6, జూన్ 2021, ఆదివారం

సూర్యుని మంత్రం🌞*🌻

 ,🌻 *🌞ఆరోగ్యం కోసం* 

*సూర్యుని మంత్రం🌞*🌻


🥀 *సూర్యమంత్రం*🥀


🌱 *నమః సూర్యాయ* 

*శాంతాయ* 

*సర్వరోగ నివారిణే!*

*ఆయురారోగ్య* 

*ఐశ్వర్యo దేహి* 

*దేహిదేవః జగత్పతే!!*🌱


🙏అర్థం🙏


ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా  నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు.  శాంతిని వొసంగువాడవు.

మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. 


సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడుకి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం ,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకం కనీసం 12 సార్లు అయినా జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తాడు..... అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యాల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..


(సేకరణ)

New inventions

 


Temple


 

వడ మాల


 

Clock calculations


 

One man


 

New invention


 

Great humanity


 

రాగి chettuku మామీడి


 

మధువు కైటభుడు*

 *మధువు కైటభుడు*


తేనపట్టును దగ్గరనుంచి పరిశీలన గా చూస్తే దానిలో ఉన్న విభాగాలు తెలుస్తాయి. పై భాగం తేనె నిల్వ చేసే భాగం. కిందిభాగం వాటి పిల్లలు వుండేభాగం. ఆ పిల్లలకు ఆహారంగా ఉండడానికి  ఆ తేనెటీగలు తేనెను సేకరించి ఉంచుతాయి.


మధువు అంటే తేనె. కీటమ్ అంటే పురుగు. కీటభం చిన్నపురుగు. కైటభం చిన్న పురుగులకు సంబంధించినది. మధు, కైటభాలు రెండూ తెనపట్టులో భాగాలు. ఆధ్యాత్మికంగా చూస్తే అవే అహంకార మమకారాలు.  పురుగులు అహంకారం. తేనె మమకారం. 


*తేనెటీగలు తేనెపట్టు దగ్గరకు ఎవరైనా వస్తే ప్రాణాలకు తెగించి పోరాడతాయి. మనమూ అంతే. మనమీదికి గాని మనదాని మీదికి గాని ఎవరైనా వస్తే అలాగే పోరాడతాము.  ఎక్కువ పోరాటాలు "మనవి" (ఆస్తులు, ధనము, అధికారము) అనుకున్న వాటి కోసమే  జరుగుతాయి. అవి తేన లాగా మనకూ ఎదుటివాడికి కూడా చాలా తియ్య గా ఉంటాయి కాబట్టి..*


మధువు కైటభుడు ఇద్దరూ విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి లో నించి పుడతారు. ఆయన లోపల నుంచి పుట్టారు కనుక వాళ్ళతో యుద్ధం చేసి ఆయన వాళ్ళను జయించ లేక పోతాడు. మోసం తో జయించాలను కుంటాడు. మీకు వరమిస్తాను రండి అంటాడు. వాళ్ళు నవ్వి నువ్వు మాకు వరాలిచ్ఛే దేమిటి నీకే మేము వరమిస్తా మంటారు. సరే అని మీరు నాచేతులో మరణించాలి అని వరం కోరతాడు విష్ణువు.  వాళ్ళు ఒప్పుకుని కొన్ని కోరికలు కోరతారు.  అది మధు కైటభుల కధ. 


నిజానికి ఈ తేనె తుట్టే  అనేది మన అందరిలో నూ ఉంటుంది. ఇది జీవుడిలో మాయ చేత అవరింపబడిన భాగం, అసుర భాగం. రెండవది జ్ఞానం చేత అవరింపబడిన భాగం, దైవ సంబంధ మైనది. రెండూ మన మనసు లోనే ఉంటాయి. యుద్ధం వాటి మధ్య జరుగుతుంది. జ్ఞానం యొక్క సహాయం లేకుండా గెలుపురాదు. ఇది సూత్రం. పరాయి వాళ్ళతో యుద్ధం చెయ్యొచ్చు గానీ మనలో మనం యుద్ధం ఎలా చేస్తాము అని కొందరికి సందేహం. వివేక చూడామణి లో ఆది శంకరులు ఇలా చెప్తారు. "మనసా కల్ప్యతే బంధో, మోక్ష స్తేనైవ కల్ప్యతే". బంధమూ మొక్షమూ రెండింటినీ మనసే కల్పిస్తుంది అని. అహంకార మమకారాలు కల్పించేది మనసే వాటిని వదిలించుకో డానికి ఉపయోగ పడేది కూడా మనసే. 


