3, అక్టోబర్ 2020, శనివారం

GOVERNMENT'S BOON FOR SENIOR CITIZENS TOTALLY FREE*

 👍👏👏  *


The Central Government has launched an excellent consulting scheme for senior citizens and all other citizens. Elderly people, especially those with high blood pressure, diabetes, etc., cannot be rushed to the hospital for OPD.  They seek treatment at home for minor ailments like headaches, physical pain, but are not ready to go to the hospital. You can access it on Google Chrome via the link below. Note:


*1*.  Select patient registration.


*2*. Type your mobile number. Type OTP on mobile for registration.


*3*. Enter patient details and district. Now, you will connect with the doctor online. After that, you can consult a doctor for any of your health problems through the video. The doctor will prescribe the medicine online. You can take the medicine by showing it in the medical pharmacy shop.


*This service is completely free.*                                        You can use this service every day from 10.00 am to 3.00 pm, including Sunday.


Please send this to senior citizens in your contact list.


This is the Central Government website: 


*https: //www.eSanjeevaniopd.in*


 

వెంకటేశ్వర








 


 


 


 


 


 

ప్రవచనములు


 

పద్మము యొక్క విశిష్టత

 


*సృష్టిలో తొలి పుష్పంగా పద్మాన్ని భావిస్తారు. పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్పంగా పురాణాలు చెబుతున్నాయి.*


*‘పద్మం’ అనే పదానికి పారమార్థిక, యౌగిక, వాస్తుపరమైన అర్థాలున్నాయి. పద్మం దేహంలోని ఒక నాడీచక్రం. కుబేరుడి నవనిధుల్లో ఒకటి.*


*వాస్తురీత్యా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు ఉన్న ఇంటిని కూడా పద్మమంటారు.పద్మం ముందు పుట్టి ఆ తరవాత సృష్టి పుట్టిందని పురాణోక్తి.*


*శేషతల్పంపై మహావిష్ణువు శయనించి ఉన్న సమయాన స్వామి నాభి నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణ కథనం. పద్మం పేరున ఓ పురాణమే వెలసింది. అదే పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లో అది రెండోది. 50వేల శ్లోకాలు కలిగి విస్తృతిలో స్కాందపురాణం తరవాత రెండో బృహత్‌ పురాణం.*


*విష్ణువు మహత్వాన్ని తెలిపే పురాణం. పద్మాలు సరస్సులో, చెరువుల్లో, జలం సమృద్ధిగా ఉండేచోట వికసిస్తుంటాయి. తామర, కమలం, నలిని, పంకజం మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.ఎందరో దేవతలకు పద్మం ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంపై కూర్చుని హస్తాల్లో పద్మాన్ని ధరించి ఉంటుంది.*


*‘కమల’ శబ్దానికి లక్ష్మీదేవి అనికూడా అర్థం ఉంది. ఆ దేవిని ‘కమలాత్మిక’ అంటారు. కమలం ఆత్మగా కలిగిన దేవత అని అర్థం.*


*పంకమంటే బురద. బురదలో పుట్టిన పద్మం పంకజమైంది. బురదలో పుట్టినా ఎలాంటి మలినాలు అంటకుండా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది.*


*మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యం చెదరకుండా చూసుకోవాలని, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించాలని గుర్తుచేస్తుంది పద్మం. ఎప్పుడూ నీళ్లలోనే ఉన్నా తామరాకుకు తడి అంటుకోదు.*


*‘తామరాకు మీది నీటిబొట్టులా’ ఉండాలంటారు. జ్ఞాని దుఃఖంలో,సుఖంలో, విపరీత పరిస్థితుల్లో సైతం చలించకుండా ఆత్మానందంలో లీనమై ఉంటాడనడానికి ప్రతీకగా ఈ విషయం నిలుస్తుంది.*


*శుభసూచకమైన ‘స్వస్తిక్‌’ చిహ్నం తామర పువ్వు నుంచే ఉత్పన్నమైందని భావిస్తున్నారు. సూర్యుడు పద్మినీప్రియుడు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన పద్మానికి సాహిత్యంలోనూ విశేషమైన స్థానం ఉంది.*


*యోగశాస్త్రం ప్రకారం మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగిఉన్నాయి. ప్రతిచక్రం నియమిత దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనం ఆమోదయోగ్యమవుతుంది.శరీరంలోని చైతన్య కేంద్రాల్ని చక్రాలంటారు.*


*మూలాధార చక్రం భౌతిక చైతన్యానికి కేంద్రం. నాభివద్ద చైతన్యకేంద్రం నీలం వర్ణంలో, ఉదరం వద్ద చైతన్యకేంద్రం ఎరుపు వర్ణంలో పదిరేకుల పద్మంలా ఉంటాయి. దానికి పైన హృదయం వద్ద చైతన్యకేంద్రం గులాబి, బంగారు రంగులు కలిసిన ఛాయలో పన్నెండు రేకుల పద్మంలా ఉంటుంది. కంఠం వద్ద చైతన్యకేంద్రం బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటుంది.*


*కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు వర్ణంలో రెండు రేకుల పద్మంలా ఉంటుంది. తలపై భాగంలో చక్రం స్వర్ణకాంతుల మధ్య నీలిరంగులో వెయ్యిరేకుల పద్మంలా ఉంటుంది.శుక్రవారం మహాలక్ష్మిని పద్మాలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.*


*తామరాకు, దుంప, కాడ, పువ్వు వైద్యానికి ఉపయోగం. పద్మకాష్ఠం ఔషధీ విశేషం. తామర తూళ్లు హంసలకు ఆహారం. పద్మకోశం నాట్యంలో ఒక అభినయ హస్తవిశేషం.*


*మహాభారత యుద్ధంలో ‘పద్మవ్యూహం’ ఉంది. పద్మరాగం జాతిరత్నం. పద్మ నాయకులు మధ్యయుగాల్లో తెలుగుగడ్డపై కొన్ని ప్రాంతాలను పాలించిన ప్రభువులు. పద్మం జ్ఞానవికాసానికి, చైతన్యానికి ప్రతీక. పద్మం మన జాతీయ పుష్పం.*


*మనకి లక్ష్మీ దేవి పద్మ పీఠం మీద నెలకొని పద్మ హస్తయై కనిపిస్తూ ఉంటుంది.ఇక లలితా త్రిపురసుందరి మహాపద్మాటవి లోనే విహరిస్తుంది.ఐతే ఈ పద్మానికి ఆద్యాత్మిక భౌతిక ప్రాముఖ్యం ఎంతగానో ఉంది.* 

*నిజానికి అసలు ముందు పద్మం పుట్టి సృష్టి తర్వాత జరిగిందని చెప్పుకోవచ్చు.*


*ఎందుకంటే పురాణయుగంలో శేషతల్పంపైన శయనించిన మహా విష్ణువునాభి కమలం నుంచి ఒక పద్మం అవతరించిందనీ, ఆ పద్మంలో నుండి సృష్టికర్త బ్రహ్మ దేముడు ఆవిర్భ వించాడనీ, అందుకే ఆ సమయంలో ఆ కాలాన్ని పురాణాల్లో "పద్మ కల్పం" అన్నారనీ ఆ పద్మం పేరునే "పద్మ పురాణం" అనీ లోకవిదితం.*


*అందుకే పద్మం నుంచి పుట్టిన వాడు గనుక బ్రహ్మ "పద్మ సంభవుడుగా పేరుగాంచాడు".ఐతే ఈ పద్మం ఎందరో దేవతలకి ఆసనంగా అందంగా అలరారుతుంది. ముఖ్యంగా స్త్రీల అందచందాలని కవులు "పద్మాక్షి...* *పద్మనయన... పద్మానన... పాద పద్మాలు" ఇలా వర్ణిస్తూ ఉంటారు. అంతే కాదు,"పద్మినీ జాతిస్త్రీలు" అని ఒక తెగ [నాలుగు జాతుల్లో].*


*వికసించిన పద్మం జ్ఞనానికి చైతన్య వికాసానికి ప్రతీక ఇక కవుల హృదయాలకి శిరీష కుసుమమే. చైతన్య కేంద్రాలను "చక్రాలు" అంటారు.*


*ఉదాహరణకు మొదటిదైన మూలాధారం భౌతిక చైతన్యానికి కేంద్రం.ఇది ఎరుపు రంగుతో నాలుగు రేకుల పద్మంలా ఉంటుంది. ఉదరం వద్ద చైతన్య కేంద్రం గాఢమైన ఎరుపు, నీలం రంగు కలిసి ఆరు రేకుల పద్మంలా ఉంటుంది.*


*ఆ పైన నాభి వద్ద ఊదా రంగులో[చైతన్య కేంద్రం ] పది రేకుల పద్మం లా ఉంటుంది.ఇక కంఠం వద్ద బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటే కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు రంగులో రెండు రేకుల పద్మం లా ఉంటుంది.*


*చివరిగా తల భాగంలో బంగారు కాంతుల మధ్య నీలి రంగులో వేయి రేకుల పద్మంలా ఉంటుంది.అమ్మవారి నెలవు అదే. కేవలం కావ్యాలలోనే గాక ఆధ్యాత్మిక పరంగా పద్మానికి గల ప్రాముఖ్యత ఎంత గొప్పదో దీన్ని బట్టి విదితమౌతుంది.*


*ఐతే ఈ పద్మం కేవలం మన దేశానికే కాదు, మన దేశంలోనే దేవతలకు పూజా పుష్పంగా ఆసనంగ కవులకు వర్ణనీయంగా భావించటమే కాదు,ఇతర దేశాల్లో కూడా పద్మ ప్రియులు చాలా చాలా ఉన్నారు.*


*"జపాన్, చైనా, టిబెట్, ఈజిప్టు" వంటి అనేక చోట్ల ఈపద్మాలు పెరుగుతాయి.*

*అనాదిగా ఈ పూలు పెరగడమే గాక అతిపవిత్రమైన పుష్పంగా ఆరాధించడం, బౌద్ధ మతంలో కూడా దీన్ని ఆధ్యాత్మికప్రాముఖ్యతతో పూజించడం ఆచారంగా ఉంది.ఈ పద్మాలు చెరువుల్లోను,సరస్సులోను ఎక్కువగా వికసిస్తాయి.ఇంచు మించు ఒకే ఆకారం గల ఈ నీటిపూలను సంస్కృతంలో "పద్మం, కమలం, పంకజం" అని అనేక రకాలుగా పిలుస్తారు.*


*ఈ పద్మ పత్రాలు గుండ్రంగా ఎనభై సెంటీమీటర్ల చుట్టు కొలతతో నీటి మీద తేలుతున్నట్లుగా వ్యాపించి చెరువంతా గొడుగుల్లా అందంగా కనిపిస్తాయి.ఈపద్మపత్రాల వేళ్ళు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి.ఇవి ఒకోసారి మీటరు ఎత్తుగా లేదా పదిహేను సెంటీ మీటర్ల వరకు అడ్డంగా విస్తరిస్తాయి.వీటి చుట్టుకొలత ఇంచు మించు తొమ్మిది సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.*


*ఇవి అందానికే కాదు, తినడానికి కూడా ఉపయోగించు కుంటారు.తాజావేళ్ళను వేయించుకుని ఎండ బెట్టిన వేళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూరల్లోకి కలుపుకుని తింటారు.చైనా,జపాన్ లాంటి ఇతర దేశాల్లో ఈ వేళ్ళతో ఊరగాయలు పెట్టి శీతాకాలంలో తినడం కద్దు.*


*ఈ వేళ్ళ నుంచి తయారు చేసే పాలపొడిలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇది చిన్న పిల్లల్లో అతిసారం వంటి వ్యాధులను నివారిస్తుంది.*


*ఈ వేళ్ళతో తయారు చేసిన పేస్టు చర్మ రోగాల నివారిణి.అంతే కాదు పూల మధ్య లో ఉన్నకర్ణికను ఎండబెట్టి చైనా వారు వాసన కోసం "టీ" లో ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే పద్మాల నుంచి సేకరించిన తేనెలో బలవర్ధక లక్షణాలుంటాయి.*


*కంటిసమస్యలకు ఈ తేనె బాగా ఉపయోగ పడుతుంది.ఇక విత్తనంలో ఆకుపచ్చ రంగులో ఉండే బీజాకారం చాలా విష పూరితంగా చేదుగా ఉంటుంది.కానీ దాని చుట్టూ ఉన్న తొనల్లో అపారమైన పోషక విలువలుంటాయి,"సి" విటమిన్ ఉంటుంది.ఈజిప్టులో ఈవిత్తనాలను పిండి చేసి పాలతోగాని నీటితోగాని ఆ పిండి తడిపి రొట్టెలు చేసుకుని తింటారట.అంతే కాదు, ఈ విత్తనాలను పచ్చిగా గాని వేయించి గాని ఉడకబెట్టిగాని తినవచ్చు.*


*సృష్టికి ముందే అవతరించిన ఈ పద్మం కనువిందు చేసే కాంతివంతమైన రూపంతో పాటు దైవికంగా సాహితీ పరంగా ఆధ్యాత్మికంగా భౌతిక చైతన్య కేంద్రంగా ఎన్నో అంద చందాలను సుమ సౌరభాలను విరజిమ్ముతూ ఇన్ని సుగుణాలను కలిగి ఉంది.మనకు ప్రకృతి పరంగా లభించిన వర ప్రసాదం ఈ అందమైన పద్మం.*



 

హైదరాబాద్ లో భూకంపం


 

రామాయణ సంబంధ 112 పుస్తకాలు(PDF

 *రామాయణ సంబంధ 112 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

112 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/ramayanam-pdf


               (OR)

 

సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) www.freegurukul.org/g/Ramayanam-1


వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) www.freegurukul.org/g/Ramayanam-2


వాల్మీకి రామాయణం-బాల,అయోధ్య,సుందర,ఉత్తర కాండ-అంతరార్ధం www.freegurukul.org/g/Ramayanam-3


చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-4


రామ కథాసుధ-1,2 భాగాలు www.freegurukul.org/g/Ramayanam-5


రామచరిత మానసము www.freegurukul.org/g/Ramayanam-6


సుందర కాండ-పారాయణము www.freegurukul.org/g/Ramayanam-7


సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము www.freegurukul.org/g/Ramayanam-8


రామచరిత మానస్-తులసీ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-9


రామాయణం www.freegurukul.org/g/Ramayanam-10


తులసీ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-11


యోగ వాసిష్ఠ సారము www.freegurukul.org/g/Ramayanam-12


యోగ వాశిష్ఠ సంగ్రహము www.freegurukul.org/g/Ramayanam-13


రామాయణ రహస్య రత్నావళి www.freegurukul.org/g/Ramayanam-14


రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-15


బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-16


రామాయణం పాత్రల ఆదర్శం www.freegurukul.org/g/Ramayanam-17


రామాయణంలో విశిష్ట పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-18


బాలానంద బొమ్మల రామాయణం www.freegurukul.org/g/Ramayanam-19


వాల్మీకి రామాయణం-సంబంధాలు www.freegurukul.org/g/Ramayanam-20


రామాయణ పరమార్ధం www.freegurukul.org/g/Ramayanam-21


శ్రీ రామాయణ రహస్యం www.freegurukul.org/g/Ramayanam-22


రామాయణ తరంగిణి-1 www.freegurukul.org/g/Ramayanam-23


రామాయణ తరంగిణి-2 www.freegurukul.org/g/Ramayanam-24


శ్రీరామాయణ కథా సుధ www.freegurukul.org/g/Ramayanam-25


వాల్మీకి రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-26


వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-27


చిత్రరూపంలో రామాయణం www.freegurukul.org/g/Ramayanam-28


వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ www.freegurukul.org/g/Ramayanam-29


వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ www.freegurukul.org/g/Ramayanam-30


వాల్మీకి రామాయణము-అరణ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-31


వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-32


వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-33


వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-34


శత శ్లోకి వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-35


జాతి జీవనంపై రామాయణ ప్రభావం www.freegurukul.org/g/Ramayanam-36


రామాయణమంటే www.freegurukul.org/g/Ramayanam-37


రామాయణ సారస్వత దర్శనము www.freegurukul.org/g/Ramayanam-38


అంతరార్ధ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-39


రామాయణ విశేషాలు www.freegurukul.org/g/Ramayanam-40


శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు-అయోధ్య,అరణ్య,కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-41


శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష www.freegurukul.org/g/Ramayanam-42


శ్రీరామ కథామృతము www.freegurukul.org/g/Ramayanam-43


జీవన చిత్రాలు-రామయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-44


రామాయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-45


లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-46


లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-47


భరతుడు www.freegurukul.org/g/Ramayanam-48


కళ్యాణ రాముడు www.freegurukul.org/g/Ramayanam-49


కాళిదాసు రామకథ www.freegurukul.org/g/Ramayanam-50


బాలానంద కుశలవుల కథ www.freegurukul.org/g/Ramayanam-51


రావణ రాజ్యము-రామ రాజ్యము www.freegurukul.org/g/Ramayanam-52


రామాయణోపన్యాస మంజరి www.freegurukul.org/g/Ramayanam-53


వాల్మీకి వచన రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-54


వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-55


వాల్మీకి రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-56


వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-57


వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-58


అయోధ్యకాండ లోని ఆణిముత్యాలు www.freegurukul.org/g/Ramayanam-59


శ్రీమద్రామాయణము-అరణ్య కాండ www.freegurukul.org/g/Ramayanam-60


వాల్మీకి రామాయణం-అరణ్య కాండ www.freegurukul.org/g/Ramayanam-61


వాల్మీకి వచన రామాయణము-కిష్కింద కాండము www.freegurukul.org/g/Ramayanam-62


సుగ్రీవ పట్టాభిషేకము www.freegurukul.org/g/Ramayanam-63


ఉపన్యాస రామాయణము-చిత్రకూట సమావేశము www.freegurukul.org/g/Ramayanam-64


సుందరకాండము www.freegurukul.org/g/Ramayanam-65


సుందరకాండ www.freegurukul.org/g/Ramayanam-66


వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము www.freegurukul.org/g/Ramayanam-67


వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము www.freegurukul.org/g/Ramayanam-68


సుందర కాండకథ www.freegurukul.org/g/Ramayanam-69


రామాయణాంతర్గత సుందరకాండము www.freegurukul.org/g/Ramayanam-70


సుందరకాండ www.freegurukul.org/g/Ramayanam-71


సుందరకాండము www.freegurukul.org/g/Ramayanam-72


సుందరకాండము www.freegurukul.org/g/Ramayanam-73


సుందర సందేశము www.freegurukul.org/g/Ramayanam-74


సుందరకాండ www.freegurukul.org/g/Ramayanam-75


రామాయణము-యుద్ధ కాండ-2 www.freegurukul.org/g/Ramayanam-76


రామాయణము-యుద్ధ కాండ-3 www.freegurukul.org/g/Ramayanam-77


వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-1 www.freegurukul.org/g/Ramayanam-78


రామాయణ సుధ-ఉత్తర కాండము www.freegurukul.org/g/Ramayanam-79


వాల్మీకి వచన రామాయణము-ఉత్తర కాండము www.freegurukul.org/g/Ramayanam-80


ఉత్తర రామాయణము www.freegurukul.org/g/Ramayanam-81


ఉత్తర రామాయణము www.freegurukul.org/g/Ramayanam-82


ఉత్తర రామాయణ కథలు www.freegurukul.org/g/Ramayanam-83


రామాయణ తరంగిణి-6 www.freegurukul.org/g/Ramayanam-84


రామాయణ తరంగిణి-7 www.freegurukul.org/g/Ramayanam-85


రామాయణ రత్నాకరము-1,2,3 www.freegurukul.org/g/Ramayanam-86


పాదుకా పట్టాభిషేకం www.freegurukul.org/g/Ramayanam-87


రామాయణ కల్పవృక్షం తెలుగుదనం www.freegurukul.org/g/Ramayanam-88


రామో విగ్రహవాన్ ధర్మః www.freegurukul.org/g/Ramayanam-89


రామ కథా రస వాహిని www.freegurukul.org/g/Ramayanam-90


సీతాదేవి వనవాసం www.freegurukul.org/g/Ramayanam-91


వాల్మీకీ రామాయణం శాపములు-వరములు www.freegurukul.org/g/Ramayanam-92


శ్రీరామ పధము www.freegurukul.org/g/Ramayanam-93


శ్రీరామనవమి www.freegurukul.org/g/Ramayanam-94


రామచరిత మానసము www.freegurukul.org/g/Ramayanam-95


రామచరిత మానసము -సుందరకాండ www.freegurukul.org/g/Ramayanam-96


తులసీ రామాయణము-యుద్ధ కాండము www.freegurukul.org/g/Ramayanam-97


శ్రీరామ పట్టాభిషేకము -శ్రీరామచరిత మానసము-ఉత్తరకాండ www.freegurukul.org/g/Ramayanam-98


వాల్మీకీయ జ్ఞాన వాసిష్ఠము www.freegurukul.org/g/Ramayanam-99


ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-1 www.freegurukul.org/g/Ramayanam-100


ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-3 www.freegurukul.org/g/Ramayanam-101


యోగ వాసిష్ఠము-ఉత్తరార్ధము www.freegurukul.org/g/Ramayanam-102


జటాయువు ధర్మబోధ www.freegurukul.org/g/Ramayanam-103


108 నామాల్లో సంపూర్ణ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-104


వాల్మీకి సంపూర్ణ రామయణ కథామృతము www.freegurukul.org/g/Ramayanam-105


వాల్మీకి రామాయణము-బాల కాండ www.freegurukul.org/g/Ramayanam-106


వాల్మీకి రామాయణము-అరణ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-107


వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-108


కిష్కింద కాండము www.freegurukul.org/g/Ramayanam-109


ఆధ్యాత్మ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-110


శ్రీరాముని చరిత్రము www.freegurukul.org/g/Ramayanam-111


సీతారామాంజనేయ సంవాదము www.freegurukul.org/g/Ramayanam-112



రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

To Join In WhatsApp Group: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this "www.freegurukul.org/join" link

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*

                                                                                        పద్యం: 1916 (౧౯౧౬)*


*10.1-902-*


*ఆ. విమల ఘనతరాత్మవిజ్ఞానవిద్యచే*

*నిగుడలేక యుడుప నిభము లగుచుఁ*

*గర్మమయములైన క్రతువుల భవ మహా*

*ర్ణవముఁ గడవఁ గోరినారు వీరు.* 🌺



*_భావము: పామరులైన ఈ గోపకులు మహత్తరమైన బ్రహ్మ విద్య రహస్యమును గ్రహించలేక, అసమర్ధులై, తెప్పలు వంటి సామాన్య కర్మస్వరూపములగు యజ్ఞములతో ఈ సంసారమనెడి మహా సాగరమును దాటగోరుచున్నారు._* 🙏



*_Meaning: Indra was thinking light of the yadava folk: "These ignorant, incompetent cowherds could not realise the secrets of higher knowledge like BrahmaVidya. They are indulging in normal yajnas which he is comparing with a canoe in their attempt to cross the huge ocean called life"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866 661454).*

శని దోషం నుండి బయటపడేందుకు

 చాలామంది ఎక్కువగా మాకు శనిపట్టినట్టు ఉంది అంటుంటారు. ఏ పని జరగకపోయినా శని బాధగా చెప్పుకుంటారు. అయితే శని అనుకూలత కోసంప్రతి శనివారం ఈమంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు.


పురాణగాధ


నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు.


ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి


పూర్వ వైభవం కలిగింది.


''క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్


ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్


నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార


వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ


ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ


కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ


శుద్ధబుద్ధి ప్రదాయనే


య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్


మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది.

శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి,


తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


''శన్యారిష్టే తు సంప్రాప్తే


శనిపూజాంచ కారయేత్


శనిధ్యానం ప్రవక్ష్యామి


ప్రాణి పీడోపశాంతయే''


ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు,


నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు..!

 

ఓం నమో నారాయణ..!!🙏


హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో 

వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి. 


జ్వాల నరసింహ స్వామి

అహోబిల నరసింహ స్వామి

మాలోల నరసింహ స్వామి

వరాహ నరసింహస్వామి (క్రోడా)

కారంజ నరసింహస్వామి

భార్గవ నరసింహస్వామి

యోగానంద నరసింహస్వామి

చత్రవట నారసింహస్వామి

పావన నరసింహ స్వామి


1.జ్వాలా నరసింహ క్షేత్రము.🙏

(కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. 

ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి 

ఘనమైన చరిత్ర ఉంది . 

పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. 

అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు 

నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.

అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, 

జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు 

అనే రూపాలలో కనిపించాడట. 

ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. 

స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.


వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, 

కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని 

"జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. 

ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే 

కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.


2. అహోబిల నరసింహ స్వామి.🙏

(గురుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని 

స్థల పురాణం చెబుతుంది. 

హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి 

ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరటా.

అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.


ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, 

ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. 

ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. 

ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున 

అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. 

ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి 

గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి. 


3. మాలోల నరసింహ స్వామి..🙏

(శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)


వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా 

"మా" అనగ లక్ష్మి లోల యనగ "ప్రియుడు" అని అర్ధం. 

ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. 

ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో 

ఈ ఆలయం కలదు. 

స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. 

వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. 

ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. 

స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి 

వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకొన్నట్లుగా యున్నది. 

స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. 

ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, 

ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. 

ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. 


4. వరాహ నరసింహస్వామి (క్రోడా)..🙏

(రాహుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)


వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా 

వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి 

భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి 

వరాహ నరసింహ క్షేత్రమని పేరు. 

భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. 

ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. 


5. కారంజ నరసింహస్వామి..🙏

(చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.

పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ 

నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. 

ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. 

అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.


6. భార్గవ నరసింహస్వామి..,,🙏

(సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. 

కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. 

ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. 

పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. 

ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. 

స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై 

శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, 

అసురుని ప్రేవులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, 

ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, 

ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.


7. యోగానంద నరసింహస్వామి..🙏

(శనిగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి 

అని పిలవబడుచున్నాడు. 

యోగపట్టంతో, విలసిల్లినాడు, 

ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. 

మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. 

ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.


8. చత్రవట నారసింహస్వామి..🙏

(కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)


పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను 

ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి 

నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి 

వారికి శాప విమోచనం గావించెను. 

కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని 

చత్రవట స్వామి అని పిలుస్తారు. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.


9. పావన నరసింహ స్వామి..🙏

(బుధగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి.

ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, 

సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్ధమగుచున్నది. 

మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. 

కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. 

ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో 

దక్షిణ దిశలో యున్నది. 

పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. 

బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. 

ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. 

ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

🙏🙏🙏


🌹🌹🌹

*దు:ఖం నుండి శాంతి వైపుకు .....*

 సేకరణ 👇


*కథా ఫలే*



*ఒక రాజు*

 ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :


 ' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.


 కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,


 నేనే ఎందుకయ్యాను ?

 ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 


' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 


అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 


ఆయనను కలవండి. 

జవాబు దొరుకుతుంది ''అన్నాడు. 


రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు


అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...

 తన ప్రశ్న ఆయన ముందు పెడితే....


 ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.


 అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''


 నిరాశపడినా , 

రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 


రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు


రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.


 కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.


 కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు



 రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 


వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,


 అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'


 రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు. 


చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 


అపుడు ఆ అబ్బాయి అన్నాడు


 '' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు. 


ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.


 తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో 


*'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు*


*రెండవ వ్యక్తిని అడిగితే..*

 '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''


 అని వెటకారంగా అంటాడు.


 మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ? 


''అని నీచంగా మాట్లాడాడు. 


కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.


 ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు. 


 రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు. 


అపుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు :


 '' రాజా , ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు.''


ఈ కథను బట్టి 

 మనం గతం లో చేసినదేదీ వృథాగా పోదు అని చెప్పడానికే.


 మరో కారణం ఏమంటే , 

కన్ను , ముక్కు , చెవి , నాలుక , చర్మం అనే అయిదు ఇంద్రియాల ద్వారా , 


అలాగే మన మనసు ద్వారా మనం ఎన్నో పనులు చేసివుంటాం. 


వాటిలో మంచివి వుంటాయి , చెడ్డవి కూడా వుంటాయి. 


అవేవో మనకు ఇపుడు తెలియవు.


 మనం ఇపుడు 

సంతోషంగా , 

అందంగా , 

*ధనవంతంగా ,*

 ప్రశాంతంగా వున్నామంటే గత జన్మల్లో చేసిన మంచి కర్మలు ఇపుడు ఫలితాలు ఇస్తున్నాయని , 


ఒక వేళ మనం ఆందోళనగా , భయంగా , ఎదురుదెబ్బలు తింటున్నామంటే అప్పటి చెడు కర్మలు ఫలితాలు ఇస్తున్నాయని తెలుసుకోవాలి.


 కానీ... 


ఈ జన్మ లో మనం ఏమైనా పాపాలు , తప్పులు చేసివుంటే వాటినుండి విముక్తి పొందడానికి ఏమైనా పరిష్కారాలున్నాయా ? 

అంటే '' 


ఖచ్చితంగా వున్నాయి ''

*శివానందలహరి*

 **దశిక రాము**



15 వ శ్లోకం


" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:”

ఈశ్వరుడు తనను ఉపేక్షిస్తున్నాడేమో అని భావించి శంకరులు చెప్పిన 

మాటలివి . ఈశ్వరుడు తలచుకుంటే , తననుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతను 

సైతమూ మార్చగలడని, శంకరులు చెప్పారు. ఈశ్వరుడు సర్వకార్య

సమర్థుడని , ఆయన తన్ను ఉపేక్షింౘ రాదననీ ప్రార్థన.


             శ్లో" 15  


**ఉపేక్షా నోచేత్కిం**


**న హరసి భవద్ధ్యాన విముఖాం**

                       

**దురాశా భూయిష్టాం** 


**విధిలిపి మశక్తో యది భవాన్**

                        

**శిరస్త ద్వైధాత్రం** 


**ననఖలు సువృత్తం పశుపతే !**

                        

**కథం వా నిర్యత్నం**


**కరనఖముఖేనైవ లులితమ్**


పదవిభాగం:

ఉపేక్షా, నోచేత్ _ కిమ్ _ న _ హరసి _ భవద్ధ్యాన విముఖాం _ 

దురాశా భూయిష్టాం _ విధిలిపిమ్ _ అశక్తః _ యది _ భవాన్ _ 

శిరః _ తత్ _ వైధాత్రం _ న _ నఖలు _ సువృత్తం _ పశుపతే _ కథం _ 

వా _ నిర్యత్నం _ కరనఖముఖేన _ ఏవ _ లులితమ్.


తాత్పర్యము: 

ఓ పశుపతీ ! నీకు నాయందు ఉపేక్షాభావము లేనట్లయితే నీ 

ధ్యానము నందు వైముఖ్యము గలిగి యుండేటట్లునూ, దురాశతో

కూడి యుండేటట్లునూ బ్రహ్మ నా నొసటిపై వ్రాసిన వ్రాతను ఎందుకు 

నీవు తుడిచి వేయడం లేదు. అలా తుడిచి వేయడానికి నీవు అసమర్థుడ

వన్నది నిజం కానేకాదు. ఎందుకంటే, నీవు నిజంగా శక్తి లేనివాడవయితే

నాల్గు తలల మధ్య మిక్కిలి దృఢంగా నిబద్ధమైన బ్రహ్మ యొక్క ఐదవతల

అప్రయత్నంగా అవలీలగా నీ చేతి గోటి కొనతో ఎలా త్రుంచి వేయబడింది ?

బ్రహ్మ తలనే త్రుంచివేసిన నీకు , అతని వ్రాతను తుడిచి వేయడం కష్టం కాదు 

అందు చేత , భవద్ధ్యాన వైముఖ్యమూ, దురాశా పరత్వమూ , అని వ్రాయబడిన నా నుదుటి వ్రాతను తొలగింౘుమని ప్రార్థన.


వివరణ:

భగవంతుని యందు భక్తి వుంటే ,విధిరాతలు కూడా దూరమౌతాయనడానికి

మనపురాణాలలో సైతం ఎన్నో ఉదాహరణలున్నాయి.


మార్కండేయుడు అల్పాయుష్కుడైనా , శివుని కరుణచే చిరంజీవిఅయ్యాడు. 

సతీ సావిత్రి యముని అనుగ్రహముతో తన భర్త ప్రాణాలను నిలబెట్టింది.

ఇక గ్రంథకర్త. శంకరులవారికి బ్రహ్మ లిఖితప్రకారం , ఎనిమిదే ఏళ్ళు ఆయుర్దాయం అయినా , సన్యాసం స్వీకరించి మరో ఎనిమిది సంవత్సరాలూ, వ్యాస భగవానుని అనుగ్రహంతో మరో పదహారు సంవత్సరాలూ మొత్తం 32 ఏళ్ళు జీవించారు కదా !


ఈశ్వరానుగ్రహం గూర్చి ధూర్జటి మహా కవి ఇలా చెప్పాడు .


          పవి పుష్పంబగు, నగ్ని మంౘగు, నకూపారంబు భూమీస్థలం

          బవు, శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యాహారమౌ, నెన్నగా

          నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్

          శివ ! నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా !!


వివరణ: 


ఈశ్వరా ! లోకంలో శివనామోచ్చారణము చేసే పుణ్యాత్ముడికి వజ్రము

పువ్వు అవుతుంది , అగ్ని మంౘు అవుతుంది. సముద్రము నేల అవుతుంది. శత్రువు మిత్రుడు అవుతాడు. విషము అమృతాన్నము అవుతుంది. నీనామము అన్నిటినీ వశము చేయగల్గిన శక్తిగలది . 


         " మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్ "


మూగవానిని వాచాలుడిగా , కుంటివాణ్ణి పర్వతాలను దాటేవానిగా

ఈశ్వరానుగ్రహం చేయగలదని బ్రహ్మ రాత ప్రక్కకు తొలగుతుందని భావం

🙏🙏🙏.


*ధర్మము-సంస్కృతి*

🌹 మూకపంచశతి🌹

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏




🌹 ఆర్యాశతకము🌹


🌹15.

శ్లోకం


అఙ్కితశఙ్కరదేహాం


అఙ్కురితోరజకఙ్కణాశ్లేషైః౹


అధికాఞ్చినిత్యతరుణీం


అద్రాక్షంకాఞ్చిదద్భుతాం బాలామ్౹౹


🌺భావం:


కామాక్షీ దేవి గాఢ ఆలింగనమువలన ఆ నిత్యతరుణి స్తనములయొక్క ,కంకణములయొక్క చిహ్నములతో ఉన్న శంకరుని దేహముతో కూడియున్న బాలాంబికను కాంచీపట్టణమందలి ఒకానొక అద్భుత ముగా చూచుచున్నాను.



🌼కాంచీనగరమున కామాక్షీదేవి పరమశివునికై తపమాచరించెను.మామిడి చెట్టు మూలమున సైకతలింగమును (ఇసుకతో లింగము)ప్రతిష్ఠించి ఆరాధించుచుండగా

ఆమెను పరీక్షించుటకై నది ఉవ్వెత్తున ఆదిశగా ప్రవహించసాగెను.ఆ నీటివడికి అడ్డుగా ఉండి ,పార్వతీ దేవి సైకతలింగమును కాపాడుకొనుటకును కౌగలించుకొనెనట.అంత లింగముపై ఆ చిహ్నములు ఏర్పడెనట .నేటికీ వాటిని ఏకామ్రేశ్వరలింగము పై చూడవచ్చును. అట్టి శంకరుని తో గూడిన ఆనిత్యయౌవ్వన అయిన కామాక్షీ దేవిని కాంచీనగరమందలి ఒకానొక అద్భుత ముగా కాంచుచున్నాను.🙏

             

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 

పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచితము "గురు అష్టకము”

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి


1) శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||




2) కళత్రమ్ ధనమ్ పుత్రపౌత్రాధి సర్వమ్ | గృహమ్ బాంధవా సర్వమేతాధి జాతమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||





3) షడఙ్గాదివేదో ముఖే శాస్త్రవిద్యా | కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||




4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః | సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||





5)  క్షమా మండలే భూపభూపాలబృన్దైః | సదాసేవితం యస్య పాదారవిన్దమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||




6) యశో  మే గతం దిక్షు దానప్రతాపాత్ | జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||





7) న భోగే న యోగే న వా వాజిరాజౌ | న కాన్తాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||





8) అరణ్యే న వాస్వస్య గేహే న కార్యే | న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |



మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||




ఫలశ్రుతి:--


గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ | యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |


లభేద్వాఞ్చితార్థం పదం బ్రహ్మసంఙ్ఞం | గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||


🕉🌞🌏🌙🌟🚩


గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం


ॐॐॐॐॐॐॐॐॐ



1) శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  చక్కని శరీర రూపం, ఎంతో అందమైన భార్య, గొప్ప కీర్తిప్రతిష్ఠలు, మేరుపర్వతమంత ధనం వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



అందం, చందం, భార్య, సంసారం, ధనం, కీర్తి వుండటం నిజంగా అదృష్టమే, మన పూర్వ జన్మల సుకృతమే, కానీ ఇవన్నీ ఎదో ఒక రోజు మన నుండి దూరమైపోతాయి! అన్నింటినీ వదులుకుని మనకు తెలియని చోటుకి వెళ్లిపోక తప్పదు!



వెళ్ళేలోపు మన రాకకు కారణమేంటో, మన గమ్యమేంటో, అసలు ఈ జననమరణ మాయ ఏంటో, జీవాత్మ ఏంటో, పరమాత్మ ఏంటో ఇత్యాది సంశయాలపై కాస్త అవగాహన వుంటే, వున్నన్నాళ్లు శాంతిగా బ్రతకొచ్చు, ఆనందంగా జీవించొచ్చు, అవునా మరి!



ఈ మహత్తర తత్వాన్ని అవగాహన చేసుకోవడం సులభంకాదు. అందుకు ఒక మార్గదర్శి అవసరము. ఆ మార్గదర్శియే మన అర్హతను బట్టీ గురురూపంలో దర్శనమిస్తుంటాడు.



అతడు మాత్రమే, ఈ చిక్కుముడిని విప్పి మనకు అసలు సత్యాన్ని చూపగలడు. అటువంటి మార్గదర్శిని పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే!





2) కళత్రమ్ ధనమ్ పుత్రపౌత్రాధి సర్వమ్ | గృహమ్ బాంధవా సర్వమేతాధి జాతమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి గృహం, ఎంతోమంది బంధువులు వున్న గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



సాధారణంగా జీవులు కష్టాల్లో వున్నప్పుడు ఆధ్యాత్మికం, సుఖాల్లో వున్నప్పుడు అహంకారాన్ని ఆశ్రయిస్తారు! ఇది మానవ నైజం! అదే మాయ!



అన్నీ వున్నప్పుడు దైవాన్ని పొగుడుతాడు, కల్పించుకొని మరీ ఎన్నో దైవకార్యాలు చేస్తాడు. పరిస్థితి కాస్త తారుమారు అయ్యేసరికి, దైవం మీద కోపం కలుగుతుంది, కొన్నాళ్ళకు అసలు దైవం వున్నాడా? లేడా? అన్న సంశయం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో తనవారినుండి ప్రేమానురాగాలు కొరవయితే, వారిని ఏమీ అనలేకా దైవాన్ని నిందించడం ప్రారంభిస్తాడు. ఇది మానవులందరికీ ఎదో ఒక సమయంలో కలిగే అనుభవమే!



ఆత్మపరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్లు తనకి దైవభక్తి కన్నా దేవునియందు తెలియని భయమే ఎక్కువుగా వున్నట్లు అనిపిస్తుంది. కారణం ఇన్నాళ్లు దేవుణ్ణి తన నుండీ వేరుగా, బయటెక్కడో చూస్తున్నాడు కాబట్టీ!



దానికి కారణం, ఎక్కువుగా బయట ప్రపంచంతో బంధాన్ని పెంచుకోవడం! నిజమైన “అహం” మరచి “అహంకారాన్ని” ఆశ్రయించడం, ఆత్మజ్ఞానం లోపించడం!!



ఎంతోకాలంగా ఎంతో అనురక్తితో ఎన్నో సుకర్మలు చేస్తున్నా కూడా ఆత్మజ్ఞానం కలగలేదంటే, సద్గురు ఆశ్రయానికి సమయం ఆసన్నమైందని అర్ధం! అహంకారాన్ని వదిలి గురువు కోసం తపిస్తే, గురువే ఆ వ్యక్తికి తన దర్శనభాగ్యం కలుగజేసి, తగు మార్గాన్ని సూచిస్తాడు! 



అతడు మాత్రమే అసలైన “నేను”ని చూపగలడు! ఆత్మజ్ఞానం ప్రసాదించగలడు! అసలు సత్యాన్ని బోధించగలడు! జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!



అటువంటి సద్గురుని పాదపద్మముల ఆశ్రయం పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!





