24, జనవరి 2025, శుక్రవారం

రమణాశ్రమ జీవితం*

 *నా రమణాశ్రమ జీవితం* 

*శ్రీమతి సూరి నాగమ్మగారు*


*Chapter - 15*


*ఓం నమో భగవతే శ్రీరమణాయ* 🙏


**విచిత్ర సంఘటనలు - 2*


రెండు రోజులు సినిమా చూసేసరికి ఆశ్రమమంతా అల్లకల్లోలమయింది. టౌనులోని అల్లరిమూకను లోపలికి రానీయలేదని వాళ్ళు డైనింగు (భోజన)హాలు పైకి రాళ్ళు రువ్వారు. అంతటితో ఆశ్రమ నిర్వాహకులతో కొందరు ఈ సినిమాలు మాన్పించక తప్పదని సర్వాధికారితో చెప్పారు. వారు ఫిల్మువారితో ఇక ఆపవలసిందే, 15 ఫిల్ములు మోసి తెచ్చామే. మీ సమ్మతితోనే తెచ్చాము గదా? చూపుతామంటారు వారు; కూడదంటారు వీరు. ఉభయులకూ వివాదం బయలుదేరింది. నాల్గవనాటి మధ్యాహ్నం 3 గంటల వేళ భగవాన్‌ హాలుకు ఉత్తర వైపునవున్న మైదానంలో ఈ వివాదం జరుగుతుంటే రాజగోపాలయ్యరు అదంతా విని వచ్చి భగవాన్‌తో మనవి చేస్తూ వుండగా మురగన్ అందుకొని ''అవును. ఋష్యాశ్రమంలో సినిమాలంటె హాస్యాస్పదంగా వుండదా? భగవాన్‌ కి ఏది చూచినా బాధాకరంగా లేదు గాని సాధకుల కిది బాధాకరంగా గాదా? ఆపకుంటె వీలులేదు'' అన్నారు.


భగవాన్ అందుకొని ''ఆ-అదే-అదే. అసలు ముందే ఈ సినిమా లెందుకర్రా. వద్దు. అన్నా నేను. 'కాదు, భగవానుకు చూపాలి' అని తెచ్చారు. సరే, పోనీ, ఏదో సరదా పడుతున్నారు గదా అని చూస్తే మళ్ళీ 15 రోజులకు అవి తెస్తామన్నారు. వద్దయ్యా! ఎందుకీ గొడవంతాను అన్నాను. 'మా కందరికీ చూడాలని వున్నది. సర్వాధికారితో చెప్పాము. వారు సమ్మతించారు. తెస్తాం' అన్నారు. అయితే మీ యిష్టం అన్నాను. ఒకసారి చెపితే వింటే గదూ? చూడండి ఇప్పుడు ఎంత గొడవవుతోందో?'' అన్నారు భగవాన్‌.


నా కదె సందయింది. మురగనారు నుద్దేశించి ''అన్నా! చూచారా? ఇందుకే స్వర్ణోత్సవ వైభవం లేఖల్లో సినిమాల విషయం వ్రాయుమంటె నా కలం నడవనే లేదు.'' అన్నాను. వెంటనే భగవా నందుకొని మురగనారుతో ''అవునవును. అప్పుడు దాన్ని వ్రాయుమని వీరంతా తొందరచేశారు. 'ఇది సద్విషయంగా సమర్థించి వ్రాయాలే? ఎల్లాగో తెలియటం లేదే?' అని నన్నడిగింది. నీ కిష్టమైతే వ్రాయి, లేకుంటే మానేసెయ్యి అన్నా నేను. ఇది యేమి ఘనతరకార్యమని కడకది వ్రాయనే లేదు'' అన్నారు. ఆ భగవద్వాణివల్ల అన్ని రహస్యాలు భేదింపబడ్డవి గదా! రహస్యభేదనమయిందని నా కెంతో సంతోషం కలిగింది. సర్వాధికారికి ఈ సమాచారమంతా తెలిసి వెంటనే సినిమాలు ఆపుచేయవలసిందని గట్టిగా శాసించారు.


మర్నాడే ఆశ్రమమంతా ప్రశాంతమయింది. ఇంచుమించు ఆ రోజుల్లోనే ఆంధ్రదేశం నుంచి ఒక యువతి వచ్చి కొన్నాళ్ళున్నదిక్కడ. హిందీ బాగా మాట్లాడేది. చక్కని కంఠం. మధురంగా పాడేది. అందరూ భగవాన్‌ మీద పాటలూ, పద్యాలూ పాడుతూ వుంటే ఆమెకూ సరదా కలిగి, అంధ్రదేశంలో ఆరితేరిన పెద్దలూ, పండితులూ వ్రాసిన తత్త్వాలూ, యడ్ల రామదాసుగారి కీర్తనలూ, ఇంకా ఏవో అవీ, యివీ రామ అన్న చోట రమణ అని పెట్టి భగవాన్‌ సన్నిధిలో పాడుతూ వచ్చింది. మంచి అర్థపుష్టిగల కీర్తనలగుటవల్లనూ, కంఠమాధుర్యంవల్లనూ అందరికీ ఆనందంగా వుండేది. రామ అన్న చోట రమణ అని పాడుతున్నట్లు భగవాన్‌ గమనిస్తునే వున్నారు.