అహంకారాన్నే జీవుడు తన స్వరూపంగా భావిస్తాడు. ఆ స్తాయిని దాటి ప్రజ్ఞానాన్ని ఆసరాగా పొంది తన అసలు స్వరూపం ఇది కాదు అని తెలుసుకునే టప్పుడు,  లోపల పెద్ద యుద్ధం మే జరుగుతుంది.  అలా (లోపలి) యుద్ధం చేసి అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించి తన అసలు రూపాన్ని (ఆనంద స్వరూపాన్ని) అందుకోవాలి. ఇది మధు కైటభు ల తో నారాయణుడి యుద్ధం సూచించే ఆధ్యాత్మిక రహస్యం. 


                              * * *

పురాణాల లో కధలకూ ఆధ్యాత్మిక విషయాలకూ సంబంధం ఉంటుంది. ఈ సంబంధం పొడుపు కధలలో లాగా ఉంటుంది. ఇంకెక్క డైనా ఇలాంటిదే ఇంకో పొడుపు కథ వస్తే ఈ విషయం అక్కడ పనికి వస్తే వాడుకోవచ్చు. 


మధు కైటభుల కథను అన్వయిస్తే సుందర కాండ లోని మధువన ధ్వంసం ఘట్టం లో ఉన్న ఆధ్యాత్మిక సూచన అర్ధమౌతుంది. ఈ మధువనం లో ఉండే తేనే తెట్టెలను మూడు తరాల నుంచి,  అంటే వాలి సుగ్రీవుల తండ్రి ఋక్ష ధ్వజుడు అతని తర్వాత వాలి, వాలి తర్వాత సుగ్రీవుడు ఈ మధు వనాన్ని తాము అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడు కొస్తుంటారు. అంజనేయుడి అనుమతి తో అంగదుడు కపులకు మధు భక్షణ కు అనుమతిస్తాడు. 


యుద్ధానికి బయల్దేరేవాడు నాకు దెబ్బ తగులు తుందేమో అనీ, నావాళ్లకు ఇబ్బంది అవుతుందేమో అని భావిస్తే యుద్ధానికి వేళ్ళనే లేడు. వెళ్లినా "జయము జయము మహారాజా మన సైన్యాలు యుద్ధం లో చిత్తుగా ఓడాయి మహారాజా"  అని వార్త చెప్పడానికి పనికి వస్తాడు. అట్లాంటి వాడు యుద్ధం చెయ్యడు. 


*ఆంజనేయుడిని వైష్ణవులు ఆచార్య స్వరూపం గా భావిస్తారు.*.. స్వామికి అనుగ్రహం ఎవరిపైన కలిగితే వాళ్ళను సన్మార్గం లో పెట్టి ఒకమెట్టు పైకి ఎక్కిస్తుంటాడు.  ఆంజనేయుడు అప్పటికే రామదాసు అయ్యాడు. సుగ్రీవుడి దండు (సైన్యం) రామ దండు గా మారాలి. లేకుంటే యుధ్దం లో గెలవ లేరు. ఆంజనేయుడు అనుమతించి  మొత్తం కపి సేన లో వుండే వాళ్ళందరి చేతా మధువనాన్ని ధ్వంసం చేయిస్తాడు. దీనికి ఆధ్యాత్మిక అర్థం కపు లందరి మనసు లోపలి తేనెతుట్టెలను వాళ్ళ చేతనే ధ్వంసం చేయించడం. ఇదే మధువన ధ్వంసం.  అంత దాకా వాళ్ళు సుగ్రీవ సైన్యం. ఆతరవాత రామ దండు. రామ దండు అంటే వానర మూక అనే మాట అప్పటినుంచి సార్థక  మైంది. ఆ తరవాత వానరులందరూ అహంకార మమకారాలను వదిలి రామ కార్యం లో నిమగ్నులవుతారు.