3) షడఙ్గాదివేదో ముఖే శాస్త్రవిద్యా | కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  ఆరు అంగముల యందు, నాలుగు వేదముల యందు, సకల శాస్త్రవిద్యల యందు ఎంతో ప్రావీణ్యత వున్నప్పటికీ, ఒక కవిగా గద్య, పద్య రచనలో ఎంతో ప్రతిభ వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



ఆచరణకు నోచుకోని పాండిత్యము వలన, శాస్త్రజ్ఞానం వలన ప్రయోజనం సూన్యం. అది అజ్ఞానాన్ని సూచిస్తుంది.



ఈ కనబడే ప్రపంచంలో నిన్న వుంది, నేడు లేదు అన్న ప్రసక్తి ఉండదు. ఈ సృష్టిలో అన్ని జడ, జీవ పదార్ధాలు మార్పు చెంది కొత్తవాటిగా రూపుదిద్దుకుంటాయి. దేనికీ నాశనము వుండదు కేవలం మార్పు వుంటుంది. అలాగే మనం, మన బంధువులు ఆత్మస్వరూపంతో ఎల్లప్పుడూ ఉన్నవారమే. ఆత్మకి మార్పు లేదు. ఆత్మ నిత్యము, శాశ్వతము.

 


అలాగే లేనిదానికి ఉనికిలేదు, వున్నది లేకుండా పోదు. ప్రతి కార్యమునకు ఒక కారణము వుంటుంది. కారణము మూలము, కార్యము దాని వికారము. కారణము నిత్యమైనది, దానినే "సత్" అంటారు. కార్యము అనిత్యమైనది, దానినే "అసత్" అంటారు.

 


అంటే ఈ సృష్టికి మూలకారణం "సత్యము". దాని వికారమైన ఈ ప్రపంచము "అసత్యము". ఆత్మ సత్యము. శరీరము అసత్యము. దీనిని సమగ్రంగా తెలుసుకున్నవాడే గురువు!



అతడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలడు! జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!



అటువంటి సద్గురుని పాదపద్మముల ఆశ్రయం పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!





4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః | సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  విదేశాలలో ఎంతో గొప్పవానిగా, స్వదేశములో ఎంతో ధనవంతునిగా కీర్తింపబడుతున్నప్పటికీ, సంఘంలో ఎంతో సదాచార సంపన్నునిగా గుర్తింపు వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



ధరణిలో పరమాత్ముని ప్రతిరూపంగా జన్మించిన ప్రతిజీవికి, మనుగడకోసం అవసరమయ్యే శక్తిసామర్ధ్యాలను, తగిన జ్ఞానాన్ని ఆ పరమాత్మ ప్రసాదించేడు.



జీవులన్నింటిలో అత్యంత జ్ఞానసంపన్నుడిగా, తన సంపూర్ణ ప్రతిరూపంగా, పూర్తి మేధస్సుతో మానవుణ్ణి సృష్టించేడు పరమాత్మ. తనలాగే మానవుడు కూడా ఈ సృష్టిని, అందున్న ప్రతి జడజీవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఈ సృష్టి నిర్వాహణలో తనకు ఎంతో చేదోడువాదోడుగా వుంటాడని భావించేడు పరమాత్మ.

 


మానవుడు కూడా తన అపరిమిత జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులను తన స్వంతం చేసుకొని, సృష్టిలో వున్న అన్ని జడజీవాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, అపర పరమాత్మగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా జీవాలతో పోలిస్తే, మానవుడు అన్ని రంగాలలో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తూ అభివృద్ధి చెందుతున్నాడు.



కానీ మానవుడు మాయకులోబడి అహంకారవశుడై తన నిజస్వరూపాన్ని విస్మరిస్తున్నాడు. తనలో వున్న ఇంద్రియాలు, మనస్సు ఈ మాయకు దోహదపడుతున్నాయి. వీటికి లోబడి, అమోఘమైన ప్రజ్ఞ వున్నప్పటికీ ఆనందంగా, ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు.

 


ఈ మాయనుండి బయటపడే మార్గాన్ని “గురువు” మాత్రమే చూపగలడు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!



అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!





5)  క్షమా మండలే భూపభూపాలబృన్దైః | సదాసేవితం యస్య పాదారవిన్దమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  ఒక దేశానికి మహారాజు అయినప్పటికీ, ఎందఱో రారాజులు పాదాక్రాంతులై సేవిస్తున్నప్పటికీ, గురుని పాదపద్మములపై లగ్నంకాని మనస్సు వుంటే వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



మహారాజులతో పాటు సామాన్య వ్యక్తులు కూడా భావించేది ఏంటంటే, ఈ విషయభోగాలతో మేము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ఎంతోమంది నుండి గౌరవమర్యాదలను నిత్యం పొందుతున్నాం, వీటితో ఆనందము కలగదని చెప్పడం శుద్ధఅబద్దం, జ్ఞానగురువులు చెప్పే ఆత్మానందము అంటే ఏమిటో మాకు తెలియదు! అది లభిస్తుందన్న నమ్మకం కూడా లేదు! అందుచేత ఈ ఇంద్రియసుఖమును వదలుకొని, అస్సలు తెలియని ఆత్మసుఖము కోసము ప్రయత్నించడం తెలివితక్కువ పని అవుతుంది కదా??



మంచి భావనే, కానీ కొంచెము ఆలోచిస్తే, ఇక్కడ సుఖమన్నది బయట పదార్ధములలో లేదు, మనలోనే వుంది, మనమే అనుభవిస్తున్నామని అర్ధమవుతుంది. ఎందుచేతనంటే కొందరికి సుఖమును కలిగించిన వస్తువు, వేరొకరికి కలిగించపోవచ్చు. ఆ పదార్ధముద్వారా పొందిన ఆనందం దానిని అనుభవించిన కొన్నాళ్ళకు పోయి విసుగు కలగవచ్చు, అప్పుడు ఆనందము కోసము ఇంకో కొత్తవస్తువును వెతుక్కుంటాము. అది దొరక్కపొతే అసహనం, కోపము కలిగి అశాంతికి లోనౌతాము.



అంటే మునుజులు పొందుతున్న ఆనందము, అసహనం, కోపము వారిలోనే వున్నాయి కానీ వస్తువులలో లేదన్న విషయము బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే ఉంటే, అది అందరికి అన్నివేలయందు ఆనందాన్ని కలిగించాలి కదా! అందుకే “కడుపునిండితే గారెలు చేదు" అన్నారు పెద్దలు. మనుజులలో నున్న అజ్ఞానమే, బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము.



మానవుడు గాఢనిద్రలో నున్నప్పుడు, బాహ్యవస్తువులను మరచి, వాటియందు ఆసక్తిని విడచి, తన దుఃఖములను కూడా మరచి, తనయందే అమితసుఖమును పొందుతున్నాడు కదా! ఈ తాత్కాలిక ఉపశమనము(సుషుప్తి) యందే ఇంత సుఖమును అనుభవిస్తే, ఇక జ్ఞానముతో కూడిన శాశ్వత ఉపశమనరూపమగు సమాధిస్థితియందు ఎంత ఆనందమును పొందగలడు? కావునా శాశ్వతానందం పొందుటకు, తాత్కాలిక వస్తుసుఖమును పరిత్యజించాలి.



ఎవడు రాగద్వేషములకు వసుడుకాడో, ఎవడు వేషభాషలకు ప్రాధాన్యత ఇవ్వకా ద్వందాలను అతిక్రమిస్తాడో అతడే గురువు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!



అటువంటి సద్గురుని పాద పద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!





6) యశో  మే గతం దిక్షు దానప్రతాపాత్ | జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  మహాదానగుణ సంపన్నుడవన్న కీర్తి దశదిశలా వ్యాపించినప్పటికీ, ఈ ప్రపంచం మొత్తం నీ పక్షాన వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుంటే వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



ప్రపంచమంతా మూడు గుణములతో నిండివుంటుంది. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ త్రిగుణముల మాయచే ఆవరింపబడిన జీవుడు, గుణాలకు అతీతుడైన పరమాత్మ స్వరూపమును గ్రహించలేకున్నాడు.

 


వీటి ప్రభావము చేత జీవుడు, అశాశ్వతమైన తన శరీరమునే తానుగా భావించి క్షణికమైన దృశ్యవస్తువుల వెంట పరిగెట్టి వాటిని పరమప్రీతితో అనుభవిస్తున్నాడు. మంచి మనస్సు, దయా మఱియు దానగుణం పుష్కలంగా వున్నప్పటికీ ఈ మాయనుండి బయటపడలేక పోతున్నాడు. అహంకారంతో వున్న పరమాత్మను లేడని వాదించి, లేని జగత్తును వున్నదిగా భావిస్తూ కాలప్రవాహములో కొట్టుకొని పోవుచు జననమరణములను పొందుతున్నాడు.

 


అనేక జన్మల సాధనాఫలితంగా, ఎదో ఒక జన్మలో జ్ఞానము ఉదయిస్తుంది. అప్పుడు జీవుడు ఈ జగత్తంతయూ బ్రహ్మమే (సర్వం ఖల్విదం బ్రహ్మ), జీవుడు కూడా బ్రహ్మమే (జీవో బ్రహ్యైవ నాపరః) అనే పరమసత్యాన్ని గ్రహిస్తాడు. అదే జీవుని ఆఖరి జన్మ అవుతుంది. ఈ స్థితిని సాధించిన మహాత్ములు చాల అరుదు.



ఇట్టి మహత్తరమైన శక్తిని పొందియుండి కూడా జీవుడు, మాయలోపడి, సత్యమును మఱచి, రాగద్వేషములకు వశుడై, మోహలాలసుడై, సుఖదుఃఖములను అనుభవిస్తూ, కలుషిత మనస్కుడై, సంసారచట్రములో ఇరుక్కుపోతున్నాడు.

 


ఈ మాయనుండి బయటపడే మార్గాన్ని “గురువు” మాత్రమే చూపగలడు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!



అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!





7) న భోగే న యోగే న వా వాజిరాజౌ | న కాన్తాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |


మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీసుఖము, ధనము ఇత్యాది వాటియందు అనురక్తి మనస్సులో లేకపోయినప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుండీ, ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



కొంతమంది తీవ్రసాధన చేసి ఇంద్రియాలను, మనస్సును తమ ఆధీనంలోకి తెచ్చుకొని విషయవిరక్తిని సాధిస్తారు. బాహ్యవస్తువుల ప్రభావానికి లొంగని గొప్ప మనోనిబ్బరాన్ని తమ స్వంతం చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో వున్నట్టే కనబడతారు కానీ అసలు సత్యాన్ని గ్రహింపరు. జీవులయెడ బేధభావాన్ని, తారతమ్యాన్ని చూపుతారు.



కారణం సరైన గురుసాంగత్యాన్ని వారు పొంది యుండక పోవచ్చు, ఒకవేళపొందినా గురువుని సరిగ్గా అర్ధంచేసుకోవడంలో లేదా వారినుండి ఆత్మజ్ఞానం పొందడంలో విఫలమైయుండచ్చు.

 


జ్ఞానంలేని కర్మాచరణ, ఆచరణలేని జ్ఞానం వలన ఉపయోగం లేదు! ఇంద్రియాలు, మనస్సు జయించినంతమాత్రాన ఆత్మానుభూతి కలుగదు. జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోవాలి.



సద్గురువు కర్మలకు విలువిస్తూనే జ్ఞానానికి పెద్దపీట వేస్తాడు. “అహం” యొక్క మూలస్థానాన్ని తెలియజేస్తూనే “అహంకారాన్ని” దూరంచేస్తాడు. శిక్షణలో “సర్వం ఖల్విదం బ్రహ్మ” అర్ధాన్ని చెప్తూనే, “అహం బ్రహ్మాస్మి” అంతరార్ధాన్ని కూడా తెలియజేస్తాడు! శిష్యుణ్ణి “తత్వమసి” నుండి “అయమాత్మా బ్రహ్మ” స్థితికి తీసుకు వెళతాడు!



అంటే - ప్రకృతి, పరమాత్మ వేరువేరు అనే భావన నుండి, అంతా పరమాత్మే - పరమాత్మ నాలోనే వున్నాడు - నేనే పరమాత్మ అనే అద్వైతస్థితికి గొనిపోయోవాడు గురువు.



అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!





8) అరణ్యే న వాస్వస్య గేహే న కార్యే | న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |



మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||


అర్ధము:-  ఇటు అడవిలో గాని అటు ఇంటిలో గాని వుండాలన్న కోరిక ఏమాత్రం లేకపోయినప్పటికీ, ఏదైనా గొప్ప కార్యం సాధించాలన్న ఆలోచన లేకపోయినప్పటికీ, దేహం మీద శ్రద్ధ కాస్తైనా లేకపోయినప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుండీ, ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?



జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య అంటారు జ్ఞానులు.



జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు.



సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సు. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధిచేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలని అన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి.



దేని దగ్గరకు జీవుని మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదే "ఆత్మ".



ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము. విన్నవారు దానిని తెలుసుకోవడం ఇంకా కష్టం. దానిగురించి చెప్పే గురువు దొరకటం చాలా కష్టం. ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది.



అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!



ఫలశ్రుతి:--


గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ | యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |


లభేద్వాఞ్చితార్థం పదం బ్రహ్మసంఙ్ఞం | గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||


ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను ఎవరు సావధానులై వింటారో, ఎవరు గురువును శ్రద్ధతో సేవిస్తారో, వారు పవిత్రులైనా, సన్యాసులైన, రాజులైనా, సజ్జనులైనా, బ్రహ్మచారులైనా, ఎటువంటివారైనా సరే వారు కోరుకున్నవన్నీ వారికి లభించి తుదకు పరబ్రహ్మమును చేరుకుంటారు!!


“గురు అష్టకం” సర్వం సంపూర్ణం.


॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ఆత్మ జ్ఞానం కలిగించే వాడు గురువు.