నాకూ తెలిసినా ఏదో భక్తిగా పాడుతున్నది మంచిదే గదా అని వింటూ వూరుకున్నాను. సయ్యదు మొదలైన మహమ్మదీయ భక్తులూ పార్శీవారు పాటలు విని భగవాన్‌ మీద వ్రాసినవే అనుకొని ''ఎవరు వ్రాసినవమ్మా ఈ పాటలు?'' అని ఆమెను అడిగితే ''నేనే వ్రాశా'' అని అన్నదట. వారంతా చాలా సంతోషించి అవి ఇంగ్లీషులో తర్జుమా చేయించుకుటాం. వ్రాసి యివ్వమంటె ఆమె వ్రాసి యిచ్చిందట. వారు ఆ కాగితం శ్రీవారికి చూపి ''ఇవి ఆమె వ్రాసిన పాటలు. ఇంగ్లీషులోకి తర్జుమా చేయించగోర్తాము'' అని విజ్ఞాపన చేసుకున్నారు. భగవాన్ ఏమీ విమర్శించక మునగాల వెంకట్రామయ్యగారు రాగానేవారికి చూపి ''అదుగో, వారు తర్జుమా చేయగలరు. వారి నడగండి'' అని చెప్పి, వెంకట్రామయ్యగారితో ''వీ రేదో తర్జుమా కావాలంటున్నారు. చూడండి'' అని చెప్పి కాగితాలిచ్చి పలక్కుండా వూరుకున్నారు.


ఆ వెంకట్రామయ్యగారికి రెండు మూడు తరానుండీ తమిళ దేశంలోనే నివాసం కావటంవల్ల తెలుగులో పాండిత్యం అంతగా లేదు. శ్లేష పదాలతో నిండివున్న ఈ పాటలు ఇంగ్లీషులో అనువదించాలంటె సామాన్యమా? అందువల్ల కొన్ని పదాలకు భగవాన్నే అర్థం అడుగుతూ వారు తికమిక పడుతూ వుండటం చూచి భగవాన్‌ సేవకులలో ఒకరు వెంకట్రామయ్యగారి అనుయాయులలో ఒకరిని చూచి ''ఇవన్నీ భగవానునే అడిగి శ్రమ కలిగించకపోతే, నాగమ్మ నడగరాదా?'' అన్నారు. భగవాన్‌ బయటికి వెళ్ళిన సమయంలో వారు నన్ను సమీపించి ఆ పాటల అర్థం కొంచెం తేలికగా చెప్పగలవా? అన్నారు. ''దానికేమి చెప్ప వచ్చును గాని అసలవి భగవానుని గుఱించి వ్రాసినవని తర్జుమా చేస్తున్నారా? లేక ఏవైనా సరే అనా?'' అన్నాను.


*ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః* 🙏


https://t.me/c/1421928578/4308.


                             24

Panchang

 


ఏదైనా అవ్వచ్చు🏵️

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏         🏵️"స్థాయి" అంటే ఏదైనా మనకు కావలసిన దాని కంటే ఎక్కువ ఉంటే స్థాయి అంటాము.. ఆది డబ్బు, ద్వేషం, అధికారం, లోభము, ఆకలి, ఆశ, మొహం, కోరిక, ప్రేమ, సోమరితనం, ఏదైనా అవ్వచ్చు🏵️వ్యక్తులను వ్యతిరేకంచకూడదు.. వారి యొక్క అభిప్రాయాలను మాత్రమే వ్యతిరేకించాలి.. తోటి వారి యొక్క విజయాలను చూసి మనము సంతోషంచగలిగిన రోజున మనము మానసికంగా పూర్తి పరిపక్వత చెందినట్లే🏵️కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు.. కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి కావాలి..భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం..మన అనందాన్ని పంచుకునే   వారికంటే బాధను  పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వాలి.. ఎందుకంటే అనందం ఎవరైనా పంచుకోవడానికి  ఇష్టపడతారు..  కానీ ఆప్తులు మాత్రమే బాధను  పంచుకుంటారు...మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశాంతి లభిస్తుంది🏵️🏵️మీ *ఆల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &  జనరల్ ఏజన్సీస్ .D.N. 29-2-3 గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి  రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును  9440893593 .9182075510* 🙏🙏🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: సంజయఉవాచ


అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః

ప్రవృత్తే శస్త్రసంపాతే ధను రుద్యమ్య పాండవః(20)


హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే..


అర్జున ఉవాచ:-


సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మే௨చ్యుత(21)


కురురాజా..అప్పుడు అర్జునుడు యుద్ధసన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తిపట్టి శ్రీ కృష్ణుడితో అచ్యుతా... రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అని అన్నాడు...

కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 999


⚜ కేరళ  : పాలక్కాడ్‌


⚜ కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం



💠 కిల్లిక్కురుస్సి మంగళాన్ని లక్కిడి అని కూడా అంటారు. 

నీలా (భారతపూజ) నది లక్కిడి దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. 


💠 కేరళలోని పాలక్కాడ్‌లోని పచ్చని కొండల మధ్య ఉన్న లక్కిడి ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం మాత్రమే కాదు. 

ఈ సుందరమైన పట్టణంలో కిల్లిక్కురిస్సి మహాదేవ దేవాలయం అని పిలువబడే వాస్తు అద్భుతం కూడా ఉన్నది.

సందర్శించే వారందరి నుండి ప్రశంసలను పొందుతున్న దాని అద్భుతమైన చెక్క నిర్మాణాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది.శివునికి అంకితం చేయబడింది.


💠 శ్రీ పరశురాముడు  కేరళలో 108 శివాలయాలు, 108 భగవతి దేవాలయాలు మరియు 108 ధర్మ శాస్తా దేవాలయాలను స్థాపించాడు.

ఈ మహాదేవ ఆలయం అందులో ఒకటి..


💠 గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం- శ్రీ కిల్లిక్కురుస్సి మహాదేవ క్షేత్రం నుండి ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు దీనిని శ్రీ శుక బ్రహ్మ ఋషి స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి.


💠 ఆలయ ప్రధాన గర్భగుడి, పశ్చిమం వైపు ఉంది, ఋషి శుక మహర్షిచే ప్రతిష్టించబడిందని నమ్ముతున్న శివలింగం ఉంది. 

ముఖ్యంగా, ఆలయంలోని నంది విగ్రహం ఈశాన్యం వైపు వంగి, దాని ఆధ్యాత్మిక శోభను పెంచుతుంది. గర్భగుడి ప్రక్కనే, ఎడమ మూలలో ఒక గణపతి మూర్తి ఉంటుంది, పార్వతి దేవి, గురువాయూరప్పన్, వనదుర్గ మరియు నాగం వంటి ఇతర ఉప దేవతలు కూడా ఇక్కడ పూజించబడ్డారు.


💠 విశేషమేమిటంటే, ఈ ఆలయం ఉత్సవాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది, ఎందుకంటే శివుడు స్వయంగా దాని ఆవరణలో తపస్సులో నిమగ్నమై ఉన్నాడని నమ్ముతారు.


💠 ఆలయం సాధారణంగా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. 


🔆 పండుగలు:


💠 శివుడికి అంకితం చేయబడిన వార్షిక పండుగ శివరాత్రి, కిల్లిక్కురిస్సి మహాదేవ ఆలయంలో అత్యంత గొప్ప వేడుక. 


💠 గ్రానైట్ లేదా రాతితో నిర్మించిన అనేక దక్షిణ భారత దేవాలయాల మాదిరిగా కాకుండా, కిల్లిక్కురిస్సి మహాదేవ ఒక ప్రత్యేకమైన చెక్క నిర్మాణాన్ని కలిగి ఉంది. క్లిష్టమైన శిల్పాలు గత యుగాల హస్తకళను ప్రదర్శిస్తాయి.


💠 ఈ గ్రామం ప్రసిద్ధ మలయాళ వ్యంగ్య కవి మరియు ఒట్టంతుల్లాల్ కళారూపాన్ని స్థాపించిన కుంచన్ నంబియార్ (రామ పనివాడ) జన్మస్థలం. 

కుంచన్ నంబియార్ జన్మించిన ఇల్లు- కలక్కతు భవనం ఇప్పుడు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. 

ఇక్కడ కుంచన్ నంబియార్ జ్ఞాపకార్థం కుంచన్ స్మారక వాయనశాల- కుంచన్ మెమోరియల్ లైబ్రరీ అనే గ్రంథాలయం కూడా ఉంది. 


💠 పురాణ కూడయాట్టం మరియు చాక్యార్ కూతు కళాకారుడు మరియు ప్రఖ్యాత నాట్యశాస్త్ర పండితుడు నాట్యాచార్య విదుషకరత్నం పద్మశ్రీ గురు మణి మాధవ చాక్యార్ కూడా ఇక్కడ నివసించారు, వీరు అభినయ (నటన) అధికారి.

అతని ఇల్లు కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయానికి సమీపంలో ఉంది. 

ఇది చాక్యార్ యొక్క ప్రముఖ శిష్యులలో ఒకరైన గురు కేలు నాయర్ స్వస్థలం.

ప్రసిద్ధ సంస్కృత పండితుడు కొప్పట్టు అచ్యుత పోతువల్ కూడా ఈ ఆలయానికి సమీపంలో నివసించారు.


💠 పాలక్కాడ్ నుండి 70 కి.మీ.ల దూరంలో ఉంది


రచన

©️ Santosh Kumar

12-15-గీతా మకరందము

 12-15-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హరామర్షభయోద్వేగైః

ముక్తో యస్స చ మే ప్రియః.


