28, జనవరి 2023, శనివారం

రథోత్సవాలు

 మువ్వురు మానవులకు రథోత్సవాలు


దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.


“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.


తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.

దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.


శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.


ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.


అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!

మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.


ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.


“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.

ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.


--- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గంగా పుష్కరాలు

 *గంగా పుష్కరాలు 2023*

                                                                           హిందూ సంప్రదాయంలో మానవుడు నీటిని 

గంగా, 

యమునా, 

గోదావరి, 

కావేరీ 

మొదలైన నదులను స్త్రీశక్తి రూపాలుగా పూజిస్తారు. ఒక్క బ్రహ్మపుత్ర తప్ప మిగిలిన నదులన్నీ స్త్రీల పేర్లతో ఉన్నాయి. మానవుడు ఆచరించు అన్నిరకాల  మంగళకరమైన అర్చనలు, ఆరాధనలు, క్రతువులు, యజ్ఞాలు మొదలైన సంప్రదాయాలన్నీ నీటితో ముడిపడి ఉన్నాయి. అంతేకాక శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలుకూడా నీటితో ముడిపడినవే. స్నానాలు అన్నిటిలో పుష్కరసమయంలో సంబంధిత నదీస్నానం చేయడం పుణ్యప్రథమని పురాణాల్లో తెలుపబడింది. పుష్కరసమయంలో సంబంధిత నదులు ప్రవహించు పరీవాహకప్రాంతాలో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలలో మరణించిన పూర్వీకులకు  శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలు చేయుట ఉత్తమమని కూడా తెలుపబడింది. బ్రహ్మ ఆకాశం, వాయువు, జలం, అగ్ని,భూమి అను పంచ భూతాలు సృష్టించగా పంచ భూతాల నుండి జీవులు పుట్టాయని ఉపనిషత్తుల సారాంశం. మనిషి ఉదయం నిద్రలేచింది మొదలుగా  నిద్రకు ఉపక్రమించేవరకు దైనందిన కార్యక్రమాలు నీటితో ముడిపడ్డవే. మానవజీవితంలో ప్రధానమైన నీటి  ప్రాముఖ్యత గుర్తుచేసేవే పుష్కరాలు.

దైనందిన కార్యక్రమాలలో 12 సంవత్సరాలు కాలం లేదా సమయం చెప్పడానికి పుష్కరకాలం అనిచెప్పడం సాధారణం.. మనదేశంలోని 12 ముఖ్యమైన నదులకు నదికి సంబంధించిన రాశిలో  బృహస్పతి ప్రవేశించినట్లు గణనచేసి ఆనదీజలం సాధారణ రోజులకంటే 12 రోజుల కాలం పుష్కరాలకాలం పవిత్రమైనట్లు భావిస్తారు. పుష్కరాలకుకల ఖ్యాతిపై కధనం ఉన్నది. పురాణకథ ప్రకారం  పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సుచేయగా శివుడు ఆయన భక్తికిమెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అడిగాడు.  పుష్కరుడు జీవులు చేసిన పాపాలవల్ల వారు స్నానంచేసిన నదులు అపవిత్రమవుతున్నాయని,నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, లోకహితం కోరి తన శరీర స్పర్శచే నదులు పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడు. శివుడు పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆనది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చాడు.  

సింధూనదికి కుంభ రాశిలో  20-11-2021 తేదీన  ప్రణహితనదికి మీన రాశిలో 13-04-2022 తేదీన పుష్కరాలు జరిగియున్నవి. రాబోవు పుష్కరాలు గంగానదికి  మేష రాశిలో 22-04-2023 తేదీన, రేవానదికి (నర్మదకు ) వృషభ రాశిలో 01-05-2024 తేదీన,  సరస్వతీనదికి మిథున రాశిలో 14-05-2025  తేదీన,

యమునానదికి  కర్కాట రాశిలో 01-06-2026తేదీన,  గోదావరినదికి  సింహ రాశిలో 26-06-2027 తేదీన,

కృష్ణా నదికి కన్యా రాశినందు  24-07-2028 తేదీన ,

కావేరీ నదికి తులారాశినందు 24-08-2029 తేదీన, భీమానదికి వృశ్చిక రాశిలో 23-09-2030 తేదీన,తపతి పుష్కరవాహినికి ధనస్సు రాశినందు 15-10-2031 తేదీన మరియు తుంగభద్రనదికి మకర రాశినందు 24-10-2032  తేదీన పుష్కరాలు ప్రారంభమౌతాయి..

