17, జులై 2022, ఆదివారం

రోగనిరోధక శక్తి

 రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు  - వివరణ . 


    మనలో చాలామందికి మనం తీసుకునే ఆహారం మీద సరైన అవగాహన ఉండదు. సమయానికి ఏది పడితే అది తినేయడం ఆ తరువాత వ్యాధులను మన చేజేతులా మనమే కొనితెచ్చుకుంటున్నాం . మానవులకు రోగాలు రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అతిగా తినటం కూడా రోగకారణమే . ఆయుర్వేదం నందు ఒక సూక్తి ఉంది. " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని చెప్తారు . ఏది పడితే అది కడుపు నిండా తిని జబ్బులను కొనితెచ్చుకోవద్దు. మీరు తినే ఆహారం మీ ఉదరము నందు సగభాగం పట్టునట్టు తిని పావుభాగం నీటికొరకు , మిగిలిన పావుభాగం వాయుప్రసారానికి అనుగుణంగా వదలవలెను. మనం తీసుకునే ఆహారం తక్కువ మోతాదులో ఉన్నను మనశరీరానికి మంచి బలాన్ని , రోగనిరోధకశక్తి ఇచ్చే ఆహారం అయ్యి ఉండవలెను . 


          ఇప్పుడు మీకు శరీరము నందు రోగనిరోధక శక్తి మరియు బలాన్ని ఇచ్చే ఆహారాల గురించి వివరిస్తాను. 


 *  వరి,గోధుమ , ఇతర ధాన్యాలు  - 


        మన ప్రధాన ఆహారాలు ఐన  వరి, గోధుమ వంటి ఆహారధాన్యాలు పైన పొట్టు తీయకుండా ( పాలిష్ ) తీసుకొనుచున్న ఇవి చాలా బలమైన ఆహారపదార్దాలు. పొట్టులో విటమిన్లు ఉంటాయి. పొట్టులో ఉండే ఒక ముఖ్యమైన విటమిన్ ధాన్యాన్ని పాక్షికంగా ఉడికించడం వల్ల ( ఉప్పుడు బియ్యం ) గింజలోపలి భాగానికి వెళ్తుంది . దంపిన బియ్యం , ఉప్పుడు బియ్యం పొట్టు తీసిన ( పాలిష్ ) బియ్యం కంటే చాలా మంచివి. 


 *  ఎండబెట్టిన మొక్కజొన్నలు  - 


          ఎండబెట్టిన మొక్కజొన్నలు వండే ముందు పలచటి సున్నపుతేటలో నానబెడితే వాటిలో ఉన్న " నియాసిన్ " అనే విటమిన్ , మాంసకృత్తుల్ని శరీరం బాగా ఉపయోగించుకోగలుగుతుంది. 


 *  రాగులు , సజ్జలు , చోళ్లు  - 


           వీటిలో ఖనిజ లవణాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం , ఇనుము ఎక్కువుగా ఉంటాయి. ఇవి వరి , గోధుమ కంటే చౌకైనవి , ఎక్కువ బలవర్థకమైన ఆహారాలు . వరి , గోధుమలకు బదులు వీటిని తీసుకోవచ్చు . 


 *  పప్పులు  - 


           ఏదో ఒక పప్పు కంటే అనేక పప్పుల మిశ్రమం మంచిది . ఒక్కో రకమైన పప్పులో ఒక్కో రకమైన మాంసకృత్తులు ఉంటాయి. పప్పుల మిశ్రమం శరీరానికి కావలసిన అన్నిరకాల మాంసకృత్తులను అందిస్తుంది. 


 *  చిక్కుళ్ళు , బటానీలు , సోయాబీన్స్  - 


         ఇవి చౌకగా దొరికే మాంసకృత్తులు . పొలాల్లో వీటిని పెంచడం వల్ల భూమిసారం పెరిగి తరువాత వేరే పంట వేస్తే బాగా పెరుగుతుంది . అందువల్ల పంటను మార్చుతూ ఉండాలి. 