తా:- ఎవనివలన ప్రపంచము ( జనులు) భయమును బొందదో, లోకమువలన ఎవడు భయమును బొందడో, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత- మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.


వ్యాఖ్య:-' లోకాన్నోద్విజతే - సత్యమార్గమున జనువాడు ప్రపంచము యొక్క నిందాస్తుతులకు ఏ మాత్రము జంకగూడదు. నిర్భయుడై ముందుకు సాగిపోవలెను. (Be fearless) విగతభీః - అని యొకతూరి భగవానుడు సెలవిచ్చిన విషయమును జ్ఞాపకమునందు ఉంచుకొనవలెను.


"హర్షామర్షభయోద్వేగైః "- హర్షము (సంతోషము} మంచిదే అయినను ఆవేశములకు లోనై, స్తోత్రములకు ఉప్పొంగిపోవుటయు, నిందలకు క్రుంగిపోవుటయు కూడదనియు, ఆ ప్రకారము ద్వంద్వములకు లోబడక, నిర్వికారుడై సమభావముగలిగి యుండవలెననియు తెలుపుటయే యగును.

తిరుమల సర్వస్వం -128*

 *తిరుమల సర్వస్వం -128*

 

 *తిరుమలకు చేరుకుందాం! 1*


 *సప్తగిరుల సమారోహమైన తిరుమలక్షేత్రం లోని ఏడవ శిఖరం “వేంకటాద్రి” పై నెలకొన్న ఆనందనిలయంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.* 



 *తిరుమలకు నడక మార్గాలు*


 తిరుమల క్షేత్రం చేరుకోడానికి అనాదిగా నాలుగు ముఖ్యమైన మార్గాలున్నాయి:


 చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక స్థలమైన తలకోన నుండి అరణ్యమార్గంలో దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. కాలాంతరాన ఈ మార్గం పూర్తిగా కనుమరుగై పోయింది.


 రెండవమార్గం కడప జిల్లా నుండి వచ్చేవారికి అనుకూలంగా ఉండేది. ఈ మార్గం కడప పట్టణంలో ప్రస్తుతం *"దేవునిగడప"* గా ప్రాచుర్యం పొందిన వేంకటేశ్వరుని ఆలయం నుండి ప్రారంభమయ్యేదని చెబుతారు. అచ్చటి నుండి కుక్కలదొడ్డి, మామండూరు గ్రామాల మీదుగా కనుమలతో కూడుకున్న అడవుల్లో సాగిపోయే ఈ మార్గం ప్రస్తుతం చాలావరకు శిథిలమైపోయింది. అయితే, ఈ దారిలో పురాతన సోపానమార్గపు ఆనవాళ్లు, కొన్ని విశ్రాంతి మంటపాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తిరుమలక్షేత్ర మందు పాపనాశనం వెళ్లే దారిలోని *"గోగర్భం"* ఆనకట్ట ప్రక్కన ఉన్న *"ఈతకాయల మంటపం"* వాటిలో ఒకటి. ఇప్పటికీ అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు అటవీశాఖ వారి ప్రత్యేక అనుమతితో, విశేష సందర్భాలలో ఈ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అపాయాలతో కూడుకున్న, జనసంచారం లేని ఈ మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం ఒకరకంగా సాహసయాత్రే!


 మూడవది మనలో చాలామందికి సుపరిచితమైన తిరుపతి పట్టణం లోని *"అలిపిరి"* నుండి మొదలయ్యేది. 


 నాలుగవ మార్గం చంద్రగిరి పరిసర ప్రాంతం నుండి బయలుదేరి తిరుమలకు చేరుకుంటుంది. దీనినే *"శ్రీవారిమెట్లు'* గా పిలుస్తారు. -


 ఇవే కాకుండా, తిరుమల క్షేత్రానికి నలుదిక్కుల నుంచి ఇంకా అనేక మార్గాలు ఉన్నట్లుగా చెబుతారు. పురాణాల ననుసరించి కపిలతీర్థం ఆలయం నుండి ఒక రహస్యమైన సొరంగమార్గం కూడా ఉండేది. తొండమాన్ చక్రవర్తి ఆ మార్గం గుండా వెళ్లి స్వామిని సేవించుకునే వాడు.


 ప్రస్తుతం *"అలిపిరి"* మరియు *"శ్రీవారిమెట్లు"* నడకమార్గాలు లేదా మెట్ల మార్గాలు మాత్రమే (వాహనాలు వెళ్ళి వచ్చే రెండు ఘాట్ రోడ్ లు కాకుండా) వాడుకలో ఉన్నాయి.