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం 22-04-2023 తేదీన  ప్రారంభమైబృహస్పతి పన్నెండో రాశిఅయిన మీనంలో ప్రవేశించినప్పుడు 03-05-2023 తేదీన ముగుస్తుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము అనిచెప్పబడింది. పుష్కర కాలంలో  22-04-2023  నుండి మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరంఅని, చివరి పన్నెండు రోజులు 03-05-2023 వరకు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు. సంవత్సరకాలంలో ఆది మరియు అంత్య పుష్కరాల పన్నెండు రోజులు ప్రత్యేకమైనవి. అంత్య పుష్కరాలకంటే ఆదిపుష్కరాలు పన్నెండురోజులు పవిత్రమైయనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో ఉంటాడని పన్నెండు రోజూలలో గంగానదిలో స్నానం చేయటంవలన సకల తీర్థాలలో స్నానంచేసిన ఫలితం దక్కుతుందని గంగానదిలో అనేకమంది భక్తులు స్నానాలుచేస్తారు.

హిందువులు గంగాదేవిని పాపములను తొలగించి శుద్ధిచేయు దేవతగా పూజిస్తారు. మొసలి వాహనధారి అయిన  గంగను అందమైన స్త్రీగా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో గంగ నదులలో పవిత్రమైనదిగా పేర్కొనబడింది. గంగాదేవి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. రామాయణం ఆమె పర్వతరాజు హిమవంతుని ప్రధమ సంతానంగా పార్వతి సోదరిఅని తెలుపుతుంది. బ్రహ్మ హిమవంతున్ని సృష్టించి హిమాలయాలకు రాజును చేశాడు.  హిమవంతుడు మేరు అను పర్వతరాజు కుమార్తె మేనవతిని వివాహం చేసుకున్న చాలాకాలం పిమ్మట  వారికి కుమార్తె జన్మించగా ఆమెకు గంగఅని పేరుపెట్టారు. పిమ్మట వారికి సతీదేవి అవతారమైన పార్వతి కుమార్తెగా జన్మించింది. గంగ పెద్దయ్యాక, దేవతలు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లారు, ఆమె నది రూపంలో ప్రవహించింది. 

మహాభారతంలో గంగ కురువంశరాజైన శంతనుని భార్యగా భీష్మునితో ఎనిమిదిమంది వశువులకు తల్లిగా తెలుపబడింది. బ్రహ్మ గంగ మరియు శంతనులను భూలోకంలో జన్మించమని శాపంఇచ్చాడు. శంతనుడు గంగానది ఒడ్డున గంగాదేవిని కలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరాడు. తన చర్యలను శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుపై ఆమె ఆతని ప్రతిపాదనన అంగీకరించింది. శంతనుడు వారు వివాహంచేసుకొని కలిసి జీవించి వసువుల అవతారమైన ఎనిమిదిమంది కుమారులను పొందారు. శాపగ్రస్తులైన వారు భూమిపై జన్మించి నప్పుడు తమజీవితాన్ని ముగించమని గంగను కోరారు. వారి అభ్యర్థనప్రకారం శంతనుని ఎదురుగానే గంగ సంతానాన్ని గంగలో పారవేయడం ప్రారంభించింది. ఎనిమిదవ కుమారుడైన భీష్ముని గంగలో ముంచబోగా, శంతనుడు అడ్డుకున్నాడు.గంగ భీష్మునితో వెళ్లిపోయి అతనికి పదేళ్ల వయసులో శంతనునికి  తిరిగి అప్పగించి వెళ్లిపోయింది. 