 *  ఆకుకూరలు  - 


          ఎక్కువుగా పచ్చగా ఉన్న ఆకుకూరల్లో కొంచం మాంసకృత్తులు , కొంచం ఇనుము , విటమిన్ A ఎక్కువుగా ఉంటుంది. చిలగడదుంప , చిక్కుడు , బటాణీ , గుమ్మడికాయల ఆకులు చాలా బలవర్ధకమైనవి . వీటిని ఎండబెట్టి పొడిచేసి బిడ్డలకు అన్నంలో కలిపి పెట్టుచున్న మాంసకృత్తులు , విటమిన్లు లభిస్తాయి. 

              

                      క్యాబేజి లాంటి లేతాకు పచ్చ ఆకుకూరలలో మాంసకృత్తులు , విటమిన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కాదు కాబట్టి పెద్దగా తీసుకోవలసిన అవసరం లేదు . 


 *  దుంపకూరల ఆకులు  - 


        ముల్లంగి , కర్రపెండలం మొదలైన మొక్కల్లో వాటి దుంపల కంటే ఆకులలో ఎక్కువ పోషకపదార్ధాలు ఉంటాయి. కర్రపెండలం ఆకుల్లో , దుంపల కంటే 7 రెట్లు అధికంగా మాంసకృత్తులు , విటమిన్లు ఉంటాయి. దుంపతో కలిపి తింటే ఇంకా ఎక్కువ బలం . లేత ఆకులు చాలా బలం ఇస్తాయి. 


           కాయగూరల్ని , బియ్యాన్ని , ఇతర పదార్ధాలని కొంచం నీటిలో ఉడకబెట్టాలి . ఉడకబెట్టటానికి ముందు కాయగూరలను కోయవలెను . అతిగా ఉడకపెట్టకూడదు . అలా ఉడకపెట్టడం వలన కొంత విటమిన్లు , లవణాలు పోతాయి. ఉడకపెట్టాక మిగిలిన నీటిని పారబోయకూడదు . ఆ నీటిని తాగడమో లేక సూప్ లా చేసుకుని తాగిన చాలా మంచిది . 


                 కాయగూరలని వండేప్పుడు కొంచం చింతపండు కలిపిన విటమిన్లు పోవు . ఎండి , వాడిపోయిన కూరగాయలకంటే తాజాగా ఉన్నవి ప్రశస్తమైనవి. బలమైనవి. అడవుల్లో దొరికే చాలా పండ్లలో విటమిన్ "C " సహజమైనది ఉండును. పంచదార కూడా అధికంగా ఉండును. విటమిన్ల కొరకు ఈ పండ్లను తీసుకోవచ్చు . తినడానికి ముందు అవి విషపూరితమైనవా ? కావా? అన్నది చూసుకోవడం ఉత్తమం. 


       ఇనప పాత్రలలో వండడం వలన లేదా చిక్కుళ్లు లాంటివి ఉడకపెట్టేప్పుడు పాత్రలో తుప్పుపట్టిన ఇనుప ముక్క వేసి ఉడకపెట్టిన ఆ ఆహారము నందు ఇనుము శాతం పెరిగి రక్తహీనత రాకుండా చూస్తుంది. బెల్లాన్ని ఇనుపపాత్రలో తయారుచేయడం వలన ఆ బెల్లము నందు ఇనుము శాతం ఎక్కువుగా ఉండును. పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది . 


           పైన చెప్పిన ఆహారాలు మాత్రమే కాకుండా , గుడ్లు , మాంసాహారం కూడా శరీరానికి బలం ఇచ్చును . ఇవి అలవాటు లేనివారు పప్పు , తాజా కూరగాయలు , పండ్లు తీసుకొని శరీరం నందు రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ తింటున్నాం అన్నది కాదు , ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం . 


           *   సమాప్తం  *


     

బాంధవ్యాలు

*బాంధవ్యాలు*

అరటిపండును తొక్క తీసేసి తింటాం.

సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.

సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని పై తొక్కతో పాటు లోపలి గింజలు కూడా వదిలేస్తాం.

ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.

జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.

ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. 

అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే. 

అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.

కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి, అన్న, తమ్ముడు అందరూ ఒక్కో రకం పండు లాంటివారు. ఒకొక్కరిది ఒక్కో స్వభావం. అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే. అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. 

పండులో అక్కర్లేని గింజ, తొక్క, తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!! కొన్ని పండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు. వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప చిరాకుపడం కదా!!?

పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం. ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.

కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!కుటుంబ స్థితిగతులను అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ
శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ !!