‌ *నడక మార్గంలో మెట్లు*


 1850వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యాత్రికుల సౌలభ్యం కోసం కొండమీదకు ఉన్న నడకదారిలో మెట్లను నిర్మించింది. 1953వ సంవత్సరంలో ఆలయం తి.తి.దే. ఆధ్వర్యం లోకి వచ్చిన తర్వాత, 26 వేల రూపాయల ఖర్చుతో ఆ మెట్ల మార్గం అభివృద్ధి చేయబడింది. ఈ మెట్లు నిర్మించక ముందు, అంటే దాదాపుగా 150 సంవత్సరాల క్రితం, తిరుమల యాత్ర దుర్గమంగా ఉండేది. మార్గమధ్యంలో తరచుగా తారసపడే చిరుతలు, ఎలుగుబంట్ల వంటి క్రూర జంతువులను పారద్రోలటానికి డప్పులు వాయించేవారు; రాత్రులందు మంటలు కూడా వేసేవారు. దొంగల భయం అధికంగా ఉండడం చేత యాత్రికులు సమూహాలుగా మాత్రమే వెళ్లేవారు. భక్తులు లోయలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళపొదలు, క్రిమికీటకాలతో నిండిన అరణ్యమార్గంలో అత్యంత ప్రయాసతో సపరివార సమేతంగా ప్రయాణిస్తూ ; మధ్యలో వంటా-వార్పు చేసుకునే వారు. మధ్య మధ్యలో మంచినీటి కోసం దిగుడు బావులు, విశ్రాంతి తీసుకోవడానికి *'ఠాణాలు"* గా పిలువబడే మండపాలు ఉండేవి. ఎందరో మహారాజులు, జమీందార్లు వారి పేరు మీదా లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదా ఈ మంటపాలను నిర్మించి, *"మానవసేవే మాధవసేవ"* యని ఆనాడే చాటిచెప్పారు. అంగవైకల్యం కలవారిని, వయోవృద్ధులను పల్లకీలా ఉండే డోలీల ద్వారా కొండకు చేర్చడానికి ప్రత్యేకంగా కూలీలు ఉండేవారు. అందుకుగాను మనిషికి పది అణాలు, అంటే కేవలం 60 పైసలు, కూలి వసూలు చేసేవారు. ఈ డోలీలు నిలుపుకోవడానికి, ఆలయ సమీపంలో ఒక *"డోలీ మంటపం"* కూడా ఉండేది. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు *"డోలీ మంటపం బ్లాకు"* లేదా *"డి ఎం బి"* గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుండి సన్నిధివీధి మీదుగా వెళ్లి ఇప్పుడున్న క్యూ కాంప్లెక్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి దర్జాగా శ్రీవారిని దర్శించుకునే వారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