 రామ రావణ యుద్ధంలో  వానరులు కూడా చాలా మంది మరణిస్తారు. హనుమంతుడు సంజీవిని తెచ్చినప్పుడు వీళ్ళు మళ్లీ బతుకుతారు. మళ్లీ ఇంకో సారి యుద్దంలో కొంతమంది చచ్చిపోతారు. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఇంద్రుడు మళ్ళీ బ్రతికిస్తాడు. అంటే వీళ్ళు రెండు సార్లు మరణించినా కూడా రాముడి పక్షాన యుద్ధం చేయడం మానరు. అంత గట్టిగా రాముడి పక్షాన నిలబడి ఉంటారు. ఒకసారి అహంకారం నశించి న జీవుడు ఎప్పటికీ భగవంతుడిని వదిలిపెట్టడు.


                         ********

వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఈ మధు కైటభ వధకూ సంబంధం వుందిట.  ఈ రాక్షసులకు విష్ణువు ఇచ్చిన వరం వల్ల వారికి మొక్షమివ్వడానికి   ఉత్తర  ద్వారం లో నుంచి  వైకుంఠానికి తీసుకు వెళ్లారని. ఉత్తర ద్వార దర్శనం అందరికీ మోక్ష కారక మయ్యేటట్లు విష్ణువు అనుగ్ర హించాడని చెప్తారు. 


 ఈ వానరులంతా సీతను వెతకడానికి దక్షిణానికి వెళ్లిన వాళ్ళు. దక్షిణ  సముద్రం  వద్ద నుంచి తిరిగి రాముడి దగ్గరకు (పరమాత్మ దర్శనానికి) రావాలంటే ఉత్తరాని కి ప్రయాణించాలి. అలా ఉత్తరానికి ప్రయాణిస్తూ వస్తే మధువన ధ్వంసం తరవాత రామ దర్శనం జరుగుతుంది. 


*పవని నాగ ప్రదీప్*

అణువు వ్యాప్త లక్షణమును

అణువు వ్యాప్త లక్షణమును లలితా సహస్రం చక్కగా వివరించినది. అణిమాదిభిఃఆవృతాః మయూఖైః. అణువు ఆదినుండి (భ ఈ హ) భిః మయూఖైః. భ ధాతు పరమైన పదార్దం.ఈ అనగావ మూల ప్రకృతి శక్తి. హ అనగా హవిస్సు లక్షణము అనగా అగ్ని పూర్వక వ్యాప్తి తత్వము. హవిస్సు యనగా దానికి పదార్ధాల లక్షణము కలిగియున్నది ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. అనగా కంటికి కనబడు లక్షణము లేదు. అది మన దేహములో కూడా వున్నది. లేనియెడల మనం తీసుకున్న ఆహారము హవిస్సుగా మారుట జరుగదు. అట్లు మారనియెడల దేహ వినాశనం. యీ దేహమునకు ఎలాగైతే యిటువంటి లక్షణము కలిగియున్నదో సమస్త జీవులకును ప్రకృతి ద్వారానే అటువంటి హవిస్సు లక్షణములు కూడా కలిగియున్నవి. నెమలి పురివిప్పిన నాట్యం ప్రకృతి లక్షణమును తెలుపు చున్నది. ఇదే సూత్రము అణువు కూడా ఆదినుండి అనగా మూల పకృతి చైతన్యమై ప్రకాశ వంతమై వ్యాప్తి లక్షణము కలిగినదియున్నదని వివరించుచున్నది. ప్రకాశించే తత్వము ప్రకృతి కంటికి స్పష్టంగా కనపడదు. వకవేళ కనిపించినా గుణము తెలియవలెనన్న దానిని పంచభూతాత్మకమైన శరీర రూపంలో పదార్దము వలెనే తెలియవలెను. వేరు మార్గము లేదు. యిది ప్రకృతి తత్వమైన జీవ శక్తిగా ఆత్మ శక్తిగా తెలియాలి. దేహధారణమును అన్నమాచార్యలవారు ఎంతకాలమని తెలుపుటకు కాలము అనంతమైనదని, జీవుడు అవిశ్రాంతంగా పదే పదే పుడుతూనే వుండుటను తెలిపినారు. దీనికి అంతు లేదా! అణువు కూడా అనంతమని వ్యాప్తి చెందియున్నదని దానికి కాల నిరూపణ లేనిది. సృష్టి నిరూపణ సూత్రము వ్యాప్త లక్షణము ప్రకృతి ద్వారా తెలుపుతునేయున్నది. ధర్మం నడిచినంత కాలం యీ సృష్టి నిత్యనూతనంగానే కనిపించును. అధర్మం పెరిగిన యిది లయం అగును. భూదేవికి భారం అధర్మమేగానీ మిగిలినవి భారం కాదు.ధర్మం ధారయతీ ధరిత్రీ, సృష్టి ప్రకృతి పరంగా సహజంగా వున్నంతవరకూ  ధర్మ నిరూపణయే. కాల పరిమితి దాని లక్షణము అనగా గమనం కాలమును దాని పరిమితిని దాని వ్యాప్తమును  ముందుగానే నిర్ణయింపబడి అణు స్వరూపమును ముందే ప్రకృతి ద్వారా వ్యాప్తిని తెలిపియున్నది. ప్రకృతి అమ్మ స్వరూపమని వివిధ రూప, రంగు, లక్షణములుగా సృష్టంచుటయే ప్రకృతి రూపమైన అమ్మ. అందరూ మానవులు అయితే అనందరి లక్షణములు వకే రీతిలో నుండవలెను కదా. వ్యక్తి వ్యక్తికి విలక్షణమైన ప్రకృతి భావములు కలుగుజున్నవి. సమిష్టి లక్షణములు గల ప్రకృతిని సమ పాళ్ళలో యుండుటకు ఏ జీవి తత్వం ఆజీవునిదే. ఏ జీవి ఆలోచనలు ఆజీవునివే. యిది కర్మ సిద్దాంతము, పరంపరగా వచ్చుచున్నది. ఎవరి కర్మ వారే అనుభవించవలెను.వకరి కర్మ వేరొకరు ఏరూపములోనైనా వేరొకరు అనుభవించరు. ఆత్మ అణు లక్షణము దేహము ద్వారానే సృష్టి చేయుట మాత్రమే ప్రకృతి రూపంలో అమ్మ వంతు. దానిని సవ్య ధర్మమార్గములో ప్రవర్తించుట జీవుడి వంతు. లేనిచో వినాశనం.అనంతమైన విశ్వ  ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తునే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పులిచర్మం..స్వామివారి లీల..ఆఖరిభాగం..*


