3, మార్చి 2026, మంగళవారం

పంచాంగం

 


భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం

 శ్రీరామ (100)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఎవరికి సులభంగా రాదు.

ఎప్పుడైనా, మనకు అపకారం చేసిన వారెవరైనా ఆపదలలో చిక్కుకుంటే " భగవంతుడు ఉన్నాడండీ. చేసిన పాపం ఊరికే పోతుందా " 

అంటాము. 

ఆ మాట కూడా భగవంతుడి మీద నమ్మకంతో చెప్పింది కాదు. 

మనకు అపకారం చేసినవాడిపై ఉన్న కసితో అన్నది.


ధూర్జటి మహాకవి కూడా, ఎంత వేదాధ్యయనం చెసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, భగవంతుడు వున్నాడా, అన్న విషయంలో తనకు ఇంకా సందేహం తీరలేదు అంటున్నారు. 


అంతేకాదు ఆ నమ్మకం కూడా నీవే కలిగించాలి స్వామి ! అని శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఇలా వేడుకుంటున్నారు :


మ// పరిశీలించితి మంత్ర తంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యో/

గ రహస్యంబులు, వేద శాస్త్రములు వక్కాణించితిన్ శంక వో/

దరయం గుమ్మడి కాయలోని యవ గింజంతైన, నమ్మించి సు/

స్థిర విజ్ఞానము త్రోవ జెప్పగదవే, 

శ్రీ కాళహస్తీశ్వరా//


(ఎన్నో మంత్ర శాస్త్రములు, తంత్ర శాస్త్రములు, క్షుణ్ణంగా పరిశీలించాను. 

సాంఖ్యము, యోగము,మొదలైన శాస్త్ర రహస్యాలనన్నింటినీ, గురువుల యొద్ద చక్కగా శ్రవణం చేసాను.

వేదములు, శాస్త్రములు అభ్యసించి, వాటిమీద ఉపన్యాసములు ఇచ్చాను.

అయినా నీ ఉనికి విషయంలో నా సందేహం పోలేదు. 

 నా అజ్ఞానం గుమ్మడికాయంత ఉంటే, ఇన్ని శాస్త్రాలు చదివినా ఒక ఆవ గింజంత అయినా నా సందేహం తీరలేదు. 

ఏ నిదర్శనమైనా చూపించి భగవంతుడు ఉన్నాడన్న గట్టి నమ్మకం నాకు కలిగించు స్వామీ.

ఓ ! శ్రీకాళహస్తీశ్వరా ! దయతో నాకు సుస్థిర విజ్ఞానం కలుగజేసి నన్ను అనుగ్రహించు).


కాబట్టి ఈశ్వరుని శరణు పొందటమే అన్ని సమస్యలకు పరిష్కారం అని మనం గ్రహించాలి.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

3-3-'26

హోళికా పర్వము

 ఓం శ్రీ మాత్రే నమః 

3-3-26

హోళికా పర్వము


హోళీ పర్వము హేళికా యనునదే యుక్తంబుగా మానవుల్ 

కేళిన్ మిత్రుల తోడ సంబరములన్ క్రీడించుచున్ మైత్రి సం

బాళింపన్ గనుచున్ వసంతునికి ఆహ్వనమ్ములన్ పల్కి గా

నాలాపంబుల మన్మథున్ ప్రకృతి సమ్యక్ దృష్టి ప్రార్థింపనౌ ||1


వేసవిలో వసంత ఋతువే రమణీయము మానవాళికు

ల్లాసము గూర్చు నీ ప్రకృతి లాస్యములన్ తిలకింప చిత్తమం 

దాసలు చుట్టుముట్టి పులకాంకురముల్ గను మేను ఇట్టి ఆ

వాసములన్ సృజించు భగవానుని అక్షరు లీలలెన్నెదన్ ||2


కాముడు జీవ కోటి యెద కామ్యపు కాంక్షల సృష్టి సేయు, ఆ 

కామితముల్ కనన్ తగు వికారములన్ సృజియించు చుండినన్ 

కోమలమైన భావముల కూర్మి మనోరథ సిద్దిగా పరం 

ధాముని ధర్మ బద్ధ సుపథమ్ముల వర్తిలు చుండగా వలెన్|| 3



మిత్రులందరికీ హోళీ మహోత్సవ పర్వ దిన శుభాకాంక్షలూ నమస్సులతో 


మీ

డా.రఘుపతి శాస్త్రుల 

విశ్రాంత ప్రాచార్యులు 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల

హోళీ పండుగ

  పద్యభారతి

🌸హోళీ పండుగ


తేటగీతి మాలిక 


వీధిలోన పిల్లలు చేరి వింతగాను

కామదహనముచేయును ఘనముగాను

హోళిహోళీయనచునికమేళ తాళ

ములనువాయించుకొనుచును ముదముతోడ

రంగులనుపూసుకొందురు  రమ్యముగను

రాజు పేదభేదములేదు రంగులకును

పిల్లలుమిఠాయితిందురు ప్రీతితోడ

సాహితీ శ్రీ జయలక్ష్మి

శ్రీమహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 2 మార్చి 2026*


        *శ్రీమహావిష్ణు పురాణం*                

             *13వ భాగం*


*అష్టాక్షరీ మంత్ర విశిష్టత*```


బ్రహ్మ ఆదేశాన్ని పాటించి విశ్వకర్మ భూమండలాన్ని సప్త ద్వీపాలుగా సప్త సముద్రాలు పరివేష్టితమై ఉండేటట్టు చేశాడు. భూమండలానికి ఊర్థ్వలోకాలకి మధ్యగా భూమి ఉపరితలం పై లోకాలోక పర్వతం ఏర్పడింది. భూమికి అంతరిక్ష లోకాలకి మధ్య ఉండటం చేత ఈ పర్వతానికి లోకాలోక పర్వతం అని పేరు వచ్చింది.


బ్రహ్మదేవుని మానసోత్తర పర్వతం నుంచి సుమేరు పర్వతం దాక చిత్రవిచిత్రమైన బంగారు కాంతులతో ప్రకాశించే భూమి ఉంది. ఈ ప్రదేశంలోకి ప్రవేశించిన ఏ ప్రాణి తిరిగి కన్పించదు. మాయమై పోతుంది. కనుక ఇది నిర్జన ప్రదేశం. ఎవ్వరూ ఉండరు.  ముల్లోకాలకు వారథిగా నిర్మితమైన ఈ పర్వతశిఖరాలను తాకుతూ సూర్య చంద్ర నక్షత్రాది గ్రహ కాంతులు ముల్లోకాలలో ప్రసరిస్తూ ఉంటాయి.

బ్రహ్మదేవుడులోకాలోకపర్వతపు నాలుగు దిక్కులలో  ఋషభం, పుష్పఛూడం, వామనం, అపరాజితం అనే నాలుగు దిగ్గజాలను నిలిపాడు. సమస్త లోకాలకు ఇవి స్థితి హేతువులు. ఈ దిగ్గజాల పైన నిర్మితమైన వైకుంఠం లో ఏడు ద్వారాల తరువాత భగవంతుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఆదిశేషువు పై పవళించి ఉంటాడు. విష్వక్సేనుడు మొదలైన పరివారం వారిని సేవిస్తుంటారు.


విశ్వకర్మ సహాయంతో పద్నాలుగు లోకాలు బ్రహ్మదేవుడు సృష్టించిన తరువాత ఆలోచనలో పడ్డాడు.


"పద్నాలుగు లోకాలలో నివసించే  వారిని ఎలా సృష్టించాలి? తనకు పద్నాలుగు లోకవాసులను సృష్టించే శక్తి ఉందా? విశ్వకర్మను సహాయంగా పంపినట్టే శ్రీమహా విష్ణువుని  పద్నాలుగు లోకాల జీవుల సృష్టిలో సహాయం చేయగలవారిని పంపమని అడగాలి" అని మనస్సుని స్థిర పరుచుకుని బ్రహ్మదేవుడు అష్టాక్షరి మంత్రమైన ‘ఓంనమోనారాయణాయ’ జపిస్తూ ధ్యానంలోకి వెళ్లాడు. 


శౌనకాది మునులు సూత మహామునిని అష్టాక్షరి మంత్ర విశిష్టతను చెప్పమని కోరారు. 

సూత మహర్షి చెప్పసాగాడు..

‘అష్టాక్షరి మంత్రం’ మహత్మ్యం  పూర్తిగా చెప్పగలవారు ముల్లోకాలలో లేరు. ఒకటి మాత్రం సత్యం. కలియుగంలో సులభంగా మానవులకు మోక్షం ప్రసాదించగల శక్తి ఈ నారాయణ మంత్రానికి మాత్రమే ఉంది. లయకారుడైన మహేశ్వరుడు సదా ఈ నారాయణ మంత్రం జపం చేస్తారు. 