సంపూర్ణ మహాభారతము*

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*267 వ రోజు*


*మధ్యాహ్నానంతర సమరం*


మధ్యాహ్నం అయింది విరిగిన రథములు, చచ్చిన హయములు, రక్తపుటేరులతో రణభూమి భయానకంగా ఉంది. ఉభయ సైన్యములు పోరు సల్పుతున్నా మన సన్యంలో నైతిక బలంతగ్గుతుంది. వారిలో వారు " అయ్యో సుయోధనుని లోభత్వం, మూర్ఖత్వం వల్లనే ఇంతటి మారణహోమం జనక్షయం దాపురించింది. అసలు పాండవులను జయించగల వారు ఎక్కడినా ఉన్నారా ? " అని తమలో తాము తర్కించుకున్నారు. వారి మాటలను సావధానంగా వింటున్న సుయోధనుడు " వారి పనికి మాలిన మాటలు విననేల అనేకులు అనేక విధముల అనుకుంటారు. మనం యుద్ధం చేస్తాము రండి " అని అందరిని రణముకు ప్రోత్సహించాడు. ఆ సమయంలో భీమసేనుడు రణరంగంలో వీరవిహారం చేస్తూ శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. ఇంతలో భీమసేనుని రథం తెచ్చి సారథి నిలవగానే దానిని అధిరోహించి అత్యంత నిశిత శరములతో బాహ్లికుని రథము విరుగకొట్టాడు. చిత్రరధుడు చిత్ర విచిత్రమైన తన నిశిత శరములు ఉపయోగించి అభిమన్యుని చికాకు పెడుతున్నాడు. అభిమన్యుడు చిత్రరధుని రథము విరుగకొట్టి, సారథిని చంపి, రథాశ్వములను చంపాడు చిత్రరధుడు దుర్ముఖుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళారు. ద్రుపదుడు ద్రోణునిపై శస్త్రప్రయోగం చేసాడు. ఆగ్రహించిన ద్రోణుడు పదునైన బాణములు ప్రయోగించి ద్రుపదుని కవచము చీల్చాడు. ద్రోణుని ధాటికి తాళ లేక ద్రుపదుడు అక్కడి నుండి వెళ్ళాడు. సుశర్మ అర్జునితో యుద్ధం చేస్తూ అర్జునిని మీద కృష్ణుని మీద శరవర్షం కురిపించాడు. వాటిని మధ్యలో త్రుంచి అర్జునుడు క్రూరబాణములతో సుశర్మను తరిమి తరిమి కొట్టాడు. అతడి సైన్యం చెదిరి పోగా అర్జునిని ధాటికి ఆగ లేక సుశర్మ ససైన్యంగా వైదొలిగాడు. అది చూసిన భీష్ముడు అర్జునుని ఎదుర్కొని విజృంభించాడు. మధలో సాత్యకి భీష్ముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు. భీష్ముడు కోపించి శక్తి ఆయుధమును సాత్యకిపై విసిరాడు. శరీరం వంచి దానిని వడిసి పట్టి తిరిగి భీష్మునిపై విసిరి సింహనాదం చేసాడు. భీష్ముడు తన ఆయుధమును తానే త్రుంచి సాత్యకిపై పది పదునైన బాణములు వేసాడు. పాండవ సైన్యం ఒక్కుమ్మడిగా భీష్మునిపై పడింది. సుయోధనుడు దుశ్శాసనుడిని పిలిచి " దుశ్శాసనా ! తాత ఒంటరిగా పోరుతున్నాడు. శకునిని తీసుకుని సాయంగా వెళ్ళు " అన్నాడు. దుశ్శాసనుడు అలాగే వెళ్ళి శకునితో చేరి భీష్మునికి సాయంగా పాండవ సైన్యాలను కకావికలు చేస్తున్నారు. ఇది గమనించిన ధర్మరాజు నకులసహదేవులను అక్కడకు వెళ్ళమని చేయి ఊపాడు. నకుల సహదేవులు భీష్ముని ఎదుర్కొన్నారు. సుయోధనుడు పది వేల అశ్విక దళమును పాండవ సైన్యాలను ఎదుర్కొనమని పంపాడు. వారు పాండవ సేనలో చొరబడి విచక్షణ లేకుండా చంపసాగారు. అది చూసిన నకులసహదేవులు, ధర్మరాజు తమ వాడి శిలీకంతో గుర్రములను కొట్ట సాగారు. కాళ్ళు తెగి గుర్రములు పడి పోతూ రణరంమును బీభత్సం చేసింది. అశ్వసైన్యం అంతకంతకూ తరిగి పోయి సైనికులను లక్ష్యపెట్టక దిక్కు తోచక పరుగెట్టాయి. వాటి కింద పడి సైనికులు చనిపోసాగారు. అనేక హయములు రౌతులనుక్రింద వేసి చంపసాగాయి. అనేకులు తమ గుర్రాల క్రింద పడి మరణించారు. అశ్వదళము నశించగానే పాండవులు భేరి తూర్యనాదాలు చేసారు. ఇది చూసిన సుయోధనుడు " మద్రనరేంద్రా ! పాండవ సేనలు చెలియలి కట్ట దాటిన సముద్రంలా విరుచుకు పడి మనసైన్యాలను ఊచ కోత కోస్తున్నాయి. వాటిని నీవే ఆపాలి. శల్యుడు తన సేనలతో నకులసహదేవ, ధర్మనందనులను ముట్టడించి పెక్కు బాణములు వేసి వారిని నొప్పించాడు. అది చూసిన భీమార్జునులు శల్యునిపై విరుచుకు పడి శల్యునిపై బాణవర్షం కురిపించారు. ఇది చూసిన భీష్మద్రోణులు భీమార్జునులను ఎదుర్కొని వివిధ అస్త్రములను వేసి వారిని నొప్పించారు. సాయం కాలం అయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మంత్రం యొక్క పరమార్ధం*

 *మంత్రం యొక్క పరమార్ధం* 


(శృంగేరి శారదా పీఠం 34వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి బోధలు)


“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” మననం చేయువానిని రక్షించునది మంత్రము. అయితే అది ఏదో విచిత్ర ధ్వనుల కలగూరగంప అని, దానినే ముద్రిత గ్రంధమునుండి గాని గ్రహింపవచ్చు అని కాని భావించినప్పుడు ఆ మంత్రం సారహీనము, నిష్ఫలము. అట్టి మంత్రములు అమిత ఆధ్యాత్మిక తపశ్శక్తి సంపద కలిగిన శ్రీ జగద్గురువుల వంటి వారిచే ఉపదేశింపబడినప్పుడే శక్తివంతములు, ఫలవంతములు. మంత్రముల యందు, వైదిక కర్మకాండయందు సామాన్యముగా సామాన్య జనముకు విశ్వాసము తగ్గడానికి కారణం ఏమిటి అనగా - అట్టి వాటిని యోగ్యత లేనివారు చేబూని ఆర్భాటము చెయ్యడం వలన, అటువంటి వారి యందు అవి నిష్ఫలములే కాదు, అపాయమును, ఉపద్రవమును కలిగించవచ్చును కూడా. అందరూ మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని వెటకారం చేస్తున్నారు కానీ నిజంగా ఆ మంత్రములను ప్రయోగిస్తున్న వారి యోగ్యత చూడడం లేదు. 


కొందరు మూర్ఖులు వీటి విలువ తెలియక వైదిక క్రియలు, విగ్రహ అభిషేకాలు, యజ్ఞాది క్రతువులు కేవలం నిరుపయోగం అని, ధన వ్యయం, ద్రవ్య వ్యయము, శక్తి వ్యయము అని నిందిస్తూ దాని బదులు కొంతమందికి ఇల్లు కట్టచ్చు, భోజనం పెట్టచ్చు, ఇతరత్రా మానవ ఉపయోగామునకై మళ్ళించవచ్చు అని చెబుతున్నారు.