*(యాభై వ రోజు)*


శ్రీధరరావు దంపతులు తాము కందుకూరు నుంచి తెచ్చిన పులిచర్మాన్ని తీసుకొని తమ ఇంటికి తిరిగివచ్చారు.. ఆసరికే ఇంటి దగ్గర శ్రీ చెక్కా కేశవులు గారి కుమారుడు కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెను తన ముందు పెట్టుకొని కూర్చునివున్నాడు..


"ఏం నాయనా?..ఎప్పుడొచ్చావు?.." అని అడిగారు శ్రీధరరావు గారు..


"ఒక అరగంట అయిందండీ..నాన్నగారు పంపించారండీ..ఈ "పులిచర్మాన్ని" శ్రీ స్వామివారికి మీ ద్వారా చేర్పించమన్నారండీ.." అన్నాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఆ పిల్లవాడు చెపుతున్న మాట ఒక్కసారిగా నిర్ఘాంతపోయేలా చేసింది..


పులిచర్మం..శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు కోరుకున్న పులిచర్మం.."నా కంతగా కావాలని అనుకుంటే..నా వద్దకు రాదా తల్లీ!.." అని శ్రీ స్వామివారు కొద్దిసేపటి క్రితం చెప్పిన మాట చెవుల్లో ఖంగున మ్రోగింది.."ఈ పాటికి వస్తూ ఉండాలని" కూడా ఆయన చెప్పారు..మహానుభావుల మాటలు పొల్లుపోవు..


వచ్చిన కుర్రవాడు కొద్దిగా సర్దుకున్నతరువాత.. శ్రీధరరావు ప్రభావతి గార్లు, ఆ చెక్క పెట్టెను తీసి చూసారు..

సుమారు ఏడడుగుల పొడవు..నాలుగు అడుగుల వెడల్పుతో..పెద్ద పులి ముఖంతో సహా ఉన్న చర్మం అది..అలాంటిది లభ్యం కావడం చాలా అరుదు..దాని ముందు తాము కందుకూరు నుంచి తెచ్చింది చాలా చిన్నదిగా ఉంది..


"నాన్నగారు ఈ మధ్య భద్రాచలం వైపు వెళ్లారండీ..తిరిగి వస్తుంటే..దారిలో ఎవరో ఈ పులిచర్మాన్ని అమ్మకానికి పెట్టి ఉన్నారట..ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని అమ్ముకునే అతను వాపోతుంటే..నాన్నగారికి శ్రీ స్వామివారి తపస్సుకు ఉపయోగపడుతుందని అనిపించిందట.. ఖరీదు అడిగితే రెండువేల రూపాయలు ఇప్పించండి చాలు అన్నాడట ఆ అమ్మే వ్యక్తి..మారు మాట్లాడకుండా ఆ డబ్బు చెల్లించి ఇంటికి పట్టుకొచ్చేసారండీ..విజయవాడ లో ఈ పెట్టె కూడా చేయించారండీ..తాను స్వయంగా తీసుకొద్దామనుకుంటే..అత్యవసర పనుల వత్తిడీతో రాలేక..నన్ను మీకు అప్పచెప్పి రమ్మన్నారండీ..మీరు శ్రీ స్వామివారికి చేర్పించండి..మరి నేను వెళ్ళొస్తానండీ.." అన్నాడు కృష్ణ..


"అందరం కలిసి వెళ్లి స్వామివారికి అప్పజెప్పుదాము ..నువ్వు కూడా మాతో రా నాయనా..నాన్నగారి తరఫున నువ్వే అందజేద్దువు.." అన్నారు శ్రీధరరావు గారు..


"లేదండీ..నేను వెళ్ళాలి..ఏమీ అనుకోకండి.." అంటూ నమస్కారం చేసి..ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు..


ప్రభావతి గారికి ఇదంతా కలలా ఉంది..పులిచర్మం కోరుకోవడమేమిటి?..అది ఈరకంగా రావడమేమిటి?..అదికూడా తమ చేతుల మీదుగానే శ్రీ స్వామివారు స్వీకరించడమేమిటి?..తాను ప్రలోభపడితే..ఎంత సున్నితంగా వారించారో..మళ్లీ అంతే గౌరవంగా తమ ద్వారా తీసుకుంటున్నారు..నిజంగా తమ జన్మ ధన్యం!..అడుగడుగునా నిదర్శనాలు చూపుతున్న ఈ మహానుభావుడి సేవ తమ పూర్వజన్మ సుకృతం..ప్రభావతి గారి కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా కారిపోయాయి..


"ప్రభావతీ..నేను ముందే చెప్పలేదా?..ఆయన గురించి మనం తాపత్రయ పడకూడదు..మనం కేవలం ఒక సాధనంగా తోడ్పాటు ఇద్దాము..మన బాధ్యత అంతవరకే..ఒక అవధూత సాధన కొరకు మనం సహకారం పరిమితులతో కూడి ఉంటుంది..అది మనకు లభించిన వరం అనుకోవాలి..పద..ఇప్పుడే వెళ్లి ఆయనకు ఈ పులిచర్మాన్ని అందజేసి వద్దాము.." అన్నారు..


పనివాడు అప్పుడే ఎద్దులను బండి నుంచి విప్పాడు..మళ్లీ ఆ  గూడు బండి సిద్ధం చేయించి..అందులో ఆ పెట్టె పెట్టుకొని తిరిగి ఆశ్రమానికి చేరారు..అప్పుడు కూడా శ్రీ స్వామివారు వరండా లోనే వున్నారు..వీళ్ళను చూడగానే సంతోషంగా నవ్వారు..


"నాయనా..ఇదిగో పులిచర్మం!..కేశవులు గారు శ్రమపడి పంపించారు..ఆయన స్వయంగా రాలేక, వాళ్ళ అబ్బాయి ఇచ్చి పంపారు..మా ద్వారా మీకు ఇవ్వమని చెప్పి పంపారు.." అన్నారు ప్రభావతి గారు..


"అమ్మా..ఇది ఆ దేవీ ప్రసాదం..సాధన లో చివరి మెట్టుగా వ్యాఘ్ర చర్మం మీద తపస్సు చేస్తారమ్మా..కేశవులు గారు మీరు కూడా బాగా సహకరించారు.." 


"నాయనా..ఉదయం నేను పడిన కలత అంతా తీరిపోయింది.. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది మా ఇద్దరికీ..ఇక ఎప్పుడూ ప్రలోభ పడను.." అన్నారు మనస్ఫూర్తిగా ప్రభావతి గారు..


"దైవేెచ్చ తల్లీ!..శుభం జరుగుతుంది..!" అన్నారు శ్రీ స్వామివారు నవ్వుతూ..


శ్రీధరరావు దంపతులు కొండంత తృప్తి తో ఇంటికి వచ్చేసారు..ప్రక్కరోజే ప్రభావతి గారు తాము తెచ్చిన పులిచర్మాన్ని ఒక మనిషి ద్వారా కందుకూరులోని బాబాయి గారింటికి చేర్పించారు..వాళ్ళూ సంతోషించారు..


ఒక ముఖ్య ఘట్టం..శ్రీ స్వామివారి నిర్ణయం..తరువాతి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఏకపద సంగమం"

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 ( *ఆదివారం కాలక్షేపానికి* )

"కుడి-యెడమల ఏకపద సంగమం"

------------------------

క్రింద ఇచ్చిన ప్రతి కుడియెడమ పదాలకు తగినైన రెండక్షరాల పదాన్ని, మొదటి పదానికి చివర, దాన్నే రెండవ పదానికి మొదట జోడించి రెండు క్రొత్త పదాలు పొందగలరు.

*ఉదాహరణ: కంద......పార* 

*జవాబు: కందగడ్డ, గడ్డపార* 


01. వెండి......చాప

02. చేతి........సాము

03. మందు....మల్లె

04. ఉక్క.......పాలు

05. మణి.......కథ

06. పూల......యాత్ర

07. ఇంటి.......గడ

08. బొట్టు.......గోచి

09. సిగ..........చీర

10. అల.........వాన

11. మేక.........రాజు

12. మట్టి........ధారి

13. పాల........గోడ

14. సుడి........పటం

15. పులి........వంక

16. చుర.........పీట

17. చెవి..........గాడు

18. నిండు.......పోత

19. కను..........జాజి

20. నర...........పీఠం

21. ఎగ...........బొట్టు

22. బోడి..........సూది

23. పాము.......వాడు

24. చింత.........బలం

25. నిప్పు.........నిద్ర

26. కుక్క..........చుక్క

27. లెక్క...........బడి

28. గద్ద............చెంబు

29. జన్మ...........దారు

30. నిద్ర............మందు

31. అర............మీను

32. వెన్న...........బంతి


ఇలాటివి పెడితే ఉర్రూతలే!

శ్లోకాలకు సంభందించిన కథ*

 *జాగ్రత జాగ్రత..  ఈ శ్లోకాలకు సంభందించిన కథ*   


 ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరితో నూ మాటాడేవాడు కాదు. ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకునే వాడు కాదు.. ఆయన  కొండ మీద వున్న తన గుహ లోంచి రోజుకు ఒకసారి పక్కనే  వున్న నదిలో  స్నానం చెయ్యడానికి బయటకు వచ్చేవాడు.ఆ  ఊరి దగ్గర చెప్పులు కుట్టేవాడు ఒకడు సంతానము లేక ఈ యోగిని సేవించి ఆ కోరిక తీర్చుకుందామని ఎదురు చూసేవాడు.  కానీ వాడికి అవకాశం చాలాకాలం దొరకలేదు. ఎండా కాలము నది ఎండిపోయి ఇసుక బయటపడి సన్న పాయగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది.  రోజూ మధ్యాహ్నం ఆ యోగి ఎండలో నదికి వచ్చేటప్పటికీ  ఎండకు ఇసుక వేడెక్కి కాళ్ళు కాలుతూ ఉండేవి. 


ఒక రోజు చెప్పులు కుట్టేవాడు కొత్త చెప్పుల జత తెచ్చి యోగి నడిచి వచ్చే దారిలో ఉంచి, తాను కనపడకుండా ఉంటాడు. యోగి ఎండలో నడుస్తూ వచ్చి కాళ్ళ వేడి భరించలేక అనుకోకుండా ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుంటాడు.  కానీ వెంటనే తన తప్పు తను తెలుసుకుంటాడు. ఈ చెప్పులు ఎవరిని అని చుట్టు పక్కల పరిశీలిస్తాడు. చెప్పులు కుట్టే వాడిని చూసి అతనిని అడిగి విషయం గ్రహిస్తాడు. వేరే వాళ్ల చెప్పుల్లో కాళ్ళు పెట్టుకున్నందు వల్ల తాను వాళ్లకు ఋణ పడ్డానని తెలుసుకుంటాడు. ఆ రుణం తీర్చుకో కపోతే తనకు ముక్తి రాదు అని కూడా గ్రహిస్తాడు. ఆ రుణం తీర్చుకోవడానికి ఆ చెప్పుల వాడికి కొడుకు గా పుట్టడానికి నిశ్చ యించు కుంటాడు. 


