16, జులై 2022, శనివారం

 1. The *STOMACH*

     is injured when

     you do not have

     breakfast in the

     morning.


2. The *KIDNEYS*

     are injured when

     you do not even

     drink 10 glasses

     of water in 24

     hours.


3. *GALLBLADDR* 

    is injured when

    you do not even

    sleep until 11

    o'clock and do not

    wake up to the

    sunrise.


4.  The *SMALL*

     *INTESTINE* is

      injured when you

      eat cold and stale

      food.


5.  The *LARGE*

     *INTESTINES* are

      injured when you

      eat more fried

      and spicy food.


6.  The *LUNGS* are

      injured when you

      breathe in smoke

      and stay in

      polluted

      environment of

      cigarettes.


7. The *LIVER* is

     injured when you

     eat heavy fried

     food, junk, and

     fast food.


8. The *HEART* is

     injured when you

     eat your meal with

     more salt and

     cholesterol.


9. The *PANCREAS*

     is injured when

     you eat sweet

     things because

     they are tasty and

     freely available.


10. The *Eyes* are

       injured when you

      work in the light

      of mobile phone

      and computer

      screen in the

      dark.


11. The *Brain* is

       injured when you

       start thinking

       negative

       thoughts.


12. The *SOUL* gets

       injured when you

       don't have family

       and friends to

       care and share

       with you in life

       their love,

       affection,

       happiness,

       sorrow and joy. 


     *All these body*

      *parts are NOT*

      *available in the*

      *market*. 


      So take good

      care and keep

      your body parts

      healthy.


EFFECT OF WATER                  

💐 We Know Water is 

       important but never 

       knew about the 

       Special Times one 

       has to drink it.. !!


       Did you  ???  


 💦 Drinking Water at the 

       Right Time ⏰ 

       Maximizes its 

       effectiveness on the 

       Human Body;


       1⃣  1 Glass of Water 

              after waking up -

             🕕⛅ helps to 

              activate internal 

              organs..


       2⃣  1 Glass of Water 

              30 Minutes  🕧 

              before a Meal - 

              helps digestion..


       3⃣ 1 Glass of Water 

              before taking a 

              Bath 🚿 - helps 

              lower your blood 

              pressure.


       4⃣ 1 Glass of Water 

              before going to 

              Bed - 🕙 avoids 

              Stroke  or Heart 

              Attack.


      'When someone 

       shares something of 

       value with you and 

       you benefit from it, 

       You have a moral 

       obligation to share it 

       with others too.'

        So..., DO yours!..


 HAVE A GOOD DAY AND STAY BLESSED ALWAYS.

చాతుర్మాస్యము- అవశ్య కర్తవ్యము

 🕉

చాతుర్మాస్యము- అవశ్య కర్తవ్యము


ఆషాఢే తు సితే పక్షే 

ఏకాదశ్యా ముపోషితః|

చాతుర్మాస్య వ్రతం కుర్యా

దత్కించిన్నయతో నరః’’||


చాతుర్మాస్యం గురించి ఇతిహాసం ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ అలసిపోయి నిదురించాడట. అది గమనించిన దేవతలు ఒక యజ్ఞం చేసి, అందులోంచీ ఉద్భవించిన హవిస్సును బ్రహ్మకు ఇచ్చారట. అది ఔషధంలా పని చేసి ఆయన అలసటను పోగొట్టిందట. ఆ యజ్ఞమే వ్రతంగా చెప్పబడింది. నియమనిష్ఠలతో, శ్రద్ధతో నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం.


బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ‘ఏకం’, ‘ద్వే’, .త్రీణీ’, ‘చత్వారే’ అంటూ నాలుగు సార్లు ఆజ్యాన్ని సమర్పించి, చివరగా ఒక సమిధను కూడా వేశాడు. ఫలితంగా- దేవతలు, దానవులు, పితరులు, మానవులు అనే నాలుగు రకాల జీవులను సృష్టించి, వారికి రోమములు, మజ్జ మాంసములు, ఎముకలను కూడా ఇచ్చాడు. ‘మాసం’ అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. ‘ఈ నాలుగు రకాల జీవులలో జ్ఞానాన్ని ఉంచడం కూడా ఈ వ్రత దీక్ష లక్ష్యం’ అని తైత్తరీయ బ్రాహ్మణం అంటోంది. మరొక నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు. ‘చతుః+ మా+అస్యం చాతుర్మాస్యం’. నాలుగు లక్ష్ములు ముఖాలుగా- నాలుగు వేదాలు చెప్పినవాడు బ్రహ్మ. వేదలక్ష్మే శ్రీవిద్య. ఈ నాలుగు నెలలూ- ప్రతి రోజూ వేదాలను పూజించాలి. అధ్యయనం, అధ్యాపనం చేయడం ముఖ్యమైన అనుష్ఠామంగా భావన చేయాలని ఉపనిషత్తు అంటోంది


చాతుర్మాస్య వ్రతమును ప్రతి

ఒక్కరూ తప్పకుండ ఆచరించి

తీరవలెను. బ్రాహ్మణ, క్షత్రియ,

వైశ్య, శూద్ర, విధవాస్త్రీ, రజస్వలా,

ముత్తైదువ, బ్రహ్మచారి, గృహస్థ,

వానప్రస్థ, సన్యాసి మొదలగువారు

ఈ వ్రతమును వదలకుండ చేసి

తీరవలెనని శాస్త్రాలు చెబుతున్నవి.

ఇటీవలి కాలంలో యతులు మాత్రమే ఆచరిస్తున్న కారణంగా- చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు లేదా పీఠాధిపతుల కార్యక్రమంగా భావిస్తున్నాం. వాస్తవానికి అన్ని వర్గాల వారు సర్వ ఆశ్రమాల వారు చాతుర్మాస్య వ్రతం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.


నిత్యం కార్యం చ సర్వేషాం 

ఏతద్ వ్రత చతుష్టయం |

 నారీభిశ్చనరైర్వాపి 

చతురాశ్రమ వర్తిభిః || 

బ్రాహ్మణః క్షత్రియః వైశ్యః 

స్త్రియః శూద్రో ప్రతీయథా || 

గృహీ వనస్థః కుటచోబహూదః

 పరమహంసకః ॥ 

నరకాన్న నిర్వర్తంతే 

త్యక్త్వా వ్రత చతుష్టయం ॥ 


చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని విష్ణు ధర్మోత్తర, భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి . తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతము గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది. 


ఏకభుక్త మధశ్శయ్యా 

బ్రహ్మచర్య మహింసనమ్

వ్రతచర్యా తపశ్చర్యా

కృచ్చచాంద్రాయణాదికమ్

దేవపూజా మంత్రజపో దశైతే

నియమాః స్మృతాః


చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల

 ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి

 వరకు గల సమయం నాలుగు

 నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద,

 ఆశ్వయుజ మాసాల్లోని

 ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి.

 ఇందులో మొదటిది దేవశయన

 ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన

 ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ

 మహావిష్ణువు ఈ నాలుగు నెలలు

 శయనిస్తాడు. విష్ణువు శయనించే

 కాలంలో సాధకులు భూశయనం

 చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి,

 సొరకాయ, టమాట, ఆవనూనెల

 సేవనం మానివేయటం, నిరంతర

 జప, తప, హోమ, పురాణ కథా

 శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ

 ఒకే పూట భోజనం చేయటం,

 ఏకాదశులలో పూర్తిగా ఉపవాస

 దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను

 పాటిస్తారు. పీఠాధిపతులు,

 దీక్షితులు ఒకే స్థానంలో

 నివసించటం, క్షురకర్మలు

 నిషేధించడం వంటి నియమాలు

 పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద

 మాసాలు గృహస్థుల నియమాలకు

 సరైనవని పద్మపురాణం

 తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ

 ఏకాదశిని అజా ఏకాదశి అంటారు.

 ఇది సమస్త పాపాలను

 తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర

 మహారాజు సత్యం, ధర్మం తప్పక

 తన భార్యకు దూరమై అనేక

 ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య

 వ్రతాన్ని మరువలేదని, చివరికి

 విజయం చేకూరిందని చెబుతారు.


చాతుర్మాస్యవ్రతము త్యజించినచో

మహాదోషము.


అవ్రతేన నయేద్‌యస్తు

చాతుర్మాస్యమనుత్తమం॥

సపాపీ నరకం యాతి

యావదాభూత సంప్లవం ॥ 


వ్రతము చేయకుండ ఎవరైతే ఈ

 చాతుర్మాస్యాన్ని గడిపెదరో అటువంటివారు మహా

ప్రళయకాల పర్యంతము నరకములో పడతాడు.


వ్రతము చేయుట వలన మహాపుణ్యము


ఇదం వ్రతం మహాపుణ్యం

 సర్వపాపహరం శుభం ॥

 సర్వాపరాధ శమనం

 సర్వోపద్రవనాశనం ॥


ఇతర వ్రతములు


పరాకం షష్టకాలం చ 

తథా ధారణపారణం | 

లక్షవర్తివ్రతం చైవ 

భీష్మ పంచకమేవచ ||

తథాలక్షనమస్కారవ్రతం 

లక్ష ప్రదక్షిణం || 

చాతుర్మాస్యే వ్రతాన్యాహుః 

ఏతత్ కామ్యమితీరితం॥


శాకాదివ్రతములే కాక పరాకవ్రతము, షష్ఠకాల వ్రతము,

 ధారణ పారణ వ్రతము, లక్ష ఒత్తుల

 వ్రతము, భీష్మపంచకవ్రతము, లక్ష

 నమస్కార వ్రతము, లక్ష ప్రదక్షిణ

 వ్రతము, తులసీ, గో ప్రదక్షిణము,

 గోదానము ఇత్యాది వ్రతములు

 కూడా చేయుట వలన విశేష

 పలములు లభించును.


‘శ్రావణే వర్జయేత్‌ శాకం 

దధి భద్రపదే తథా!

దుగ్ధ మాశ్వయుజే మాసి 

కార్తికే ద్విదళాం తథా!!’’


శ్రావణ మాసంలో కూరగాయలను,

 భాద్రపద మాసంలో పెరుగును,

 అశ్వయుజ మాసంలో పాలు, పాల

 పదార్ధాలనూ, కార్తీకంలో రెండు

 బద్దలుగా విడివడే పప్పు

 ధాన్యాలూ లేదా పప్పుతో చేసిన

 పదార్ధాలనూ త్యజించాలి.


దీనికి కారణాలు ఏమిటంటే,

 ఋతువులు మారుతున్న

 సమయంలో వ్యాధులు

 ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం

 నుంచి వర్ష ఋతువు, ఆపైన

 శరదృతువు కాలంలో వీటి ప్రభావం

 మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ

 ఋతువుల సంధ్య కాలాన్ని

 యమద్రంష్టలని అందుకే అన్నారు. శాస్త్ర రీత్యా ఆషాఢంలో కామోద్దీపకం హెచ్చు. అందుకే నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాలతో నదులలో నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని నియంత్రించడానికి నియమిత ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు మాసాల్లో చెయ్యాలి. వీటినే చాతుర్మాస్య నియమంగా- ఆరోగ్య రీత్యా చెప్పడం జరిగింది. ఈ నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు, పర్వాలు పేరిట కట్టడి చేయడం కూడా జరిగింది. వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే.


శాక వ్రతము:-


శాక వ్రతములో సకల

కూరగాయలను త్యజించవలెను.

దశవిధములైన శాకములు.

శాకములనగా కేవలము

కూరగాయలని అర్థము కాదు.

చెట్టుకు సంబంధించిన, మూలము,

పత్రము, కరీరము, మొలకలు,

చెట్టు అగ్రభాగము, ఫలములు,

కాండము, వేరు, పండు, దంటు,

చెక్క, పూవు, తొక్క, మొగ్గుచిగురు,

ఆకులు, ఆకుకూరలు, కరివేపాకు, ఇవే మొదలైనవాటిని

శాకవ్రతములో వర్జ్యము.


శాకవ్రతములో స్వీకరించుటకు యోగ్యములు:- బేడలు, తులసీ, అతసీ, బ్రాహ్మీ, మిరియాలు, జీలకర్ర, ఎండుశుంఠి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇంగువ, ఎండిన ఉసిరికాయ ఉపయోగిస్తారు.


ప్రప్రథమముగా చాతుర్మాస్య వ్రత

సంకల్పమును చేసుకొనవలెను.

ప్రథమ మాసములో శాక

వ్రతమును, ద్వితీయ మాసములో

దధి వ్రతమును, తృతీయ

 మాసములో క్షీర వ్రతమును,

నాల్గవ మాసములో 'ద్విదల'

మరియు బహుబీజ వ్రతమును

ఆచరించవలెను.


కర్కాటక సంక్రమణం నుండి కానీ,

అషాఢ శుక్ల దశమి, ఏకాదశి, పూర్ణిమ తిథి నాడు ప్రారంభించి

కార్తీక పౌర్ణమికి సమాప్తి

 చేయవలెను. 


సుప్తే త్వయిజగన్నాథ 

జగత్‌సుప్తం భవేదిదం|

విబుద్ధే చ విబుద్ధ్యేత 

ప్రసన్నోభవ మేకచ్యుత | 

చతురో వార్షికాన్ మాసాన్ 

దేవ దేవ జగత్పతే |

నిర్విఘ్నం సిద్ధిమాయాతు

ప్రసాదాత్ తవకేశవ |

గృహీతే॑స్మిన్ వ్రతే దేవ 

పంచత్వం యదిమేభమే|

తదాభవేత్ సుసంపూర్ణం 

ప్రసాదాత్తే జనార్దన||


ఈ విధముగా ప్రార్థించవలెను. పంచగవ్య శుద్ది చేసుకొని, అచమన, ప్రాణాయామ, సంకల్పంతో శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర రూపాణాం ప్రీతిం కామయమానః చాతుర్మాస్య వ్రతాంగ శాకవ్రత, దధివ్రత, క్షీరవ్రత ద్విదళ వ్రతాఖ్య చతుర్విధ వ్రతం స్వీకరిష్యే.


శాకవ్రత సంకల్పము 

(ఆషాఢ శుక్ల ద్వాదశీ- పూర్ణిమ):


శాకవ్రతం మయాదేవ

గృహీతం పురతస్తవ। 

నిర్విఘ్నం సిద్ధి మాయాతు

ప్రసాదాత్ తే రమాపతే ॥


శాక సమర్పణ:-

ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే । 

శాకంతు ద్విజవర్యాయ 

స హిరణ్యం దదామ్యహం॥


దధివ్రత సంకల్పము : 

(శ్రావణ శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)


దధిభాద్రపదే మాసి 

వర్ణయిష్యే సదాహరే || 

ఇమంకరిష్యే నియమం 

నిర్విఘ్నం కురు కేశవ ॥


దధివ్రత సమర్పణము:-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే !

 ద్విజవర్యాయ దాస్యేంహం

స హిరణ్యం ఘనం దధి ॥


క్షీర వ్రత సంకల్పం 

(భాద్రపద శుక్ల ద్వాదశీ-పూర్ణిమ) : 

క్షీరవ్రతమిదం దేవ 

గృహీతం పురతస్తవ | 

నిర్విఘ్నం సిద్ధిమాయాతు

 ప్రసాదాత్ తే రమాపతే ॥


క్షీరవ్రత సమర్పణ :-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే | 

క్షీరంతు ద్విజవర్యాయ 

స హిరణ్యం దదామ్యహం ॥


ద్విదళవ్రత సంకల్పము:-

 (ఆశ్వయుజ శుక్ల ద్వాదశీ) : 

కార్తికే ద్విదలంధాన్యం 

వర్ణయిష్యే సదాహరే || 

ఇమంకరిష్యే నియమం 

నిర్విఘ్నం కురు కేశవ ॥


ద్విదళ సమర్పణ :-


ఉపాయనమిదం దేవ 

వ్రత సంపూర్తి హేతవే | 

ద్విదలం ద్విజవరాయ 

స హిరణ్యం దదామ్యహం ॥


చాతుర్మాస్యవ్రత సమర్పణ


ఇదం వ్రతం మయాదేవకృతం

ప్రీత్యై తవప్రభో | 

న్యూనం సంపూర్ణతాం యాతు

త్వత్ప్రసాదాత్ జనార్ధన ॥


అదీ కాకుండా, పరివ్రాజకులు గ్రామాల్లో సంచరిస్తే, వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకూ, గృహస్థులకూ ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. అందువల్ల పరివ్రాజకులు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, నాలుగు మాసాలపాటు తమ సమయాన్ని భగవత్‌ చింతనతో పాటు ధర్మ ప్రచారానికే వినియోగించాలని నియమం ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూ ధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా, దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.


🔯

కొత్త దంపతులు

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - VII    



ॐ  కొత్త దంపతులు 


    ఆషాఢ మాసంలో కొత్త కోడలూ, కొత్త అల్లుడూ వారివారి అత్తిళ్ళ గడపలు దాటకూడదు అంటారు. 

   దీని అసలు కారణాలు వెనక్కి వెళ్ళిపోయి, గడపలు దాటకుండా, మిగతా వ్యవహారాలు మాత్రం సాగిపోతున్నాయి. 

    ఈ ఆచారానికి అసలు కారణాలు 


1. మనది ప్రధానంగా వ్యావసాయక దేశం. ఆషాఢ మాసం ప్రారంభంనుంచీ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. 

     కాబట్టి వాటిమీద దృష్టి పెట్టాలి. 


2. నూతన దంపతులు ఆషాఢ మాసంలో కలిసి, స్త్రీ గర్భవతి అయితే, పురుడు వేసవి మధ్య కాలంలో వస్తుంది. స్త్రీకి మొదటి కానుపుకు ఆకాలం అనుకూలం కాదు. 

    అందుకనే దంపతులని ఆ నెల దూరంగా ఉంచడం. 

    కొద్దిరోజుల దూరం మరింత దగ్గరచేస్తుంది కూడా కదా! 


3. అత్తింటి దగ్గర కొత్త కోడలుగా ఉండి, పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అత్తింటి - పుట్టింటి ఆచార వ్యవహారాలవంటివన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ, సమన్వయ పరచుకునే వెసులుబాటు ఆషాఢమాసం వలనే. 

  (ప్రస్తుత residential విద్యా సంస్థల్లో, చేరిన పిల్లలకి మొదట్లో home sick అని సెలవులిస్తారు కదా!)


    పెద్దలు ఎంతో ఆలోచించి, మన శ్రేయస్సుకై అందిచ్చిన ఆచారాలను, యథాతథంగా కొనసాగించాలి కదా! 


                       సమాప్తం 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

పులిచర్మము

 పులిచర్మము వంద, చిఱుత చర్మము అరవై ఐదురూపాయలే.

...............................................................


ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్ననాయి. ఈ జీవులన్నింటిలోను ప్రకృతిశక్తులను అనగా నింగి, నీరు, నిప్పు, గాలి, భూమి మొ॥ వాటిని వుపయోగించు కోవడములో మానవుడే అగ్రగణ్యుడు. అడవిలో బ్రతికే జంతుజాలము  కేవలము ఉదరపోషణకే కష్టపడతాయి. కాని మానవుడు రేపటి తరానికి కూడా తన సంపదలు దక్కాలని చూస్తాడు. మానవుడు చేస్తున్న హననము వలన జీవసమతౌల్యము దెబ్బతిని పర్యావరణము క్షిణించిపోతోంది. 


మానవుడు అడవులను ఆక్రమించడము వలన అందులో జీవించే సాధు క్రూర జంతువులు ఆవాసము ఆహారము కరువై ఊరిబాట పట్టాయి. 


సాధుజంతువులు ఊర్లోపడితే ప్రమాదమేమి లేదు కాని, క్రూర జంతువులు గ్రామాలపై పడితే ప్రమాదమేగా, అందుకే వాటిని మొన్నటి మనిషి చాటుగా నక్కి తుపాకితో కాల్చడము, ఉరులు పన్నడము, ఇనుపక్లిప్పులు అమర్చడము, ఆహారములో విషము పెట్టడము, రహస్యంగా గోతులు తీయడము మొదలైన పద్ధతుల ద్వారా వాటిని చంపేవాడు. కాని నేటి మనిషి చర్మము, గోర్లు, దంతాలు, ఎముకలు మొదలైనవాటి కోసము అడవి జంతువులను చంపేస్తున్నాడు.


ఇక సప్తవ్యసనాలలో వేట ఒక్కటి. బ్రిటిష్ దొరలు వేటనెపముతో బారు తుపాకులతో పులులను సింహాలను చంపి, చచ్చిన వాటిపై కాలుపెట్టి ఫోటోలు దిగేవారు, పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకొన్న జమీందారులు తక్కువేమి కాదు, వారి వేట విలాసానికి వందలకొద్ది మూగ (క్రూర) జీవాలు బలైపోయాయి.


విశాఖపట్నం జిల్లాలో దట్టమైన అడవులుండేవి, అందులో పెద్దపులులు,చిఱుతలు, ఎలుగుబంట్లు, దమ్ములగొండ్లు (హైనాలు)  ఎక్కువగా వుండేవి. (హైనాలను అనంతపురం జిల్లాలో కత్తెగోరకలంటారు).


 ఇవి అప్పుడప్పుడు పశువులపై గ్రామాలపై దాడి చేసేవి. దాంతో ప్రజలు బ్రిటిష్ అధికారులను రక్షించమని వేడుకొన్నారు. బ్రిటిష్ సిపాయిలు పులుల వేట సాగించారు కాని సరైన ఫలితాలు ఇవ్వలేదు. విశాఖ మన్యములో వున్న కొండ దొరలు మాంచి వేటగాండ్లు, దాంతో బ్రిటిష్ అధికారులు పులులను ఇతర మృగాలను చంపే పనినివారికి అప్పగించి, ఒకపులిని చంపి దాని తోలును అప్పచెప్పితే 30రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అయితే అడవినమ్ముకొన్న కొండదొరలు పులులను చంపటానికి ముగపడలేదు. బ్రిటిష్ అధికారుల దోరణి ఒకదెబ్బకు రెండు పిట్టల సామెతలాంటిది కదా ! 


మృగాలనుండి మనుషులను పంటపొలాలను రక్షిస్తున్నామన్న సాకు ఒకటైతే అంతర్గతంగా మృగాల చర్మాలను ఎగుమతి చేసిడబ్బు సంపాదించడం మరో ఉద్దేశ్యము. 


రెండో ఉద్దేశ్యముతో పులి,చిఱుత, నల్లపులులు (పాంథర్), ఎలుగుబంటి, దమ్ములగొండి, నక్క,తోడేళ్ళను చంపి వాటి తోలును అప్పచెప్పినవారికి భారీ నజరానా ప్రకటించారు. ఎంతగానంటే పులికి 100 రూపాయలు,చిఱుతకు 65 రూపాయలు, ఎలుగుబంటికి 40 రూపాయలు, నక్కతోడేళ్ళకు 25 రూపాయలు ప్రకటించారు.


ఆ రోజుల్లో రూపాయి విలువ చాలా ఎక్కువ. వంద రుపాయలకే 10 ఎకరాల మాగాణి వచ్చేది. కనుక బ్రిటిష్ వాడు పన్నిన మాయలో కొండదొరలు చిక్కుకున్నారు.


1863 సంవత్సరము మొదటి ఆరునెలలలోనే  185 పులులను, 360 చిరుతలను, పాంథర్స్ లను, 72 ఎలుగుబంట్లను, 361 హైనాలను చంపేశారు. ఇక నక్కలతోడేళ్ళు వేలసంఖ్యలో హతమయ్యాయి. తాము దైవసమానంగా చూచుకొంటున్న జంతుజాలము ఇలా చంపడము సహించలేక, కొండదొరల కులపెద్దలు ఈ మారణకాండను ఆపాల్సిందిగా కట్టుబాటు చేశారు. దాంతో మృగాల వేట ఆగిపోయింది.


డెహ్రాడూన్‌ లోని ఫొరెన్సిక్ ల్యాబ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్ స్టిట్యూట్ అఫ్ ఇండియా వారు జరిపిన టిష్యూ & DNA, ఇతర పరిశోధనల వలన తేలిందేమంటే 1987 నుండి దేశములో 65 శాతము జంతుజాలము ఆహారము & అక్రమరవాణకు  బలైపోయింది. 5 లక్షల జంతువులు 2010 నుండి 2020 వరకు జరిగిన హింసలో అంటే చంపడము, హింసించడము, జంతువులతో సంభోగము, కాల్లునరకడము వంటి కారణాల వలన విపరీతంగా బాధలు అనుభవించాయి.


ఆటవిక జంతువులను రక్షించటానికి కేంద్రప్రభుత్వము  ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనే పటిష్టమైన చట్టాన్ని తెచ్చింది. కాని తీర్పురావడము ఒక జీవితకాలము లేట్ కదా ! 


ఉదా॥ 1998 లో సల్మాన్ ఖాన్ జింకలను చంపాడని కేసుపెడితే 2018 లో జోధ్‌ పూర్ కోర్టు అతనిని నిందితుడిగా నిర్ణయము చేస్తూ 5 సంవత్సరాల శిక్ష విధించింది. అతనేమో హైకోర్టులో బెయిల్‌ తెచ్చుకొన్నాడు. ఈ కేసు తెగేదెప్పుడు తెల్లారెదెప్పుడు, కేసులు పెట్టడము ఎంత ముఖ్యమో వాటిని పరిష్కరించడము అంతే ముఖ్యం, అప్పుడే మృగవేటగాళ్ళు భయపడతారు.


ఇంకోటుంది, దాని పేరు PETA (People for the Ethical Treatment of Animals), ఉద్దేశ్యము మంచిదే, కాని చర్యలే శూన్యం, అపుడపుడు ఏవో ఒకట్రెండు పేపరులో వార్తలు తప్ప, అడవి జంతువులకు వీరు చేసింది - O.


జంతురక్షణకు ప్రభుత్వకృషి ఎంతగా వున్నా, విరివిగా చెట్లను పెంచితే చాలు 50% జంతుమనుగడ ప్రగతిపథము వైపు వెళుతుంది.


ప్రకృతి ధర్మపీటము వారు అపారంగా చెట్లను పెంచటానికి  నిస్వార్థ, నిర్విరామ కృషి చేస్తున్నారు, వారికి అభినందనలు.


(సేకరణ)

.......................................................... జి.బి.విశ్వనాథ.9441245857, అనంతపురము.

పొడుపు పద్యము

 .  ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యము  …...

ఆ. అందమైన మాట కారక్షరమ్ములు 

కనగ రెండు, మూడు ''దనుజ నగరి''

తొలుగ నవ్వి రెండు దుహిత కిచ్చెడు ఆస్థి 

పదము తెలుప వలయు పసిడి బాల..!

అర్థంకాని శివాలయాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

💐 *శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు* 💐


💐 *మహానంది*  💐

శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.

బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది

ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.


💐 *ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )*

కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.


💐 *ఆదిలాబాద్ జిల్లాలోని  శ్రీ బుగ్గా రామేశ్వరాలయం*

ఈఅలయంలో  శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.


💐 *కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో  నంది* ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్


💐 *అలంపూర్ బాల బ్రహేశ్వర* లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.


💐 *వరంగల్ జిల్లా  వెయ్యిస్తంభాల గుడి*

ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.

ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.


💐 *ద్రాక్షారామం* ఈశివలింగం

 పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.


💐 *భీమవరంలో సోమేశ్వరుడు.*

ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు


💐 *కోటప్పకొండ* ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.

ఇక్కడికి కాకులు అసలు రావు


💐 *గుoటూరు జిల్లా చేజర్ల*

ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి . 

లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే  శవంకుళ్లిన వాసన వస్తుంది.

  ఉత్తరభాగంలో నీరుపోస్తే  అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.


💐 *బైరవకొన* ఇక్కడ కాకులు రావు.

అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.


💐 *యాగంటి* ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు


💐 *శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము* వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట


💐 *కర్నూలు జిల్లాసంగమేశ్వరం* లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.

6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.


💐 *శ్రీకాళహస్తి* లో వాయురూపములో శివలింగం ఉంటుంది.


💐 *అమర్ నాద్* శ్రావణ మాసంలో ఇక్కడ  స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.


💐 *కర్ణాటకలోని శివగంగ* ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.

ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.

మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.


💐 *మహారాష్ట్రలో కోపినేశ్వర్* అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.

నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.


💐 *కంచి.*

 ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.


💐 *తమిళ నాడు తిరు నాగేశ్వరము* 

ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.


💐 *చైనాలో కిన్నెర కైలాసము*

ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు.

సేకరణ: వాట్సాప్ పోస్ట్.

భద్రపరచిన నీరు

 శ్లోకం:☝️

*అంభసః ప్రసృతీ రష్టౌ*

    *రవావనుదితే పిబేత్ l*

*వాతపిత్తకఫాన్ జిత్వా*

    *జీవేద్వర్షశతం సుఖీ ll*

   - మనుస్మృతి


భావం: రాత్రి సంగ్రహించి భద్రపరచిన నీరు ఎనిమిది పుడిసెళ్ళు సూర్యోదయాత్పూర్వము తెల్లవారుఝామున త్రాగినవాడు వాతపిత్తశ్లేష్మ దోషములను జయించి, సుఖముగా నూరేళ్శు బ్రతుకును. అంటే ఓ పెద్ద గ్లాసుడు మంచినీళ్ళు సరిపోతాయన్నమాట.

జేబులో డబ్బు

 జేబులో డబ్బు 

మనం ఇల్లు వదిలి వీధిలోకి వెళ్లినా కూడా జేబులో డబ్బులు వుంటటం అవసరం. డబ్బులు జేబులో లేకపోతె మనం ఏ కార్యం చేయలేము అనేది సత్యం.  పూర్వం ఒక సామెత చెప్పేవారు __రగ పోయిన యాగాని ఉండాలి.  నిజానికి అప్పట్లో కాల కృత్యాలను తీర్చుకోవటానికి ధనంతో పనిలేకుండుండేది. అయినా అప్పుడు ఆ సామెత పుట్టింది.  అదే ఇప్పుడు సులభాకాంప్లెక్స్ లో కాలు మడవటానికి కూడా డబ్బులు వసులు చేస్తున్నారు. 

మనం గ్రామాంతరానికి (వేరే ఊరికి) వెళితే జేబులో కొంచం ఎక్కువ డబ్బులు తీసుకొని వెళతాము.  దూరంగా వుండేవానికి తోడుగా ఉండేది ఏమిటి అంటే అతని వద్ద వున్న డబ్బులు మాత్రమే. అదే వేరే రాష్ట్రానికి వెళితే ఇంకా ఎక్కువ డబ్బులు జేబులో వేసుకొని వెళతాము. అదే విధంగా మనం వేరే దేశానికి వెళ్లాలంటే చాలా డబ్బులు తీసుకొని వెళతాము.  అంతే కాదు మన దేశపు ద్రవ్యం ఆ దేశంలో చెల్లుబాటు కావు కాబట్టి మనం వెళ్లే దేశపు ద్రవ్యంగా మన డబ్బులు మారకం చేసుకొని ఆ దేశపు ద్రవ్యమును తీసుకొని వెళతాము. ఇక వేరే లోకానికి వెళితే ఏమిటి భార్గవ శర్మకు పిచ్చి పట్టిందా వేరే దేశం వరకు మాకు తెలుసు వేరే లోకానికి నేను ఎందుకు వెళతాను అని నీవు అనవచ్చు.  కానీ మిత్రమా నీవు వేరే దేశం వెళతావో లేదో తెలియదు కానీ వేరే లోకానికి మాత్రం మనమంతా ఏదో ఒకరోజు వెళ్ళవలసిందే అందులో ఇసుమంతయు అనుమానం లేదు.  కాబట్టి మన వేరే లోక ప్రయాణానికి వలసినంత ద్రవ్యాన్ని ఇప్పుడే, ఇక్కడే సముపార్జన చేసుకోవాలి. ఇప్పడికే నీకు నేను చెప్పదలచినది అర్ధం అయ్యిందని అనుకుంటాను.

"జాతస్య మరణం ధ్రువం"

జన్మించటం యెంత నిజమో మరణించటం అంత సత్యం.  మనం ఎంతసేపు ఇక్కడ నేను శాశ్వితంగా వుంటాను అనే భ్రాంతిలో ఉంటాము.  ఆలా ఉండకపోతే నిజానికి మనం బ్రతికి ఉండలేము.  కానీ జ్ఞ్యాని అయినవాడు మాత్రమే తాను చూసే ప్రపంచం శాశ్వితం కాదని బ్రహ్మమొక్కటే సత్యం అని తెలుసుకుంటాడు. మనం ఏ కర్మలు చేస్తామో ఆ ఫలితం  పొందుతాము. మనం ఇడ్లి పాత్రలో పిండి వేసి ఉడికిన తారువాట్ దోశలు రావాలంటే రావు.  అదే విధాంగే పెనం మీద పిండి వేసి ఇడ్లి కావాలంటే రాదు.  కాబట్టి నీకు పుణ్య ఫలం కావాలంటే పుణ్య కార్యాలు,  పాప ఫలం కావాలంటే పాపకార్యాలు చేయవలసిందే అందులో సందేహం లేదు. 

పూర్వం ఒక పుణ్యాత్ముడు జీవితంలో పూర్తిగా ధర్మకార్యాలు చేసి సంపూర్ణంగా పుణ్యాన్ని సముపార్జించాడట కానీ ఒక పర్యాయం తన భార్యతో కటువుగా ప్రవర్తించాడట దాని కారణంగా అతనికి పాపం కలిగింది.  మరణానంతరం దేవదూతలు, యమ దూతాలు అతని వద్దకు వచ్చారట ఇతను పుణ్యాత్ముడు కాబట్టి ఇతనిని మేము స్వర్గానికి తీసుకొని వెళతాము అని దేవదూతలు అన్నారట దానికి యమదూతలు మీరు చెప్పింది నిజమే కానీ ఇతను తన భార్యను కఠిన మాటలాడి ఒకసారి మనోవేదనకు గురిచేశాడు కాబట్టి ఆ పాప ఫలంగా ఇతను ఒక్కసారి యమలోక దర్శనం చేసుకొని (అదే అతని శిక్ష) తరువాత స్వర్గానికి వెళ్లవచ్చని యమధర్మరాజు ఆజ్ఞాపించారని చెప్పి యమలోకం చూపించటానికి యమదూతలు ఆతనిని తీసుకొని  వెళ్లారు. ఆ పుణ్యప్తుడు యమలోకంలో విధించే చిత్ర విచిత్ర శిక్షలను చూసి బాధపడ్డాడు.  కాగా అతను అక్కడ వున్నందుకు శిక్షలు అనుభవించే పాపులకు కొంత ఊరట  కలిగిందట. అంత వారు మహానుభావా తమరెవరోకాని మీరు ఇక్కడ ఉన్నందువల్ల మాకు ఊరట  కలుగుతున్నది. కాబట్టి దయచేసి ఇక్కడ వుండవలసిందిగా ప్రార్ధించారట.  వారి మాటలు విన్న ఆ మహానుభావుడు వారి అవస్థలు నేను చూడలేక పోవుచున్నాను అని యమదూతలతో  వారికి ఉపశమనం కలిగించటానికి నేను ఏమి చేయగలను  అని ప్రశ్నించగా దానికి ఆ దూతలు మహానుభావా నీ వద్ద అపారమైన పుణ్యఫలం వున్నది నీవు ఆ పుణ్యఫలాన్ని వారికి దానం చేస్తే దానివల్ల వారు వారి శిక్షలనుండి విముక్తులు  అవుతారు. కానీ మీ పుణ్యఫలం శున్యం కావటం వలన మీరు ఇక్కడ శిక్షలను అనుభవించవలసి ఉంటుంది అని పేర్కొన్నారు. దానికి ఆయన ఇంతమందికి మేలు జరుగుతుందంటే నేను ఎలాంటి శిక్షలు ఐనా అనుభవించటానికి సిద్ధం అని చెప్పి ఆ క్షణమే తన పూర్తి పుణ్య ఫలాన్ని అక్కడి పాపులకు ధారపోసాడు. ఇంతలో ఒక పెద్ద భటుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడి భటులను మీరు ఈయనను ఇంకా ఎందుకు ఉంచారు తక్షణం ఈయనను స్వర్గ లోకానికి పంపాలి అని తొందర పెట్టాడు.  దానికి అక్కడ వున్న యమదూతలు జరిగిన వృత్తాంతం అంతా ఆయనకు వివరించి ఇప్పుడు ఈయన పూర్తీ పుణ్య ఫలాన్ని దానం చేయటం వలన ఇక్కడ వుండవలసి వచ్చింది అని తెలిపారు.  ఆ విషయం ఏమధర్మరాజుగారికి కూడా తెసులుసును కాబట్టే పాప పుణ్య గణన చేసి యముడు గారు ఇతనిని వెంటనే స్వర్గ లోకానికి ఆదేశించారు అని చెప్పారు.  అదెలా సాధ్యం ఇప్పుడు ఇతని వద్ద పుణ్య ఫలం లేదుకదా అని వారు అడుగగా దానికి ఆ భటుడు అయన తన పుణ్యఫలాన్ని పూర్తిగా దానం చేయటం వలన ఆ దానఫలంగా ఇతనికి తన పుణ్యఫలాన్ని రెట్టింపు పుణ్యఫలం లభించింది అని చెప్పి ఆ పుణ్యాత్ముని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. 

కాబట్టి మిత్రమా మనం నిస్వార్ధంగా చేసే ప్రతి కర్మ ఏంటో పుణ్యాన్ని చేకూరుస్తుంది.  ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే వేరే లోకంలోకి పనికి వచ్చే ద్రవ్యాన్ని (పుణ్యాన్ని) సంపాదించుకో నీ జన్మ ధన్యం చేసుకో.  ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి.  ఏదీకూడా ఆచరించటం చెప్పినంత సులువు కానీ  కాదు. కాకపొతే మన శక్తి సామర్ధ్యాలను పట్టి మనం పుణ్యకార్యాలు చేయటం సదా మనకు శ్రేయోదార్యం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

వైద్యో నారాయణో హరిః

 వైద్యో నారాయణో హరిః


1981లో పదకొండు సంవత్సరాల వయస్సులో మొదటి సారిగా పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నాను. మా అమ్మమ్మ తాతయ్యలు స్వామివారికి పెద్ద భక్తులు. ఇంటిలో జరిగే ప్రతీ పెళ్ళికి స్వామివారి ఆశీస్సులు అందుకోవడం పరిపాటి. నా చిన్న చిన్నమ్మ పెళ్లికి ముందు మహారాష్ట్రలోని పండరీపురానికి ప్రయాణమయ్యాము. మాధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి గది తలుపులు తెరవడంతో మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నాను. ఆ గది తలుపులు తెరచినది కూడా ఇప్పటి స్వామినాథేంద్ర సరస్వతి అయిన బాలు మామే. ఇరవై భక్తుల మధ్యలో దాదాపు రెండు గంటల దర్శనానంతరం మరలా మరుసటిరోజు ఉదయం, సాయంత్రం కూడా స్వామివారిని దర్శించుకున్నాము. ఈ మూడు సందర్భాలే స్వామివారిని నేను మొదట దర్శించుకున్నది. భక్తులందరూ స్వామివారిని ఏవేవో ఎందుకు కోరుతున్నారో నాకు అర్థమయ్యేదికాదు. కొంతమంది తమ పిల్లలకు పెళ్లి అవ్వాలని వేడుకున్నారు. ఒకామె తనకు పుత్రభాగ్యం కావాలని కోరుకుంది. మరొకతను ఉద్యోగంలో ఉన్నత స్థానం కావాలన్నాడు. వీటన్నిటికీ సమాధానం స్వామివారి మౌన ఆశీస్సులు మాత్రమే! అమ్మమ్మ తాతయ్యలు పెళ్లిపత్రికను స్వామివారి ముందుంచి ఆశీస్సులను అర్థించారు. రెండురోజుల పండరీపుర యాత్ర పూర్తిచేసుకుని, మంత్రాలయానికి అటునుంచి మద్రాసుకు చేరుకున్నాము. అప్పటిదాకా మా నాన్నగారు స్వామివారిని కలవలేదు. అంతేకాదు వారు ఏ ఆధ్యాత్మిక గురువును కలవడం కూడా నేను చూడలేదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే ఇక్కడితో ఏదో మొదలవ్వబోతోంది అని.


రెండవసారి 1984లో కాంచీపురలో పరమాచార్య స్వామివారి దర్శనం. అంతకు సంవత్సరం క్రితమే చిన్నస్వామివారు కూడా కంచిమఠానికి రావడంతో ముగ్గురిని దర్శించుకోవడానికి వెళ్లాము. అమ్మమ్మ తాతయ్యలకు అది ఎప్పటిలాగానే అధి సాధారణ సందర్శనం. మా అమ్మ రాలేకపోయారు. మా నాన్న మఠానికి సంబంధించిన విషయాల్లో అంతా ఆసక్తిగా ఉండేవారు కాదు. వారు వృత్తినే దైవంగా భావించేవారు. స్వామివారు మా తాతగారి బంధువుల గురించి మా అమ్మానాన్నల గురించి అందరి గురించి అడిగారు. జయేంద్ర సరస్వతీ స్వామివారిని, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని అప్పుడే నేను మొదటిసారి చూడడం. మద్రాసుకు వచ్చి మా పనుల్లో మేము ఉండిపోయాము. అప్పుడే మఠం నుండి ఒక వ్యక్తి మానసిక వైద్యుడైన మా నాన్నగారికి ఫోను చేసి ఒక రోగి గురించి మాట్లాడారు. ఆ రోగి వివరాలు ఏవీ నాకు తెలియవు. కానీ అతను మఠం వ్యక్తులకు సంబంధించిన వ్యక్తి అని అర్థమైంది. మా నాన్నగారు ఆ రోగిని కూడా అందరి రోగుల్లానే వైద్యం చేశారు. అయితే, ఒకరోజు స్వామివారు మఠంలో నాన్నని కలవమన్నారని మఠం నుండి ఫోను వచ్చింది. తీరికలేకపోవడంతో దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఒక ఆదివారం నాటి ఉదయం డ్రైవరుని ఇంటికి రమ్మని చెప్పి కంచికి వెళ్లాలని బయలుదేరారు. రెండు గంటల తరువాత మఠంలో ఉన్నారు. అప్పుడు జరిగిన విషయం ఇదే.


ఒక వ్యక్తి : సార్, మీరేనా డాక్టర్ మాతృభూతం?


నాన్న : అవును.


ఒక వ్యక్తి : టీవీ కార్యక్రమాలు ఇచ్చేది మీరేకదా?


నాన్న : అవును.


ఒక వ్యక్తి : నమస్కారం సార్, నేను కంచి మఠం వాడిని. మేరు ఈరోజు వస్తున్నారని స్వామివారు చెప్పారు. మెకోసమే వేచి చూస్తున్నాము.


ఈ క్షణమే మా జీవితాలను మలుపు తిప్పింది. జీవితాంతం గుర్తుంచుకోతగ్గ పరిణామాలకు ఇది నాంది. ప్రవేశద్వారం వద్ద ఆ వ్యక్తి చెప్పిన మాటలను విని మా తల్లితండ్రులు ఆశ్చర్యపోయారు. మఠంలోనికి వెళ్ళి, వెంటనే సాంప్రదాయ దుస్తుల్లోకి మారి, స్వామివారి వద్దకు వెళ్లారు.


పరమాచార్య : నీ పేరెంటి?


నాన్న : మాతృభూతం


పరమాచార్య : స్వస్థలం?


నాన్న : పెరాళం దగ్గర్లోని కూట్టనూర్. తాతగారు, కుట్టకరై రామసామి అయ్యర్.


పరమాచార్య : ఓహ్! అన్నదానం రామసామి అయ్యరా! అతనికి దీక్షను ఇచ్చింది నేనే. రమణానంద స్వామి.


మా ముత్తాతగారు 1952లో స్వర్గస్తులయ్యారు. ఈ సంభాషణ జరిగింది 1985లో. ఎవరైనా అంతపాత విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. మా నాన్న అసలు నమ్మలేకపోతున్నారు. అప్పుడు వారికి అనిపించింది తను ఒక అసాధారణమైన వ్యక్తితో మాట్లాడుతున్నానని. తరువాత రోగుల గురించి, నాన్నగారి వృత్తి గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ రోగి త్వరగా కోలుకుంటున్నాడని తెలుసుకుని సంతోషంతో ఇద్దరినీ ఆశీర్వదించారు స్వామివారు. ఈ సంఘటన తరువాత నాన్న పూర్తిగా మారిపోయారు. మఠంలోని ఎందరో వారికి స్నేహితులయ్యారు. వారి వైద్యం చేస్తున్న ఆ రోగి వద్ద నుండి డబ్బులు తీసుకోరాదని నిశ్చయించుకున్నారు. తరువాత ఆల్ ఇండియా రేడియోలో ఒక కార్యక్రమానికి వెళ్లారు. అందులో “మనకు పేరు, ఖ్యాతి, ఆరోగ్యం, డబ్బు ఏదైనా దొరకొచ్చు. కానీ మహాత్ముల ఆశీస్సులకు అవి ఏమాత్రం సరితూగవు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి” అని చెప్పారు.


మొదటి దర్శనం తరువాత నుండి ఇద్దరూ తరచూ స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు. స్వామీజీలు అన్న పద్ధతినే తిరస్కరించేవారి జీవితాల్లో ఇదొక పెద్ద విషయం. చాలా సంవత్సరాలు మేము తిరుమల వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాము. కానీ ఒక్కసారి కూడా మా నాన్నగారు సన్యాసులను దర్శించలేదు. కానీ పరిస్థితి మారిపోయింది. అప్పుడప్పుడు నేనూ, నా సహోదరుడు కూడా వారితోపాటు కంచికి వెళ్ళేవాళ్లం. కొన్నిసార్లు మా నాన్నమ్మ తాతయ్యలు కూడా వచ్చేవారు.


అలా వెళ్లినప్పుడు, మా నాన్నగారు వచ్చారని స్వామివారితో చెప్పేవారు మఠం అధికారులు. స్వామివారు వెంటనే “నువ్వు కాసేపు ఇక్కడ కూర్చో” అనేవారు. అప్పుడు నాన్నగారు స్వామివారితో ఎన్నో విషయాలు మాట్లాడేవారు. కూత్తనూరు దగ్గరలోని దేవాలయాల విషయాలను అడిగేవారు. మా తాతగారు కూడా తంజావూరు ప్రాంతం వారే కాక మాజీ రాష్ట్రపతి ఆర్. వేంకటామన్ కు బంధువు. రాష్ట్రపతి గారి గురించి కూడా అడిగేవారు స్వామి. సంభాషణ మరలా ఏదో ఒక రోగి వద్దకు వచ్చేది. ఆరోగ్య పురోగతిని విని స్వామివారు, “నువ్వు మఠానికి ఇంత చేస్తున్నావు! క్షేమంగా ఉండు! ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునిరా” అని చెప్పేవారు. మేము ఆ దేవాలయాలను దర్శించుకుని తిరిగి వచ్చేవారం. మేము వచ్చిన తరువాత ఆ దేవాలయంలో కొందరు వ్యక్తుల గురించి అడిగేవారు. వారు స్వామివారికి చాలా దగ్గరివారేమో, అందుకే అడుగుతున్నారు అని అనుకునేవాణ్ణి.


కొన్ని నెలల తరువాత, ఆ రోగి మఠానికి వెళ్లిపోయాడు. నాకు తెలిసి ఇది జరిగింది 1986లో అనుకుంటా. ఆ రోగి తిరిగి రాగానే, “ఇతడు కోలుకున్నాడా! క్షేమంగా ఉండు! అంతా నీ చలవే” అన్నారు స్వామివారు. మా నాన్నగారికి ఒక శాలువా ఇచ్చి ఆశీర్వదించారు. అప్పుడు స్వామివారు పెద్దగా నవ్వడం నేను గమనించాను. “ఆ సమయంలో నడిచే పరమేశ్వరుడు మమ్మల్ని చూసి మందహాసం చేశాడు అని నేను గ్రహించలేదు!”


అది 1986. తరచూ మఠానికి వెళ్తుండేవారం. స్వామివారితో మా నాన్నగారు సంభాషించేవారు. అద్భుతాలు ఎప్పుడూ ఆగలేదు. మద్రాసు యు.యస్. కాన్సులేట్ అధికారిణి స్వామివారిని దర్శించుకోవడానికి మా నాన్నగారు సహాయం చేశారు. ఆమెకు ఒక విచిత్రమైన ప్రశ్న ఉండేది. తను నాల్గవసారి వివాహం చేసుకోవచ్చా అని. అప్పటికే మూడు సార్లు విడాకులు తీసుకుంది. కారు ప్రయాణించేటప్పుడు పొగ త్రాగుతూనే ఉంది. మఠంలోనికి అడుగుపెట్టగానే ఆపేసింది. స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి ఎదురుగా కూర్చుంది. ఇరువురూ ఏమీ మాటాడుకోలేదు. పదిహేను నిముషాల తరువాత ఆమె పైకి లేచి, స్వామివారికి నమస్కరించి, బయటకు వెళ్లిపోయింది. తరువత మా నాన్నగారికి ధన్యవాదాలు తెలిపింది. నాల్గవసారి వివాహం చేసుకోవద్దని స్వామివారు తనను ఆజ్ఞాపించారని తరువాత తెలిపింది. 1994లో స్వామివారు సిద్ధి పొందిన తరువాత ఒక తమిళ పత్రికలో మా నాన్నగారు ఈ విషయాన్ని వ్రాశారు. అందులో చివర్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. వీరి అవసరం స్వామివారికి ఎలా తెలిసింది? ఇది ఒక చిక్కుముడి. ఇది ఒక రహస్యం. దైవమే ఒక చిక్కుముడి కదా!


1985-86లో అయిదారు సార్లు మఠానికి వెళ్ళిన తరువాత, మఠం కార్యాలయం నుండి నాన్నగారికి కబురు వచ్చింది. “శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు” అన్నది దాని సారాంశం. నేను కూడా వారితోనే ఉన్నాను. నిజానికి మొత్తం కుటుంబం, అత్తలు, మావయ్యలు, పిన్ని, బాబాయిలు, వారి పిల్లలు మొత్తం అందరూ ఉన్నారు. రెండు కార్లను కూడా అద్దెకు తీసుకున్నాము. మఠంలో మేము స్వామివారిని కలిసాము. మమ్మల్ని ఆశీర్వదించిన తరువాత నాన్నగారిని తమ గదిలోకి పిలిచి దాదాపు గంటసేపు మాట్లాడారు. మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాము. తరువాత నాన్నగారు బయటకు వచ్చారు.


వారి సంభాషణ క్లుప్తంగా ఇది.


జయేంద్ర స్వామి : నీ గురించి మఠంలో చాలా మందికి తెలిసినట్టుందే! నీవు ఏ డాక్టరువి?


నాన్న : మానసిక వైద్యుణ్ణి. మద్రాసులో పనిచేస్తున్నాను.


జయేంద్ర స్వామి : నీకు ఒక పని ఉంది. కలవై అని ఒక ప్రదేశం కంచి నుండి 40 కి.మీ. దూరం. అక్కడ ఒక వృద్ధాశ్రమం, శిశుకేంద్రం ఉన్నాయి. మీ కుటుంబంతో సహా వెళ్లి అక్కడ ఉన్నవారికి వైద్య సేవ చేయండి.


నాన్న : సరే, నేను చేస్తాను.


జయేంద్ర స్వామి : నెలకు ఒక్కసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి వెళ్లి వారిని చూడండి.


కలవై స్వామివారు సన్యసించిన స్థలం అని అప్పటిదాకా మాకు తెలియదు. అది స్వామివారి భక్తులకు పరమపవిత్రమైన క్షేత్రం. ఆ శిశుగృహం ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలకోసం. స్వామివారితో సంభాషించిన తరువాత సెలవు తీసుకుని పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నాము. ఈ కొత్త ప్రణాళిక గురించి చెప్పగానే స్వామివారు చాలా సంతోషించి మమ్మల్నందరినీ ఆశీర్వదించారు. కంచిలో కొన్ని దేవాలయాలను సందర్శించి ఇంటికి తిరిగొచ్చాము. ఇప్పటికీ నడుస్తూ మాకు సకల సౌభాగ్యాలను ఇస్తున్న ఆ కార్యక్రమానికి నాంది ఇదే.


కలవైలో ఉన్న వృద్ధాశ్రమము మరియు శిశుగృహంలో ఉన్నవారికి వైద్య సహాయం అందించాల్సిన పనిని నాన్నగారికి అప్పగించారు. జయేంద్ర స్వామివారిని కలిసిన తరువాత, స్వామివారు కొన్ని వారాలపాటు మఠానికి దూరంగా తలకావేరీకి వెళ్ళిపోయారు. స్వామివారు అప్పగించిన పని గురించి ఏం చెయ్యాలో నాన్నగారికి పాలుపోలేదు. మా మేనత్త, మావయ్య మరియు వైద్యులైన మరికొందరికి తరువాతి అడుగు ఎలా వెయ్యాలో అర్థంకాలేదు. ఆ సమయంలోనే ఎస్‌బి‌ఐలో పనిచేసే మా పెదనాన్న తిరుమలకు వెళ్లారు. అక్కడ జయేంద్ర సరస్వతీ స్వామివారు వేంకటాచలపతి గురించి తపస్సు చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవాలని పెదనాన్న నిర్ణయించుకున్నారు. డా. మాతృభూతం పెద్దన్నగా పరిచయం చేసుకుని ఆశీస్సులను కోరారు. తరువాత స్వామివారు నాన్నగారి గురించి మాట్లాడుతూ, “నేనతనికి అప్పగించిన పని మొదలుపెట్టారా?” అని అడిగారు. మా పెదనాన్న నాన్నగారితో ఈ విషయం చెప్పగానే స్వామివారి ఆదేశాన్ని పాలించడానికి సంసిద్ధులయ్యారు.


కంచికి వెళ్ళి పరమాచార్య స్వామివారిని కలిసి తను మొదలుపెట్టబోయే కార్యక్రమం గురించి తెలిపారు.


“అవునా ఇప్పుడే ప్రారంబించాలా?” అని స్వామివారు అన్నారు.


మొత్తం వైద్యుల బృందాన్ని, కుటుంబ సభ్యుల గురించి అడిగారు స్వామివారు. మరలా స్వామివారే, “కలవైకి వెళ్ళేముందు ఈ ఊరికి(గుడికి) వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రా” అని చెప్పారు.


మా నాన్నగారు స్వామివారు చెప్పినట్టే మఠానికి తిరిగొచ్చారు. వెళ్ళగానే “అక్కడ వర్షం పడిందా?” అని అడిగారు స్వామివారు.


స్వామివారు పక్కన కూర్చున్న వ్యక్తి ద్వారా, “అవును స్వామి వర్షం పడింది, అంతా మీ అనుగ్రహం” అని బదులిచ్చారు.


“అలాగా, అయితే ఇన్ని రోజులూ అక్కడ వర్షం పడకపోవడం కూడా నా అనుగ్రహమేనా?” అన్నారు స్వామివారు.


స్వామివారి హాస్య చతురతకు, బుద్ధి కుశలతకు ఆశ్చర్యపోయారు మా నాన్నగారు.


మా నాన్నగారి పర్యవేక్షణలో కలవై కార్యక్రమం మొదలుపెట్టబడింది. ఆశ్రమం వారికి వైద్య సహాయం ఇవ్వడానికి అక్కడకు వెళ్ళడం ఒక సరదా ప్రయాణంలా మొదలుపెట్టాము. పెద్దవారితో కలిపి ఒక నలభై మంది దాకా ఉన్న ఒక చిన్న ఆశ్రమం అది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారి వారి ఆరోగ్యస్థితిని బట్టి మందుల చీటీలు తయారుచేసేవాళ్లం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పట్నంలో ఉండే యువకుల కంటే అక్కడ ఉన్న డెబ్బై సంవత్ర్సరాల పైబడ్డ ముసలివారే ఎక్కువ ఆరోగ్యంగా ఉండడం. యథాప్రకారం స్వామివారు సన్యసించిన స్థలాన్ని దర్శించుకుని అందరూ కంచికి బయలుదేరారు. అక్కడ జరిగిన విషయాలన్నిటిని స్వామివారికి విన్నవించారు మా నాన్నగారు. కొంతమంది వైద్యులు ఆసుపత్రిలో మా నానగారి విద్యార్థులే. ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములవ్వడం వారికి చాలా సంతోషంగా ఉంది. అప్పుడే స్వామివారి వద్దకు ఒక పేదవాడు వచ్చి బంగారం అడగడం గమనించారు మా నాన్నగారు.


పేదవాడు : నేను నా కుమార్తె వివాహం చెయ్యాలి, దానికి కావాల్సిన బంగారం నావద్ద లేదు. నాకు పదకొండు సవర్ల బంగారం కావాలి.


స్వామివారు : కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మను వేడుకో. తిరిగి రా, అమ్మ నీకు ఇస్తుంది. 


స్వామివారు చెప్పినట్టుగానే చేసాడావ్యక్తి. కొన్ని నిముషాల తరువాత ఒక ధనవంతుడు వచ్చి పన్నెండు సవర్ల బంగారం సమర్పించాడు. కొద్దిసేపటి తరువాత ఆ పేదవాడు వచ్చి వెళ్లిపోవడానికి అనుమతి కోరాడు.


స్వామివారు : అమ్మను వేడుకున్నావా?


పేదవాడు : వేడుకున్నాను స్వామి.


స్వామివారు : బంగారం దొరికిందా?


పేదవాడు : లేదు.


స్వామివారు : ఎంత అడిగావు?


పేదవాడు : పదకొండు సవర్లు.


స్వామివారు : నాకు తెలుసు నీకు అత్యాశ లేదు అని. పేదవాడివైనా నిజాయితీపరుడివి. ఈ పన్నెండు తీసుకుని నీ కుమార్తె పెళ్లి జరిపించు.


పన్నెండు సవర్ల బంగారాన్ని ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు. ఆ పేదవాడు మఠం నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మా అమ్మనాన్న ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ ఈ సంఘటనను తలచుకుంటే కేవలం స్వామివారి కరుణ తప్ప మరేమీ కనబడదు.


స్వామివారితో మా తల్లితండ్రుల ప్రయాణం ప్రారంభం అయ్యింది. ఈ సేవాకార్యక్రమం మొదలు పెట్టిన కొన్ని నెలల్లోనే, చిన్నతనం నుండి నాకు తెలిసిన ఎందరో మా నాన్నగారి మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు. కుటుంబ వైద్యులు మాత్రమే ఉన్న చిన్న సమూహం ఇప్పుడు పది మంది వైద్యులతో పెద్ద కుటుంబం అయ్యింది. ప్రతి నెలా ఆదివారం ఈ కార్యక్రమం జరిగేది. అందరూ మాయింట్లో సమావేశం అయ్యి, కావాల్సిన మందులు, పరీక్ష సామాగ్రి అన్నీ ఎక్కించుకుని కంచికి ప్రయాణమయ్యేవారు. స్వామివారిని దర్శించాలని మఠం అధికారులకు సమాచారం ఇచ్చేవారు. మఠం అధికారులు స్వామివారితో, “కలవై వైద్యులు వచ్చారు” అని చెప్పేవారు.


పరమాచార్య : నా వద్దకు రమ్మని చెప్పండి. కొద్దిసేపు నా వద్ద కూర్చుని తరువాత కలవై వెళ్ళమని చెప్పు.


దాదాపు ఇరవై నిముషాలపాటు స్వామివారి సన్నిధిలో గడిపేవారం. ఎందరో భక్తులు కేవలం స్వామివారి క్షణవీక్షణం కోసం పరితపించేవారు. “స్వామీ దయచేసి నన్ను ఈ కష్టం నుండి బయటపడవేయండి, భరించడం నావల్ల కావట్లేదు” అని ఎందరో స్వామివారిని వేడుకోవడం నా కళ్ళారా చూశాను.


చాలాసార్లు నన్ను ఆలోచింపజేసిన ఏమిటంటే, నమ్మకానికి మించి ఇలా ఎలా వేడుకోగలరు? ఎందుకు స్వామివారు వారికి నేరుగా సమాధానం ఇవ్వలేదు? కేవలం ఒకసారి వారిని చూసి, ఆశీర్వదించి మౌనంగా ఉండిపోయేవారు. “అసలు ఇలా కష్టాలు చెప్పుకోవడానికి మనకు హక్కు ఉందా?” అని వారిని చూసినప్పుడల్లా నాకు అనిపించేది.


వైద్యుల బృందంతో మాట్లాడి కలవై ఆశ్రమం గురించి వివరాలు అడిగేవారు. ఒక్కోసారి మా నాన్నగారు ఆశ్రమానికి దానం చేసే ఎవరైనా పెద్ద దాతను పిలుచుకునివెళ్ళేవారు. స్వామివారు వారిని చూసి, “ఇంతగా మఠానికి సేవ చేస్తున్నది నువ్వేనా? సంతోషంగా ఉండు” అని దీవించేవారు.


మేము సెలవు తీసుకుని కలవై ఆశ్రమానికి వెళ్ళేవాళ్లం. ఆశ్రమవాసులకు వైద్యం, సేవ కొన్ని గంటలపాటు జరిగేది. మా నాన్నగారు ముఖ్యంగా వీటన్నిటినీ నిర్వహిస్తూ ఎప్పుడైనా ఎవరికైనా మానసిక సమస్యలు వస్తే చూసేవారు. మాతోపాటుగా వచ్చే కొంతమంది వైద్య కళాశాల విద్యార్థులు వుండేవారు. వైద్యం చెయ్యడంలో సలహాలు, సూచనలు తీసుకునేవారు. అది చెన్నైలోని పెద్ద వైద్యుల చిన్న వైద్యశాల అయిపోయింది. “నా జీవితంలో ఎన్నో వేల మందికి వైద్యం చేశాను కానీ, సేవ చెయ్యడంలో ఉన్న ఈ సంతోషాన్ని ఎప్పుడూ పొందలేదు” అని చెప్పేవారు. ఈ కార్యక్రమం మొత్తం మా నిధులతోనే జరిగేది. ఇది మా కుటుంబసభ్యులకు, స్నేహితులకు మాత్రమే తెలుసు. అంతేకాదు, “నువ్వు ధర్మం చెయ్యకపోయినా పరవాలేదు కానీ, చేశానని మాత్రం ఎప్పుడూ చెప్పుకోకు. ఇదే హిందూ ధర్మం” అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు. ఎంత నిజం ఇది!!


వైద్యసేవ కార్యక్రమం పూర్తయిన తరువాత కంచికి తిరిగొచ్చి మొత్తం విషయాలను స్వామివారికి తెలిపేవాళ్లం. స్వామివారు ఎప్పుడూ అడిగే విషయాలు అక్కడి ఆశ్రమ అధికారులు ఏం చేశారు? మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? అని. కార్యక్రమం తరువాత మమ్మల్ని చూడడం స్వామివారు ఎప్పుడూ మానలేదు. ఆరోగ్యం బాగోలేక, శరీరం సహకరించకపోయినా, పడుకున్న వారు పైకిలేచి ఆశీస్సులు అందించేవారు. అంతా మా నాన్నగారే చేస్తున్నారు కాబట్టి నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తరువాత తెలిసింది మేము అలా చెయ్యడానికి కూడా స్వామివారే కారణం అని.


మా బృందం చేసిన గొప్ప పనులన్నీ స్వామివారి అనంతమైన కృప వల్ల మాత్రమే అని చాలా రోజులు నేను విస్మరించాను!


కార్యక్రమాల కోసం కలవై వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు నేను కూడా వారితోపాటు వెళ్ళేవాణ్ణి. కొన్నిసార్లు వెళ్లలేకపోయేవాణ్ణి. నేను అప్పుడే కళాశాలకు చేరడం వల్ల, వారాంతాల్లో నేను చెన్నైలో వుంటే తప్పక వెళ్ళేవాడిని. చదువుల కోసం చిదంబరంలో వుండడం వల్ల వెళ్ళడం తగ్గించాను. అలా ఒకసారి వెళ్ళినప్పుడే ఈ సంఘటన జరిగింది.


మా నాన్నగారి అన్నగారు (అయిదుగురిలో మా నాన్న చిన్నవారు) వచ్చి స్వామివారిని దర్శించి తనను తాను బ్యాంకు రీజనల్ మేనేజరుగా పరిచయం చేసుకుని స్వామివారితో మాట్లాడారు. తిరుపతిలో జయేంద్ర స్వామివారితో జరిగిన సంభాషణను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మేము వుండగానే స్వామివారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన వ్యాపార వ్యవహారం గురించి తన స్థితి గురించి స్వామివారికి చెబుతున్నాడు. తనతోపాటుగా కలిసి వుంటున్న తన బంధువుల గురించి, వారి ఆరోగ్యస్థితి గురించి చెప్పాడు. హఠాత్తుగా స్వామివారు ఒక విషయం అడిగారు.


స్వామివారు : చెన్నైలోని అభిరామపురంలో నీకు రెండు ఇళ్ళు వున్నాయి కదూ?


వచ్చిన వ్యక్తి : అవును, రెండు ఇళ్ళు వున్నాయి.


స్వామివారు : మరి మఠం కోసం ఏం చేయాలని అనుకుంటున్నావు?


వచ్చిన వ్యక్తి : మఠం కోసం తీసుకున్న వీటన్నిటినీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. 


అలా కొద్దిసేపు వారి సంభాషణ సాగింది. కొద్దిసేపటి తరువాత స్వామివారు మాతో, “ఓ, కలవై వైద్యులందరూ ఇంకా ఇక్కడే వున్నారా? నేను ఇంకా వీళ్ళకు అనుమతి ఇవ్వలేదా? సరే అందరూ వెళ్లిరండి” అని చెప్పారు.


అది చాలా చిన్న సంఘటనే కావచ్చు. ఆ వచ్చిన వ్యక్తికి అభిరామపురంలో రెండు ఇళ్ళు ఉన్నాయని స్వామివారికి ఎలా తెలుసు?


కేవలం కలవై ఆశ్రమవాసుల వైద్య సహాయం కోసం మా నాన్నగారు ‘శ్రీ కంచి పరమగురు మెడికల్ ట్రస్ట్’ ను స్థాపించారు. కాళహస్తి ఆశ్రమంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపడానికి స్వామివారిని అడిగారు. కానీ అందుకు స్వామివారి అనుమతి లభించలేదు. మా నాన్నగారు తలపెట్టిన కార్యక్రమం అలా కొనసాగుతోంది.


నేను చిదంబరంలో చదువుతున్నప్పుడు మాటల మధ్యలో నా స్నేహితునికి నాకు కంచి స్వామివారికి వున్న పరిచయాన్ని చెప్పాను. దాంతో అతను మరొక విషయం చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారు పాండిచ్చేరిలో ఉన్నప్పుడు నా స్నేహితుని తాతగారు స్వామివారికి త్రాగడానికి నీళ్ళిచ్చారు. 1980లలో స్వామివారు మరలా వచ్చినప్పుడు నా స్నేహితుడు, అతని తాతగారు స్వామివారి దర్శనానికి వెళ్లారు. కానీ భక్తుల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల లోపలకు వెళ్లలేకపోయారు.


తాత : కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడకు వచ్చినప్పుడు నేను వారికి నీళ్ళు ఇచ్చాను. బహుశా స్వామివారు మరచిపోయారు అనుకుంటాను.


కొద్ది నిముషాల తరువాత.


ఒక వ్యక్తి : ఇక్కడ పళనిపిళ్ళై ఎవరు?


తాత : నేనే పళనిపిళ్ళైని.


ఆ వ్యక్తి : స్వామివారు మిమ్మల్ని లోపలకు రమ్మంటున్నారు.

ఇప్పటికీ నాకు ఈ సంఘటన గుర్తుకువస్తే నమ్మబుద్ధి కాదు. స్వామివారికి అంతా తెలుసు.


మరొకసారి కంచికి వెళ్లినప్పుడు మా తాతగారి చిన్న తమ్ముడు జయేంద్ర స్వామివారిని కలవడానికి వచ్చారు. ఇరవై అయిదు సంవత్సరాల తరువాత వారిని దర్శనం చేసుకుంటున్నారు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు మా తాతగారు నాతో చెప్పిన విషయం.


తాత : ఒరేయ్! సరస్వతీ అమ్మవారికి ఒక ప్రత్యేక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఈ స్వామివారే నాకు చెప్పారు. నేను రోజూ చెప్పుకుంటాను. ఇది చాలామందికి దొరకని గొప్ప అవకాశం, తెలుసా?


నేను : ఓహ్, అలాగా!


కొద్దిసేపటి తరువాత.


జయేంద్ర స్వామి : కాశీ, నీవు ఆ మంత్రాన్ని జపిస్తున్నావు కదూ?


ఇన్ని సంవత్సరాల తరువాత మా తాతగారి పేరును స్వామివారు ఎలా గుర్తుపెట్టుకున్నారు? అద్భుతాలు ఎప్పటికీ ఆగిపోవు.


--- శ్రీ భాస్కర్ మాతృభూతం. vandeguruparamparaam.blogspot.in నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం