనతో అలసిపోయాను. ఈ జీవితం పట్లా , అధికారం పట్లా విరక్తి పుట్టింది...”*


*“ఈ వయసులో అది సహజమే త్రిశంకూ !”* వశిష్ఠమహర్షి చిరునవ్వుతో అన్నాడు. *“హరిశ్చంద్రుడు పెద్దవాడయ్యాడు కద ! అతన్ని రాజుగా అభిషేకించి , నివృత్తి జీవితం గడుపు !"*


*"నా ఉద్దేశం నివృత్తి జీవితం గడపడం కాదు. నాలో మోక్షేచ్ఛ బలంగా ఉంది. నేను స్వర్గానికి వెళ్ళాలి గురుదేవా !”*


వశిష్ఠుడు చిన్నగా నవ్వాడు. *“అది మన చేతుల్లో లేదు త్రిశంకూ ! స్వర్గమో , నరకమో - మనిషి మరణిస్తే గానీ తేలదు. మరణం మన చేతిలో లేదు. స్వర్గవాస కాంక్షతోనే ఆత్మహత్య ద్వారా మరణిస్తే నరకం తప్పదు !”*


*"గురుదేవా ! దయచేసి నన్ను చెప్పనివ్వండి ! నేను మరణించకుండానే , ఈ శరీరంతోనే నేరుగా స్వర్గానికి వెళ్ళాలి !"*


వశిష్ఠ మహర్షి నిర్ఘాతంపోతూ చూశాడు. త్రిశంకుడికి మతి భ్రమించిందా ?! *"త్రిశంకూ , ఒక సత్యం చెప్తాను విను ! సశరీరంగా స్వర్గానికి చేరే వ్యవహారం అలా ఉంచుదాం ! ఒకవేళ నీకు సమీప భవిష్యత్తులో సహజ మరణం సంభవించినప్పటికీ నీకు స్వర్గవాసమూ , మోక్షమూ లభించే అవకాశం లేదు...”*


*"గురుదేవా !"*


*"ఎందుకో తెలుసా ? మోక్షకారకుడైన కేతుగ్రహదేవత నీకు అనుకూలంగా లేడు ! కేతువు వక్రంగా వీక్షిస్తే , మోక్షం సిద్ధించదు !"*


త్రిశంకు చక్రవర్తి వశిష్ఠుడి వైపు రెప్పవేయకుండా , తీక్షణంగా చూశాడు. *"గ్రహచారాన్నీ , అదృష్టాన్నీ మరిచిపోండి. గురుదేవా ! నన్ను బొందితో స్వర్గానికి పంపించే మహత్తర సంకల్పంతో అద్వితీయమైన మహాయాగం చేయండి. మీరు అందుకు సమర్థులని నాకు తెలుసు. మా వంశానికి చెందిన వైవస్వత మనుమహారాజుకు యజ్ఞాచరణంతో సంతతి కలిగేలా చేశారు మీరు !"*


*"అది వేరు , త్రిశంకు ! నీ కోరిక అసాధారణమైంది ! ఆచరణ సాధ్యం కానిది ! నిజం చెప్పాలంటే నీది ఆశ కాదు ; వ్యామోహం - విపరీతమైన వ్యామోహం !"* వశిష్ఠ మహర్షి నిష్కర్షగా అన్నాడు.


*"నా విపరీత వ్యామోహాన్ని ఆశగా , ఆశయంగా పరివర్తింపజేయండి ! సశరీర స్వర్గయానానికీ , మోక్షానికీ అవసరమైన యాగం చేయండి !"* త్రిశంకుడు గంభీరంగా అన్నాడు.


*"ఆజ్ఞాపిస్తున్నావా , రాజా ?"*


*"అర్థించాను ; అభ్యర్థించాను ! ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను !"*


*"నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాను !”*


*"గురుదేవా !"*


*"మళ్ళీ చెప్తున్నాను త్రిశంకూ ! మోక్షకారక గ్రహం నీకు అనుకూలంగా లేదు ! క్రతువు విజయవంతం కాదు ! సఫలం కాదు ! ఫలించని క్రతువుని ఈ వశిష్ఠుడు చేయడు !"*


తీక్షణంగా చూస్తున్న త్రిశంకుడి చూపుల్ని పట్టించుకోకుండా వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయాడు.


★★★★★★★★★★★★★★★★


ఆశ్రమ ప్రాంగణంలో అరుగు మీద కూర్చున్న విశ్వామిత్ర మహర్షి పాదాలకు ప్రణామం చేశాడు త్రిశంకు చక్రవర్తి.


*"ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు !"* విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు.


*"సమయోచితమైన దీవెన అనుగ్రహించారు ! కులగురువైన వశిష్ఠుడి నిరాదరణను రుచి చూసి , అవమాన భారంతో మీ సన్నిధికి వచ్చాను"* త్రిశంకుడు బరువుగా అన్నాడు.


*"ఏం జరిగింది , సత్యవ్రతా ?"* విశ్వామిత్ర మహర్షి అనునయంగా అడిగాడు. *"శాప రూపంలో ఆ వశిష్ఠుడు నీకు బహూకరించిన నామధేయంతో నిన్ను ఈ విశ్వామిత్రుడు సంబోధించడు !"*


*"ధన్యుణ్ణి ! రాజ్యాధికారం మీదా , జీవితం మీదా విరక్తి పెచ్చరిల్లిన కారణంగా , తగిన మహాయాగం చేసి , నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించి , ఆ విధంగా మోక్షం ఇప్పించమని ఆ వశిష్ఠ మహర్షిని అర్థించాను. ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించాడు !"* త్రిశంకుడి కంఠంలో ఆవేశం గంటలా ధ్వనించింది.


*"కారణం ?"*


*“మోక్షకారకుడైన కేతువు నన్ను వక్రంగా చూస్తున్నాడట !"* త్రిశంకుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.


విశ్వామిత్రుడు గొల్లున నవ్వాడు. *"చేయగలిగిన చేవ ఉన్న వ్యక్తిని అడగాలి , సత్యవ్రతా నువ్వు ! ఆ వశిష్ఠుడు ఎంత ? అతగాడి తపోబలమెంత ? బ్రహ్మర్షి అన్న అహంకారం ఒక్కటే - ఆ వశిష్ఠుడు కాని , వశిష్ఠుడి బలం ! హోమాగ్నిని పుట్టించలేని వాడు 'సమిథలు పచ్చివి' అన్నట్టు తన చేతగానితనాన్ని గ్రహచారానికి ఆపాదించాడు !"*


*"గురుదేవా... నా కోరిక మీరే తీర్చాలి !"* త్రిశంకు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. *"సత్యవ్రతా ! సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన మేధావి మాత్రమే , 'మహర్షి' మాత్రమే నిన్ను సశరీరంగా స్వర్గానికి సాగనంపగలడు ! నీ కోరిక నేను తీరుస్తాను ! ఆ వశిష్ఠుడి కళ్ళు తెరిపిస్తాను !"* విశ్వామిత్రుడు సగర్వంగా అన్నాడు.


*"గురుదేవా ! మీరు అంగీకరించారు ! సశరీర స్వర్గ ప్రవేశంలో నాకింక అనుమానమే లేదు !"* త్రిశంకుడు ఆనందంగా అన్నాడు.


*"యజ్ఞ నిర్వహణకు సన్నద్ధం చేయించు. ముందుగా బ్రహ్మవాదులైన ఋషులను ఆహ్వానించు. నేను స్వయంగా యాజకత్వం వహించి యజ్ఞం చేయిస్తాను !”* విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు.


త్రిశంకు చక్రవర్తి కృతజ్ఞతా పూర్వకంగా విశ్వామిత్రుడికి పాదాభివందనం చేశాడు. *"సశరీర స్వర్గ ప్రాప్తిరస్తు !”* దీవించాడు విశ్వామిత్రుడు.

  

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*వర వైకుంఠము సారసాకరము; దివ్యస్వర్ణ శాలాంక గో*

*పుర హర్మ్యావృత మైన తద్భవన మంభోజంబు; తన్మంది రాం*

*తర విభ్రాజిత భోగి గర్ణిక; దదుద్యద్భోగ పర్యంకమం*

*దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్.*


వైకుంఠం చాలా మేలైనపురం. అది ఒక పద్మాల కొలను అనుకొంటే అందులోని పసిడి గోపురాలతో కూడిన మేడల మధ్యనున్న శ్రీ మహావిష్ణువు ఉండే భవనం ఒక గొప్ప పద్మంలాగా ఉన్నది. ఆ భవనం లోపల విరాజిల్లుతున్న ఆదిశేషుడు, విష్ణువునకు సెజ్జగానుండి పద్మంలోని దుద్దులాగా కానవస్తున్నాడు. పైకి చక్కగా ఎత్తిపట్టి ఉన్న ఆ శేషుని తలలనే పానుపు మీద మాధవుడు మకరందాన్ని తనివితీరా గ్రోలటానికి వచ్చిన తుమ్మెదలాగా కనపడుతున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*ఆత్మపత్న్యాచ కలహో*,    

*మిథ్యానిందా పరస్త్రీయామ్*!                      

*స్వజనే ప్రేమ హీనత్వం*,         

*అశ్లీలం సర్వదా నృణామ్* !!


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము -  *భార్యతో పోట్లాడటం, ఏ పాపమూ ఎరుగని స్త్రీపై నిందలు మోపడం, తల్లి,తండ్రి మొదలైన తనవారిపై ప్రేమ లేకుండా ఉండటం*-- ఇవి వ్యక్తిని *సుజనుడు* గా నిలపవు.

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 03*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*క్లైబ్యం మా స్మ గమః పార్థ*

*నైతత్త్వయ్యుపపద్యతే ।*

*క్షుద్రం హృదయ దౌర్బల్యం*

*త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।।*


*భావము:*

ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.

 

*వివరణ:* 

జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహించుతూ అర్జునుడి అంతర్గత శక్తిని పెంపోదిస్తున్నాడు.

ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంభోదించడం వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల ఆర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంభోదిస్తున్నాడు, తన క్షత్రియ ధర్మమయిన కర్తవ్యాన్ని విస్మరించాలనే ఆలోచనే, ఆ శత్రువు.

అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్త భ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనత. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన, ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 11*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 28*


*అంతరంగమందు నభవు నుద్దేశించి*

*నిల్పి చూడనాడ నిల్చుగాక*

*బాహ్యమందు శివుని భావింపనిలుచునా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

బాహ్యస్థితిలో శివుని గూర్చి తలపు స్థిరము గాదు.

అంతశ్శుద్ధి కలిగి పరమాత్మను ధ్యానించే మానవునికి సకల సుఖములు ప్రాప్తించును.


*💥వేమన పద్యాలు -- 29*

      

*అంతరంగమందు ననువుగా శోధించి*

*తలప దలప ముక్తి తగులు గాక*

*బాహ్యరంగమందు భాషింపదెలియునా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తగిన రీతిలో ముక్తి పొందాలంటే మనసు ప్రధానంగా చేసుకుని భగవంతుని ధ్యానించాలి.

ఒట్టిమాటలు ఎందుకు పనికి రావు.


*💥వేమన పద్యాలు -- 30*

      

*అంతరంగమందు నపరాధములు చేసి*

*మంచి వానివలెను మనుజుడుండు*

*యితరు లెరుగకున్న నీశ్వరుం డెరుగడా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తప్పులన్నీ చేసేసి , ఏమీ తెలియదు నాకు అంటే , మనుషులు ఊరుకోవచ్చేమో గాని ఈశ్వరుడు ఊరుకోడు.

తగిన సమయంలో బుద్ధి చెబుతాడు.

ఆ భగవంతుని దృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 12*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 31*


*అంతరంగమందు నద్వైతమే యుండు*

*బాహ్యమందు ద్వైత భావముండు*

*యట్లుకాక తత్త్వ మలవడ నేరదు* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తత్త్వం తెలియాలంటే ద్వైత భ్రాంతి వీడాలి.

జీవాత్మ పరమాత్మలను వేరుగా చూడరాదు.

అభేద బ్రహ్మ బోధము కావాలి.


*💥వేమన పద్యాలు -- 32*


*అంతరంగ మెరుగ హరుడౌను గురుడౌను*

*యంతరంగ మెరుగ నలవికాదు*

*యంతరంగ మెరుగ నతడెపో శివుడయా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అది ఆ శివునికొక్కడికే శక్యము , ఎదుటి వాని మనసుననున్నది గ్రహించినవాడే శివస్వరూపుడౌతాడు.


*💥వేమన పద్యాలు -- 33*

      

*అంతరంగ హృదయమందగా సాధించి*

*చింత లూడబెరికి చిక్కుపడక*

*వింతజూచి మెలగి విజ్ఞాన మందరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఏ చీకూ చింతా లేకుండా , చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించి జ్ఞానమును పొందవలెను.

సత్ప్రవర్తునుడై మెలగవలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ – శ్లోకం – 71*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శివానందలహరీ – శ్లోకం – 71*

. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాప*

*యుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।*

*నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రః*

*సానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥*


రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే శత్రువులను జయించి మోక్షలక్ష్మిని పొందుట ఎలా సాధ్యమో శంకరులు చూపుతున్నారు.


బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, పరిపక్వత పొందిన భక్తి అనే అల్లెత్రాటితో‌ వంచబడిన మనస్సు అనే‌ వింటికి కూర్చబడినవీ, అమోఘములూ (వ్యర్థము కానివి) అయిన శివస్మరణము అనే‌ బాణ సమూహములతో‌ పాపములనెడి శత్రువులను నిశ్శేషముగా జయించి, విజయుడై ఆనందముతో‌ మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందుతాడు.


భక్తితో మనస్సును బంధించి నిరంతర శివనామస్మరణ చేయుట ద్వారా పాపరాశి ధ్వంసము చేసుకొని శివసాయుజ్యము పొందవచ్చునని శంకరుల ఉపదేశము.


👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

*****

28-01-2024

భాను వాసరః ఆదివారం 

రాశి ఫలితాలు

XXXX

మేషం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృషభం

చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. ఉద్యోగమున స్థానచలన  సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

---------------------------------------

మిధునం

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి  నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

కర్కాటకం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. 

---------------------------------------

సింహం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

కన్య

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతం ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. 

---------------------------------------

తుల

సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి,ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

వృశ్చికం

ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

ధనస్సు

బంధు,మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.

---------------------------------------

మకరం

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

------------------------------------

కుంభం

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

మీనం

 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ  సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.

---------------------------------------

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.28.01.2024

 ఆది వారం (భాను వాసరే) 

 **********


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే కృష్ణ పక్షే

తృతీయాయాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.37

సూ.అ.5.50

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు

పుష్య మాసం 

కృష్ణ పక్షం తదియ రా.తె.4.05 వరకు.

ఆది వారం. 

నక్షత్రం మఘ మ.2.36 వరకు. 

అమృతం ప.11.53 ల 1.39 వరకు. 

దుర్ముహూర్తం సా.4.18 ల 5.03 వరకు. 

వర్జ్యం రా. 11.28 ల 1.14 వరకు. 

యోగం సౌభాగ్య ఉ.8.07 వరకు. 

కరణం వనజి మ.3.02 వరకు.   

కరణం భద్ర రా. తె. 4.05 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ తదియ. 

*********************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

చిన్ని కృష్ణుడిని

 శ్లోకం:☝️

*కరారవిందేన పదారవిందం*

  *ముఖారవిందే వినివేశయంతం |*

*వటస్య పత్రస్య పుటేశయానం*

  *బాలం ముకుందం మానసా స్మరామి ||*


భావం: పద్మమువంటి చేతితో తన పాద పద్మమును ముఖ పద్మములో ఉంచే వటపత్రశాయి, చిన్ని కృష్ణుడిని నా హృదయంలో ధ్యానిస్తున్నాను.🙏

పంచాంగం 28.01.2024

 ఈ రోజు పంచాంగం 28.01.2024

Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: తృతీయా తిధి భాను వాసర: మఘ నక్షత్రం సౌభాగ్య యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ రా.తె 06:10 వరకు.

మఘ మధ్యాహ్నం 03:53 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:05


వర్జ్యం : రాత్రి 12:54 నుండి 02:42 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:35 నుండి 05:20 వరకు.


అమృత ఘడియలు : మధ్యాహ్నం 01:12 నుండి మధ్యాహ్నం 02:59


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

నేటివేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటివేద ఆశీర్వచనం *(28-01-2024, ఆదివారం)* 


https://youtu.be/yKmEBpTeZoE?si=u6KT5h5WNDboaM4D


🙏🙏

27, జనవరి 2024, శనివారం

గుఱ్ఱాలు లేని రథం

 *సుభాషితం*

*---------------*

🌺

*యథాశ్చ రథహీనాస్తు*

 *రాథో వాశ్చైర్యథా వినా ౹*

     *ఏవం తపోsప్య విద్యస్య*

    *విద్యావాsప్య తపస్వినః ౹.*      🌺

*(సంగ్రహము)*

            *భావం.రథమే లేని గుఱ్ఱాల్లా, గుఱ్ఱాలు లేని రథంలా  విద్య లేనివాడు తపస్సు, తప్పస్సు లేని విద్య అన్నీ వ్యర్థమైనవి.*

🌺✍🏽

శ్రీమద్భగవద్గీత

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీమద్భగవద్గీత - 2వ అధ్యాయము* 

.           *సాంఖ్య యోగము*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, లోభములు - ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.


👆 *సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