యోగం ద్వారా తన ప్రాణాలు విడిచి చెప్పు వాడికి కొడుకు గా పుడతాడు. పుట్టినప్పటినుంచి ఆ పిల్లవాడు స్తబ్దు గా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. కొడుకంటూ ఒకడు పుట్టాడు కాబట్టి ఎలా ఉన్నా చెప్పుల వాడు ఆ పిల్లవాడిని పోషించు కుంటూ ఉంటాడు. ప్రతిరోజూ రాత్రిపూట నాలుగు జాముల లోనూ నాలుగు వీధుల్లో తిరుగుతూ జాగ్రత్త జాగ్రత్త అని డప్పు కొట్టుకుంటూ అరవడం ఆ చెప్పుల వాడి బాధ్యత. అది వాడి ఉద్యోగం. 


ఒకరోజు  వాడికి  జబ్బు చేస్తుంది. వాడు తన ఉద్యోగం చేయలేక పోతాడు. అప్పుడు ఈ పిల్లవాడు తాను ఆ పని చేస్తానని తండ్రితో చెబుతాడు. ఆరోజు రాత్రి ఈ పిల్లవాడు నాలుగు వీధుల లో నాలుగు జాములలో తిరుగుతూ ఈ నాలుగు శ్లోకాలు పెద్దగా డప్పు కొడుతూ చదువుతాడు.


1. *శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర|| అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


2. *శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|  సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


3. *శ్లో|| కామ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|    జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


4. *శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


ఆ వూరి రాజుగారు అది విని ఆశ్చర్యపోయి ఈ రోజు డప్పు కొట్టిన వాడు మహా జ్ఞాని అని తెలుసుకొని పొద్దున్నే చెప్పులు కుట్టే వాడి ఇంటికి వస్తాడు. ఎన్నో కానుకలు కూడా తీసుకొస్తాడు. ఈ పిల్లవాడు రాజు గారికి తన పూర్వ జన్మ కధ చెప్పి రాజు తెచ్చిన కానుకలను తన తండ్రి కి ఇప్పించి తాను రుణ విముక్తుడై దేహాన్ని వదిలిపెడతాడు...


 *ఋణానుబంధ రూపేణా పసుపత్ని సుతాలయ*  అనేది ఈ కథలో చెప్పిన ముఖ్య విషయం. నాలుగు శ్లోకాల లో ఉన్నది భజగోవింద శ్లోకాల లో శంకరులు ప్రతిపాదించిన విషయమే ఉన్నది... శ్లోకాలు చాలా సరళంగా ను సులభంగా అర్థం అయ్యేటట్లు ఉన్నాయి. ఆధ్యాత్మికంగాను వేదాంత పరంగాను మనిషి జాగ్రత్త పడవలసిన విషయాలన్నీ ఈ శ్లోకాలలో ఉన్నాయి. ఇవి నాలుగూ చాలా ప్రసిద్ధమైన శ్లోకాలు. 


*ఇలాంటివే చాలా శ్లోకాలు  జాగ్రత్త జాగ్రత్త అని వచ్చేవి తర్వాత ఏర్పడ్డాయి..*


*పవని నాగ ప్రదీప్.*

నవగ్రహాల తల్లిదండ్రులు

 నవగ్రహాల తల్లిదండ్రులు వారి భార్యలు పేర్లు


 🔅🔅🔅🌷🌷🌷🔅🔅🔅


🍁01. రవి[సూర్యుని]

తల్లిదండ్రులు అతిది - కశ్యపులు.

భార్యలు ఉష,- ఛాయ


🍁02. చంద్రుని

తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి,

భార్య రోహిణి


🍁03. కుజుని

తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు,

భార్యశక్తి దేవి


🍁04. బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి*


🍁05. గురుని

తల్లిదండ్రులు - తార, అంగీరసుడు,

భార్య తారాదేవి


🍁06. శుక్రుని

తల్లిదండ్రులు - ఉష,భ్రుగు,

భార్య సుకీర్తి దేవి


🍁07. శని

తల్లిదండ్రులు - ఛాయ, రవి,

భార్య జ్యేష్ట దేవి


🍁08. రాహువు

తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు,

భార్య కరాళి దేవి


🍁09 కేతువు

తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు,

భార్య చిత్రా దేవి


T.me/narayanamantram 


🔅🔅🔅🌷🌷🌷🔅🔅🔅