సర్వే జనా సుఖినోభవంతు🙏🙏🙏

మానవ జన్మ:

 

మానవ జన్మ:

( ఇది కేవలం 60 సంవత్సరాలు నిండిన పురుషులను ఉద్దేశించి వ్రాసింది.  మిగిలినవారు చదవటం నిషిద్ధం)

మిత్రులారా 84 లక్షల జీవరాశులలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషులతో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయివారి శరీరం సున్నితం, సుకుమారం గా ఉండి ఉంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీల కంటే పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యం తో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) ఇప్పుడు మీరు 60 సంవత్సరాల వయస్సు గడిపి జీవితంలో చివరి అంకంలో వున్నారు.అంటే  శని దేవుడు మీ జాతక చక్రంలో రెండు భ్రమణాలు చేసి వున్నారు. నాలుగు భ్రమణాలు చేయడం అనేది నాకు తెలిసి శ్రీ రామానుజ చార్యులు వారికి మాత్రమే జరిగింది ఆచార్యులు 120 వసంతాలు జీవించినట్లు చరిత్ర చెబుతున్నది. (జ్యోతిష శాస్త్ర రీత్యా శని దేవుడు మారక కారకుడు అంటే మారక స్థానంలో శని ప్రవేశిస్తే జాతకునికి మారకం (మరణం) సంభవిస్తుందని శాస్త్ర  ఉవాచ. జాతక చక్రంలో అతి తక్కువ వేగంతో చలించే గ్రాహం శని శని ఒక సారి తను ఉన్న గది నుండి భ్రమించి తిరిగి అదే స్థలానికి రావడానికి 30 సంవత్సరాల సమయం పడుతుందికొందరు 30 సంవత్సరాల కన్నా ముందే చనిపోతారు అంటే శని మొదటి భ్రమణంలో మారకాన్ని ఇచ్చాడన్నమాట. అతి ఎక్కువగా శని దేవుడు 4 సార్లు జాతకుని జాతకచక్రంలో తిరుగగలడు అంటే 30 x 4= 120 సంవత్సరాలు అతి దీర్ఘ ఆయుష్షు ) అతి దీర్ఘ ఆయుష్షు అతికొద్ది మంది జాతకంలో ఉంటే ఉండవచ్చు కానీ అది చాలా దుర్లభము. 60 దాటినాయి అంటే క్షణంలోనైనా పిలుపు రావచ్చుమీరు నేను అనుకున్నది దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఈశ్వరునికి ఎరుకమనం మన అజ్ఞానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తాం అని ఐహికమైన వాంఛల మీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాంమీరు ఆనందంగా 60 సంవత్సరాలు గడిపారు ఇక మీదనన్న మిగిలిన శేష జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మ సార్థకం చేసుకోవాలని యోచించండిఅదే మనకు పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. అవకాశం కనుక సరిగా వినియోగించుకో పోతే మరల ఎన్ని జన్మలకు తిరిగి అవకాశం వస్తుందితిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84 లక్షలు ఇష్టు ఒకటి అంటే మీరు ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగ విలాసాలతో అపురూపమైన మానవ జన్మను వృధా చేస్తే చివరికి మీకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూ ఉండటమే. కాబట్టి భార్గవ శర్మ మాట విని మిత్రమా ఇప్పుడే మేల్కొని నీ గమ్యాన్ని తెలుసుకో. మిగిలిన జీవకోటికి మనిషికి ఉన్న తేడా ఒక్కటే మనిషికి బుద్ది వున్నది మిగిలిన జంతువులకు బుద్ది లేదు.  కాబట్టి మేధావి అయిన మనిషి తన బుద్దిని ఉపయోగించి తాను ఈ జన్మ ఎందుకు ఎత్తానా అని యోచిస్తే తన జన్మకు సార్ధకత ఏమిటా అని అనిపిస్తుంది.  మన మహర్షులు ఒక్కటే చెప్పారు అదే జన్మరాహిత్యం అంటే మోక్షం.  సాధకుడు తన శక్తితో బ్రహ్మ జ్ఞనాన్ని పొందాలి.  తత్ ద్వారా మోక్షాన్ని పొందటమే జీవన సాఫల్యం.  కాబట్టి మిత్రమా ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