"ఓం నమో నారాయణాయ"


ఎనిమిది బీజాక్షరాలతో ఈ మంత్రం ఉండటం వలన అష్టాక్షరీ మంత్రం అయ్యింది. 

ఈ మంత్రంలో "ఓం" ఆత్మ స్వరూపాన్ని, "నమః" బుద్దిని,  "నారాయణాయ" పంచేంద్రియాల తో కూడిన జీవుని సూచిస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం వ్యాపక మంత్రం. ఆకాశ తత్త్వంపై ఆధారపడి ఉంటుంది. అందు వలన ఈ మంత్ర జపం చేసే సాధకుడి మనస్సంతా నారాయణ మంత్రం వ్యాపించి పోతుంది.


అష్టాక్షరీ మంత్రంలో ప్రధమాక్షరం ‘ఓంకారం’ సూక్ష్మంలో మోక్షం ప్రసాదించే సాధనం. ఓం కార జపం వలన అనేక ప్రయోజనాలు కలుగు తాయి. విశ్వంలో శ్రీమహావిష్ణువు నుంచి వెలువడిన ఆది ప్రణవ నాదం ఈ ‘ఓం’కారం.


రెండవ అక్షరం ‘న’ అంటే నశింప చేయడం. ఐహిక భౌతిక సుఖాల పైగల మోహాన్ని నారాయణుడు నశింప చేస్తున్నాడు.


మూడవ అక్షరం ‘మో’ అంటే నారాయణుడు మనలో గల మోహాన్ని నశింప చేసి, సత్య దర్శనం చేయించి, జ్ఞాన జ్యోతి వెలిగించి, జననమరణ చక్రబంధం నుండి విముక్తి కలిగించి ‘మోక్షం’ ప్రసాదిస్తాడు.


నాలుగవ అక్షరం ‘నా’ అనగా ఆద్యంతాలు లేని నాద స్వరూపుడు నారాయణుడు. 

నారాయణ స్వరూపం తెలియ జేస్తుంది.


#ఐదవ అక్షరం "రా"  జనులందరిని రజింప చేయువాడు నారాయణుడు అని సూచిస్తుంది. రామచంద్రునిగా అవతారం ధరించి సకల జగత్తును రమింప చేశాడు.


#ఆరవ అక్షరం ‘య’ కారం యజ్ఞ సూచకం. యజ్ఞ స్వరూపుడైన భగవంతుని స్వరూపం తెలియజేస్తుంది.


*ఏడవ అక్షరం ’ణా’ నారాయణుని విశ్వ వ్యాపకత్వం తెలియజేస్తుంది.  అన్నిటిలో తనే ఉంటూ తనలోనే జగత్తును దాచుకునే తత్త్వ స్వరూపుడు.


#ఎనిమిదవ అక్షరం ‘య’ రెండవసారి ఎందుకు వచ్చిందంటే, యజ్ఞ కర్త, యజ్ఞ భోక్త  నారాయణుడే కదా! యజ్ఞ స్వరూపము శ్రీహరే! యజ్ఞ ఫలం స్వీకరించేది శ్రీహరే!


ఇక అక్షర ఫలం వినండి. ‘న’ అక్షరం పలకడం వలన స్వర్గ భోగాలు లభిస్తాయి. ‘ర’ అక్షరం పలకడం వలన రామరాజ్యం లోని భోగాలు పొందవచ్చును.  ‘య’ అక్షరం వలన కుబేరుని వలె సర్వ సౌభాగ్యాలు పొంద వచ్చును. ‘ణ’ అక్షరం పలకడం వలన మోక్ష మార్గము సుగమం అవుతుంది.```


*#అష్టాక్షరీ మంత్ర జప విధానం:* ```


సంకల్పం, కరన్యాస అంగ న్యాసాల తరువాత ధ్యాన మంత్రంతో ధ్యానచేయాలి.  అష్టాక్షరి మంత్రాన్ని సాధకులు శక్త్యానుసారము కనీసం 108 సార్లు జపించాలి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గ్రహణ ఆచరణ

 ✨గ్రహణ ఆచరణ లేదు

పగటిపూట చంద్రగ్రహణం ఉన్నందున ఎటువంటి ఆచరణ లేదు. కేవలం మోక్షస్నానం చేస్తే సరిపోతుంది.

అందువల్ల ఎవరూ గాబరా పడి శాంతి మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు.

🔅అహ్ని చాంద్రం న దర్శనం, రాత్రౌ న దర్శనం సౌరమ్ ।

అగోచరే తు నైవాస్తి స్నాన-దాన-జపాదికమ్ ॥

పగటిపూట చంద్రగ్రహణం దర్శనమవదు. అలాగే రాత్రిపూట సూర్యగ్రహణం దర్శనమవదు. కనుక కంటికి కనిపించని (అగోచరమైన) ఇటువంటి గ్రహణాలకు స్నానం, దానం, జపం, తపస్సు వంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు.

ఈ విషయమై ధర్మసింధు మరియు నిర్ణయసింధు గ్రంథాలలో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది:

🔅గ్రహణం న భవేత్ రాత్రౌ భానోః, చంద్రస్య చాహని |

తదదృష్టిర్న దోషాయ తస్మాత్ స్నానం న కారయేత్ ||

రాత్రిపూట సూర్యగ్రహణం ఉండదు, అలాగే పగటిపూట చంద్రగ్రహణం ఉండదు (అంటే కనిపించదు). అవి దర్శనమవకపోవడంతో ఎటువంటి దోషం లేదు. కాబట్టి ఆ సమయంలో గ్రహణస్నానం, సూతకాలు చేయకూడదు.

🔅స్పర్శకాలే యదా సూర్యః చంద్రో వా నైవ దృశ్యతే |

తదా న సూతకం ప్రోక్తం మునిభిః తత్త్వదర్శిభిః ||

గ్రహణ స్పర్శకాలంలో (ఆరంభ సమయంలో) సూర్యుడు లేదా చంద్రుడు కనిపించనట్లయితే, తత్త్వజ్ఞానులైన మునులు ఎటువంటి సూతకాన్ని విధించలేదు.

✨గ్రస్తోదయ

గ్రహణం పట్టి ఉన్నప్పుడే సూర్యుడు లేదా చంద్రుడు ఉదయిస్తే దాన్ని “గ్రస్తోదయ” అంటారు. అంటే మనకు గ్రహణ ఆరంభం కనిపించదు, కానీ మధ్య భాగం లేదా అంత్యం కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో సూర్యుడు/చంద్రుడు ఉదయించి దర్శనమైన క్షణం నుండి సూతకం ప్రారంభమవుతుంది. గ్రహణ మోక్షం (అంత్యం) అయిన తరువాత స్నానం చేయాలి.

అందువల్ల ఈ గ్రహణానికి సంబంధించిన ఆచరణ కేవలం మోక్షకాల స్నానం మాత్రమే.

పూజ – శాంతి – హోమ మొదలైన వాటితో మోసపోవద్దు. ప్రస్తుతం కొన్ని మాధ్యమాలలో దీనిని ఒక వ్యాపారంగా మార్చిన విషయం విచారకరం. అందుకే ఈ సూ1195010481చన ఇస్తున్నాము.

ఆపస్తంబుడు

  ఆపస్తంబుడు అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)

యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.

ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు. 

కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు. 

బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు. 

కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు. 

అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.

దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సాంప్రదాయం కదా.) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు

కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు. 

కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.

అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు. 

కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు. 

దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు. 

దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.

జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది. 

ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.


సేకరణ

చంద్రవిద్యా

🌹. చంద్రవిద్యా🌹


మనువు తరువాత శ్రీ విద్యను ఉపాసించిన వాడు చంద్రుడు. 

కనుక ఈ శ్రీవిద్యను చంద్రవిద్యా అన్నారు. చంద్రునివి పదహారు కళలు అంటే షోడశ కళలు. 

షోడశీ విద్య అనగా చంద్రవిద్యయే. అదే శ్రీవిద్య. సుధాంశుడు కనుక చంద్రుడు సోముడయ్యాడు. 

తన అమృతధారలతో సృష్టిని పోషించేవాడు సోముడు. 

స ఉమా, సోమ అని భావం. ఉమతో కూడిన శివుడు కూడా సోముడు. 

కనుక శివుడు, ఉమా ఇద్దరి అంశా కలసిన శక్తి చంద్రుడు. 

అందువలన చంద్ర విద్యా అంటే, శివ శక్తి సమ్మేళనం. 

ఈ రెండూ కలిస్తేనే, సృష్టి, ఈ రెండూ కలిస్తేనే పూర్ణత్వం. 

అటువంటి శివశక్తి సమ్మిళితమైన, ఆ చంద్రవిద్య కు వందనం. 🌹


🌹చంద్రమండలమధ్యగా 🌹


చంద్రుడంటే శివ శక్తి సమ్మేళనమైనప్పుడు, ఆ చంద్రమండలమే శ్రీ చక్రము. 

ఆ శ్రీచక్రమధ్యంలో బిందురూపిణివలె అమ్మ దీపించుచున్నది. 

అందుకే ఈ నామంలో అమ్మను చంద్రమండలమధ్యగా అన్నారు. 

సహస్రారము చేరిన తరువాత శివ శక్తి సమ్మేళనము జరిగి షోడశకళలూ ప్రకాశవంతమవుతాయి. 

అపుడు ఆ మండలం మధ్యలో శ్రీలలిత జ్వాజ్వల్యమానంగా దర్శనమిస్తుంది. 

ఈ సర్వ జగత్తూ చంద్రాగ్నులచే నిండి వున్నది కనుక దీనిని అగ్నిషోమాత్మకం అంటారు. 

శివుడు స్వయముగా తాను అగ్ని యొక్క శిరోభాగములో ఉంటే, 

అమ్మవారు చంద్రుని యొక్క శిరోభాగములో వున్నదని చెపుతాడు. 

శివుడు, శక్తి ఇద్దరూ కలిసి ఈ అగ్నిసోమములుగా జగత్తంతా వ్యాపించి వున్నారు. 

చంద్రునిలో షోడశకళలూ అమ్మ నుంచి సంక్రమించినవే. 

చంద్రమండలమే తానై, ఆ మధ్యలో విరాజిల్లుతున్న, ఆ చంద్రమండలమధ్యగ కు వందనం.🌹


🌹చారురూపా🌹


చారు అంటే, సుందరము, రమణీయము, లావణ్యము అని అర్ధం. 

ఈ నామంలో అమ్మవారు అందమైన రూపము కలది అని చెప్పుకుంటున్నాం. 

మనోహరమైన రూపము కలది ఆ శ్రీలలిత. ఆ రూప లావణ్యానికి అవధులు లేవు, పోలిక లేదు. 

అటువంటి సుందర కమనీయమైన రూపము ఆ లలితాపరమేశ్వరిది. 

చంద్రునికి అందము, ఆకర్షణ లలితాదేవి నుంచి వచ్చినవే. 

ఒకసారి ఆ రాజరాజేశ్వరి ఆకర్షణకు లోనైన వారు తిరిగిపోలేరు. 

ఒకసారి శ్రీవిద్య లోని మాధుర్యాన్ని, రమణీయతను రుచి చూచిన వారు అమ్మను వదలరు. 

అందమైన లావణ్యలతిక, ఆ చారురూప🌹. చంద్రవిద్యా🌹


మనువు తరువాత శ్రీ విద్యను ఉపాసించిన వాడు చంద్రుడు. 

కనుక ఈ శ్రీవిద్యను చంద్రవిద్యా అన్నారు. చంద్రునివి పదహారు కళలు అంటే షోడశ కళలు. 

షోడశీ విద్య అనగా చంద్రవిద్యయే. అదే శ్రీవిద్య. సుధాంశుడు కనుక చంద్రుడు సోముడయ్యాడు. 

తన అమృతధారలతో సృష్టిని పోషించేవాడు సోముడు. 

స ఉమా, సోమ అని భావం. ఉమతో కూడిన శివుడు కూడా సోముడు. 

కనుక శివుడు, ఉమా ఇద్దరి అంశా కలసిన శక్తి చంద్రుడు. 

అందువలన చంద్ర విద్యా అంటే, శివ శక్తి సమ్మేళనం. 

ఈ రెండూ కలిస్తేనే, సృష్టి, ఈ రెండూ కలిస్తేనే పూర్ణత్వం. 

అటువంటి శివశక్తి సమ్మిళితమైన, ఆ చంద్రవిద్య కు వందనం. 🌹


🌹చంద్రమండలమధ్యగా 🌹


చంద్రుడంటే శివ శక్తి సమ్మేళనమైనప్పుడు, ఆ చంద్రమండలమే శ్రీ చక్రము. 

ఆ శ్రీచక్రమధ్యంలో బిందురూపిణివలె అమ్మ దీపించుచున్నది. 

అందుకే ఈ నామంలో అమ్మను చంద్రమండలమధ్యగా అన్నారు. 

సహస్రారము చేరిన తరువాత శివ శక్తి సమ్మేళనము జరిగి షోడశకళలూ ప్రకాశవంతమవుతాయి. 

అపుడు ఆ మండలం మధ్యలో శ్రీలలిత జ్వాజ్వల్యమానంగా దర్శనమిస్తుంది. 

ఈ సర్వ జగత్తూ చంద్రాగ్నులచే నిండి వున్నది కనుక దీనిని అగ్నిషోమాత్మకం అంటారు. 

శివుడు స్వయముగా తాను అగ్ని యొక్క శిరోభాగములో ఉంటే, 

అమ్మవారు చంద్రుని యొక్క శిరోభాగములో వున్నదని చెపుతాడు. 

శివుడు, శక్తి ఇద్దరూ కలిసి ఈ అగ్నిసోమములుగా జగత్తంతా వ్యాపించి వున్నారు. 

చంద్రునిలో షోడశకళలూ అమ్మ నుంచి సంక్రమించినవే. 

చంద్రమండలమే తానై, ఆ మధ్యలో విరాజిల్లుతున్న, ఆ చంద్రమండలమధ్యగ కు వందనం.🌹


🌹చారురూపా🌹


చారు అంటే, సుందరము, రమణీయము, లావణ్యము అని అర్ధం. 

ఈ నామంలో అమ్మవారు అందమైన రూపము కలది అని చెప్పుకుంటున్నాం. 

మనోహరమైన రూపము కలది ఆ శ్రీలలిత. ఆ రూప లావణ్యానికి అవధులు లేవు, పోలిక లేదు. 

అటువంటి సుందర కమనీయమైన రూపము ఆ లలితాపరమేశ్వరిది. 

చంద్రునికి అందము, ఆకర్షణ లలితాదేవి నుంచి వచ్చినవే. 

ఒకసారి ఆ రాజరాజేశ్వరి ఆకర్షణకు లోనైన వారు తిరిగిపోలేరు. 

ఒకసారి శ్రీవిద్య లోని మాధుర్యాన్ని, రమణీయతను రుచి చూచిన వారు అమ్మను వదలరు. 

అందమైన లావణ్యలతిక, ఆ చారురూపఆపస్తంబుడు అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)

యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.

ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు. 

కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు. 

బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు. 

కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు. 

అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.

దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సాంప్రదాయం కదా.) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు

కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు. 

కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.

అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు. 

కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు. 

దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు. 

దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.

జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది. 

ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.


సేకరణ కు వందనం. 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹 కు వందనం. 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


* 667వ రోజు*

పురాణగాధ

ధర్మరాజు సందేహాలు ఇక లేనట్లు " పితామహా ! అందరికీ వినిపించేలా ఒక ప్రాచీన గాధ ఒకటి వినిపించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఉమామహేశ్వర సంవాదము వినిపిస్తాను. ఈ సంవాదం శ్రీకృష్ణుడి సన్నిధానంలో వినిపించడం నా పూర్వ పుణ్యపుణ్యవిశేషంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణా ! నీ అనుమతితో ఈ కథను ధర్మరాజుకు వినిపిస్తున్నాను. పుత్రసంతానంకోరి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితోసహా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ 12 సంవత్సరములు అత్యంత దీక్షతో వ్రతంచేసాడు. వ్రతదీక్షవలన శ్రీకృష్ణుడు చాలా నలిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని చూడడానికి నారదుడు, వ్యాసుడు, వాల్మికి, దేవలుడు, కశ్యపుడు మొదలగు వారు తమ తమతమ శిష్య బృందముతో అక్కడకు వచ్చారు. వారికి శ్రీకృష్ణుడు అర్ఘ్యము పాద్యము ఆసనము ఇచ్చి సత్కరించి ఇష్టాగోష్టి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడి ముఖము నుండి ఒక మహాగ్ని వెలువడింది. ఆ అగ్ని అక్కడ ఉన్న అడవిని కాల్చింది. ఆ అడవులలోఉన్న మృగములు, పక్షులు, తపస్సు చేసుకుంటున్న సిద్ధులు, సాధ్యులు, మునులు ఆందోళన చెందుతున్నారు. అది గమనించిన శ్రీకృష్ణుడు తన శుభప్రథమైన చూపులతో ఆ మంటలను ఆర్పి వేసాడు. అడవులు మరలా యధాస్థితికివచ్చాయి. ఈ సంఘటన చూసి మునులందరూ ఆశ్చర్యపోయారు. వారిని చూసి శ్రీకృష్ణుడు " మీరు ఈ అగ్నిని చూసి ఏమనుకున్నారు ఉన్నది ఉన్నట్లు చెప్పండి " అని అడిగాడు. మునులంతా ముక్త కంఠముతో ఇలా అన్నారు. దేవా ! ఈ సమస్త జగతి నీ నుండి సృష్టించబడి నీలోనే లయం ఔతుంది. సకల చరాచరజీవజాలము నీ ఆధీనములో ఉన్నాయి కదా. అంతా నీ సంకల్పము వలనే జరిగిఉంటుంది. కనుక ఇది ఎలా జరిగిందో నీవు చెపితే కాని మాకుతెలియదు. అందుకే ఇది చూసి ఆశ్చర్యపోయాము " అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు " మహా మునులారా ! మీరు ప్రసన్నంగా ఉండడమే ఈ సృష్టికి ఆధారము. కనుక మీకు ఆ అగ్ని గురించి చెప్తాను వినండి. పూర్వము అస్త్రవిద్యా ప్రవీణుడైన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి అస్త్రవిద్య నా ముఖం నుండి వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు నాకు మన్మధుడిని కొడుకుగా ప్రసాదించాడు. నా ముఖం నుండి పుట్టిన అగ్ని పోతూ పోతూ ఈ అడవిని కాల్చింది. నేను నా చల్లని చూపులతో తిరిగి ఈ అడవిని పునరుజ్జీవింప చేసాను. మీరు చూసింది అదే " అని అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ వైదీశ్వరన్ కోయల్

 🕉 మన గుడి : నెం 1404


⚜  తమిళనాడు : 


⚜  శ్రీ వైదీశ్వరన్ కోయల్



💠 తమిళనాడులోని మయిలాడుతురై జిల్లాలో ఉన్న వైతీశ్వరన్ ఆలయం, 'ఆరోగ్య ప్రదాత' అయిన వైద్యనాథర్ లేదా వైతీశ్వరన్ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ దేవాలయం.


💠 నవగ్రహాలలో ఒకటైన అంగారకుడు కుష్టు వ్యాధితో బాధపడి, వైద్యనాథ స్వామిచే నయం చేయబడ్డాడు. 

అప్పటి నుండి ఇది అంగారక గ్రహానికి సంబంధించిన నవగ్రహ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది


💠 సాధారణంగా, వైతీశ్వరన్ అంటే 'రోగాలను నయం చేసే దేవుడు'. వైతీశ్వర స్వామిని ప్రార్థిస్తే 4000 రకాలకు పైగా వ్యాధులను నయం చేయవచ్చని చెబుతారు.


💠 శివుడు ఇక్కడ ఆది వైద్యనాథా అనే పేరుతో సుప్రసిద్ధుడు. 

ఆది వైద్యనాథుడంటే లోకంలోని అన్ని దారుణ రోగాలను మించిన మహాదారుణ రోగమైన 'జన్మ'ను పూర్తిగా నయం చేయగల ఆది దేవుడని అంతరార్థం!

అనగా జన్మ రాహిత్యం


💠 ఈ ఆలయం యొక్క ప్రధాన విశేషాలలో ఒకటి, ఇక్కడ స్వామి పశ్చిమ దిశకు అభిముఖంగా ఉంటారు. 

పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్న స్వామిని పూజిస్తే, ఒక భక్తుడు 1000 శివాలయాలను సందర్శించి పూజించినంత పుణ్యం లభిస్తుంది. 


💠 ఈ ఆలయం ఎంతో విశాలమైన ఆలయం. అధిష్ఠాన దైవం పేరు ఆది వైద్యనాథార్ కాగా - అమ్మవారి పేరు తాయియల్ నాయకి! 


💠 ఆలయంలో భక్తుల వ్యాధి నివారణ కోసమై సర్వరోగ నివారక మాత్ర'లను అందజేస్తారు. 

ఈ మాత్రలు ఎంతో శక్తివంతమైనవని, స్వస్థత కూర్చడంలో సాటిలేనివని అశేష భక్తజనుల ప్రగాఢ విశ్వాసం! 


💠 గర్భగుడి చుట్టూ ఉన్న మొదటి ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి లోహ విగ్రహం ఉంది, ఇక్కడ ఆయనను ముత్తుకుమార స్వామిగా పూజిస్తారు. 

గర్భగుడిలోని ఇతర లోహ విగ్రహాలు నటరాజు, సోమస్కంద, అంగారక గ్రహానికి చెందినవి మరియు దుర్గ, దక్షిణామూర్తి, సూర్యుడు, జటాయువు, సంపాతి రాతి శిల్పాలు ఉన్నాయి. 

రెండవ ప్రాంగణంలో దక్షిణం వైపు ముఖంగా ఉన్న తాయల్నాయకి మందిరంలో, వ్యాధులను నయం చేసే ఔషధ తైలంతో నిలబడి ఉన్న భంగిమలో ఉన్న తాయల్నాయకి విగ్రహం ఉంది.


💠 స్థానిక పురాణం ప్రకారం, శివుడు మేరు పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు, అతని నుదుటి నుండి ఒక నీటి బిందువు పడి ఒక అందమైన బిడ్డగా మారింది. 

భూదేవి ఆ బిడ్డను పెంచింది, అతను శివుని యొక్క గొప్ప భక్తుడిగా మారాడు. 

అతని భక్తికి సంతోషించిన శివుడు అతన్ని ఒక గ్రహంగా మార్చాడు. అతని రంగు ఆధారంగా, అంగారకుడికి సాధారణంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరింపజేస్తారు. 


💠 రామాయణ కాలంలో, రాముడు, లక్ష్మణుడు మరియు సప్తఋషులు ఈ ప్రదేశంలో దేవతను పూజించారు. ఈ ఆలయంలో జటాయు కుండం అనే కోనేరు ఉంది.


💠 శివుని భార్య అయిన పార్వతి, తన కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని తన సాధారణ ఆరు ముఖాల రూపం నుండి ఒక ముఖంతో కనిపించమని కోరింది. 

అతను అలా చేసినప్పుడు, ఆమె సంతోషించి, రాక్షసులను సంహరించడానికి అతనికి వేల్ (ఆయుధం) బహూకరించింది. 


💠 సుబ్రహ్మణ్యుడు సూరపద్ముడనే అసురుడిని జయించాడు, ఆ యుద్ధంలో అతని సైన్యం తీవ్రంగా గాయపడింది. 

శివుడు వైద్యుడైన వైతీశ్వర రూపంలో వచ్చి గాయాలను నయం చేశాడు. 


💠 జటాయువు, మురుగన్ మరియు సూర్యుడు ఇక్కడ శివుడిని పూజించారని నమ్ముతారు. మురుగన్ ఈ ప్రదేశంలో వేల్ త్రిశూలాన్ని పొందినందున, అతన్ని సెల్వముత్తు కుమారన్ అని పిలుస్తారు. 


💠 ప్రచారంలో ఉన్న పురాణం ప్రకారం, 'పుల్' (జటాయువు), 'ఇరుక్కు' (ఇరుక్కువేదం), 'వేల్' (మురుగన్‌కు ప్రతీక) మరియు 'ఊర్' (ప్రదేశం) ఈ ప్రదేశంలో పూజించాయి, అందుకే దీనికి 'పుల్లిరుక్కవేలూర్' అనే పేరు వచ్చింది.


🔆 నాడీజ్యోతిష ప్రధాన కేంద్రం


💠 ఈ గ్రామం తమిళంలో నాడియాస్ట్రాలజీ అని పిలువబడే తాటి ఆకు జ్యోతిష్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. 


💠 శివనాడి. భృగునాడి, గురునాడి మున్నగు పేర్లతో పిలువబడే ఈ ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో సర్వజనుల జాతకచక్రాలు నిక్షిప్తమై ఉన్నాయని చెపుతారు! 

కేవలం చెప్పడమే కాదు - వాటిని విడి పుస్తకంలో వ్రాసి, క్యాసెట్గా రికార్డు చేసి మరీ ఇస్తారు. 


💠 ఈ భూత భవిష్యత్ వర్తమాన జీవిత విశేషాలన్నింటినీ వెళ్ళిన వ్యక్తి కేవలం తన పేరు చెప్పినంత మాత్రానే వరుసగా వెల్లడించడం దిగ్భ్రామ గొలుపుతుంది! 

వైదీశ్వరన్ కోయిల్ దక్షిణ భారతంలో ప్రధాన నాడీ జ్యోతిష కేంద్రంగా వాసికెక్కింది।.


💠 ఆలయ సముదాయంలోని సిద్ధామృతం చెరువులోని పవిత్ర జలాల్లో అమృతం ఉంటుంది, మరియు పవిత్ర స్నానం అన్ని వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.


💠 ఇది చిదంబరం నుండి 27 కిలోమీటర్లు, మైలదుత్తు🕉 మన గుడి : నెం 1404


⚜  తమిళనాడు : 


⚜  శ్రీ వైదీశ్వరన్ కోయల్రై



💠 తమిళనాడులోని మయిలాడుతురై జిల్లాలో ఉన్న వైతీశ్వరన్ ఆలయం, 'ఆరోగ్య ప్రదాత' అయిన వైద్యనాథర్ లేదా వైతీశ్వరన్ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ దేవాలయం.


💠 నవగ్రహాలలో ఒకటైన అంగారకుడు కుష్టు వ్యాధితో బాధపడి, వైద్యనాథ స్వామిచే నయం చేయబడ్డాడు. 

అప్పటి నుండి ఇది అంగారక గ్రహానికి సంబంధించిన నవగ్రహ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది


💠 సాధారణంగా, వైతీశ్వరన్ అంటే 'రోగాలను నయం చేసే దేవుడు'. వైతీశ్వర స్వామిని ప్రార్థిస్తే 4000 రకాలకు పైగా వ్యాధులను నయం చేయవచ్చని చెబుతారు.


💠 శివుడు ఇక్కడ ఆది వైద్యనాథా అనే పేరుతో సుప్రసిద్ధుడు. 

ఆది వైద్యనాథుడంటే లోకంలోని అన్ని దారుణ రోగాలను మించిన మహాదారుణ రోగమైన 'జన్మ'ను పూర్తిగా నయం చేయగల ఆది దేవుడని అంతరార్థం!

అనగా జన్మ రాహిత్యం


💠 ఈ ఆలయం యొక్క ప్రధాన విశేషాలలో ఒకటి, ఇక్కడ స్వామి పశ్చిమ దిశకు అభిముఖంగా ఉంటారు. 

పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్న స్వామిని పూజిస్తే, ఒక భక్తుడు 1000 శివాలయాలను సందర్శించి పూజించినంత పుణ్యం లభిస్తుంది. 


💠 ఈ ఆలయం ఎంతో విశాలమైన ఆలయం. అధిష్ఠాన దైవం పేరు ఆది వైద్యనాథార్ కాగా - అమ్మవారి పేరు తాయియల్ నాయకి! 


💠 ఆలయంలో భక్తుల వ్యాధి నివారణ కోసమై సర్వరోగ నివారక మాత్ర'లను అందజేస్తారు. 

ఈ మాత్రలు ఎంతో శక్తివంతమైనవని, స్వస్థత కూర్చడంలో సాటిలేనివని అశేష భక్తజనుల ప్రగాఢ విశ్వాసం! 


💠 గర్భగుడి చుట్టూ ఉన్న మొదటి ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి లోహ విగ్రహం ఉంది, ఇక్కడ ఆయనను ముత్తుకుమార స్వామిగా పూజిస్తారు. 

గర్భగుడిలోని ఇతర లోహ విగ్రహాలు నటరాజు, సోమస్కంద, అంగారక గ్రహానికి చెందినవి మరియు దుర్గ, దక్షిణామూర్తి, సూర్యుడు, జటాయువు, సంపాతి రాతి శిల్పాలు ఉన్నాయి. 

రెండవ ప్రాంగణంలో దక్షిణం వైపు ముఖంగా ఉన్న తాయల్నాయకి మందిరంలో, వ్యాధులను నయం చేసే ఔషధ తైలంతో నిలబడి ఉన్న భంగిమలో ఉన్న తాయల్నాయకి విగ్రహం ఉంది.


💠 స్థానిక పురాణం ప్రకారం, శివుడు మేరు పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు, అతని నుదుటి నుండి ఒక నీటి బిందువు పడి ఒక అందమైన బిడ్డగా మారింది. 

భూదేవి ఆ బిడ్డను పెంచింది, అతను శివుని యొక్క గొప్ప భక్తుడిగా మారాడు. 

అతని భక్తికి సంతోషించిన శివుడు అతన్ని ఒక గ్రహంగా మార్చాడు. అతని రంగు ఆధారంగా, అంగారకుడికి సాధారణంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరింపజేస్తారు. 


💠 రామాయణ కాలంలో, రాముడు, లక్ష్మణుడు మరియు సప్తఋషులు ఈ ప్రదేశంలో దేవతను పూజించారు. ఈ ఆలయంలో జటాయు కుండం అనే కోనేరు ఉంది.


💠 శివుని భార్య అయిన పార్వతి, తన కుమారుడైన సుబ్రహ్మణ్యుడిని తన సాధారణ ఆరు ముఖాల రూపం నుండి ఒక ముఖంతో కనిపించమని కోరింది. 

అతను అలా చేసినప్పుడు, ఆమె సంతోషించి, రాక్షసులను సంహరించడానికి అతనికి వేల్ (ఆయుధం) బహూకరించింది. 


💠 సుబ్రహ్మణ్యుడు సూరపద్ముడనే అసురుడిని జయించాడు, ఆ యుద్ధంలో అతని సైన్యం తీవ్రంగా గాయపడింది. 

శివుడు వైద్యుడైన వైతీశ్వర రూపంలో వచ్చి గాయాలను నయం చేశాడు. 


💠 జటాయువు, మురుగన్ మరియు సూర్యుడు ఇక్కడ శివుడిని పూజించారని నమ్ముతారు. మురుగన్ ఈ ప్రదేశంలో వేల్ త్రిశూలాన్ని పొందినందున, అతన్ని సెల్వముత్తు కుమారన్ అని పిలుస్తారు. 


💠 ప్రచారంలో ఉన్న పురాణం ప్రకారం, 'పుల్' (జటాయువు), 'ఇరుక్కు' (ఇరుక్కువేదం), 'వేల్' (మురుగన్‌కు ప్రతీక) మరియు 'ఊర్' (ప్రదేశం) ఈ ప్రదేశంలో పూజించాయి, అందుకే దీనికి 'పుల్లిరుక్కవేలూర్' అనే పేరు వచ్చింది.


🔆 నాడీజ్యోతిష ప్రధాన కేంద్రం


💠 ఈ గ్రామం తమిళంలో నాడియాస్ట్రాలజీ అని పిలువబడే తాటి ఆకు జ్యోతిష్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. 


💠 శివనాడి. భృగునాడి, గురునాడి మున్నగు పేర్లతో పిలువబడే ఈ ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో సర్వజనుల జాతకచక్రాలు నిక్షిప్తమై ఉన్నాయని చెపుతారు! 

కేవలం చెప్పడమే కాదు - వాటిని విడి పుస్తకంలో వ్రాసి, క్యాసెట్గా రికార్డు చేసి మరీ ఇస్తారు. 


💠 ఈ భూత భవిష్యత్ వర్తమాన జీవిత విశేషాలన్నింటినీ వెళ్ళిన వ్యక్తి కేవలం తన పేరు చెప్పినంత మాత్రానే వరుసగా వెల్లడించడం దిగ్భ్రామ గొలుపుతుంది! 

వైదీశ్వరన్ కోయిల్ దక్షిణ భారతంలో ప్రధాన నాడీ జ్యోతిష కేంద్రంగా వాసికెక్కింది।.


💠 ఆలయ సముదాయంలోని సిద్ధామృతం చెరువులోని పవిత్ర జలాల్లో అమృతం ఉంటుంది, మరియు పవిత్ర స్నానం అన్ని వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.


💠 ఇది చిదంబరం నుండి 27 కిలోమీటర్లు, మైలదుత్తురై నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

*శ్రీ మహావిష్ణు పురాణం*

  


        *శ్రీ మహావిష్ణు పురాణం*

                ➖➖➖✍️

             పన్నెండవ భాగం



*భూమండలం - సప్త ద్వీపాలు:*```

బ్రహ్మదేవుడు భూమండలాన్ని సప్త ద్వీపాలుగా విభజించి,జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలీ ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం అని పేర్లు పెట్టాడు.


#జంబూద్వీపం తొమ్మిదివర్షములు (దేశాలు)గా విస్తరించి ఉంది. తొమ్మిది వర్షములలో భరత వర్షము ఒక్కటే కర్మ క్షేత్రం. భగవంతునికే కాదు, దేవతలందరికి ప్రియమైనది. ఇక్కడ మానవులుగా జన్మించి పుణ్య కర్మలు, తపస్సులు చేసి జన్మరాహిత్యమైన మోక్షము పొందాలి అని దేవతలు కూడా కోరుకుంటారు. కర్మక్షేత్రం, ధర్మ క్షేత్రం అయిన ఈ భూమిలో మహావిష్ణువు అనేక అవతా రాలు ఎత్తి ధర్మపరిరక్షణ చేశాడు.


జంబూద్వీపానికి నాభి కేంద్రంగా లక్ష యోజనాల మేరు పర్వతము ఉంది. భరతవర్షానికి ఉత్తరాన నిషధ హోమకూట హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్షములు ఉన్నాయి. భరతవర్షానికి పశ్చిమాన మాల్యవంత పర్వతము, తూర్పున గంధమాదన పర్వతాలు ఉన్నాయి. వీటికి సరిహద్దులుగా నీల, నిషధ పర్వతాలు ఉన్నాయి. దేవజాతుల వారు ఇక్కడ నివసిస్తారు.


వీటి సరిహద్దులుగా ఉన్న కేతుమాల, భద్రాశ్వ వర్షాలలో ఆయా దేశ జాతుల వారు నివసిస్తారు. మంధర, మేరు మంధర, సుపార్స్మక, కుముద పర్వతాలు మేరు పర్వత పాదగిరులుగా ఉన్నాయి. ఈ పర్వతాలపై క్షీర సరస్సు, మధు సరస్సు, ఇక్షు సరస్సు, శుద్ధోదక సరస్సులున్నాయి. దేవతలు ఈ సరస్సుల నీటిని స్పర్శించి ఐశ్వర్య యోగ సిద్దులను పొందుతారు.


నాలుగు పర్వతాల పై నందన, చైత్రరథక, వైభ్రాజక, సర్వభద్రక అనే నాలుగు ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ నాలుగు వనాలలో గీత వాయిద్య నర్తకీమణులైన అప్సరసలు నివసిస్తారు. దేవతాగణాలు ఈ నాలుగు వర్షాలలో విహరిస్తూ సుఖ భోగాలు పొందుతారు.


మేరు పర్వత శిఖరం పై పెద్ద నేరేడు (జంబు) వృక్షము ఉంది. జంబూద్వీపము అనే పేరు ఈ వృక్షము వలనలే వచ్చింది. ఈ జంబూవృక్షానికి ఏనుగు తలంత నేరేడు ఫలాలు కాస్తుంటాయి. జంబూ ఫలాలు పగిలి వాటి రసం ప్రవహించి జంబూనది ఏర్పడింది. జంబూనది తీరంలో శక్తి స్వరూపిణి "జంబాద్విని" గా వెలిసింది. తొలి సృష్టి మానవులు జంబూఫలాలను ఆహారంగా సేవించేవారు. దేవతల హస్త స్పర్శ తగిలి ఎండిపోయిన జంబూరసము బంగారంగా మారుతుంది. ఈ బంగారాన్ని జంబూరసంగా పిలుస్తారు. 


జంబూద్వీపములో భరతవ వర్షము ఒక్కటే మానవులు నివసించే భూమిగా ఉంది. మిగిలిన ఎనిమిది వర్షాలు "దేవభూములు" గా ప్రసిద్ది చెందాయి. ఇక్కడ దేవతా జాతుల వారు నివసిస్తారు.


#రెండవ ద్వీపం ప్లక్ష ద్వీపము. జంబుద్వీపమంత పరిమాణమే కలిగి ఉంటుంది. ఇక్షు సముద్రం ప్లక్షద్వీపం చుట్టూ ఉంటుంది. ఇక్కడ అరుణ, నృమ్ణ,అంగీరస,సావిత్రి, సుప్రభాతిక, ఋతంభర, సత్యంభర అనే సప్త నదులు ఉన్నాయి. మణికూట, ఇంద్రసేన,జ్యోతిష్మతి,సువర్ణ, హరిణ్యష్టీవ, మేఘమాల అనే ఏడు పర్వతాలు ఉంటాయి. ఇక్కడ హంస, పతంగ, ఊర్థ్వాయన, సత్యాంగ అనే నాలుగు సంజ్ఞలు గల నాలుగు వర్ణాల వారు నిసిస్తుంటారు. ప్రజలు వేయి సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటారు. సూర్యోపాసన చేస్తుంటారు.


#మూడవ ద్వీపం శాల్మల ద్వీపం. పరిమాణంలో ప్లక్ష ద్వీపానికి రెట్టింపు ఉంటుంది. ఈ ద్వీపాన్ని సురా సముద్రం చుట్టుముట్టి ఉంటుంది. ద్వీపం మధ్యలో శాల్మలీ వృక్షము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. గరుత్మంతుడు ఈ వృక్షము పై నివసిస్తుంటాడు. ఇక్కడ ఏడు పర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. శ్రుతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర అనే నాలుగు వర్ణాల వారు నివసిస్తుంటారు. వేదమయుడైన సోమేశ్వరుని పూజిస్తారు.


#నాలుగవ ద్వీపం కుశ ద్వీపం. ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఘృత సముద్రం ఉంటుంది. ద్వీపం లోని కుశస్థంభం స్వయం ప్రకాశమై వెలుగుతూ నాలుగు వైపుల వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ద్వీపంలో కూడా ఏడుపర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. కుశల, కోవిధ, అభియుక్త, కులక అనే నాలుగు వర్ణాల ప్రజలు నివసిస్తూ, అగ్నిదేవుని పూజిస్తూ యజ్ఞయాగాదులు చేస్తుంటారు.


#ఐదవ ద్వీపం క్రౌంచ ద్వీపము. కుశద్వీపానికి పరిమాణంలో రెండు రెట్లు ఉంటుంది. క్షీర సముద్రం ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. ఇక్కడ గల క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఛేదించి ఏడు భాగాలు చేశాడు. ఏడు నదులు, ఏడు పర్వతాలు ఈ ద్వీపంలో ఉన్నాయి. పురుష, ఋషభ, ద్రవిణ, దేవిక అనే నాలుగు వర్ణాల వారు ఈ ద్వీపంలో నిసిస్తుంటారు. అగ్నిని ఉపాసిస్తూ యజ్ఞాలు చేస్తారు.


#ఆరవది శాకద్వీపం. ఈ ద్వీపం మధ్యలో పెద్దదైన శాక వృక్షము ఉండటం వలన ద్వీపానికి శాకద్వీపము అని పేరు వచ్చింది. ఇక్కడ కూడ ఏడు పర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అనే చాతుర్వర్ణాల ప్రజలు నిసిస్తుంటారు. ఇక్కడ పరమేశ్వరుని పూజిస్తారు.


#ఏడవది పుష్కర ద్వీపం. లక్ష బంగారు రేకులు కలిగిన పద్మము అనగా పుష్కరము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. ఈ పుష్కరమే బ్రహ్మదేవుని ఆసనం అంటారు. మహర్షులు "మానసోత్తరం" అని ఈ ద్వీపాన్ని కీర్తించడం వలన మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఉంది. అవధిగిరి అనే పర్వతం ఈ ద్వీపాన్ని రమణ-ఘాతకి అనే రెండు భాగాలుగా విభజించి సరిహద్దుగా ఉంది. లక్ష యోజనాల ఎత్తు గల ఈ పర్వత శిఖరం పై ఇంద్రాది దిక్పాలకులు ఉండే నాలుగు నగరాలు ఉన్నాయి.


మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ లోకసంచారం చేసే సూర్యుడు ఈ అవధిగిరి పర్వతము నుంచే ఉదయిస్తాడు. మానవుల ఒక్క సంవత్సర కాలం ఇక్కడి వారికి ఒక రోజు అవుతుంది. ఈ ద్వీప ప్రజలు పరబ్రహ్మను ఉపాసన చేస్తారు.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు.```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

పాల్కురికి సోమనాథుడు

  పాల్కురికి సోమనాథుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.


పాల్కురికి సోమనాథుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాథుడు శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాథుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వైష్ణవ దంపతులకు జన్మించాడు. వీరు ఉత్తమరాజు వారను, కౌండిన్యస గోత్రము కలిగిన నియోగులు. అనేక శాస్త్రములు చదివిన మీదట వీరశైవం లోకి ప్రవేశించి దీక్ష ధరించెను. సోమనాథుడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.


పాల్కురికి సోమనాథుడు రచించిన 'పంచ పాషాణములు' (లేదా పంచ పాషాణ పద్యాలు) అత్యంత కఠినమైనఛందోబద్ధమైన తెలుగు పద్యాలు. ఇవి ప్రధానంగా హల్లుల పునరావృత్తంతో (టడకి వంటి అక్షరాలతో) నిండినాలుక తిరగని "జిహ్వా కోటలు"గా ప్రసిద్ధి చెందాయి. ఇవి కవి పాండిత్యానికిఅక్షర క్రీడకు నిదర్శనంగా నిలుస్తాయి. 


పంచ పాషాణ పద్యాల ప్రత్యేకతలు:

నిర్మాణం: ఈ పద్యాలు చదవడం చాలా కష్టం. వీటిలో అక్షరాల కూర్పు (టట్టకిట్టటటకిట్టటటట్ట) వలే ఉంటుంది.

ప్రసిద్ధ పద్యం: "టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి..." అని మొదలయ్యే పద్యం సోమనాథుని రచనల్లో చాలా ప్రసిద్ధి పొందినది.

భాష: ఇవి పండితుల కోసంకవి యొక్క శబ్ద ఛాతుర్యాన్ని (నిఘంటు పరిజ్ఞానం) ప్రదర్శించడానికి రాసిన అత్యంత కఠినమైన పద్యాలు.

శైలి: పాల్కురికి సోమనాథుడు 'జానుతెనుగు' శైలికి పెట్టింది పేరు అయినప్పటికీ ఇలాంటి కఠినమైన పద్యాలను కూడా ఆయన అద్భుతంగా రచించారు. 

**********************

పంచ పాషాణాలు - ఐదు కఠినమైన పద్యాలు


****************************


మహా కవి భారవి పద్యం


షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే


జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫణ ఘణః ఖడ్జోత వీడ్యద్భ్రమా


వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రియపదాడ్గ్ర్య డడ్గ్రడ్గ్రహా


పాదౌ టేట్పర్బటట్ప్రటప్రటట్రసప్రఖ్యాస సఖ్యోదయా


……………………………….


పాల్కుర్కి సొమనాధకవి పద్యాలు


టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి


ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటింక్రుతిస్ఫుటో


త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట


పటుతాండవాటన "ట" కారనుత బసవేశ పాహిమాం


……………………………….


డమరుగజాత డండడమ్రుడండ మ్రుడండ మ్రుడండ


మ్రుండమ్రుం డమ్రుణ మ్రుడండడండ మ్రుణడండడ


డండ మ్రుడం డమ్రుం డమ్రుం డమ్రుణమ్రుడండడంక్రుతి


విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ప్రమధన తాండవాటన


"డ" కారనుత బసవేశ పాహిమాం!


………………………………….


ఢణ ఢణ ఢం మ్రుఢం మ్రుఢణఢం మ్రుణఢం మ్రుణ


ఢంఢణోద్ధణం ధణనటన త్వదీయడమరూత్థ


మదార్భట ఢంక్రుతి ప్రజ్రుంభణ త్రుటితాభ్రతార గణరాజ


దినేశముఖగ్రహప్రఘర్ క్షణగుణతాండవాటన


"డ" కారనుత బసవేశ పాహిమాం!


……………………………………


ణణ్మ్రుణ ణణ్మ్రుణ ణ్మ్రు ణణ ణణ్మ్రుణ ణ ణ్మ్రుణ ణణ్మ్రుణ


ణ్మ్రుణణ్ణ ణ్మ్రుణ న్రుత్వదీయసుఖ విక్రమ జ్రుంభణ


సంచలన్నభో ణ్ణ ణ్మ్రుణ ది క్క్వణ ణ్మ్రుణణ ణణ్మ్రుణ


ణణ్మ్రుణ ణణ్మ్రుణ స్వనణ్ణ ణ్మ్రుణ తాండవాటన


"ణ" కారనుత బసవేశ పాహిమాం!

మహనీయుని మాట*

 🙏*శుభోదయమ్*🙏

     -------------------

🌸 *మహనీయుని మాట*🌸

        -------------------------

"విజయమంటే కేవలం బాహ్య యుద్ధంలో గెలవడం కాదు.

నిజమైన విజయమంటే మన లోపలి దుర్గుణాలను జయించడం."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"సహనం, క్రమశిక్షణ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు.

అవే దీర్ఘకాల విజయానికి పునాది."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 


*సర్వేజనాః సుఖినోభవన్తు*


*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*

  


🌹🌹 జీవిత సత్యం 🌹🌹


             *సంప్రదాయ వస్త్రాలతో దైవదర్శనం*


                 *సంప్రదాయ వస్త్రాలతో దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల లభించే శుభఫలాలు తెలుసా? 


సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేయడం వలన శరీరానికి శక్తి, మనసుకు స్థైర్యం లభిస్తాయి. అదే విధంగా…*


                 *పురుషులు నడుముపై భాగాన వస్త్రం లేకుండా, శాస్త్రోక్తంగా దైవవదర్శనం చేయడం వలన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. మనస్సు ప్రశాంతమవుతుంది , భక్తి భావం మరింత లోతుగా స్థిరపడుతుంది. ఆధ్యాత్మిక శక్తిని నేరుగా స్వీకరించే సామర్థ్యం పెరుగుతుంది.*


             *ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు… మన శరీరం – మనస్సు – ప్రకృతి మధ్య ఉన్న అనుసంధానాన్ని బలపరచే శాస్త్రీయ మార్గం కూడా.*


            *సంప్రదాయాన్ని పాటిస్తే... ఆరోగ్యం , శాంతి , ఆధ్యాత్మిక బలం, మూడూ మన వెంట నడుస్తాయి.*


*సర్వేజనాః సుఖినోభవన్తు* 

 *శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*

ప్రతిరోజూ పరీక్షయే CB

 ప్రతిరోజూ పరీక్షయే 

విద్యార్థి దశలో వున్నప్పుడు ప్రతి విద్యార్థికి ప్రధాన పరీక్షలు సంవత్సరానికి ఒక సారి మాత్రమే వస్తాయితెలివయిన విద్యార్థులు పరీక్షలకు ముందు రెండు మూడు నెలల నుండి ఏకాగ్రతతో, కష్టపడి చదివి పరీక్షలలో ఉతీర్ణత సాధించవచ్చు. కొంతమంది చివరి నిమిషం వరకు చదవకుండా వుండి రేపు పరీక్ష అన్నప్పుడు యేవో చిన్న గైడుపుస్తకాలు కొనుక్కొని చదివి పరీక్ష వ్రాస్తారు. ఇదొక పద్దతి. విద్యార్థి చురుకు గలవాడు, తెలివయిన వాడు సుక్మాగ్రహి అయితే ఆలా చేసికుడా పరీక్షలు ఉతీర్ణత  సాధించవచ్చు. కానీ దీక్షగా చదివిన విద్యార్థి సాదించినన్ని గణములు పొందకపోవచ్చు. ఆలా కాకుండా రోజు పరీక్ష అయితే అప్పుడు విద్యార్థులు చక్కగా రోజు పాఠం రోజే చదివి అవగాహన  పొందవచ్చు. కానీ ఎప్పటికి ఆలా ఉండదు

సాధకుని జీవితం చాలా కఠినమైనది నిజానికి సాధనకు అనేక విధాలా అవరోధాలు కలుగుతాయి. అవి ఏమిటో చూద్దాము

1) ఆద్యాత్మికం: అంటే సాధకుని శరీరం సాధనకు సహకరించక పోవటం అందులో మొదటిది 

తామాస ప్రవ్రుత్: తామాస ప్రవ్రుత్తి సాధారణంగా ప్రతి సాధకునికి ప్రారంభంలో ఎదురయ్యే అవరోధంనీవు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో లేచి సాధన చేద్దామనుకుంటావు. గడియారంలో అలారం పెట్టుకొని నిద్రించావు అలారం మోగింది కానీ నీవు తెల్లవారుజామున 4గంటల సమయంలో మంచి నిద్రలో వున్నావు. నిద్రాభంగం అయినట్లుగా భావించి అలారం నొక్కి మరల పడుకుంటావు. తెల్లవారిన తరువాత 6 లేక్ 7 గంటలకు మెలకువ వచ్చింది కానీ ప్రయోజనం ఏముంది ఉరుమొత్తం మేలుకుంది నీకు సాధన చేయటం కుదరలేదుఅంటే ఒక రోజు నీ సాధనకు భంగం కలిగినట్లే కదా 

రాత్రి భోజనం : సాధకుడు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలో కృష్ణ భగవానుడు చెప్నట్లుగా  రాత్రి భోజనం విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మితాహారం, సాత్విక ఆహరం తీసుకోవాలిసాత్విక ఆహరం అంటే ఏమిటి శాఖాహారమా అని చాలా మంది అడుగుతారునిజానికి సాత్విక ఆహరం అంటే శాఖాహారం అనికాదు అది ఏమిటంటే తక్కువగా ఉప్పు, కారం వుండి  ఎటువంటి మసాలాలు లేకుండా వున్నటువంటిది ఇంకొక మాట చెప్పాలంటే త్వరగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. కృష్ణ భగవానుడు ఒక్క మాటలో పూర్తి వివరణ ఇచ్చారు. అదేమిటంటే ఆహరం తీసుకున్న వెంటనే దాహం కాకూడదు. ఉదాహరణకు నీవు నూనెతో కూడిన పదార్ధం అంటే పూరీలు తిన్నావనుకో నీ దృష్టిలో పూరీలు పూర్తిగా శాకాహాహారమే కానీ అవి తిన్న వెంటనే దాహం అవుతుంది అంటే అవి శాకాహారం కానీ సాత్విక్ ఆహరం కాదు

తొందరగా పడుకోవటం: సాధకుడు రాత్రిపూట సాధ్యమైనంతవరకు తొందరగా నిద్రకు  ఉపక్రమించాలి. రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం వలన తొందరగా లేవలేడు

ఆరోగ్య పరిరక్షణ: సాధకుడు శరీరం మీద మమకారం వహించకూడదు కానీ శ్రర్ధ వహించాలి రెండిటి చిన్న తేడా వున్నది శరీరపు మమకారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం సమాజంలో అందంగా కనపడాలి అని అనుకోవటం మమకారం అప్పుడు వెంట్రుకలకు రంగులు వేయటం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు చేసుకోవటం విలువైన ఆభరణాలు ధరించటం చేయటం అనేది శరీర మమకారం. అదే శరీర శ్రర్ధ అంటే ప్రాతఃకాలంలో నిద్రలేచి దంతధావన చేసి పరిశుభ్రంగా చన్నీటి సనానం చేయటం, ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించటం. సాత్విక ఆహారం సమయానుకూలంగా భుజించటం, మిత భాషణం, ధార్మిక జీవనం చేయటం. ఇత్యాదివన్నీ శరీరపు శ్రర్ధగా పేర్కొన వచ్చు

తామరాకు మీద నీటి బొట్టు: తామరాకు మీద నీటి బొట్టు:లాగ కుటుంబ సంబంధాలు కలిగి  ఉండటం. ఇది చెప్పినంత సులువు కాదు అనంతమైన కృషితో మాత్రమే సాధ్యం. అయినా సాధకుడు ప్రయత్నం చేయాలి

వస్తు వ్యామోహం: సాధకుడు వస్తువ్యామోహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫలానా వాహనం కావలి స్నానానికి చక్కటి వేడినీళ్లు ఉండాలి, ఆహారంలో ఫలానా కూర మాత్రమే ఉండాలి. అలాగే నాకు ఖరీదైన దుస్తులు, వస్తువులు గృహాలు వుండాలని వ్యామోహం పెంచుకోకూడదు. శరీరానికి సంబంధించి నియమాలు తీసుకుంటే సాధకుడు మొదటి అవాంతరాన్ని అధిరోహించినట్లేకానీ మరల చెపుతున్నా ఆచరించటం చాలా కష్టం

ఇక రెండవది ఆధిభౌతికం: సాధకునికి బయటి ప్రపంచంనుండి ఎదురయ్యే సమస్యలు. సాధకుడు అతి కష్టంగా తెల్లవారుఝామునే లేచి సాధన మొదలు పెడితే ప్రక్కనే వున్న దేవాలయంలో పూజారిగారు ధనుర్మాస పూజ అని అదే సమయంలో చక్కగా అర్చన చేస్తున్నారు. మీకు మైకు శబ్దంతో సాదన కుదరటం  లేదు. నీవు వెళ్లి దేవాలయంలోని పూజారిగారిని మైకుపెట్ట వద్దని చెప్పలేవుఆలా అంటే నీకు భక్తి లేదా నీవు హిందువు కాదా అని నిన్ను ప్రశ్నిస్తారుఅక్కడ దేవాలయంలో వున్న ఇతరప్రజలు కూడా నీ మీద అదోలా చూసి రోజుల్లో పూజలు చేయరు, చేస్తుంటే అడ్డగిస్తున్నారు నాస్తికత్వం బాగా పెరుగుతున్నది అని నీ మీద పరిహాసాలు చేయట తథ్యం. తెల్ల మొహం వేసుకొని వెనుతిరిగి రావటం మినహా ఏమి చేయలేవు రోజుల్లో ఇతర మతస్తుల మైకులు కూడా ఎక్కువ అయ్యాయివారిని నీవు అస్సలు అడగలేవు. ఇది ఒకరకం ఐతే ఇక మైకులేదు నీవు ప్రశాంతంగా సాధన చేసుకుంటూవున్నావు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఒక వీధి కుక్క మొరుగుతుంది అంతే కుక్కలన్ని ఒక్కసారిగా ఒకదానిమీద ఒకటి పది పెద్దగా అరుస్తుంటాయి. వాటిని నీవు ఆపలేవు. ఇక నీ సాధన రోజు సాగాడు. ఇక పొతే రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో వివాహాలలో ఫంక్షన్ హాలులో రికార్డులు రాత్రి అని లేక పగలు అని లేక  వేస్తున్నారు. శబ్దాలు యెంతగా వుంటున్నాయంటే గుండె మీద కొట్టినట్లుగా ఉంటున్నాయినీవు వారితో పోరాడ లేవుఅధవా పొలిసు స్టేషనుకు వెళ్లి ఫిరియాదు చేసినా పోలీసువారు కూడా నిన్నే నిందించి పంపుతారు. రకంగా అనేక విధాలుగా అధిభౌతిక అవాంతరాలు వస్తూవుంటాయి. వాటిని సాధకుడు అత్యంత తెలివి తేటలతో దాటాలి

అది దైవికం: అనగా ప్రకృతి అవాంతరాలు, వర్షాలు కురవటం, భూకంపాలు రావటం, పెనుగాలులు వీయటం ఇత్యాదివన్నీ కోవకు వస్తాయి ఇన్ని అవరోధాలను దాటితే కానీ నీవు సాధన చేయలేవు

సంసార జీవనం సాధనకు ఉపయుక్తమా: చాలామంది గృహస్తులకు కలిగే సాధారణ సందేహంనిజానికి సంసారం సాధనకు ప్రతిబంధకం కాదని విగ్న్యులు చెపుతారుకానీ సంసారం మాత్రం తప్పకుండా సాధనకు ఒక ప్రతిబంధకమే అవుతుంది. దీనిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను. నీవు ఒక సైకిలు పోటీలో పాలుగొన్నావనుకో  మిగితా వారంతా ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఉంటే నీవు ముందు గొట్టం మీద నీ భార్యను, చిన్న పిల్లవాడిని వెనుక క్యారియర్ మీద నీ ఇద్దరు కొడుకులను కూర్చోపెట్టుకొని సైకిలు తొక్కుతూ పోటీలో పాల్గొన్నావనుకో అప్పుడు నీవు విజయాన్ని యెంత సులువుగా పొందగలవో అలానే సంసారిక జీవనం చేస్తూ సాధన చేయటం కూడా

సన్యాసులంతా సులభంగా మోక్షం పొందగలరా: ప్రశ్నకు కూడా అవును అని  చెప్పలేము. రోజుల్లో మనం అనేకమంది సన్యాసులను చూస్తున్నాము వారు దైవచింతనకన్నా రాజకీయాలు, ధనాపేక్ష, సామాజిక విషయాలమీద శ్రర్ధ చూపుతూ ఖరీదైన కాషాయవస్త్రాలు ధరిస్తూ పాదపూజలు చేయించుకుంటూ పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతూ అనేక సుఖాలు అనుభవిస్తున్నారువారు ఒకరకంగా సంసార జీవనం చేసే సాధకులకన్నా ఇంకా అధోపాతాళంలో వున్నట్లుగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక సైకిలు మీద సంసారి భార్య పిల్లలను ఎక్కించుకొని తొక్కుతుంటే ఇటువంటి సన్యాసులు ముందొక ఇసుక బస్తా వెనుక ఒక మట్టి బస్తా పెట్టుకొని సైకిలు తొక్కే వాడిగా అభివర్ణించవచ్చు

నిజానికి సన్యాసి అంటే కౌపీనం తప్పించి ఏమి లేకుండా వుంది ఉండటానికి ఎటువంటి ఆశ్రమాలు లేకుండా చెట్ల క్రింద, గుహలలో వుంటూ అడవిలో ఆకులు అలమేలు భుజిస్తూ, వాగులు వొర్రెలలో నీటిని తాగుతూ, భౌతిక ప్రపంచానికి దూరంగా వుంటూ జీవనం గడిపే సాధకులు సత్వరంగా వారి గమ్యాన్ని చేరుకోగలరు

నిజానికి సాధకుని జీవనం కఠినమైనది, అనేక వడిదుడుకులు కలిగి ప్రతిక్షణం ఒక పరీక్షగా ఉంటుంది. బాహ్యంగా అనైక రకాలుగా విమర్శలు, వత్తిళ్లు వస్తాయివాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే సాధనలో పురోగతి సాధించగలం. సాధకుడు అకుంఠిత దీక్ష, భగవంతునిమీద అనన్య ప్రేమ దాస్య ప్రవ్రుత్తి, కలిగి త్రికరణ శుద్ధిగా దైవచింతనలో నిరంతరం గడిపితేనే జీవన్ముక్తిని పొందలేరు. భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే సాధకుడు ఎటువంటి పరిస్థితిలోను భగవంతుని మీదినుంచి మనస్సును  మళ్ళించకూడదు. ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకొని నిరంతర దైవ చింతనలోనే జీవనం గడపాలి. అప్పుడే మోక్ష సాధన కలుగుతుంది

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిఁ 

మీ 

భార్గవ శర్మ