 సేకరణ 👇

ఔదుంబర వృక్షానికి దత్తాత్రేయ స్వామికి అవినాభావ సంబంధం కదా. ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దత్తాత్రేయుల వారి కృపచే గురు బలం కలుగుతుంది. మరి గురు గ్రహానికి చెందిన వృక్షం రావి చెట్టు. మేడి( ఔదుంబర) శుక్ర గ్రహానికి చెందిన వృక్షం కదా? ఈ సందిగ్ధం తీర్చండి దయచేసి.

చక్కని ప్రశ్న అండి. 

దత్తాత్రేయుల వారు సర్వదేవతా స్వరూపులు, ఆది,అంతము లేని శక్తి స్వామి వారిది. 

ఏదో ఒక గ్రహంకి సంబంధించిన శక్తిగా వారి శక్తిని పరిమితం చేయలేము.

గురుగ్రహం అనుగ్రహం మానవులకు కలగాలి అంటే, మనకు ఆత్మానుభూతి అందించే ఏ వ్యక్తిని మనం గురువుగా భావించినా, పూజించినా కూడా, 

సేవించిన శిష్యుడు యొక్క భావం, ఆ దత్తప్రభువుకు వినతి గా చేరుతుంది. 

ఈ విధంగా స్వామివారు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతంలో తెలియజేశారు.

గురుడు దేవతల గురువు, ఆత్మ జ్ఞానానికి సంకేతం.

శుక్రుడు దానవుల గురువు. ప్రకృతి లో ఉండే ఇహిక సుఖాలను ఇచ్చే గ్రహం, శారీరక సౌఖ్యం లాంటివి.

మనం గ్రహాల విషయంకి వస్తె రెండు గ్రహాలు గురుస్థానంలో ఉన్నవే. 

కాక పోతే రెండు వర్గాల మధ్య దేవతా లక్షణాలు, రాక్షస లక్షణాలు ఉండే, మానసిక స్థితులలో తేడా అంతే.

ఎన్నోసార్లు స్వామివారి చరిత్రలో, 

"కలియుగంలో మానవులు యొక్క మానసికస్థితి అన్నిటినీ కావాలి అని, కబళించాలనే భావం తో ఉంటారు" అని చెప్పబడి ఉన్నది.

అంటే కలియుగంలో మానవులు దగ్గర దగ్గరగా రాక్షస ప్రవృత్తిని కలిగిఉంటారు. అంటే వివేకం ను కోల్పోయి ఉంటారు అని. (మీరు ఈ విషయం, నా నేటిమాటలో అంతకు ముందు ప్రస్తావించాను, చూడవచ్చు)

రాక్షసులకు గురువు శుక్రుడు , శుక్రగ్రహం యొక్క మొక్క మేడివృక్షం. మేడిచెట్టు మూలములో శ్రీ దత్తప్రభువు స్థిరనివాసం. ద్వంద్వ వైఖరి. 

అంటే ప్రకృతి పరంగా సుఖానికి, ఆధ్యాత్మిక పరంగా ఆత్మ జ్ఞానానికి.

సకల జీవుల యొక్క, దేవతా ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి కూడా, శ్రీ దత్తులవారి  సంకల్పంలోనే ఉంటుంది. ఇక్కడా కూడా ద్వంద్వ వైఖరి.

స్వామి వారు చెప్తారు, ద్వంద్వం లేక పోతే సృష్టి, స్థితి,లయ ఉండదు. మనం ఈ ప్రకృతి లో, ప్రతీ దానిలో ద్వంద్వ వైఖరి గమనించ వచ్చు.

మనం విశ్వవ్యాప్తంగా చూస్తే, మనం చూసే ఇటువంటి నక్షత్ర మండలాలు ఎన్నో ఉన్నాయి. 

మనకు తెలిసినది, ప్రస్తుతం మనం చూడ గలుగుతున్న ఈ గ్రహస్థితి ఈ ఖగోళవ్యవస్థకి సంబంధించినది మాత్రమే.

దత్తప్రభువును, దిగంబరా దిగంబరా అని స్మరిస్తాము. 

అంటే దిక్కులను అంబరంగా గల ప్రభువు అని అర్థం వస్తుంది కదా, 

అంతంలేని దిక్కులు స్వామి వారికి వస్త్రాలు. 

అనంతం అయిన శక్తి స్వామి వారు.

కాబట్టి గురు గ్రహం కు మాత్రమే స్వామి వారిని భావించ కూడదు.

స్వామి సంకల్ప స్వరూపం, అవతారాలు వారి సంకల్పానికి రూపాలు, వీటిలో మళ్లీ ద్వంద్వ  రూపాలు, మూల అవతారాలు, అంశ అవతారాలు.

సర్వదేవతా స్వరూపం అయిన దత్తాత్రేయస్వామి వారు, 

నరసింహ అవతారంలో, హిరణ్యకశిపుని సంహరించిన తరువాత, వారి గోళ్ళకు బాధ కలిగింది. 

వారికి ఉపశమనం కోసం లక్ష్మీఅమ్మవారి స్వరూపం, అక్కడి ఆకులుతో స్వామివారి గొరులను శుభ్రపరుస్తారు. ఉపశమనం కలుగుతుంది, 

అప్పుడు ఆ ఆకులు కలిగిన ఔదుంబర వృక్షంకు స్వామివారు వరంఇస్తారు, 

నీ వలన నాకు ఉపశమనం కలిగినది కావున, నీ మూలంలో నేను స్థిరంగా ఉంటాను అని.

స్వామివారు మూలంలో ఉండటం వలన, ఈ ఔదుంబర వృక్షం ను, కల్పవృక్షం గా ఈ భూలోకం లో మనం కొలుస్తాము. 

ఔదుంబర వృక్షంనకు ప్రదక్షిణలు చేసి ఏ కోరిక అయినా నెరవేరుతుంది.

ఔదుంబర స్తోత్రం కూడా ఉన్నది. 

ప్రదక్షిణ చేస్తూ, ఒక రెండు వాక్యాలు ఈ స్తోత్రం నుండి స్వీకరించినవి పఠిస్తాము. 

ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః ।

చింతామణి ర్గురోహ్ పాదౌ దుర్లభా భువనత్రయే।।

ఔదుంబర వృక్షం, ప్రకృతి పరంగా చక్కని, చూడ ముచ్చట గా ఉండే ఫలాలను అందిస్తుంది. 

కానీ వాటిలో పురుగులు ఉంటాయి. 

అంటే, లౌకికంగా అందం గా కనిపించే ప్రతీది మనసు కోరుకుంటుంది. కానీ పర్యవసానం కుళ్ళి ఉంటుంది అని.

అదే విధంగా, ఈ వృక్షంకు పోషణలో శ్రర్ధ లోపిస్తే, గొంగళిపురుగుల వంటి పురుగులు వచ్చేస్తాయి. అంటే మన మనసుని గమనిస్తూ ఉంటే చక్కని లక్ష్యం గల జీవితం ఉంటుంది అని. మానవుని జీవితానికి లక్ష్యం ఒక్కటే, ఆత్మ జ్ఞానం.

అంటే, ఇక్కడ దత్తాత్రేయస్వామి, ఔదుంబర సేవనం చేసే భక్తులకు ఒక పరీక్ష వంటిది పెట్టారు. 

ఆ సేవ చేసేవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. 

ఔదుంబర సేవ చేసేవారు నిరంతర గమనింపులో ఉండాలి. 

ఏమరపాటు మొక్కని పాడు చేస్తుంది. ఇది భౌతికం గా, 

ఆధ్యాత్మిక పరంగా చూస్తే, మనిషి కి తన వ్యక్తిత్వాన్ని నాశనంచేసే దుష్టశక్తులు నలువైపులా ఉంటాయి. వాటి నుండి ఎల్లవేళలా జాగురూకులు అయిఉండాలి అనేది తెలియజేస్తుంది. 

ఎంత చక్కటి సందేశం చూడండి. 

నిరంతరం అప్రమత్తంగా ఉండండి అని, ఈ సేవ తెలియజేస్తోంది.

ఔదుంబర వృక్షంకు ప్రదక్షిణలు చేసిన ప్రతీవారు ఆ కోరిక తీరింది, ఈ కోరిక తీరింది అని చెపుతూ ఉంటారు. 

కానీ, స్వామి చెప్పేది, 

ధర్మ బద్ధంగా ఉండే ప్రతీ కోరిక, తీరుతుంది అని చెప్తారు.

ఇక్కడ కూడా ధ్వంద్వం ఉంది గమనించండి. 

కోరిక ఏ విధం అయినది అయినా తీరుతుంది అని, ధర్మ బద్ధంగా ఉండేది తప్పక తీరుతుంది అని.

మనుషులు యొక్క మనస్తత్వం, 

ఈ యుగధర్మం ప్రకారం, 

ప్రతీ దానికీ ప్రమాణం, ఋజువు కావాలని అనుకుంటారు.

దాని కోసం, 

ధర్మ ఆక్షేపణ జరుగ కుండా, 

వారి పూర్వజన్మ కర్మఫలంగా కోరిక నెరవేరుస్తారు. తీరుతుంది, సందేహం లేదు.

మన పరిస్థితుల దృష్ట్యా కోరికలు కొరకూడదు. 

మనకి ఏది అవసరమో ఆ స్వామి కి తెలుసు. 

అందుకు మనం స్వామిని మనవారిగా, 

ద్వంద్వ స్థితిని విడిచి, వారితో మమేకం అయిపోవాలి. 

అందుకే ఆత్మ జ్ఞానం కలిగించే వాడు గురువు. 

శక్తి లేనిదే ఆత్మజ్ఞానంకు విలువ ఉండదు. 

అంటే, అన్ని విధాల మనం సౌఖ్యం అనుభవిస్తూ, ఆత్మ జ్ఞానం కోరుకోవాలి, అది నిజమైనది అవుతుంది. 

అంటే, స్మశాన, ప్రసవ, దరిద్ర, లాంటి వైరాగ్య స్థితి కాకుండా అని భావం ఇక్కడ.

అన్ని ప్రకృతి పరమైన కోరికలు తీర్చే గ్రహం శుక్రుడు అయితే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేది గురుగ్రహం. 

రెండింటి సమ్మేళనమే దత్త ప్రభువు ఉన్న ఔదుంబర వృక్షం. 

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణార వింద మస్తు

Lord Indra got upset with Farmers

 Once, Lord Indra got upset with Farmers, he announced there will be no rain for 12 years & you won’t be able to produce crops.


Farmers begged for clemency from Lord Indra , who then said , Rain will be possible only if Lord Shiva plays his Damru. But he secretly requested Lord Shiva not to agree to these Farmers & when Farmers reached Lord Shiva he repeated the same thing that he will play Damru after 12 years.


Disappointed Farmers decided to wait till 12 years.


But one Farmer regularly was digging, treating & putting manure in the soil & sowing the seeds even with no crop emerging.


Other Farmers were making fun of that Farmer . After 3 years all Farmers asked that Farmer why are you wasting your time n energy when you know that rains will not come before 12 years.


He replied “I know that crop won’t come out but I’m doing it as a matter of “practice”. After 12 years I will forget the process of growing crops and working in the field so I must keep it doing so that I’m fit to produce the crop the moment there is rain after 12 years.”


Hearing his argument Goddess Parvati praised his version before Lord Shiva & said “You may also forget playing the Damru after 12 years!”


The innocent Lord Shiva in his anxiety just tried to play the Damru, to check if he could….and hearing the sound of Damru immediately there was rain and the farmer who was regularly working in the field got his crop emerged immediately while others were disappointed.


It is the practice which keeps on making you perfect.


We become even diseased or old just because we don’t practice.


Practice is the essence of quality survival.


So, let lockdown lift after 2 weeks, 2 months or 2 years. Whatever trade or profession we are in, keep sharpening our skills, practice with what we have, upgrade our knowledge.


Don’t wait for rain , that is the lock down to be lifted and then start something… focus on our skills today, upskill your self so that you are ready to meet the challenges .

🌹 మూకపంచశతి🌹

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏




🌹 ఆర్యాశతకము🌹


🌹15.

శ్లోకం


అఙ్కితశఙ్కరదేహాం


అఙ్కురితోరజకఙ్కణాశ్లేషైః౹


అధికాఞ్చినిత్యతరుణీం


అద్రాక్షంకాఞ్చిదద్భుతాం బాలామ్౹౹


🌺భావం:


కామాక్షీ దేవి గాఢ ఆలింగనమువలన ఆ నిత్యతరుణి స్తనములయొక్క ,కంకణములయొక్క చిహ్నములతో ఉన్న శంకరుని దేహముతో కూడియున్న బాలాంబికను కాంచీపట్టణమందలి ఒకానొక అద్భుత ముగా చూచుచున్నాను.



🌼కాంచీనగరమున కామాక్షీదేవి పరమశివునికై తపమాచరించెను.మామిడి చెట్టు మూలమున సైకతలింగమును (ఇసుకతో లింగము)ప్రతిష్ఠించి ఆరాధించుచుండగా

ఆమెను పరీక్షించుటకై నది ఉవ్వెత్తున ఆదిశగా ప్రవహించసాగెను.ఆ నీటివడికి అడ్డుగా ఉండి ,పార్వతీ దేవి సైకతలింగమును కాపాడుకొనుటకును కౌగలించుకొనెనట.అంత లింగముపై ఆ చిహ్నములు ఏర్పడెనట .నేటికీ వాటిని ఏకామ్రేశ్వరలింగము పై చూడవచ్చును. అట్టి శంకరుని తో గూడిన ఆనిత్యయౌవ్వన అయిన కామాక్షీ దేవిని కాంచీనగరమందలి ఒకానొక అద్భుత ముగా కాంచుచున్నాను.🙏

             

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 

పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

: దసరాల్లో అమ్మవారిని పూజించిన పూలను ఏంఊచేయాలి?


తొమ్మిది రోజులు ముందురోజు పూజించిన పుష్పాలను మరునాడు తొలగించి వేయాలి. తీసివేసిన తరువాత ఆ పువ్వులు ను దోసిలి లో ఉంచుకొని వాసన చూసి శిరస్సు పై దాల్చి ఓం శక్తయే నమహ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి. వాటిని నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం ను ప్రవహించే నీటిలో వదిలి వేయాలి. సమీపంలో ప్రవహించే నీరు లేకపోతే ఎవరూ తొక్కనిచోట, చెట్లు మొదట్లో పువ్వులు ను వేయాలి.

[: నవరాత్రి పూజలను స్త్రీ లు చేయవచ్చా?

స్త్రీ లకు విధినియమాల విషయం లో అనేక సడలింపులు ఉన్నాయి. భర్త చేసే ప్రతి పుణ్య కార్యక్రమంలో భార్య కు వాటా దక్కుతుందని ధర్మశాస్త్రం. ఇంటి యజమాని చేసే దైవ విధులతోపాటు ప్రతి కార్యంలోనూ ఆమె ఎంతగానో సహకరిస్తుంది. మహిళలు ప్రత్యేకంగా భారీ కార్యక్రమములు చేపట్టిన లేకపోయినా పర్వాలేదు. వారికి కేటాయించిన వ్రతాలు చేస్తే చాలు. వారికి నవరాత్రి దీక్షలు వంటివి లేవు. వ్యక్తిగత అభివృద్ధి ని ఆశించేవారు ఒంటరిగా కూడా చేసుకోవచ్చును.

: దేవీ విగ్రహం దేనితో తయారు చేసుకోవాలి?

భగవంతుని మనం ఏ రూపంలో నైనా అర్చించుకోవచ్చును. అయితే అమ్మవారిని ఎనిమిది విధాలుగా తయారు చేసుకోవచ్చని దేవీ భాగవతము స్పష్టం చేస్తోంది. శిలారూపంలో చెక్కతో, గంథంతో, బంగారు వెండి వంటి లోహంతో చిత్రపటాలరూపంలో ఇసుక తో మట్టి తో అమ్మవారి అర్చామూర్తులను, తయారుచేసుకోవచ్చును. దసరా నవరాత్రులు లో అమ్మ వారిని కళశరూపంలో ఆరాధించడం ఒక సాంప్రదాయం. అలాగే, ప్రకృతి రూపం లో ఉండే అమ్మవారిని బతుకమ్మ పేరిట దసరా రోజుల్లో నే ఆరాధిస్తారు.

అందరూ తప్పక ఆచరించవలసిన వ్రతం

 


తప్పులెన్ను వారు తండోపతండంబు  

లుర్వి జనులకెల్ల నుండు తప్పు 

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు 

విశ్వ దాభిరామ వినుర వేమ !



ఈ నాలుగు చిన్ని చిన్ని వాక్యాలలో - ఎంత అర్థం వుందో - చూడండి.


తప్పులెన్నువారు తండోపతండంబులు - నిజమే కదా...ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే. విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే తప్పు - కనీసం మనం చెయ్యకుండా వున్నామా? ..అదీలేదు.


 ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు - తప్పులెన్నువారు తండోపతండంబులు. నిజమే కదా!


     "ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"


తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.

దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు. 


పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ జీవిత సూత్రాలు.


 మరి మూడో వాక్యం చూద్దాం.. " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "


యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.



ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.


సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .


మారితే వారు బాగుపడ్డారు. మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది? మనం ఎవరు చెబితే వింటాం?


 "తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.


"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.   


మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది.


 ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో ప్రణాళిక వేసుకొవాలి. దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.


మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం. నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తాము.


. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.


పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.


సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?


మాట్లాడొచ్చు . మొదట - వారి తప్పులు, మనలో లేకుండా చూసుకోవాలి. తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.


సంస్కృతంలో ఒక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".


సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.


మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.  


ఈ రోజు నుండీ - ఒక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని ఒక వ్రతం పెట్టుకోండి. 


మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది .


 మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం నిండుతుంది .






🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

మొగాళ్ళ దినం ..

 *ఈరోజు మొగాళ్ళ దినం ....!*


అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న...... మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. 


ఎందుకో... 

మచ్చుకు కొన్ని ....


చెడ్డి చొక్కాతో బాల్యం అంతా గడిపెయ్యాలి. కొన్ని సార్లు చెడ్డి కూడా వెయ్యరు


చదువు చదివితే సరిపోదు మొగాడివి రాంక్ రావాలి అని అరచి గోల చేస్తారు. 


భయమేసినా భయపడి చావకూడదు.

మగాడు భయపడేది ఏంటి అంటారు.


ఎలకవచ్చినా...

పాము వచ్చినా బల్లి చచ్చినా..

మనమే తియ్యాలి...

వారు తియ్యరు అరవడం మాత్రమె చేస్తారు. 


ఉద్యోగాలు చెయ్యల్సింది మనం....

కోయిలమ్మ.... కుంకుమరేఖ...రచ్చబండలు లాంటి సీరియల్స్ చూసేది వాళ్ళు.


నోములు వ్రతాలు వాళ్ళకి...

సరుకులు,సామాన్లు తేవాల్సింది మనం.


పెళ్లి చేసుకుంటే..

వాళ్ళని బుట్టలో తెస్తారు

మనల్ని బుట్టలో వేసుకుంటారు


పట్టు చీరలు వుంటాయి కాని పట్టు పాంటులు వుండవు, ఉన్నా పెట్టరు.


మనం అమ్మాయిలని చూసినా...

వాళ్ళు మనన్ని చూసినా...

పళ్ళురాల గోట్టేది మనన్నే...


ఫలానా ఆవిడ మొగుడు అని చెప్తారు కాని...

ఫలానా వాడి పెళ్ళాం అని ఎందుకు అన రో...


కాఫీ ఇస్తే తాగాలి.లేకపోతే...

మంచినీళ్లని కాఫీలా భావించాలి...


నోరు ఇచ్చాడు..

కాని వాడకూడదు.


ఇలాంటి బాధల మధ్య కూడా...

ఓ రోజు మనకంటూ ఇచ్చినందుకు తోటి మొగవాళ్ళకి...

నా అభినందనలు..


కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు

మన బాధలు మనమే పడాలి.

మనకు శుభాకాంక్షలు మనమే చెప్పుకుందాం!!

👍👍👍👍👍👍👍

చివరిగా....

అదే ఉమెన్సు డే అయితే

ప్రత్యేక సెలవు .టీవీల్లో ఆడవాళ్ళ కోసం ప్రత్యేక ప్రోగ్రాంలు, పాటలు....


మరి మగవారి కోసం ఒక్క. పాట కూడా లేదు


ఇక వాట్సాపుల్లో అయితే ఉదయం నుండి పడుకునే వరకూ ఒకటే మెసేజులు...

వాటిని డిలీట్ చేయాలంటే ఓ పూట పడుతుంది


మన గ్రూపులో ఉన్న ఆడలేడీసులో ఇప్పటి వరకూ మగవారికి ఎవరూ శుభాకాంక్షలు చెప్పినవారు లేరు!


ఏదైనా మగవారిదే విశాల హృదయం అని నిరూపించారు


*ఈ జన్మకింతే....*

*హ్యాపీ మగవాళ్ళ డే.......*

 ☹️☹️☹️☹️☹️🤭🤣😂🤣😂😬😬😬😩

ధార్మికగీత - 17

 

                                        

         *శ్లో:- కాకః కృష్ణ: పికః కృష్ణ: ౹*

                 *కో భేదః పిక కాకయో: ౹*

                 *వసంత కాలే ప్రాప్తే తు ౹*

                 *కాకః కాకః పికః పికః ౹౹*  

                                         


" కా " యని గోల చే సెడియు 

          కాకము నుండును కాల వర్ణమున్

" కూ "యని పాట పాడెడియు 

          కోయిల వర్ణ.ము కాలమే సుమా !

కోయిల కాక మందునను 

          కూడిన బేధము దేలునెప్పుడున్ ?

హాయి నొసంగు యామని సు 

           భాగమమందున కంఠపోలికన్

కోయిల కోయిలే యగును 

            కూయని కాకిక కాకియే యగున్ 


గోపాలుని మధుసూదన రావు

భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి

 కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి


మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది


మియపూర్ న్యూ సైబర్ హిల్స్ లో కుటుంవంతో నివాసం ఉంటున్న రామచంద్ర రెడ్డి....


బెడ్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని రామచంద్ర రెడ్డి ఆత్మహత్య....


తన వల్ల ఇంట్లో కుటింబికులకు కారోనా సోకకూడదనే ఉద్దేశంతో తను ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం....


రామచంద్ర రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియపూర్ పోలీసులు....

ఆయుర్వేదం లో జ్యోతిష్యం యొక్క పాత్ర

 -


 ఆయుర్వేదంలో జ్యోతిషం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆయుర్వేదం అంటే కేవలం చెట్ల మందులు , పసర్లు అని మాత్రమే అనుకుంటారు . జ్యోతిష్యం కూడా ఒక భాగమే . అందుకే "వైద్యజ్యోతీష్యం " అనే పేరు కూడా ఉంది. నేను ఔషధాలు తయారీకి అవసరం అయిన మొక్కల్ని సేకరించేప్పుడు కాని , ఔషధం తయారుచేసేప్పుడు కాని ఈ జ్యోతిష్య సంబంధ నియమాలు తప్పకుండా ఆచరిస్తాను. ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో జ్యోతీష్యం ప్రధానపాత్ర ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను.


 * అమృతగడియాల యందు క్రొత్తగా చేయు మందులు అనగా లేహ్యములు, చూర్ణములు , రోగిచే సేవించబడు ఔషధం అమృతతుల్యమై వాతపిత్త శ్లేష్మజ్వరాది రోగములను హరింపచేసి ఆరోగ్యంబును అవయవాలకు బలమును ఆయుర్వృద్దిని చేయును . అమృతఘడియల్లోనే నూతన ఔషధాలను తయారుచేయవలెను అని శ్రీ ధన్వంతరి తెలియచేశారు. మందు ఇచ్చినప్పుడు కూడా అమృత ఘటికలలోనే తయారుచేయవలెను.


 * "ఔషదారంభే గురుశ్రేష్ఠహా " అనే ఆర్యోక్తి ప్రకారం గురువారం నూతనౌషధములను అమృతగడియాలలో సేవించిన అది అమృతం వలే తప్పక పనిచేయును .


 * నవౌషధం బుధసోమాయోహ " అనగా బుధసోమవారాలు అమృతగడియాలలోనైనా మందు సేవించరాదు . అటుల సేవించిన గుణం ఇవ్వదు.


 * అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి ఈ నక్షత్రములు, అదివారం, సోమవారం, బుధవారం, గురువారం , శుక్రవారం లు వీటితో చేరిన శుభతిథుల యందు మిధున, కన్యా, ధనుస్సు , మీన లగ్నముల యందు ఏ గ్రహములు లేకుండా ఉండటం , ఆయుష్మన్నమ యోగము నందు మందులు సేవించుటకు , మందులు చేయుటకు యోగ్యముగా ఉండును. మంగళవారం, శుక్రవారం విరేచనములకు మందు తీసుకుంటా మంచిది .


 * అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణము, ధనిష్ట , శతబిషం, రేవతి ఈ నక్షత్రములు మరియు అదివారం , బుదవారం, శనివారం , తదియ , పంచమి, సప్తమి తిధుల యందు తైలములు సేవించుటకు చాలా మంచి సమయం.


 * అశ్వని, కృత్తికా, ఆరుద్ర, ఆశ్లేష, చిత్త, విశాఖ, జేష్ఠ, మూల , శతబిషం ఈ నక్షత్రాలతో కూడిన అదివారం, మంగళవారం యందు క్రూర లగ్నములు అగు మేష,వృశ్చిక , మకర, కుంభ లగ్నముల యందు శరీరమునకు రక్షా రేకులు అనగా తాయత్తులు కట్టించుకొనుట మంచిది . ఈ ముహుర్తాలు శస్త్ర చికిత్స చేయుటకు పాటించవలెను .


 * అశ్వని, మృగశిర, పునర్వసు , పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతబిషం , రేవతి నక్షత్రములు, అదివారం, మంగళవారం, గురువారములతో కలిసినపుడు పాదరసం , రసకర్పూరాది రసములు కలిసిన మందులు సేవించవలెను .


 * పంచాంగ శుద్ది నందు క్షేమతార గురువు మరియు చంద్రబలం కలిగి ఉండినప్పుడు రోగము శీఘ్రముగా నశించును.


        ఇంకా స్వప్నములను బట్టి ఏ వ్యాధి కలుగునో , మరణానికి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో కూడా వివరణ ఉంది .వాటిని తరువాతి పోస్టులలో వివరిస్తాను.


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

**సంపూర్ణ తిరుమల చరిత్ర** - 7

 **దశిక రాము**




శ్రీమహావిష్ణువు 12 అంశలతో ఈ జగత్తు పరిపాలించబడుతుంది అని వైష్ణవ భక్తుల విశ్వాసం. అందుకే మహా విష్ణువు యొక్క 12 అంశలూ 12 మంది ఆళ్వారులుగా జన్మించి ఈ లోకాన్ని కాపాడుతుంటారని అభిప్రాయం. భక్తసులభుడైన శ్రీహరి తన ఆయుధాలను ఈ జగత్తును రక్షించేందుకు ఆళ్వారుల రూపంలో అవతరింపచేశాడని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది.


మధురకవి ఆళ్వారులు


వీరు గరుడుని అవతారంగా వైష్ణవులు కొలుస్తారు. ఆళ్వారుల్లో చివరివారు, తమ అమృత గానంతో శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేసినవారు. ఈ మధురకవి ఆళ్వారులు బ్రాహ్మణ వంశంలో జన్మించారు. వీరు నమ్మాళ్వారుల సమకాలికులు. నమ్మాళ్వారులకంటే పెద్దవారు. వీరు సంస్కృత, తమిళ భాషల్లో గొప్ప పండితులు. వీరి అసలు పేరు భట్టనాథులు. కానీ వీరు తమ మృదుమధుర గానంతో శ్రీమహావిష్ణువు గానం చేసి శ్రోతలను ఆనందింప చేశారు కనుక వీరిని మధురకవి యాళ్వారులు అని పిలిచేవారు. ఆ పేరే సార్ధక నామధేయం అయింది. వీరు తమ భక్తి తత్వాన్వేషణలో అనేక పుణ్యక్షేత్ర దర్శనార్థం దక్షిణాపథం నుండి తూర్పుదిశగా తీర్థయాత్రలకు బయల్దేరారు. అనేక ప్రాంతాలు, క్షేత్రాలు దర్శించిన ఈ మధురకవి ఆళ్వారు ప్రయాగ క్షేత్రం చేరుకున్నారు. అక్కడ ప్రయాగలో తమ భక్తిగానంతో భక్తులను పరవశం చేస్తుండగా అక్కడికి చేరిన కొంతమంది ఈ ఆళ్వారుల పుట్టుపూర్వోత్తరాల గురించి అడిగారు. వారికి తాను దక్షిణాపథంనుండి ఉత్తర ప్రాంతంలోని పుణ్య క్షేత్రాలు దర్శించి వచ్చానని, ఇక్కడ ఈ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక భక్తి తత్వాన్ని గురించి తనకు తెలీని విషయాలు తెలుసుకోవాలని ఉందని ఇక్కడి మహానుభావులను దర్శించ వచ్చానని తెలియజేశాడు.


ఇంతలో అక్కడ చేరిన వారిలో కొందరు ఆశ్చర్యంతో ''స్వామీ! దక్షిణాపథంలో లేని పుణ్యక్షేత్రాలు, తత్వవేత్తలు, పండితులు, జ్ఞానులు ఇక్కడ ఉన్నారా?” అని అడిగారు. ''తమరు నమ్మాళ్వారులు నివసించే ప్రాంతం నుండే కదా వచ్చారు. అక్కడ ఆళ్వారు తిరునగరిని దర్శించలేదా? వారి గురించి తమకు తెలీదా?” అని అడిగారు. తిరునగరిలో జన్మించి పదహారు సంవత్సరాలు తింత్రిణీ వృక్షం కింద తపస్సు చేసిన నమ్మాళ్వారుల గురించి వారి భక్తి తత్వాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేశారు. వారి ఈ సమాచారంతో మధురకవి ఆళ్వారులకు నమ్మాళ్వారులను చూడాలని, కలుసుకోవాలని ఉత్సాహపడ్డాడు.


నమ్మాళ్వారుల భక్తి తత్వాన్ని, మహిమలను విన్న మధురకవి ఆళ్వారుల దృష్టి అంతా నమ్మాళ్వారుల మీదికి మళ్ళింది. కానీ తాను ఉత్తరదేశ యాత్రను మధ్యలో ముగించడానికి మనస్కరించలేదు. అలాగని నమ్మాళ్వారుల గురించిన ధ్యాస వదల్లేదు. ఉత్తరదేశ పుణ్యక్షేత్ర యాత్రలు యాంత్రికంగా చేస్తూనే ఉన్నా మనసులో నమ్మాళ్వారుల రూపాన్ని చిత్రించుకుని ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉండసాగాడు. ఎప్పుడెప్పుడు ఈ ఉత్తరదేశ తీర్థయాత్రలు ముగించుకుని తిరునగరి చేరి నమ్మాళ్వారులను కలుసుకుంటానా అనే ధ్యాస ఎక్కువైంది. నమ్మాళ్వారులను దక్షిణదేశంలో వెలసిన ఒక ఆధ్యాత్మిక తేజస్సుగా ఊహించుకుని వారి రూపాన్ని మనసులో చిత్రించుకుని పదేపదే వారి ధ్యాసలోనే కాలం గడపసాగాడు.


కానీ ఒకనాడు విచిత్రం జరిగింది. నమ్మాళ్వారులు కూడా తన శిష్య బృందంతో ఉత్తరదేశ యాత్ర చేస్తూ అక్కడి ఆలయాలను దర్శించసాగాడు. మధురకవి కూడా అదే ఆలయాన్ని చూడవచ్చాడు. ఊహారూపంలో దక్షిణ ప్రాంతంలో నుండి వెలుగొందే దివ్య నక్షత్రంగా ఊహించుకున్న నమ్మాళ్వారుల దివ్యమంగళరూపాన్ని అక్కడ మధురకవి దర్శించడం జరిగింది. నమ్మాళ్వారుల దివ్యతేజోరోపాన్ని వారు ధరించిన వకుళమాలను చూసిన మధురకవి వారిని నమ్మాళ్వారులుగా గుర్తించి పాదాభివందనం చేశాడు. క్షణమాత్రం జరిగిన ఈ సన్నివేశంలో నమ్మాళ్వారుల అంతరంగాన్ని గ్రహించిన మధురకవి ఆ మధురానుభూతిని మదినిండా నింపుకుని ఉత్తరదేశయాత్రను ముగించుకుని తిరిగి నమ్మాళ్వారులను కలుసుకునేందుకు ఆళ్వారు తిరునగరి చేరుకున్నారు.


ఈవిధంగా మధురకవి ఆళ్వారులు తమ యాత్రలో నిరంతరం నమ్మాళ్వారుల ధ్యాసతోనే ముగించుకుని తన తిరుగు ప్రయాణంలో వకుళ భూషణుడైన నమ్మాళ్వారుల నివాసమైన యాదినాథస్వామి ఆలయానికి విచ్చేసి అక్కడ ద్వాదశోర్ధ్వపుండ్రములతో కనులపండుగ్గా ప్రకాశిస్తోన్న శఠగోప యోగీంద్రుని చూసి సాష్టాంగ దండప్రణామం చేసి ఆనందంతో కరతాళధ్వనులు చేయసాగాడు. అప్పుడు ఆ శఠగోప యోగి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ మూసుకున్నాడు. అంత మధురకవి ఆయనను ''ప్రకృతి కడుపున పుట్టిన జీవుడు ఏమి తిని, ఎలా బ్రతుకుతాడు?” అని ప్రశ్నించాడు. డానికి నమ్మాళ్వారు ''అదే తిని, అలాగే బ్రతుకుతాడు'' అని సమాధానం చెప్పాడు. అందుకు మధురకవి తన సమస్యకు భావపూర్ణమైన జవాబు ఇచ్చినవాడు సామాన్య మానవుడు కాడని, గొప్ప తత్వవేత్త అని తలచి ఆ యోగిపుంగవుని అత్యంత భక్తిశ్రద్ధలతో శరణు కోరి, తనను శిష్యునిగా చేర్చుకోమని, కటాక్షించమని వేడుకున్నాడు.


అప్పుడు నమ్మాళ్వారులు, మధురకవిని ఆశీర్వదించి తన శిష్యునిగా చేసుకుని ముక్తినొసగే సులభోపాయాలను ఉపదేశించాడు. మధురకవి క్రమక్రమంగా పరాభక్తి, పరజ్ఞానం అలవరచుకున్నాడు. ఆయన తన శ్రావ్యమైన స్వరంతో మధురగానం చేస్తూ నమ్మాళ్వారుల భగవత్తత్వాన్ని ప్రబంధరూపంలో రచించి ప్రచారం చేశాడు. ఇలా మధురకవి నమ్మాళ్వారుల సేవలో చాలాకాలం గడిపాడు. అందుకే గురుశిష్యుల అవినాభావ సంబంధంగా నమ్మాళ్వారులని, మధురకవిని పోలుస్తుంటారు పండితులు.


34 సంవత్సరాలు జీవించిన నమ్మాళ్వారులవారు తన అనంత భక్తి వాంగ్మయాన్ని శిష్యుడు మధురకవికి పంచి అశేష భక్తజన వాహిని ముందు శ్రీవారి సాయుజ్యాన్ని చేరుకున్నారు. తర్వాత వారి జ్ఞాపకార్ధం మధురకవి అదే ఆలయ ప్రాంగణంలో నమ్మాళ్వారుల ఆలయాన్ని, ప్రహరీ గోడను నిర్మించి, ఆలయ నిర్వహణ యావత్తు తానే నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో కొలవసాగాడు. వారు గానంచేసిన వేదాలను ప్రబంధాలుగా రచించి వాటిని ఎంతో ప్రాచుర్యంలోకి తెచ్చి తన మధుర స్వరంతో గానం చేయసాగాడు.


ఈవిధంగా మధురకవి తన జీవితం అంతా తింత్రిణీ వృక్షం వద్దనే గడుపుతూ భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తూ నమ్మాళ్వారులు ఎంచుకున్న మార్గాన్నే అనుసరించాడు. నమ్మాళ్వారుల ద్రవిడ వేదసారాన్ని ప్రబంధ రూపంలో గానం చేస్తూ యావద్దేశంలో భక్తి సాహిత్యాన్ని ప్రచారం చేశారు. వీరు నమ్మాళ్వారుల మీద అనేక పాశురాలు, పాటలు రచించి శ్రావ్యగానం చేసి ఆనందించేవారు. ఆ పాటలు అక్కడి ప్రజలను, భక్తులను ఆనంద పరవశులను చేసేవి.


వీరి ఆలయాన్ని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో చూడవచ్చు.


వైష్ణవ భక్తి తత్వాన్ని అనంత భక్తి పారవశ్యంతో రచించి, గానంచేసి ఈ భారతావనిని తరింపజేసిన ఆళ్వారుల భక్తి సారాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకోవడం సామాన్యులకు అంత తేలిక కాదు. వారి అనంత భక్తి తత్వాన్ని అర్ధం చేసుకోవడం అంటే ఆ అనంత పద్మనాభుని అర్ధం చేసుకోవడమే. వారి భక్తి పారవశ్యం హైందవ భక్తి ప్రపంచానికే ఆదర్శం. ఆ పన్నిద్దరు ఆళ్వారుల గురించి సూక్ష్మంగా తెలియజేసే ప్రయత్నంలో వీరి సమగ్ర లీలా విశేషాలను పొందుపరచలేకపోతున్నాం. కానీ వైష్ణవ భక్తి ప్రపంచంలో అగ్రగాములైన వ్వ్ ఆళ్వారుల గురించి వారి చరిత్ర గురించి కనీస అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వారి ప్రస్తావన చేయాలని భావించడం జరిగింది. అందుకే వచ్చే వారం నుండి ఆళ్వారుల్లో చివరివారైన నమ్మాళ్వారుల చరిత్ర, మధురకవి ఆళ్వారుల చరిత్ర ఇందులోని 6, 7 భాగాల్లో ప్రస్తావించినందువల్ల మళ్ళీ వివరించకుండా మిగిలిన ఆళ్వారుల చరిత్ర అందించ సంకల్పించాం. కనుక వచ్చే వారం నుండి మిగిలిన ఆళ్వారుల చరిత్రను అందించే మహదవకాశం కలిగించిన వేంకట ప్రభువుకు సదా కృతజ్ఞతలు.


వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 


దయచేసి షేర్ చేయండి 


స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ... 


కనుక మనం ఆలస్యం చేయక 


అందరం " గోవిందా గోవిందా " అని పలికి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...


గోవిందా గోవిందా 

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


🔱 **అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ.** 🔱


   🌹 **లోకాస్సమస్తా స్సుఖినోభవంతు** 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను** 

**పాటిద్దాం**

**మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము

 *దశిక రాము**


💮 #-21💮


     💠శ్లోకం 15💠

లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|

చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||


135. లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.

136. సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.

137. ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.

138. కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.

139. చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.

140. చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.

141. చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).

142. చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి

29. వ్యంగ కాడు, వాని యంగాలె వేదాలు,


వేద సారమంత విస్తృతముగ


ఎరుక గలిగి యెరుక బరచు కవి యతడె


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : అవ్యంగః ... అ + వి + అంగ ... వి అంగ కానివాడు అనగా ఏవిధమైన లోపాలు లేనివాడు, వేదాంగః ... వేదాలే అంగాలైనవాడు, వేదవిత్ .... వేదాల లోతుపాతులను క్షుణ్ణంగా తెలిసిన వాడు, కవి ... సర్వ ద్రష్ట.


భావము : ఏ విధమైన లోపాలు లేని మనోహరమైన రూపం గలవాడు, వేదాలే తన అంగాలు కాగా, వాటి లోతుపాతులు క్షుణ్ణంగా ఎరిగినవాడు, సర్వమూ తెలిసిన మునీశ్వరుడు(" నాన్ ఋషి కురుతే కావ్యం " ... అనే పెద్దల వాక్కును బట్టి కావ్యం వ్రాయగలవాడు అనగా కవి ఐనవాడు ఋషి తుల్యుడే ఇక్కడ ఆంగ్ల పాఠంలో కూడా కవిః అంటే మునీశ్వర అనే అర్థం కనబడుతూండటం గమనార్హం కదా!) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. }



శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః


చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః !!15!!


(నామాలు 133...140)


30. అధిపతె జగమునకు, అరసు నాకమునకు,


అరయ గల్పములకు నతడె బతియు,


కార్య కారణములు కనగ యాతనిలోనె


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : లోకాధ్యక్ష ... లోకాలకు అధిపతి, సురాధ్యక్ష ... స్వర్గాధిపతి, ధర్మాధ్యక్ష ... ధర్మాలకు అదినాథుడు, కృతా కృతః ... కార్య కారణ రూపుడు, వ్యక్తా వ్యక్త స్వరూపుడు.


భావము : లోకాలకు అధిపతి, స్వర్గానికి (నాకమునకు) అధినాథుడు(అరసు అంటే రాజు, ప్రభువు అనే అర్థాలూ ఉన్నాయి కదా), ధర్మాలకు( కల్పము అంటే న్యాయము, ధర్మము అనే అర్థాలూ ఉన్నాయి కదా) అధిపతి (పతి అంటే కూడా ప్రభువు అనే అర్థం ఉందికదా), వ్యక్తా వ్యక్త స్వరూపుడు(కృతము అంటే చేసినది, అకృతము అంటే చేయనిది...చేసేదీ చేయించేదీ వాడే . కనుక చేయించేటపుడు తాను అకృత రూపుడే కదా) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.}


31. చనుగ జూడ చతురాత్మయై తానె


నాల్గు వ్యూహములతొ నయముగాను


నాల్గు కోరలుండు, నాలుగే భుజములు


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : .చతురాత్మా ... విభూతి చతుష్టయం, చతుర్ వ్యూహ ... నాలుగు వ్యూహాలు, చతుర్ దంష్ట్ర ... నాలుగు కోరలు, చతుర్భుజః ... నాలుగు భుజాలు.


భావము : పరమాత్ముడైన శ్రీహరి రజోగుణ స్వరూపమై సృష్టి కార్యక్రమంలో పరబ్రహ్మ, ప్రజాపతులు (కశ్యపాదులు), కాలము, సృష్టి, స్థితిలో విష్ణువు, మనువులు, కాలము, పాలన, తమోగుణ ప్రధానమైన లయములో రుద్రుడు, అగ్ని, కాలము, లయము...( దీనినే విభూతి చతుష్టయం అంటున్నారు)లై ప్రసిద్ధికెక్కుతున్నాడు(చను అంటే ప్రసిద్ధికెక్కు అనే అర్థమూ ఉంది కదా). ఇక నాలుగు వ్యూహాలంటే వాసుదేవ. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే వ్యూహాలు... (బహుశా ఆ అవతారాలే వ్యూహాత్మకం కావచ్చునేమో), నాలుగు కోరలంటే ... ధర్మార్థ కామ మోక్షములు, నాలుగు వేదాలు, చతురాత్మలూ, వ్యూహాలు... (వీటితోనే సందర్ఙానుసారం రక్కసి గుణాలను అణచివేస్తుంటాడా శ్రీహరి,) నాలుగు భుజాలు ... శంఖు, చక్ర, గదా, ధనువులు వీటిని ధరించడానికీ, జగత్తులోని తన భక్తులను భవసాగరం నుంచి దాటించడానికి తగినంతగా విశాలమూ, దృఢతరమూ అయిన భుజాలు... ఇన్ని విశిష్టతలున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



ఓం నమో నారాయణాయ

🕉️🙏🕉️🙏🕉️🙏

🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

శ్రీవేంకటేశ

 **దశిక రాము**


*శ్రీవేంకటేశ మతిసుందరమోహనాంగం*


*శ్రీ భూమికాంత మరవింద దళాయతాక్షం*


*ప్రాణప్రియంప్రవిమలసత్కరుణాంబురాశిం*


*బ్రహ్మేశ వంద్యమనిశం వరదం భజామి*!!


*వేంకటేశో వాసుదేవో వారిజాసన వందితః*


*స్వామి పుష్కరిణీవాసః శంఖ చక్రగదాధరః*


*పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః*


*విశ్వాత్మా విశ్వలోకేవిజయో వేంకటేశ్వరః*!!



        *శుభోదయం* 

*బకాసుర వధ*



శాలిహోత్రుని వద్ద పాండవులు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు.తరువాత వారు ఏకచక్రపురానికి బ్రాహ్మణ వేషాలలో బయలుదేరారు. పాండవులు, కుంతీదేవి జింక చర్మాలు ధరించి, నార చీరలతో, వేదపఠనం చేస్తూ ఏకచక్రపురం వచ్చారు.

ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తమ నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రతీరోజు మౌనంగా అందరి ఇల్లకూ వెళ్లి బిక్ష స్వీకరించి, తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ బిక్షను రెండు భాగాలు చేసి, అందులో ఒక భాగం భీమునికి పెట్టి, మిగిలింది తను, మిగిలిన నలుగురు కొడుకులు తింటూ ఉండేవాళ్ళు.సత్ప్రవర్తనులు, సహృదయులు అయిన వారిని చూసి ఆ అగ్రహారంలో వాళ్ళు అందరూ చాలా ఆనందపడేవాళ్ళు.

ఒకరోజు భీముడు, కుంతీ ఇంట్లో ఉన్నారు. మిగిలిన వారు బిక్షాటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంటిలో నుండి రోదన ధ్వనులు వినపడ్డాయి. అవి విని కుంతీదేవి భీముని పిలిచి “నాయనా భీమసేనా! ఈ ఇంటి వారికీ ఏదో కష్టం కలిగినట్టుంది. వీరు మనకు ఉపకారం చేసారు. వవాళ్ళ ఉపకారాన్ని గుర్తించడం మనకు పుణ్యం, కాని దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఎక్కువ పుణ్యం. కాబట్టి వాళ్లకు తగిన ప్రత్యుపకారం చెయ్యడానికి ఆలోచించు” అని చెప్పింది.

“అమ్మా!నీ ఆజ్ఞ అవశ్యం నెరవేరుస్తాను. తప్పకుండా వారికి ప్రత్యుపకారం చేస్తాను. నీవు వారి శోక కారణం కనుక్కొని రా అమ్మా” అన్నాడు భీముడు. సరే అని కుంతి వారి వద్దకు వెళ్ళింది. రోదిస్తున్న ఆ ఇంటి యజమానిని వారి దుఃఖానికి కారణం అడిగింది.

“అమ్మా జనన మరణాలు, సంయోగ వియోగాలు ప్రకృతి సిద్ధమైనవి. కాని వేదోక్తంగా వివాహమాడిన భార్యను రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపవలిసిన కూతురిని రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను. నాకు, నా పితరులకు పిందోదకాలు ఇవ్వవలిసిన కుమారుడిని రాక్షసునికి ఆహారంగా వెళతాను” అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు.

దానికి ఆయన భార్య సమ్మతించలేదు. “నాధా, మిమ్మల్ని వివాహమదినందుకు మీకు సంతాన ప్రాప్తి కలిగించాను. నా బాధ్యత తీరిపోయింది. భర్త కంటే ముందు మరణించిపుణ్యలోకాలకు వెళతాను. పైగా భర్తలేని స్త్రీలకు అవమానాలు ఎక్కువ. ప్రతీవాడు కోరతాడు, పైగా భార్య మరణిస్తే భర్త మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త మరణిస్తే, భార్య వేరే వివాహం చేసుకోలేదు కదా. కాబట్టి నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళతాను. మీరు వేరే వివాహం చేసుకొని, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి,ప్రయోజకులను చెయ్యండి” అని చెప్పింది ఆ ఇల్లాలు.

అప్పుడు కూతురు ముందుకు వచ్చి, “అమ్మా, నాకు వివాహం చేసి మీకు మనుమలు కలిగే కంటే, మీరు జీవించి ఉంటే మీకు ఇంకా ఎక్కువ మంది సంతానం కలుగుతారు.అందుకని నేనే రాక్షసునికి ఆహారంగా వెళతాను” అని చెప్పింది.

ఇంతలో చిన్నవాడైన కుమారుడు,ధైర్యంగా ఒక చిన్న కర్ర తీసుకొని, “తండ్రీ నేను వెళ్లి ఆ రాక్షసుడిని చంపుతాను” అని వచ్చీ రాని మాటలతో ఓదార్చాడు.

ఇదేమి కుంతికి అర్థం కాలేదు. “అమ్మా రాక్షసుడు ఎవరు? మీరు వాడికి ఆహరం కావడం ఏమిటి? వివరంగా చెప్పండి.

దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. “అమ్మా, ఇక్కడికి ఆమడ దూరాన, యమునా నదీ తీరాన బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు గ్రామాల మీద పది అందరిని భక్షిస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు అందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతీరోజూ ఇంటికి ఒక మనిషి, రెండు దున్న పోతులూ, బండెడు ఆహరం వాడికి పంపాలి. ఈ దేసాన్నేలే రాజు కూడా వాడిని ఎదిరించే శక్తి లేనందున, ఆయన దీనిని గురించి ఆలోచించలేదు.”

అప్పుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో, “అయ్యా, మీరు దుఃఖించ వలదు.ఈ ఆపద తొలగే ఉపాయం నాకు తెలుసు. మీకు ఒక్కడే కొడుకు, నాకు ఐదుగురు కొడుకులు. వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపుతాను” అని చెప్పింది.

దానికి ఆ బ్రాహ్మణుడు “అమ్మా, వద్దమ్మా మీరు మాకు అతిథులు. మిమ్మల్ని ఆ కోరిక కోరడం మహాపాపం. పైగా బ్రాహ్మణ హత్య ఘోర పాపము” అని అన్నాడు.

దానికి కుంతీదేవి నవ్వి “అయ్యా! మీరు ఏమి ఆలోచించకండి, నా కుమారుడు అమిత బలవంతుడు. ఇదివరకు కొంత మంది రాక్షసులను చంపాడు. ఆ బకుడిని చంపి వస్తాడు” అని చెప్పింది.

వెంటనే భీముని పిలిచి జరిగిందంతా భీమునికి చెప్పింది. భీముడు సంతషంగా ఒప్పుకున్నాడు.ఇంతలో ధర్మజుడు, మిగిలిన తమ్ములు వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసాడు. తల్లిని పిలిచి “అమ్మా భీముడు ఎవ్వరితోనో యుద్ధానికి పోతున్నట్టున్నాడు. తనంతట తానే వేలుతున్నడా లేక మీరు వెళ్ళమన్నారా?” అని అడిగాడు.

జరిగిందంతా ధర్మజునికి చెప్పింది కుంతి.

“అమ్మా! అమ్మా! ఇదేమిటమ్మా!పరాయి వాళ్ళ కోసం కన్నకొడుకును బాలి ఇస్తావా అమ్మా. అమ్మా నీకు మతి భ్రమించినట్టుంది. భీమసేనుడు విదిచిపెట్టదగిన వాడా చెప్పమ్మా?” అన్నాడు.

“నాయనా ధర్మరాజా,భీముని బలము తెలియక నేను ఈ పని చెయ్యడం లేదు. ఈ భీమసేనుని శక్తి నీకు తెలియదు. వీడు పుట్టిన పడవ రోజున వీడు నా చెయ్యి జారి ఒక కొండ రాయి మీద పడ్డాడు. ఆ పెద్ద బండ రాయి పొడి పొడి అయింది. వీడు వజ్ర కాయుడు. ఆ రాక్షసుడిని చంపి ఈ అగ్రహారానికి శాస్వతంగా రాక్షస బాధ తీర్చగలడు.

క్షత్రియ ధర్మాన్ని ఇదివరకు వేద వ్యాసుడు చెప్పగా విన్నాను. అది నీకు చెపుతాను విను. ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలను తొలగించడానికి పుట్టిన వాడు. మృత్యుభయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలు పొందుతాడు. సాటి క్షత్రియుడిని రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే, ప్రజల అనురాగాన్ని పొందుతాడు. ఇది క్షత్రియ ధర్మం. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం లభించింది” అని చెప్పింది.

వెంటనే ఆ ఉరి వారందరూ రక రకాలైన పిండి వంటలు, ఆహార పదార్థాలు తయారు చేసారు. ముందుగా భీముడికి తృప్తిగా కడుపునిండా భోజనం పెట్టారు. ఒక బండినిండా ఆహారపదార్థాలు నింపారు. భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటుకు వెళ్ళాడు. యమునా నదీ తీరాన బండి నిలిపాడు. బకాసురుని పిలిచాడు. వాడు ఎంతకూ రాలేదు. వాడు వచ్చేదాకా ఉరికే ఉండటం ఎందుకని, ఆ బండిలో ఆహారపదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా తినేసాడు.

Cont...

బకాసురుడికి ఏమి తోచడంలేదు. ప్రతీరోజూ భయంగా తన వద్దకు వచ్చే నరుడు ఈ రోజు ఎక్కడో ఉండి పిలుస్తున్నాడు ఏమిటి అనుకున్నాడు. ఎంతకూ నరుడు రాకపోతే ఆకలి బాధకు తట్టుకోలేక బండిని వెతుక్కుంటూ వెళ్ళాడు. బండి మీద కూర్చుని ఆహారాన్ని తింటున్న భీముడిని చూసాడు.

తన కోసం తెచ్చిన ఆహారాన్ని నరుడు తినడం చూసి సహించలేకపోయాడు.భీముడిని పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు.భీముడికి చీమ కుట్టినట్లైనా లేదు.బకుడు పక్కనే ఉన్న ఒక చెట్టును పెరికి భీముని మీద వేసాడు. భీముడికి కోపం వచ్చింది. బకాసురుడి మీద కలియ పడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. భీముడు బకాసురుడితో మల్ల యుద్ధం చేసి, చంపేసాడు.

బకాసురుడు పెట్టిన కేకలకు అతని బంధువులు అందరూ అక్కడకు వచ్చారు. “చూడండి, ఈ బకాసురుడు చచ్చాడు.మీరు కూడా ఏకచక్రపుర వాసులకు ఏమన్నా ఆపద తలపెడితే వీదిలాగే చస్తారు” అని చెప్పాడు. చేసేది లేక భీమునికి భయపడి వారందరూ దానికి ఒప్పుకున్నారు. భీముడు బకాసురుని కళేభరాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్రపురం పొలిమేరలలో పడవేసాడు. అది చూసిన ఏకచక్రపుర వాసులందరూ సంతోషించారు. భీముని పరాక్రమాన్ని ఎంతగానో కొనియాడారు.

ఇంటికి వెళ్లి తల్లి కుంతికి, అన్నయ్య ధర్మజునికి, తమ్ములకు జరిగిందంతా చెప్పాడు. ఆ ఉరి వారందరూ “ వీడు సామాన్య బ్రాహ్మణుడు కాదు. మంత్రం సిద్ధి కలవాడు” అంటూ భీముని చూడడానికి అతను ఉన్న ఇంటికి వచ్చారు.