అటువంటి మూర్ఖులను మనం నేడు ఈ సామాజిక సంఘాలలో కూడా చూడవచ్చును. ఆ క్రతువుల విలువ వాటిద్వారా ఫలం పొందిన వారికి అర్ధం అవుతుంది. గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు  వారికి  తెలియని విషయాలను అనవసరంగా వాళ్లకు ఉన్న చత్వారపు కళ్ళజోళ్ళలో చూసి తీర్పు చెయ్యకూడదు. తద్వారా ఆ మంత్రశక్తి ని అవమానించి అనవసరపు పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. అన్ని పాపాలు ఒక్క సారే తేలిపోవు. కొన్ని పాపాలు పండాలంటే కొన్ని జన్మలు పడతాయి. అలాగే మనం నేడు అనుభవించే కష్టాలు కొన్ని జన్మల క్రితం చేసిన పాప ఫలమే. ఒక కధ ఉన్నది. 


ధృతరాష్ట్రుడు తాను 100 మంది కుమారులు పోగొట్టుకుని తాను ఎప్పుడు చేసిన పాపమని భగవంతుని అడుగుతాడు. అతడు ఒక యాభై జన్మల క్రితం కిరాతకుడు అని, ఒకసారి ఒక పక్షి 100 పిల్లల్ని దాని తల్లి తండ్రుల యెదుటనే చంపాడని అందుకు ఆ పాపం ఇప్పటికి ఫలించిందని చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రునికి ఒక అనుమానం వస్తుంది, మరి 50 జన్మలు ఎందుకు ఆగవలసి వచ్చింది అని. దానికి 100 మంది పిల్లలు పుట్టాలంటే సంపాదింకోవలసిన పుణ్యానికి 50 జన్మలు పట్టిందని చెబుతాడు శ్రీకృష్ణుడు. 


ఈరోజు మనం చేసే పాపం ఈ జన్మలోనే ఫలితం చూపించక పోవచ్చును, కానీ వడ్డీ, చక్ర వడ్డీలతో భారీగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేడు మనకు అర్ధం కానిదానిని అవహేళన చెయ్యవద్దు. మన మహర్షులు, పెద్దలు, తాతలు ఎంతో ఆలోచించి, తర్కించి చేసిన సాంప్రదాయ పద్ధతులను విమర్శించే అర్హత లేని వారు కూడా నోరు పారేసుకుని పాపం మూటకట్టుకుంటూ వున్నారు. ఆ భగవంతుని దయ వలన మనం అటువంటి వెర్రి వాగుడు వాగకుండుగాక !!

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  - దశమి - అనూరాధ -‌‌ భృగు వాసరే* (24.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

బిల్వపత్రం

 బిల్వపత్రం (మారేడు దళం) పరమశివునికి ప్రీతికరం. మారేడుదళాన్ని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు.


బిల్వ వృక్షం (మారేడు చెట్టు)

శివలింగార్చనతో కూడిన శివపూజకు బిల్వ పత్రం అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం పరిపాటి అని ప్రముఖ ఆధ్యాత్మి కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ బిల్వపత్రం అపురూపమైనది. ఆకులు విశిష్ట ఆకారంలో ఉంటాయి. మూడు ఆకులు ఒకే సమూహంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అలనాడు భక్తకన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు.


శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కాళము, హస్తి శివపూజలో బిల్వపత్రాలు అలంకరించి మోక్షప్రాప్తి పొందాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.


ఏకబిల్వం శివార్పణం


ఈ శ్లోకం శివస్తుతిలో బహుళప్రాచుర్యం పొందింది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత వివరించబడి ఉంది. పరమపవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడుదళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. కోటి ఏనుగుల దానఫలం, నూరు యజ్ఞాలఫలం, కోటి కన్యాదానాలవల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రం శివపూజకు సమర్చించడం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని ప్రతీతి అని చిలకమర్తి తెలియజేశారు.


అఖండ విల్వపత్రేణ పూజితే


నందికేశ్వరే శుధ్యంతిసర్వపాపేభ్యో


ఏకబిల్వం శివార్పణం


సకల పాపాల నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది శివరపురాణం. ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతిదేవికి కనిపించిందట. ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోం తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మా పార్వతీదేవి! నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీ దేవి అడిగిందట.


అందుకు బిల్వపత్రం నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను.. ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ అని వేడుకొందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటినుంచి శివస్తుతి, శివారాధనపూజకు తప్పనిసరి అయింది బిల్వపత్రం. పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడువృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడువృక్షం పరమశివునికి ప్రీతికరం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరచక్రవర్తి శర్మ అని తెలిపారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివపూజ చేయాలని సూచించారు.

పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


కూతురిని రైలెక్కించి... స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవలు కనుమరుగయ్యే దాకా  చేయి ఊపి, అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై... నీరసంగా ఇంటికి వచ్చి, గత నాలుగు రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది... అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన.

          పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం సహజమే... దానికి ప్రకృతిలోని ఏ ప్రాణీ, ఇంతగా బాధపడటంలేదు కదా... మరి కాస్తోకూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము... అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది.

          కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి... అలవాటుగా అటునుంచి, కూతురు..."నాన్నా! ఇంటికి వెళ్ళిపోయారా? ఈ నాలుగు రోజులు తెగ తిరిగేసారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి. అవీ,ఇవీ అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి, మేం వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి, సర్దిపెట్టమని పురమాయించాను... ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా... వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు"....అలా ఇంకా ఏదేదో చెబుతుండగానే... "అలాగేనమ్మా , నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త...ఇక ఉంటాను", అని ఫోన్ పెట్టేయబోతుంటే... "నాన్నా!  ఉండండి...మీ మనవరాలు మీకు వాట్సాప్ లో ఏదో సందేశం పంపించిందంట", అని  ముగించింది.  పదిహేడు సంవత్సరాల మనవరాలు  తనకు ఏ సందేశం పంపించి ఉంటుందా అని ఆత్రుతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా.

             "తాతయ్యా! మీతో ఉన్న ఈ నాలుగురోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో.‌..అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మనింట్లో మీరు వండించిన పిండివంటల వాసనలు ఇంకా నా ముక్కుపుటాల పై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్ కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో! ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లంపాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. 

          భోగి పండుగ రోజు... తెల్లవారుఝామున నిద్రలేచి, తలస్నానం చేసి, ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్లి...  మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి, అందులో పిడకల దండ వేసి, ఆ చలిలో  వెచ్చగా రెండు చేతులూ చాపి... చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే  నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ..." మీ మనవలా అండి", అని పలకరిస్తుంటే... మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా ... "అవునండీ, పండక్కి వచ్చారు"... అని బదులిస్తుంటే, నాకు ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరంగా అనిపించింది... ఎందుకంటే, మా నగరాల్లో మేమెవరమో మా పొరుగు వారికి తెలియదు, మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు.

           సంక్రాంతి పండుగ రోజున... గతించిన పెద్దలకు గారెలు , పరమాన్నం నివేదించి, పూజ చేసి,మేమందరం మీ కాళ్ళకి నమస్కరిస్తుంటే ... "దీర్ఘాయుష్మాన్ భవ", అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే..."మీవంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష" అని,  అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని... పిండివంటలు తింటూ...ఆ రోజంతా ఇంటికి వచ్చే పోయే వాళ్ళతో ఎంత సందడిగా గడిచిపోయిందో! పనమ్మాయికి, వాచ్మెన్ భార్యకు, పాలబ్బాయికి... మనం చేసుకున్న పిండివంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు, వాళ్ళు ఎంతో సంతోషంగా అవి తీసుకుని వెళ్తుంటే... పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఆరోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్యా. 

          కనుమ పండుగ రోజున మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్ళకి వెళ్లి అందరినీ కలిసి వస్తుంటే... మనకు ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్యా... ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నందుకు మామీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా ...మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు "మన" అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్యా.

          తెల్లవారుఝామునే హరిదాసు సంకీర్తన, వాకిళ్ళ ముందు అందమైన ముగ్గులు... వాటి మధ్యలో పసుపు రంగు చామంతిలతో కూడిన గొబ్బెమ్మలు... పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం... బ్రతుకుతెరువుకై వలసపోయిన కుటుంబాలు, పండుగ కోసం సొంతూరుకి రావడం... పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు,అల్లుళ్ళతో కళకళలాడిన లోగిళ్ళు...అందంగా ముస్తాబైన పశువులు... బంధుమిత్రుల కోలాహలం... అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం...

ఇలా ఒకటా,రెండా...ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు... యాంత్రికత మోజులో మునిగితేలుతున్న మా నగర సమాజానికి ఆటవిడుపుగా, ఒకింత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా....

ఈ అనుభవాలని,అనుభూతులని మూటగట్టుకుని... మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా... తిరుగు ప్రయాణం అవుతున్నాము. మాకు  ఇంత ఘనంగా, చక్కగా పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్యా!".

          సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనై, అంతవరకూ తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ... ఇనుమడించిన ఉత్సాహంతో ...

"మీ తరానికి... మన సంస్కృతి, సాంప్రదాయాలు అందించాలనే తహతహ తోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాము తల్లీ...మా తరాలకి, రాబోయే భావి తరాలకు వారధిగా మీరు ఉండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకు ఉన్న అవకాశం తల్లీ. అందుకే ఎంత ప్రయాసపడైనా పండుగలకు సొంత ఊరికి రండి , మీ మూలాలు తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి...మాకు బలం అవ్వండి..‌నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా...  ", అని 

 తిరుగు సందేశం పంపాడు తాతగారు... మీసం సవరించుకుంటూ,కొండంత తృప్తితో.... 🌹🙏🌹