భాగవత గ్రంధంలో విష్ణువు గంగకు మూలమని పేర్కొనబడింది. కధనంప్రకారం, వామన అవతారంలో విష్ణువు తన ఎడమపాదాన్ని విశ్వమంతా విస్తరించి బొటనవేలు గోరుతో ఒక రంధ్రం ఏర్పరచాడు. రంధ్రంద్వారా, సముద్రంనీరు స్వచ్ఛమైన గంగానదిగా భూమిపై ప్రవేశించింది. ఎర్రటి కుంకుమరంగు కల వామనుని పాదాలను కడిగిన తరువాత, గంగ గులాబీరంగు పొందింది. విశ్వంలోకి వచ్చేముందు గంగ విష్ణువు పాదాలను తాకింది కాబట్టి గంగను విష్ణుపది అనిపిలుస్తారు.భూమిపైకి దిగేముందు గంగ బ్రహ్మలోకంలో ఉండిపోయిందని నిర్ధారణ అయింది. ఆమె రాజర్షి భగీరథుని తపస్సువల్ల మరియు శివుని వరంప్రభావంతో భూమిపైకి దిగింది.

సాగరరాజు వంశస్థుడైన భగీరథుడి ప్రయత్నాలద్వారా గంగ భూమిపైకి వచ్చిన కథ రామాయణం, మహాభారతం మరియు వివిధ పురాణాల్లో వివరించబడింది.సాగర రాజు అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని సంచరించడానికి వదిలి వేశాడు.యాగం విజయవంతం కాకుండా ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు.గుర్రం అదృశ్యమైందని సాగరరాజు తన అరవైవేలమంది కొడుకులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. వారు పాతాల లోకంలో కపిలమహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని కనుగొన్నారు. కపిలమహర్షి గుర్రాన్ని దొంగిలించాడని భావించి, ఆయన ధ్యానంలో ఉండగా వారు ధ్యానాన్ని ఆటంకపరచారు. కపిలమహర్షి కోపించి తనచూపులతో అరవై వేలమందినీ కాల్చి బూడిదచేసాడు.వారిఆత్మలకు విముక్తి కలిగించడానికి పరిహారం కపిలమహర్షినుండి తెలుసుకోడానికి సగరరాజు మనవడైన అంశుమాన్‌ని పంపాడు. స్వర్గంనుండి ప్రవహింఛు గంగ మాత్రమే వారిని విముక్తి చేయగలదని కపిలమహర్షి తెలిపాడు.

అంశుమాన్ మనుమడు భగీరథుడు తీవ్రమైన తపస్సుచేసి, బ్రహ్మ మరియు శివుని అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ గంగను భూమిపైకి దిగడానికి అనుమతించగా, శివుడు గంగ ఉధృతి తగ్గుటకు కేశములందు బంధించి ఒకపాయగా భూమిపై వదిలాడు. శివుని జటాఝూటం (కేశముల) నుండి గంగానది గంగోత్రివద్ద ఉద్భవించింది. గంగను భగీరథుడు సముద్రానికి అక్కడనుండి, పాతాళానికి ప్రవహింపచేశాడు. గంగానది భూమిపై ప్రవహించుప్పుడు జాను మహర్షి యొక్క ఆశ్రమంలో హోమాగ్ని ఆర్పివేసింది. మహర్షి  ఆగ్రహించి మొత్తం గంగను మ్రింగివేశాడు. భగీరథుని విజ్ఞప్తిపై, జాహ్నాఋషి ఆమెను తన ఎడమచేవినుండి వదలిపెట్టాడు. అందువలన గంగను జాహ్నవిఅని అంటారు. పిమ్మట గంగ పాతాళంలోని కపిలమహర్షి  ఆశ్రమానికి చేరుకొని, అక్కడ బూడిదగాఉన్నభగీరథుడి పూర్వీకులను శాప విముక్తులను చేసింది.

భగీరధుని కృషి వలన భూమిపైకి వచ్చుటవలన భగీరధిగా పిలువబడు గంగానది భారతదేశంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద నది. గంగాదేవి స్వర్గం, భూలోకం మరియు పాతాళలోకాల్లో ప్రవహిస్తుంది. గంగానదికి జాహ్నవి, గంగ, శుభ్ర, సప్తేశ్వరి, నికిత, భాగీరథి, అలకనంద మరియు విష్ణుపది వంటి వివిధ నామాలు (పేర్లు) ఉన్నవి. పవిత్రమైన గంగానది దైవత్వం కలిగి స్నానంచేసినంత మాత్రాన సకల పాపములు హరిస్తుంది. మరణించినవారికి పిండప్రదానం చేస్తే వారికి ముక్తి కలిగించి స్వర్గలోక నివాసం ప్రసాదిస్తుంది. హిందూ మతంలో గంగాదేవిని మానవాళికి తల్లిగాతలచి యాత్రికులు తమ బంధువుల చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేయడంద్వారా వారిఆత్మలు శుద్ధి చేయబడి జనన మరణ చక్రంనుండి విముక్తికలిగి మోక్షం పొందుతాయని భావిస్తారు. గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, వారణాశి, కలకత్తాలోని కాళీ ఘాట్‌ మొదలైన గంగానది పరీవాహక ప్రదేశాల్లో గంగానదికి పండుగలు జరుపుతారు.

గంగా పుష్కరాలు అనగానే భక్తులు సాధారణంగా కాశీ లేదా వారణాశి వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు. వారణాశిలో బస మరియు భోజన సౌకర్యాలు చాలా అభివుద్ధి చెందిఉన్నాయి. కానీ భద్రీనాధ్ వద్దఉద్భవించిన అలాకానంద దేవప్రాయాగ వచ్చుసరికి గొంగోత్రివద్ద ఉద్భవించిన భగీరధితో కలిసి గంగానదిగా ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి ప్రవహించి ప్రయాగరాజ్ వద్ద యమున మరియు సరస్వతీనదులతో కలిసి ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దివ్యప్రదేశాలు గంగోత్రి, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్, గర్ ముక్తేశ్వర్ (హాపూర్) మరియు గంగాసాగర్ గంగా పుష్కరాల సమయంలో పవిత్రస్నానాలకు మరియు మరణించినవార్కి పిండప్రదానం చేయుటద్వారా వారి ఆత్మలకు మోక్షం కలిగించే దివ్యప్రదేశాలు. ప్రతిక్షేత్రంలో స్నానఘట్టాలు, రవాణా, భోజన వసతి సదుపాయ వివరములు విడిగా తెలియజేస్తాం. 

గమనిక: పుష్కరాల సమయంలో కాశీ (వారణాశి) తోపాటు మిగిలిన క్షేత్రాల్లో                  నదీస్నానం మరియు పిండప్రధానం  చేయవచ్చు గంగోత్రి, దేవప్రయాగ,                                                                           ఋషీకేశ్, హరిద్వార్ ఛోటా చార్ ధామ్ యాత్రనందు భాగమై ఉన్నాయి.  కావున వీలుకొద్దీ వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కావున వీలుకొద్దీ  వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కోరుతున్నాం.

నేను ఎవడను

 .

                    *సుభాషితమ్*


*శ్లో𝕝𝕝 కుతోఽహమాగతః కోఽస్మి*  

*క్వ గమిష్యామి కస్య వా।*

*కస్మిన్ స్థితః క్వ భవితా* 

*కస్మాత్కిమనుశోచసి॥*

                              ( *మహా భారతం* )


తా𝕝𝕝 *"నేను ఎవడను.ఎక్కడినుండివచ్చాను? ఎక్కడికి పోతాను ?ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి*? 


*ఏ ప్రదేశంలో ఉన్నాను? ఎక్కడ మళ్లీ జన్మిస్తాను?ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలుసునా?* 

*ఇవి అన్నీ బాగా ఆలోచిస్తే ఇంకా దుఃఖించడం ఎందుకు?"*

అరాళ కుంతలా

 అరాళ కుంతలా .🌹

🌺

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా

చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద

అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.

"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.

ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి

"నీ పేరు" అన్నారు.

-అప్పారావు -

"గోత్రం"

-అరాళ కుంతల-

పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.

