14, జూన్ 2022, మంగళవారం

సువర్ణావకాశం 2

  సువర్ణావకాశం 2

(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన  వ్యాసంఇతరులు  చదవడం నిషిద్ధం. )

రోజుల్లో మనం అనేక ప్రకటనలు చూస్తున్నాము "సువర్ణావకాశం" బంపర్ ఆఫర్ మంచి తరుణం మించిన పోవును ఇప్పుడు అవకాశాన్ని వినియోగించుకోండి అని అనేక వ్యాపార ప్రకటనలను నిత్యం చూస్తున్నాము. వాటిని చూసి రోజూ ఎంతోమంది మోసపోతున్నట్లు కూడా మనం  తెలుసుకుంటున్నాము. బంపర్ ఆఫర్ ఇప్పుడే కొనండి ఆలస్యం చేస్తే మంచి అవకాశం కోల్పోతారు అని మభ్యపెట్టి అనేక నాసిరకపు సామాన్లు అమ్ముతున్నారుఅమాయక మహిళలు ఎందరో మోసపోయారని మనకు తెలుస్తున్నదిఇదంతా ఐహికమైన, నిత్యం మనం చూస్తున్న విషయం ఇక విషయానికి వస్తే 

మానవ జన్మ:

మిత్రులారా 84 లక్షల జీవరాశులలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషులతో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయివారి శరీరం సున్నితం, సుకుమారం గా ఉండి ఉంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీల కంటే పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యం తో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) ఇప్పుడు మీరు 60 సంవత్సరాల వయస్సు గడిపి జీవితంలో చివరి అంకంలో వున్నారు.అంటే  శని దేవుడు మీ జాతక చక్రంలో రెండు భ్రమణాలు చేసి వున్నారు. నాలుగు భ్రమణాలు చేయడం అనేది నాకు తెలిసి శ్రీ రామానుజ చార్యులు వారికి మాత్రమే జరిగింది ఆచార్యులు 120 వసంతాలు జీవించినట్లు చరిత్ర చెబుతున్నది. (జ్యోతిష శాస్త్ర రీత్యా శని దేవుడు మారక కారకుడు అంటే మారక స్థానంలో శని ప్రవేశిస్తే జాతకునికి మారకం (మరణం) సంభవిస్తుందని శాస్త్ర  ఉవాచ. జాతక చక్రంలో అతి తక్కువ వేగంతో చలించే గ్రాహం శని శని ఒక సారి తను ఉన్న గది నుండి భ్రమించి తిరిగి అదే స్థలానికి రావడానికి 30 సంవత్సరాల సమయం పడుతుందికొందరు 30 సంవత్సరాల కన్నా ముందే చనిపోతారు అంటే శని మొదటి భ్రమణంలో మారకాన్ని ఇచ్చాడన్నమాట. అతి ఎక్కువగా శని దేవుడు 4 సార్లు జాతకుని జాతకచక్రంలో తిరుగగలడు అంటే 30 x 4= 120 సంవత్సరాలు అతి దీర్ఘ ఆయుష్షు ) అతి దీర్ఘ ఆయుష్షు అతికొద్ది మంది జాతకంలో ఉంటే ఉండవచ్చు కానీ అది చాలా దుర్లభము. 60 దాటినాయి అంటే క్షణంలోనైనా పిలుపు రావచ్చుమీరు నేను అనుకున్నది దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఈశ్వరునికి ఎరుకమనం మన అజ్ఞానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తాం అని ఐహికమైన వాంఛల మీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాంమీరు ఆనందంగా 60 సంవత్సరాలు గడిపారు ఇక మీదనన్న మిగిలిన శేష జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మ సార్థకం చేసుకోవాలని యోచించండిఅదే మనకు పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. అవకాశం కనుక సరిగా వినియోగించుకో పోతే మరల ఎన్ని జన్మలకు తిరిగి అవకాశం వస్తుందితిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84లక్షలు ఇష్టు ఒకటి అంటే మీరు ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగ విలాసాలతో అపురూపమైన మానవ జన్మను వృధా చేస్తే చివరికి మీకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూ ఉండటమే. కాబట్టి మిత్రమా మేల్కొని నీ గమ్యాన్ని తెలుసుకో

ప్రయాణికుడు

60 సంవత్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలిమీరు పూర్తిగా ప్రయాణ సన్నాహాలు లోనే ఉండాలి. కొంతమంది ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చి ఉన్నారుకొంతమంది స్టేషన్ కి  వెళ్లే మార్గంలో ఉన్నారు, కొంతమంది ఎక్కవలసిన రైలు స్టేషనులో ప్లాట్ఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైలులో కూర్చొని రైలు సిగ్నల్ కోసం వున్నట్లుగా భావించాలి. ఏ క్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపడం ప్రయాణం మొదలు కావడం జరగవచ్చుమీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటూ కూర్చుంటే ప్రయోజనం లేదుఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యారు ఇప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు ఒంటరిగా ఉన్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ప్రయాణంలో కూడా రావచ్చుకానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావడం అనేది ఉండదుకాబట్టి ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం

ఈశ్వరానుగ్రహం

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుఅది ఎంతవరకు నిజమో కానీ  నేను ఒక్కటి మాత్రమే సంపూర్ణంగా విశ్వసిస్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించడానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేవుని మీదకు వెళ్ళదుఅందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమం పెట్టారు అని నాకనిపిస్తుందినిజానికి మనం పూజించేది వినాయకుడిని కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుందికానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం

దేముడిని ఏమి కోరాలి

దేముడిని ఏమి కోరుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న నిజానికి మనం దేముడిని రెండు విషయాలు ముందుగా కోరుకోవాలి అవి ఏమిటంటే భగవంతుడా నిన్ను సదా పూజించే మనస్సు నాకివ్వు. ఇక రెండోది  నేను సదా నీ సేవ చేయడానికి నాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు  ఇవ్వుమీ మనస్సు, శరీరం సహకరిస్తేనే కదా మీరు దైవ ప్రార్ధన, , పూజ చేయగలరు

జీవన విధానంలో మార్పు

నిన్నటిదాకా గడిపిన జీవితం ఒక ఎత్తు రోజు నుంచి గడిపిన జీవితం ఒక ఎత్తు. నిన్నటిదాకా నీవు డబ్బు వెంట పరుగులు నీ   గమ్యం ఎప్పుడు ఒక్కటే అదేమిటంటే డబ్బు ఎలా సంపాదించాలి, భార్య పిల్లలను ఎలా పోషించాలి అనేదేకానీ ఇప్పుడు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారు వాళ్ళ కాళ్ళ మీద నిలపడగలుగుతున్నారు. వారికి వారి వారి కుటుంబాలు ఏర్పడ్డాయి లేకపోతే ఏర్పడుతున్నాయినీకు చీకు చింత లేదు. కావాల్సినంత సమయం వున్నది. ఇన్నాళ్లు నీవు గత జీవితంలో బాహ్య పటాటోపాలు, కపట వేషధారణ, ఎవరినో చూసి పోల్చుకునే  విధానం. నా హోదా, నా సంపద మొదలైన విషయాలను పక్కన పెట్టి ఇప్పుడు కేవలం నేను ఈశ్వరుని సేవకుడు అనే భావంతో మెలగాలి. అంటే ఒక సేవకునికి ఉండే లక్షణాలు  అలవరచుకోవాలి. అవి ఏమిటంటే వినయ, విధేయత, సాధారణ జీవనం. నిగర్వం, నిరాడంబరత, సత్సీలం, సదాచారం. నిరంతర ఈశ్వర జాస  అలవరచుకోవాలి. నా కుటుంబం, నా బంధువులు, నా మిత్రులు అనే నా అనేవి కొద్దీ కొద్దిగా తగ్గించుకోవాలి నేను కేవలం నేను అనే తలపుల లోనే ఉండాలి ఇక్కడ నేను అంటే ఎవరు అనే విచారణ  చేయాలి. దేహం నేను కాదు కేవలం నా దేహం నాకు (ఆత్మకు) ఒక ఉపాధి స్థానం అంటే ఒక డ్రైవరుకు కారు ఎలా ఉపాధి స్తానంలో ఆలా కాబట్టి దేహాన్ని నేను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా చూసుకుంటాను కానీ దేహ వ్యామోహానికి లోను కాను అని దృఢ సంకల్పం చేయాలిఎట్టి పరిస్థితిలోను దేహ వ్యామోహానికి లోనే కాను అనే సంకల్పం  చేయాలి. మొహాన్ని వీడటం అంటే అంత సులభం కాదు కఠిన అభ్యసంతోటె అది సాధ్యం. . 

దేహ నియంత్రణ

ఎప్పుడైతే నాకు దేహం ఒక ఉపాధి స్థానం అని నీవు భావిస్తావో అప్పుడు నీవు దేహాన్ని ఒక యంత్రాన్ని బాగుచేసే వాని చేతిలో పరికరం లాగా మాత్రమే  చూస్తావు. దేహ సౌందర్యం తో నీకు సంబంధం లేదు కానీ కేవలం దేహాన్ని పరి శుభ్రంగా పెంచుకోవడానికి మాత్రమే చూస్తావుదేహం ఎప్పుడైతే బాహ్యంగా పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు దేహంలోని మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందిఅదే దేహం చెమటతో నిండి, నోరు పాచితో ఉంటుందో అప్పుడు నీ మనస్సు నీ వశం కాకుండా దేహం మీదకు పదే పదే వస్తుందిఅప్పుడు ద్యానమ్  చేయలేవు. కాబట్టి దేహాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధకుడు చేయాల్సిన మొదటి పని.

ముండనం

కేశాలను  పెంచుకోకూడదు. తరచూ ముండనం (గుండు) చేయించాలిముండకోపనిషత్ ముండనం గూర్చి వివరిస్తుంది. "తలలు బోడులైన తలపులు బోడులవునా?" అని ఒక వాక్యం నానుడి ఉంది దీని అర్థం శిరస్సు ముండనం చేయించుకున్న మనస్సు వాంఛలను వదులునా అనికానీ ఎప్పుడైతే శిరస్సు బోడి అవుతుందో అప్పుడు చాలావరకు దేహ వాంచ  తగ్గుతుంది ఎందుకంటే మనిషికి అందాన్ని ఇచ్చేవే తలవెంట్రుకలు వాటిని పట్టె తానూ అందంగా వున్నాను అనే భ్రాంతిలో వుంటారు. కొందరు నెరసిన వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఇంకా తాను యవ్వనంలో వున్నానని సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటివారి మనస్సు ఎప్పుడు ఐహికమైన వాంఛల మీదనే ఉంటుంది. దైవజాస అస్సలు కలుగదు. అదే ముండనం చేసుకున్న సాధకునికి చక్కటి ఆహ్లాదకరమైన దైవ చింతన కలిగి . మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. సాధారణంగా గుండు చేయించుకోవడానికి ఎవ్వరు  ఇష్టపడరు. కానీ సాధకుడు తన గమ్యమైన మోక్షాన్ని చేరుకోవాలంటే తప్పకుండా ముండనం  చేసుకోవలసిందే. దీనిని నేను ఒక చిన్న ఉదాహరణ తో వివరిస్తాను. ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కావలసిన లక్షణం సరిగా పాఠాలు చదువుకొని అవగాహన చేసుకోవటం మాత్రమే అతని వస్త్రధారణతో  ఏరకంగాను అతని చదువుకు సంబంధం ఉండదు కదా మరి మా పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా రకం వస్త్రాలనే (UNIFORM) ధరించాలని పాఠశాల యాజమాన్యం సూచిస్తే తప్పకుండ మనం మన పిల్లలకు అదేవిధంగా వస్త్రధారణ చేసి పాఠశాలకు పంపుతామునిజానికి విద్యార్థి చదువుకు అతని వస్త్ర ధారణకు ఎలాంటి సంబంధం లేదు కానీ పలనా విద్యార్థి ఫలానా పాఠశాలలో చదువుతున్నాడని వస్త్ర ధారణ చెపుతుందిఅదే విధంగా సాధకులమైన మనమందరము బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జకు పాటు పడుతున్నామని ముండనం వలన కొంతవరకు సాధారణ ప్రజానీకానికి తెలువవచ్చు

ముండనం ప్రారంభంలో

 కొత్తగా ముండనం చేసుకునే సాధకునికి అనేక విమర్శలు, సందేహాలు, వస్తాయి. మొట్ట మొదట ప్రతి వారు కూడా శారీరిక సౌందర్యం మీదనే మొహంతో వుంటారు కాబట్టి ముండకము చేసుకోవటానికి సాధకుని మనస్సు అంగీకరించదుకర్మ పరికత్వత చెందితే తప్ప ఆధ్యాత్మిక జీవనం మనుషులకు అలవడదునూటికి తొంబయి మంది తమ సాధారణ జీవనానికి విఘాతం కలిగే విధంగా ఉండటానికి అంగీకరించరువారు చూపే కారణాలునా భార్య పిల్లలు నేను గుండు చేసుకుంటే వప్పుకోరుమీ జుట్టు మంచిగా వుంది చక్కగా రంగు వేసుకోండి సినిమా హీరోల వుంటారు అని నా భార్య అన్నదినేను నా భార్య మాటకు విలువ ఇస్తాను అంటారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే ఆర్యా  ఒక తాగుబోతు తన భార్య అనుమతి తీసుకొని తాగుతున్నాడా? అదే విధంగా ఒక జూదరి తన భార్య అనుమతి తీసుకొని జూదం ఆడి సమస్త ఆస్తుల్ని కోల్పోతున్నాడా లేదేవారు ఒక దుర్వ్యసనానికో లేక దుస్సంగత్యానికో పాలుపడి వారి భార్యలు యెంత వద్దన్నా వారి వారి పనులు చేస్తున్నారు, తత్ ద్వారా వారి భార్య పిల్లలకు అనేక విధాలుగా దుఃఖాన్ని చేకూరుస్తున్నారు. మరి సాధక మిత్రమా నీవు నీ కుటుంబ బాధ్యత ఏమాత్రం వీడకుండా నీ కుటుంబాన్ని పోషిస్తూ నిన్నునీవు  ఉద్దరించుకోవటానికి ముండనం చేసుకోవటానికి ఎందుకు సంకోచిస్తున్నావు. ఒక్క సారి ఆలోచించునీవు నీ ధర్మాన్ని నిర్వహిస్తూ (భార్య పిల్లలను పోషిస్తూ) నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నావుఇందులో లేశమాత్రము తప్పులేదునిన్ను ఎవరైనా కాదంటే వారి మాటలు గణనలోకి తీసుకోకు. నిన్ను చూసి ఎవరో ఏమో అనుకుంటారని చిన్నతనంగా అనుకోకు. నీవు చేసేది కేవలం నీ ఆధ్యాత్మిక ప్రగతికోసం మాత్రమే అని  భావించు. నీకు స్వార్థపర ప్రపంచంతో ఎలాంటి   నీ జీవనం నీది నీ ముక్తిమార్గం  నీది. అబ్బ వచ్చాడండి అపర రమణ మహర్షి ఈయనట జ్ఞ్యాని అట మోక్షసాధన చేస్తాడట మనమందరము దేముడిని కొలవటం లేదా అది కేవల ఎచ్చులకే కాక జ్ఞ్యానం లేదు ఏమి లేదు అంతా బూటకం అని నిందించేవారు కూడా సమాజంలో   అటువంటి కు విమర్శలను దేముడు నీకు పెట్టె పరీక్షలుగా భావించి మౌనంగా నీ పని నీవు చేసుకుంటూ వేళ్ళు. నీకు తోడుగా సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థలాల్లో ఉంటాడునీవు చేయవలసిందల్ల  ఈశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మటమే. .  

మొదట్లో సమస్యలు

సమాజంలో మనం ఎలా కనపడితే అలాగే చూస్తుందినీవు నిన్నటిదాకా చక్కగా క్రాపు చేయించుకొని రంగు వేసుకొని అందంగా కనబడే రోజు గుండుతో కనపడేసరికి సమాజం నిన్ను ఆలా స్వీకరించటానికి ఇష్టపడదు . ప్రశ్నల పరంపర: ఒక మిత్రుడు అడుగుతాడు రావుగారు మీరు తిరుపతికి వెళ్ళారా, లేదు అయితే యాదగిరి గుట్ట లేదు అయితే ఇంకెక్కడికి వెళ్లారుఅయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు కేవలం నేను ఆధ్యాత్మిక జీవనం చేయదలచుకొన్నాను అందుకే నాటి నుండి ముండనం చేసుకొని వుండదలచుకున్న అంటే ఊరుకోండి మాస్టారు మీ గురించి నాకు తెలియదా మీకు ఆధ్యాత్మిక జీవనం ఏమిటీ. అని చులకన చేస్తారు. ఇక మీ శిఖ (పిలక) చూస్తే అయ్యో మీ నాన్నగారు పోయారా లేక అమ్మగారు పోయారా అని అడుగుతారుఎందుకంటె మన సమాజంలో గుండు పిలక కేవలం పితృ కర్మలు చేసేటప్పుడే వుంచుకుంటారనే   అభిప్రాయం వుంది కాబట్టి. ఇటువంటి అనేక సమస్యలను సాధకుడు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రమా శిఖ లేకుండా చేసే ఏకర్మ కూడా అంటే దైవకార్యం కానీ పితృకార్యం కానీ ఫలించదుమనం కేవలం పితృకర్మలు చేసేటప్పుడే శిఖ ధరించాలనే అభిప్రాయంలో వున్నాం ఎలాగైతే భగవద్గీత శవ యాత్రలో  వాహనం వద్ద వినిపించేదానిగా ఎలా అనుకుంటున్నారో ఆలానిజానికి ప్రతి పురోహితుడు విధిగా శిఖ ధరించి ఇతరులకు మార్గదర్శకం వాహించాలి. కానీ వారే పాటించటం లేదు. మన ధర్మాన్ని  ఉద్దరించటానికి శంకరులు మరల రావాలేమో

శిఖ ప్రాధాన్యత

పూర్తిగా ముండనం (గుండు) కేవలం సన్యాసులు మాత్రమే చేయించుకోవాలి. సంసార జీవనం చేస్తున్నవారు తప్పనిసరిగా శిఖ(పిలక) ధరించాలి మన శాస్త్రాల్లో బ్రాహ్మణుడు గోపాదం అంటే ఆవు యొక్క అరికాలు (డెక్క ) పరిమాణంలో శిఖను ధరించాలని పేర్కొన్నాయిపరిమాణం ఎంతైనా శిఖ మాత్రం తప్పనిసరిగా ఉంచుకొని మాత్రమే గుండు చేయించుకోవాలి. ఒకసారి భార్గవ శర్మ గుండు చేయించుకోవడానికి మంగలి షాప్ కి వెళ్లి మంగలితో పిలక ఉంచవలసిందిగా చెపితే ప్రక్కన వున్న తెలిసిన వాడు మీకెందుకు సార్ పిలక  రోజుల్లో పురోహితులు కూడా గుండు పిలక పెట్టుకోవడం లేదు అని పరిహాసంగా అనడం జరిగింది దానికి అది మన సంప్రదాయం అందుకే నేను ఇలా వుంచుకుంటున్న అని సమాధానం చెప్పడం జరిగింది.   మన ఆచార సాంప్రదాయాలు రోజు రోజుకు అణగారి పోతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని మనం మన సాంప్రదాయాలని పాటించక పొతే భవిష్యత్తులో మన సంప్రాయాలు మన ముందు తరాలకు ఆచరించటం అటుంచి వారికి తెలియనే తెలియవు. వారు పురాతన చిత్రాల్లో మాత్రమే చూడగలుగుతారు అనటంలో సందేహం లేదు

ఒకసారి బ్రాహ్మణ సంఘము వారు వనభోజనాలు ఏర్పాటు చేస్తే శర్మ అక్కడకు వెళ్ళాడు నిర్వాహకులలో  ఒకరు " మీరా ఎవరో పంతులు అనుకున్న" అని అంటే ఆర్యా నేను పంతుల్నే మీరు కాదా? ఇది బ్రాహణ వనభోజనాలు అనుకున్న కాదా ఏమిటి అని అనటం జరిగిందిబ్రాహ్మణ సంఘ  నిర్వహణ మండలి సభ్యులు కూడా ఒక్కరుకూడా గుండు పిలక వున్నవారు కనపడలేదు అంతేకాదు కనీసం బ్రాహ్మణ వనభోజనాలు కదా పంచకట్టుకొని వద్దామని ఒక్కరు కూడా అనుకోలేదు. కానీ  వీరు బ్రాహ్మణులను ఉద్ధరిస్తారని చెప్పుకుంటారు. ఇతరులకన్నా బిన్నంగా బ్రాహ్మణునికి రెండు ధర్మాలు ఉన్నాయి అని  నేననుకుంటా. అవి ఒకటి తన స్వధర్మాన్ని ఆచరించటం రెండు ఇతరులతో వారి, వారి స్వధర్మాలను ఆచరించాలని  చెప్పటం. మొదటిదే కనపడటంలేదు ఇక రెండోదాని ప్రశస్తే లేదు. ముందు ప్రతివక్కరు తమ ధర్మాన్ని పాటించాలిఅప్పుడే ధర్మం నిలబడుతుంది. ధర్మాన్ని ఆచరించే వారికి ధర్మం ఎప్పుడు రక్షగా ఉంటుంది. హిందువు అయిన ప్రతివారు వారి  కుటుంబ పద్దతి ప్రకారం పంచ కట్టుకోవటం   విధిగా దైవతార్చన వేళ  పంచకట్టుకోవాలి. అన్న నియమం కుటుంబ పెద్దలు ఆచరించి ఆచరింప చేయాలి. శోచనీయమైన విషయం ఏమిటంటే పౌరోహితం చేసే బ్రహ్మణోత్తములు, అర్చన చేసే అర్చకస్వాములు పంచ కట్టు మార్చి ధవళ వస్త్రాన్ని లుంగిలాగా కట్టి కార్యక్రమాలు  చేయిస్తున్నారు.

తిరుపతి వెళితే: చాలామంది తిరుపతి వెళ్ళినవారు పూర్తిగా గుండు చేయించుకునే ఆచారం మనకు వున్నదినిజానికి తిరుపతి వెళ్ళినకూడా తప్పకుండ శిఖ ను ఉంచుకొనే గుండు చేయించుకోవాలికేవలం సన్యాసులు మాత్రమే పూర్తిగా గుండు చేయించుకోవటానికి అర్హులు విషయాన్ని గమనించాలి

మీరు నిజంగా మోక్ష సాధకులు అయితే తప్పకుండ పైవిధంగా ఉండటానికి ప్రయత్నించండిమన మార్గంలో ఎన్ని అవాంతరాలు వచ్చిన మనం వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలి

క్రమబద్ద జీవనం

సాధకుని రోజు ఎప్పుడు ఉషోదయ కాలంతోటే మొదలైతుందిఅంటే సూర్యోదయం కన్నా 90 నిమిషాల ముందు అంటే సుమారు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేవాలి. ఎప్పుడు 6,7 గంటలకు నిద్రలేచే అలవాటు వున్నవారు ఇలా 4 గంటలకు నిద్ర లేవాలంటే చాలా కష్టంగా ఉంటుందికానీ మనం మన గమ్యం వైపు నడవాలంటే తప్పకుండ అబ్యాసం చేయాలి. కొంత కాలం అబ్యాసం చేస్తే తరువాత మీరు మీకు తెలియకుండానే నిద్రనుంచి మేల్కొంటారు. ముందుగా రాత్రి భోజనం త్వరగా ముగించి తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే తప్పకుండ ఉషోదయకాలంలో నిద్ర లేవగలుగుతాడు. సాధకుడు తన సెల్ఫోనులో వెంకటేశ్వర సుప్రభాతాన్ని అలారంగా పెట్టుకున్నాడు దాని ద్వారా నిద్ర లేస్తూనే స్వామి సుప్రభాతం వింటూ లేస్తాడు కాబట్టి ఉభయ తారకంగా ఉంటుదని అతని భావం. మీరు మీకు నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోండికానీ ఎట్టి పరిస్థితిలోను నిద్ర ఉదయం 4గంటలవరకే పరిమితం చేయండి

నిద్ర లేవంగానే మలమూత్ర విసర్జన చేసి చక్కగా దంతధావన చేసి ధ్యానానికి ఉపక్రమించండిస్నానం చేస్తే మంచిదే కానీ స్నానానికి ఎక్కువ సమయం కాకుండా చూసుకోండి

ఉదయం 4గంటల సమయం

నిజంగా సమయం యన్తో పవిత్రమైనదిగా గోచరిస్తుంది. ఎందుకంటె మీకు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా పిట్టల శబ్దాలు వినపడతాయిమీకు 5గంటలనుండి శబ్దాలు వినపడతాయికాబట్టి 4నుండి 5 గంటల సమయం చాలా విలువయినది. శ్రీ కృష్ణ పరమాత్మా  చెప్పినట్లు ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే యోగి మాత్రం మేల్కొంటాడు. స్వామి చెప్పింది నిజం యోగి సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. ఉదయం 4 గంటల సమయంలో చేసే ధ్యానం చక్కటి ఫలితాన్నిస్తుంది

ముక్తికి మార్గం

ఇటీవల కొంతమంది కలియుగంలో ముక్తికి కేవలం నామస్మరణ చాలు పూర్వం ఋషులు కష్టపడ్డట్లు కఠోర తపస్సు చేయనవసరం లేదు అంటూ రోజులో రెండు మూడు నిముషాలు దైవజ్యానం చేస్తూ తనకు తానుగా తరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. అది అస్సలు  నమ్మకండి. ఒక్కవిషయ గుర్తుంచుకోండి ప్రకృతి ధర్మం అన్ని యుగాలకు ఒకే విధంగా ఉంటుందిఎప్పుడు అది మారదుప్రకృతి ధర్మం అంటే ఏమిటంటే మనకు జగత్తులో కనిపించే నియమాలు ఉదాహరణకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, నీరు పల్లంలోకే ప్రవహిస్తుంది, నిప్పు ముట్టుకుంటే  కాలుతుంది. మేఘాలు వర్షిస్తాయినదులు సముద్రంలోనే కలుస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడుఇలాంటివి అనేక నియమాలు ప్రకృతిలో మనం చూస్తున్నాము.  ఇప్పుడు చెప్పిన ప్రకృతి నియమాలు సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా వున్నాయి.ఒక యుగంలోకాని, ఒక కాలంలో కానీ ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకోలేదు, భవిష్యత్తులో కూడా మార్చుకోదుఅటువంటప్పుడు పురుషుని (భగవంతుని) నియమాలు ఎలా  మారుతాయి. ప్రకృతికి నియంత భగవంతుడే కదా. కాబట్టి మిత్రమా కేవలం నామ స్మరణ చేస్తే మోక్షం రాదు మాట కేవలం కఠినమైన తపమొనర్చలేని ఆర్భకులు పలికిందే కాని మరొకటి కాదు

ఉపనిషట్ మంత్రం చుడండి 

ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత 

క్షురస్య ధార నిశిత దురత్యయా దుర్గం పాదస్తత్కవయో వదన్తి 

తా|| లేవండి! (అజ్ఞానమనే నిద్రనుండి), మేల్కొనండి! ఉత్తమ గురువులను సమీపించి ( జ్ఞానాన్ని) తెలుసుకోండి. మార్గం మంగలి కత్తి అంచు మీద నడవటం వలె చాలా కష్టమైనది మరియు తీక్షమైనది, కనుక చాలా కష్టంచే దాటదగినది, కష్టంచే పొందదగినదని పండితులు చెబుతారు. కాబట్టి మిత్రమా మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞ్యానమే జ్ఞ్యానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు

సద్గురువులు

మధ్య సద్గురువుల ప్రభంజనం సమాజంలో బాగా కనపడుతున్నది. యేవో కొన్ని పురాణాలూ, ఇతిహాసాలు, ఒకటి రెండు ఉపనిషత్తులు చదివి వారికి కలిగిన జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞ్యానంగా భావిస్తూ ప్రచారం చేసుకుంటూ వారు దైవ భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దండిగా విశేష కానుకలను తీసుకొంటూ ఉపదేశాలు చేస్తూ సామాన్యులను మభ్యపెడుతూ వారు అనేక సుఖభోగాలను అనుభవిస్తున్నారుమిత్రమా అలంటి వారి వలలో చిక్కుకొని నీ అమూల్య  జీవితాన్ని,కాలాన్ని వృధా  చేసుకోకు. ఇలాంటి సద్గురువులు గడ్డాలకు మీసాలకు కూడా రంగులు వేసుకొని ఖరీదైన కంకణాలు, కిరీటాలు ( బంగారపు) ధరిస్తూ తామే అపార దేవతా స్వరూపమని ప్రచారం  చేసుకొంటున్నారుమిత్రమా వీరు చేసేది దైవ దూషణ, దైవ ధిక్కారం అంతకంటే ఇంకొకటి  కాదు. ఇలాంటి వారిగూర్చి బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు ఎప్పుడో పేర్కొన్నారు

సద్గురువు:

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మరి నిజమైన సద్గురువు  ఎవరు. సద సత్యాన్వేషణ చేసే మహానుభావుడే నిజమైన సద్గురువుమరి ఆయనను ఎలా తెలుసుకోవాలిఒక ఉదంతం చెపుతాను పరికించండిపూర్వం ఒక జిజ్ఞాసపరుడు తనను ఉద్ధరించే సద్గురువు ఎవరైనా దొరుకుతాడా అని విచారిస్తూ  వెళుతుంటాడు. ఎందరినో అడుగుతాడుకానీ సద్గురువు  దొరకలేదు. కీనీ ఒక గ్రామంలో ఒకతను ఆర్య సద్గురువు జ్ఞ్యాని అంటే మాకు తెలియదు కానీ ఇక్కడి సమీపపు అడవిలో వున్న శివాలయంలో ఒకతను  ఉంటున్నాడు. అతనికి సరైన దుస్తులు కూడా లేవు ఎప్పుడు పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. మేమంతా అతనొక పిచ్చివాడుగా అనుకుంటాముమీరు వెతికే జ్ఞ్యని, సద్గురువు అతనేనేమో ఒకసారి వెళ్లి చుడండి అన్నాడు. అదివిన్న జిగ్న్యాసకు పట్టరాని ఆనందం కలిగి ఇక తనకు జీవన్ముక్తి కలిగించే సద్గురువు దొరికాడని భావించి శివాలయానికి ఆత్రుతతతో చేరుతాడుఅక్కడి దృశ్యం చూసి మన జిజ్ఞాస పరుడికి మతి పోయింది ఎదుకంటే అక్కడి మనిషి శివాలయంలోని శివలింగానికి తన కాళ్ళు రెండు దట్టించి తన్ని పడుకొని వున్నాడు అది చూసిన మన జిజ్ఞాసపరుడు ఇలా అనుకుంటాడుఈయనను నేను అనవసరంగా జ్ఞ్యాని అని అనుకున్నా నిజానికి యితడు దేముడిగురించి ఏమాత్రం విశ్వాసం లేని ఒక మూర్కుడో లేక పిచ్చివాడా అయ్యివుంటాడు అని అనుకోని వచ్చే కోపాన్ని అణచుకొని ఆర్య మీరు ఏమిచేస్తున్నారో తెలుస్తుందా  అన్నాడు. లేదు నాయనా నేనేమి చేస్తున్నాను కేవలం నేలమీద పడుకొని ఉన్నానే అని అన్నాడుమీరు నేలమీద  పడుకున్నారు. అది సరే మీ కాళ్ళు పవిత్రమైన శివలింగాన్ని తాకుతున్నాయి అది చూసుకున్నారు అని కొంచం ఉగ్రస్వరంతో అన్నాడుదానికి ప్రశాంత్ వదనంతో అతను నాయనా నేను చూడలేదు నాయనా దయచేసి శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి పో నాయనా నాకు ద్రుష్టి సరిగా ఆనదు అన్నాడుఅప్పుడు మన జిజ్ఞాసపరుడు అతని కాళ్ళను లింగంనుంచి తీసి ప్రక్కన పెట్టాడుఆశ్చర్యం అక్కడ ఇంకొక లింగం ఉద్బవించింది. దానిమీద  మరలా అతని పాదాలు వున్నాయి. మన జిజ్ఞాసపరుడు ఇంకొక చోటికి అతని పాదాలను మార్చాడు అక్కడ ఇంకొక లింగం అట్లా మన జిజ్ఞాసపరుడుఎన్ని చోట్లకు అతని పాదాలను మార్చాడో అన్ని లింగాలు వచ్చాయిదాన్ని చూసిన జిజ్ఞాసపరుడు వెంటనే అతని పాదపద్మాలను పట్టుకొని మహానుభావా తమరు ఎవరు ఏమిటి వింత నేను ఆజ్ఞనంతో మిమ్మలను గుర్తించలేక పోయాను నన్ను క్షమించండి అని వేడుకుంటే ప్రసన్నవదనుడై శివాలయంలోని జ్ఞ్యాని నాయనా నీవు నీకు వున్న జ్ఞనంతో శివ లింగంలోనే భగవంతుని చూస్తున్నావుకానీ నాకు అంతట శివుడే కనపడుతున్నాడు మరి  శివుడు లేని చోట నా కాళ్లను ఎలా ఉంచగలను  అన్నాడు. అప్పుడు అతని మాటలకు మన జిజ్ఞాస పరుడు నిశ్చేష్టుడు అయి  అతనిని గురువుగా స్వీకరించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు.. కాబట్టి మిత్రమా బ్రహ్మ జ్ఞ్యానులు ఎప్పుడు బ్రహ్మ్మములోనే సంచరిస్తూ ఈ ఐహిక ద్వైత ప్రపంచాన్ని గూర్చి  ఏమాత్రము  విచారించారు. ప్రపంచాన్ని కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, కాళ్లతో నడుస్తారు కానీ కానీ ఏది వారి మనసును చేరదు వారి మనస్సు సదా బ్రహ్మము మీదనే లఘ్నత చెంది ఉంటుంది.  వారు జీవించటానికి తింటారు కానీ తినే పదార్ధం  ఏది వారి మనస్సును ఆకట్టుకోదు, స్త్రీ పురుష, బాల, యవ్వన, వృద్ధ వత్యాసాలు వారికి వుండవు. అరిషడ్వార్గం పూర్తిగా వారికి స్వాధీనమై ఉంటుంది.  ఎటువంటి మనోవికారాలు వారికి వుండవు. ఒక్క మాటలో చెప్పాలంటే అటువంటి వారు నడిచే దేవుళ్ళు.  మన సహజమైన స్వభావాన్ని వారికి కూడా అంటకట్టి వారు కూడా కోరికలకు బానిసలు అనే తలంపులో ఉంటాము.  నిజానికి అటువంటి వారు  పూర్తిగా బ్రహ్మ జ్ఞ్యానం కలిగి  వుంటారు.  సదా నిధిజాసలో వుంటూ వారి జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అంకితం చేస్తారు. 

"బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవ" 

బ్రహ్మను తెలుసుకున్న వాడు స్వయముగా బ్రహ్మయే అవుచున్నాడు. అనగా బ్రహ్మ జ్ఞ్యాని వేరు, బ్రహ్మ వేరు కాదని అర్ధం.  బ్రహ్మ జ్ఞ్యాని సంపూర్ణ బ్రహ్మ స్వరూపమే, అతనికి ఈ ద్విఏత   జగత్తు పూర్తిగా బ్రహ్మ స్వరూపంగా గోచరిస్తుంది.  బంగారము, మట్టి రెండు మట్టిగానె గోచరిస్తుంది. ఒక ఘటం (కుండ ) వేరుగా మృత్తిక (మట్టి) వేరుగా చూడడు అంతా ఒక్కటిగానే కనపడుతుంది.  మరి అటువంటి సత్పురుషులు ఐహిక మినట్టి వస్తువుల పట్ల మమకారం చూపుతారా? అంటే చూపరు.  వారి జీవిత లక్ష్యం కేవలం బ్రహ్మము అంటే బ్రహ్మమే కాక వేరొకట్టి కాదు.  మిత్రమా అటువంటి సద్గురువును చేరు 

కాబట్టి మిత్రులారా సద్గురువులను గుర్తించటానికి ఒక్కటే   మార్గం. వారు మన సాంఘిక నియమాలకు లోబడి వుండరు. ఏకాంతంగా ఉంటారువారికి ఎలాంటి ప్రచారాలు వుండవుప్రలోభాలకు  లొంగరు. సిరి సంపదలు వారికి తృణ సమానం. వారికంటూ ప్రపంచంలో ఏదీ ఉండదువారికి నీవు ఏది( అంటే ధన కనక వస్తు వాహనంఇవ్వవలసిన పని లేదు  వారికి నీవు సేవ చేసి ప్రసన్నం చేసుకోవాలివారికి ధనికుడు, పేదవాడు మన్నన ఛీత్కారాలు అన్ని సమానమే. మిత్రమా నీకు అటువంటి సద్గురువు ఎక్కడైనా కనిపించాడా? కనిపిస్తే వెంటనే అతని శరణు వేడు నీ జన్మ సార్థకత చేసుకో

సద్గురు తానే వస్తాడు

ఇటీవల చాలామంది తనకు తాను ఒక సాధకుడిగా భవిస్తూ తనను ఉద్దరించడానికి ఒక సద్గురువు తనవద్దకే వచ్చి తనను ఉద్ధరిస్తాడనే భ్రాంతిలో   వున్నారుమిత్రమా  మోక్ష సాధన అనేది ఎవరికి వారుగా శోధన చేసిసాధన చేసి, శ్రమించి, కష్టించి  సాధించాల్సింది. ఎవరు నీ దగ్గరకు రారు నిన్ను ఎవ్వరు ఉద్దరించరు ఆలా అని ఎవరైనా అంటే అది కేవలం నీ వద్ద నుండి కానుకల రూపంలో ధనాన్ని సేకరించే మార్గం తప్ప వేరొకటి కాదునిజమైన గురువుకి నీ సిరిసంపదలు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు  అంతే కాదు ఆయనకు నీతోకూడ పనిలేదు. నిన్ను ఉద్ధరించే గురువు ఎవరో కాదు నీకు నీవే అది మరువకు  మిత్రమా

ఆయనను పూజిస్తే మోక్షం ఇస్తాడట

ఇది ఒక విచిత్ర వాదం ఒక వ్యక్తిని అది హిందూ ధర్మాన్ని గూర్చి తెలియని ఇతర మతస్తుని సద్గురువుగా భావించి, గుడులు కట్టి పూజించటమే కాకుండా అయన నీకు కూడా మోక్షాన్ని ఇస్తాడు అని ఇటీవల కొందరు  భావించి ప్రచారం   చేస్తున్నారు. మిత్రమా ఇటువంటి ప్రలోభాలకు లొంగకు నీ అమూల్య కాలాన్ని వృధా చేయకు

విగ్రహారాధన:

దేవాలయాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తే మోక్షం లభిస్తుందా అని కొందరు  అడుగుతారుమిత్రమా భక్తి మార్గం జ్ఞాన మార్గానికి ప్రాథమిక విద్యగా   ఉపకరిస్తుంది భక్తి  వలన అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందిఐహిక వాంచితాలు నెరవేరుతాయిభక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గాన్ని చేరుకోవాలి ఎలా అయితే పాఠశాల చదువు అయిన తర్వాత కళాశాల చదువుకు వెళ్లినట్లు .  

ధ్యానం ఎలా చేయాలి

సాధకుడికి తలెత్తే సందేహాలు ధ్యానం ఎందుకు చేయాలి, ఎలాచేయాలి, ధ్యానం అంటే ఏమిటి ఇలాంటి, ధ్యానం తప్ప ఇంకో మార్గం లేదా అనే అనేక ప్రశ్నలు జిజ్ఞాసువుల తలల్లో మెదులుతాయి

ధ్యానం అంటే ." చిత్తవృత్తి నిరోధమే యోగం." అన్నారు   యోగాన్ని ఆచరించే వాడే యోగి.మరి ధ్యానం అనేక ద్యాననపద్ధతులు వున్నాయిమీకు ఎటువంటి పద్దతి అనుసరణీయమో తెలుసుకొని సంబంధిత గురువుని చేరి అభ్యసించాలిఒక మంచి సద్గురువు వద్దకు వెళ్లి గురువుకి సేవ చేసి గురుకృపకు పాత్రులై మోక్షపదాన్ని చేరుకోవాలి.  

\