"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా

ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

 కొస మెరుపులు:

1. ఈ పరిశోధన వళ్ళ నాకు వెండ్రుక అనే అనే పదం తెలిసింది. ఇన్నాళ్లు వెంట్రుక అని మాత్రమే తెలుసు. నిఘంటువులో 'వెండ్రుక'కే అర్ధం ఇవ్వబడింది. వెంట్రుక కోసం వెతికేతే వెండ్రుకని చూడుము అంటుంది.

2. శ్రీ కృష్ణుడికి సత్యభామ కాలు తాకడం కేవలం నంది తిమ్మన గారి కల్పన మాత్రమేనట. ఆ కల్పన ఎందుకు చెయ్యవలసొచ్చిందనడానికి ఒక కత ఎక్కడో చదివినట్టు గుర్తు. ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలు వారికి వారి భార్యామణి కాలు తగిలిందని ఆయన భార్యమీద కోపంతో మాట్లాడకుండా ఉన్నాడంట. విషయం తెలిసిన నంది తిమ్మన భార్య కాలు తాకడం తప్పుకాదు అని రాయలవారికి చెప్పడంకోసం ఈ కల్పన చేసాడంట.


😀😀😀😀😀😀😀😀😀😀😀😀

స్వ ధర్మో నిధనం శ్రేయః

 నేను మతం మారి మీకు సేవ చేస్తాను.....

ఒకసారి పరమాచార్య వారు తమినాడు లోని కరంబకుడి నుండి పట్టుకొట్టయ్ అనే గ్రామానికి మకాం మారుస్తున్నారు. ఆయన కోసం కరంబకుడి నివాసి అయిన ఒక ముస్లిం వృద్దుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది మంచి ఎండా కాలం. రొప్పుతూ వస్తున్న వృద్దున్ని చూసి స్వామి ఆగారు.వృద్దుడు పండ్లు, పూలు స్వామి కి సమర్పించి నమస్కరించి నిలుచున్నాడు.

స్వామి "మీరు నన్ను కరం బకుడి లో చూచారుగా. మరల ఇంత రొప్పుతూ ఎందుకు వచ్చారు."

ముస్లిం వృద్దుడు " నేను మిమ్మల్ని కరంబకుడి లో చూసాను. అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేననిపించి మరల వచ్చాను. మా మతం లో అల్లా కు రూపం లేదు ఉంటే మీలా ఉంటాడు. అని నా అభిప్రాయం అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది. మీ మతం లోకి మారి మీరు కోరిన సేవ చేస్తాను. నన్ను మీ మతం లోకి చేర్చుకొని మీ సేవా భాగ్యం కలిగించండి. "కన్నీళ్లతో గద్గద స్వరంతో.

స్వామి కరుణ వర్షించే కళ్ళతో చూస్తూ "మీకు నన్ను చూడాలనిపించి నప్పుడు నన్ను తలుచుకోండి. మీ ఆలోచనలలోకి నేను వస్తాను. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నట్లే. దానికోసం మతం మారకూడదు." అని అనునయంగా చెప్పి స్వామి ముందుకు సాగారు.స్వామి కనుమరుగయ్యే వరకు కన్నీళ్లతో స్వామి నే చూస్తూ వృద్దుడు ఆగిపోయాడు.

**** మతం మానవుడు ఏర్పరుచుకున్న

కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాల, విశ్వాసాల హద్దు.స్వామి వారు ఎవరి హద్దులలో వారుండి గమ్యాన్ని చేరవలేనని విశ్వసిస్తారు . "స్వ ధర్మో నిధనం శ్రేయః "అనే గీతాచార్యుని అభిప్రాయమే స్వామి వారి అభిప్రాయం.

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 

తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 

దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  

సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 

తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 

తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 

తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 

చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.

ఓం తత్సత్ 

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 



పంచకర్మ పద్ధతి

 ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 


     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 


       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 


       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నస్యకర్మ  - 


        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 


 *  వమనకర్మ  - 


       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 


 *  విరేచనకర్మ - 


       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 


 *  నిరూహవస్తి - 


        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 


 *  అనువాసనవ వస్తి - 


      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 


        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .