15, జనవరి 2022, శనివారం

అసిధారావ్రతం

 *అసిధారావ్రతం!*


‘అదేమీ ఆషామాషీ విషయం కాదు. అసిధారావ్రతం!’ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏమిటీ అసిధారావ్రతం.

 

‘అసి’ అంటే ‘కత్తి’, ‘ధార’ అంటే ‘పదునైన అంచు’ అని అర్థం. అంటే కత్తియొక్క పదునైన అంచు అని భావన.  


అర్థం వరకు బానే ఉంది గానీ ఈ జాతీయం ఏమిటి, భాషా ప్రయోగం ఎలా చేయాలి, మధ్యలో ఈ వ్రతం ఏమిటి మరి!


 ‘అసిధారావ్రతం’ అనేది నిజంగానే ఒక వ్రతం. పెళ్లైనవాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు చేపట్టే కఠినమైన వ్రతం ఇది.

 

ఏవైనా కారణాల చేత భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒకే మంచం మీద పడుకున్న భార్యభర్తల మధ్య ఒక పదునైన కత్తి పెట్టేవారు. కత్తి ఆ భార్యాభర్తల మధ్య హద్దులా ఉంటుంది. ఉన్నచోటు నుంచి తెలిసో తెలియకో ఏ మాత్రం కదిలినా కత్తికి బలి కాక తప్పదు. అందుకే ఎంతో అంకితభావంతో ఈ దీక్ష చేసేవారు.

 

ఇప్పుడు ఈ ‘అసిధారావ్రతం’ ఎక్కడైనా ఆచరణలో ఉందా లేదా అనేది తెలియదుగానీ, కఠినమైన పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పనిని అంతకంటే కఠినమైన దీక్షతో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం *అసిధారావ్రతం* అన్న జాతీయాన్ని వాడటం జరుగుతోంది.

 

మీకు తెలిసిన యిలాంటి జాతీయాల గురించి తెలియజేసి భాషాభివృద్ధికి తోడ్పడండి.

ఉత్తరాయణ

 ॐ ఉత్తరాయణ పుణ్యకాల సంక్రాంతి శుభాకాంక్షలు. 


      దేవతలకు పగలు ప్రారంభమైన సమయం. 


I. మన సంవత్సరం - దేవతల రోజు 


      మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.

      సూర్యుడు 

  - మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణ పుణ్యకాలంతో దేవతల పగలు ప్రారంభం. 

  - కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయన పుణ్యకాలంతో దేవతల రాత్రి ప్రారంభం.

  - మకరరాశిలోకి ప్రవేశించేముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారు ఝాము. 


నాలుగు ఏకాదశులు 


1. దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. దానిని "శయన ఏకాదశీ" అంటారు. 

    స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం" ద్వారా మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు.

      (12 నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒకరోజులో, మూడవవంతు అయిన నాలుగు నెలలు వారి నిద్రాకాలం. ఆ పద్ధతిలోనే, మన 24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తాము) 

2. మన రెండు నెలల కాలం అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు ఆయన అటువాడు ఇటు తిరిగి పడుకుంటాడు. దాన్ని "పరివర్తన ఏకాదశీ" అంటారు. 

 3. మరొక రెండు నెలల తరువాత కార్తీక శుక్ల ఏకాదశీ నాడు యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని "ఉత్థాన ఏకాదశీ" అంటారు.

4. సౌరమానంతో చూసే ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశీ నాడు, స్వామి వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుండీ దేవతలకి దర్శనమిస్తాడు. 

    దానిని "వైకుంఠ ఏకాదశీ" అని, "ముక్కోటి ఏకాదశీ" అనీ పిలుస్తారు. 

      ఆ ఉత్తరద్వారంలో స్వామిని అందరమూ దర్శనం చేసుకుంటాం.

      మన సంవత్సరం దేవతలకి రోజు అని చెప్పుకున్నాం కదా! ఆవిధంగా, వారు ప్రతీరోజూ వారి తెల్లవారుఝామున వైకుంఠద్వారం నుండీ స్వామిని దర్శించుకుంటారు. 



                      అన్వయం 


II. సూర్యుడు    


      సూర్యుడు రెండు రకాల వెలుగులను ప్రసాదిస్తాడు. అందులో   

  - మొదటిది, కాంతి రూపంలో భౌతికంగా చూడగలిగేది, వేడిరూపంలో పొందగలిగేది. దీనిని దీపాలరూపంలోనూ, సౌరశక్తితో నడిచే కుక్కర్ల వంటివాటి రూపాలలోనూ చూస్తాం. 

      ఈ విషయాలు సూర్యునికి భూమి దగ్గరవుతూండడం మొదలై, ఉష్ణాంశం పెరిగే కాలం ప్రారంభం అనే దాన్ని ఉత్తరాయణంగా సూచిస్తుంది. 

  - రెండవది, ఆలోచనకి సంబంధించి జ్ఞానరూప వెలుగు. సౌరశక్తితో పనిచేసే Solar Calculators వంటి యంత్రాలే దీనికి నిదర్శనం. 


III. దైవ సంపద 


      మనలోని దైవశక్తులను చైతన్యవంతం చేసికొనే కాలంగా సాధనా పరంగా మరొక కోణంలో దేవతల పగలు ప్రారంభం అని చూపిస్తుంది. 


      ఈ విషయాలలో భగవద్గీతలో తెలిపిన "దివ్యగుణ సంపద" అనేదాన్ని పరిశీలిద్దాం.  


దివ్యగుణ సంపద: 


1. భయము లేకుండుట - అభయమ్, 

2. తనలోని అన్వయ వ్యతిరేక శక్తుల (positive & negative) నడుమ సామ్యము చెడిపోకుండుట - సత్త్వ సంశుద్ధి, 

3. క్రమ పద్ధతిలో జ్ఞానమాచరించి, అది తనయందు యోగము చెందునట్లు చూచుకొనుట - జ్ఞానయోగవ్యవస్థితి, 

4. ఉన్నంతలో ప్రేమపూర్వకంగా సమర్పించ గలుగుట - దానము,  

5. తనపై బాహ్యవిషయ ప్రభావం లేకుండా చూచుట - దమము, 

6. ఫలితం నశించకుండా చేసే మంచి పని - యజ్ఞము, 

7. శాస్త్రగ్రంథాల మననం, వాటి వెలుగులో జీవనం మలచుకొనుట - స్వాధ్యాయము, 

8. తనలోని జ్ఞాన, ప్రాణ, దక్షిణాగ్నులు మూడిటిని ప్రజ్వలింపజేసి, వానిని సద్వినియోగం చేయుట - తపస్సు, 

9. కపటం లేకుండడం - ఋజుత్వం, 

10. మనోవాక్కాయ కర్మలచే ఏ జీవిని బాధింపకుండటం - అహింస, 

11. సత్యము అవసరము కొఱకుగాక, తన స్వభావంగా ఉండుట - సత్యము, 

12. కోపము తనలో నిలువకయుండడం - అక్రోధము, 

13. తనది తనకావశ్యకమైనా, మంచి పనికి సమర్పణ చేయగలుగుట - త్యాగము, 

14. ఏ పరిస్థితిలోనూ చికాకు పడకుండడం - శాంతి, 

15. ఎవరియెడల దుర్బుద్ధి లేకుండడం, కొండెములు చెప్పకుండడం - అపైశునమ్, 

16. సర్వజీవులయందు దయ కలిగియుండడం - దయ, 

17. ఏ విషయమందైనా ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట - అలోలత్వం, 

18. మృదువుగా ప్రవర్తించుట - మార్దవము, 

19. తనయందెంత స్వల్పదోషమున్నా సిగ్గపడకుండడం, ఒదిగి ప్రవర్తించడం - ఉచిత లజ్జ - హ్రీః, 

20. అనవసరమైన కుతూహలం లేకుండడం - అచాపలం, 

21. తన చుట్టు ఉన్నవారిని ఆకర్షించి, వారికి సుఖశాంతులను ప్రసాదించే తన తేజస్సు, 

22. ఓరిమి కలిగియుండడం, సహనం - క్షమ, 

23. తనయందు తాను నిలబడుట - ధైర్యము - ధృతి, 

24. మానసిక శుభ్రత - శౌచము, 

25. మేలు జరిగినచోట కీడు తలపెట్టకుండడం - అద్రోహము, 

26. దురభిమానం లేకుండడం - నాతిమానితా. 

                    - భగవద్గీత 16 - 1,2,3 



IV. భగవంతుడు - దేవుడు 


      ఇప్పుడు "భగవంతుడు" అంటే నిర్వచనం చూద్దాం. 


                      భగవంతుడు

 

మొదటి నిర్వచనం


 భగములు ఆరు. అవి 

1. ఐశ్వర్యము, 

2. వీర్యము, 

3. యశస్సు, 

4. సంపద, 

5. జ్ఞానము, 

6. వైరాగ్యము. 


"ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్య యశస శ్శ్రియః I 

 వైరాగ్యస్యాథమోక్షస్య షణ్ణాం భగ ఇతీ రణా ॥"


      ఈ ఆరు గుణాలు కలవాడు "భగవంతుడు". 


రెండవ నిర్వచనం


1. భూతముల పుట్టుకను, 

2. నాశమును, 

3. రాబోయెడి సంపత్తును, 

4. రాబోయెడి ఆపత్తును, 

5. అజ్ఞానమును, 

6. జ్ఞానమును ఎఱుంగువాడు.


"ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం I 

  వేత్తి విద్యా మవిద్యాం చ సవాచ్యో భగవానితి॥" 


      ఈ ఆరూ ఎవ్వరెరుగురో, ఆయన "భగవంతుడు" అనబడతాడు. 



      ఇప్పుడు "దేవుడు" అనే దానికి నిర్వచనం చూద్దాం.


                      దేవుడు


"దేవుడు" అనే శబ్దం పది అర్థాల సమూహం గా నిర్వచింపబడింది.


1.శుధ్ధమగు జగత్తును క్రీడింప చేయువాడు.

అ)తన స్వరూపమందు తానే ఆనందంతో క్రీడించువాడు,లేక,

ఆ)పర సహాయంలేకుండా,సహజ స్వభావంతో క్రీడలాగా సమస్త జగత్తునూ చేసేవాడు,లేక,

ఇ)సమస్త క్రీడలకు ఆధారమైనవాడు.

"యో దీవ్యతి క్రీడతి స దేవః"


2.ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు.

అందరినీ జయించేవాడు, అనగా అతనిని ఎవరూ జయించలేరు.

"విజగీషతే స దేవః"


3.అన్ని ప్రయత్నములకు సాధనోప సాధనములను ఇచ్చువాడు

న్యాయాన్యాయ రూప వ్యవహారమూలను తెలియువాడు.

"వ్యవహారయతి స దేవః"


4.స్వయం ప్రకాశ స్వరూపుడు,

అన్నిటికి చరాచర జగత్తు అంతటికి ప్రకాశకుడు.

"యశ్చరాచరం జగద్ద్యోతయతి సదేవః"


5.ఎల్లర ప్రశంసకు యోగ్యుడు.

.నిందింప దగనివాడు.

"య స్త్యూయతే స దేవః"


6.తాను స్వయమానంద స్వరూపుడు.

ఇతరులకానందము కలుగజేయువాడు,దుఃఖము లేశమూ లేనివాడు.

"యో మోదయతి స దేవః"


7.మదోన్మత్తులను తాడించేవాడు.

సదాహర్షితుడు.శోకరహితుడు.ఇతరులను హర్షింపజేయువాడు,దుఃఖమునుండి దూరము చేసేవాడు.

"యో మాద్యతి స దేవః"


8.అందరి శయనార్థము రాత్రిని,ప్రలయాన్ని చేసేవాడు.

.ప్రలయసమయమున అవ్యక్తమందు సమస్తజీవులను నిద్రింపజేయువాడు.

"యః స్వాపయతి స దేవః"


9.కామించుటకు యోగ్యుడు.

సత్యకాముడు.శిష్టులకామమునకు లక్ష్యమగువాడు.

"యః కామయతే కామ్యతే వా స దేవః"


10.జ్ఞాన స్వరూపుడు.

అన్నిటియందు వ్వాప్తుడై, తెలియుటకు యోగ్యుడు.

"యో గఛ్ఛతి గమ్యతే వా స దేవః"



దేవః - అనే శబ్దం "దివు క్రీడా విజగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు" అనే ధాతువునుండి సిధ్ధమవుతోంది.దాని నుంచీ వచ్చినవే పైన పేర్కొన్న పది అర్థాలు. 



VI. ముగింపు 


       మకర సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం 


      ఈ సమయంలో, దేవతల పగలుగా - మనలోని దైవీ శక్తులను గుర్తించి, వాటిని చైతన్యపరచుకుంటూ, దైవానుభూతి కలిగి, మనం "దైవమే" అనే అద్వైతసిద్ధి పొందుదాం. 

      సాధనలో పూర్ణత్వానికి చేరుకొని,దక్షిణాయనం అనే దేవతల "విశ్రాంతి" కాలానికి పునాది వేసుకుందాం. 



విశేష అనుబంధం 


      దీనితోపాటు ఇతర మతస్థుడైన ఒక మిత్రుడు ఈ పండగ మతాతీతమైనదనీ, విజ్ఞాన శాస్త్ర పరంగా గొప్పదనీ, ఆంగ్లంలో నాకు పంపిన విషయం కూడా దీనితో జతపరుచబడింది. 


      Makara Sankranti is not only a Hindu festival but actually a universal phenomenon because it is purely based on the science of astronomy & crop cycle which is not limited to any particular religion. 

      Basically, it is a celebration of the “revival” of sunlight (solar energy & positivity) into our lives and it coincides with the harvest season as well.

      The zodiac phases of the Sun from July to December witness decreasing sunlight, and after that, the subsequent zodiac phases witness increase in sunlight. 

      It looks like the Sun is on a downward journey between July to December and this downward journey suddenly changes to upward journey or northward movement in late December & early January. 

      Since "Uttara" means "Northward" & "Aayana" means "Movement" in Sanskrit, this phenomenon of phase reversal from Southward movement to Northward movement of the Sun is called “Uttara Ayana” or “Uttarayan” in short. 

      We have 12 Zodiacs in an year, there will be 12 Sankrantis each year. 

      But as we saw how Makara is significant due to the revival of sunlight, the “Sankranti of Makara” (or transmigration of Sun into Makara) is celebrated as “Makara Sankranti”. 


Wish you and your family happy Makara Sankranti.🌹💐🌺


                    =x=x=x=


             -- రామాయణం శర్మ

                    భద్రాచలం

కొండవీటి శాసనంలో పేర్కొన్న కూరగాయల పేర్లేమిటి ? ...............................

 శ్రీకృష్ణదేవరాయల కొండవీటి శాసనంలో పేర్కొన్న కూరగాయల పేర్లేమిటి ?

..........................................................


జామ మిరప ముల్లంగి వేరుశెనగ, పొగాకు, టీ, కాఫీ, నల్లమందు ( ఓపియం), గెనుసుగడ్డ (చిలకడదుంప),ఉల్లి (ఎర్రగడ్డ), వెల్లుల్లి ( తెల్లగడ్డ), బెండ, యాపిల్,జీడిపప్పు, అనాస (ఫైనాపిల్ ), అవకాడో, రాజ్మా, బీన్స్, క్యారట్, కాలిఫ్లవర్, గోబి, పామాయిల్, కాప్సికమ్, సొరకాయ, పుచ్చకాయ, మొదలైన కాయలు పండ్లు కూరగాయలు మనవి కాదంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు కదా!


నమ్మాలి. ఇందులో చాలావరకు కాయలుపండ్లు పోర్చుగీసు వారి రాకతో భారతదేశంలో పంటలుగా మారాయి. ఉదా॥ మిరప, పొగాకు, బొప్పాయి, వేరుశెనగ,అనాస, బంగాళాదుంప మొదలైనవి. మరికొన్నింటిని బ్రిటన్, ఫ్రెంచి, డచ్ మొదలైనదేశాల వర్తకులు మనదేశంలో ప్రవేశపెట్టారు. కొన్ని విదేశీయుల రాకతో మనవిగా మారగా మరికొన్ని జీవనానికి మనిషి వలసవెళ్ళినపుడు తనతో పట్టుకుపోవడం జరిగింది. ఉదా॥ అన్ని రకాల సొరకాయలకు జన్మస్థానం ఆఫ్రికా కాగా, అవి కొన్ని వేలసంవత్సరాల కిందటనే భారతదేశంలో ప్రవేశించాయి.


అంతకుముందు మనదేశంలో దొరికేపండ్లు కూరగాయలతోనే మనవారు వంటలలో వాడి తినేవారు. ఒకసందేహం కలగవచ్చు, పోర్చుగీసువారు మిరపకాయలను ప్రవేశపెట్టారు కదా! అంతకుముందు మనవారు కారంలేకుండానే అన్నాన్ని తినేవారా అంటే అలా తినేవారు కాదు.కారానికి ఆరోగ్యానికి రారాజు మిరియాలు. ఆ మిరియాలను కారంకొరకు ఉపయోగించేవారు.


మనదేశంలోనున్న కాయలు పండ్లు కూరగాయలు ఆకుకూరలేమిటో చూద్దాం.


మిరియాలు, ఏలకులు, లవంగాలు, పసుపు, ఆవాలు(సాసువులు) జీలకర్ర, దోస, వంకాయ, గుమ్మడి, ద్రాక్ష, చెరకు, దానిమ్మ, దోస, కొబ్బరి, అల్లం, శొంఠి, కంద, గురుగు, చెంచలి, పాలవాకు, గాదిరాకు, దిరిశాకు, అవిస, చింతాకు, పెసలు, అలసందలు (బొబ్బర్లు), ఉలవలు, బియ్యం, గోధుమలు, బార్లీ, సజ్జ, కొర్ర, సాములు, అనప( సొరకాయ కాదు, ఇదో పప్పుధాన్యం), కాకర, చింతపండు మామిడి మొదలైనవి.


మనపూర్వీకులు వుపయోగించిన కొన్నింటి కాయలను మనము పూర్తిగా వదిలేశాము. ఏవి మనవో మనవికాదో తెలుసుకోలేనంతగా కొన్ని మన ఆహారసంస్కృతిలో కలిసిపోయాయి.


క్రీడాభిరామమనే గ్రంధాన్ని వినుకొండ వల్లభరాయుడు వ్రాశాడని కాదు శ్రీనాథుడు వ్రాశాడని కొందరి వాదం. ఎవరు వ్రాస్తేనేమి అందులో మంచినశర్మ టిట్టిభసెట్టి అనేవారు ఇద్దరు మంచిమిత్రులు. ఓరుగల్లు నగరాన్ని చూడటానికి వెళ్ళి, నగర అందాలను అస్వాదించి పూటకూళ్ళ ఇంటిలో ఒకరూకకే తాము మృష్టాన్న భోజనాన్ని ఏయే పదార్థాలతో తిన్నది సవివరంగా వివరించారు.


ఇక పల్లెటూరి భోజనం ఎలావుంటుంది అందులో ఏయే ఆకుకూరలు వాడారోనన్న సంగతిని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో "గురుగున్ జెంచలి లేత దిరిశాకు....." అనే పద్యంలో చక్కగా వివరించాడు.


శ్రీకృష్ణదేవరాయుడంటే గుర్తుకు వచ్చింది.


2.5.1520 నాడు శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలంలో సాళువతిమ్మరుసు (అప్పాజీ) మేనల్లుడైన నాదెండ్ల గోపర్సయ్యగారు కొండవీడు పాలకుడిగా వున్నపుడు అక్కడి, యజ్ఞవాటికా రఘునాథదేవాలయానికి శిఖరం కట్టించి, దేవాలయానికి సున్నం కొట్టించి, చుట్టూ ప్రాకారాలు కట్టించి,రాజగోపురంపై బంగారు కలశాలు ఎత్తించి, నిత్యనైవేద్యాలకు దూపదీప అమృతపడులకు దానాలు చేసి, నిత్యం దేవాలయంలో పూజలు నిర్విజ్ఞంగా జరగటానికిగాను మైదవోలు, వేంపల్లె (కడపజిల్లాలోనివి) దానంగా ఇచ్చి, 


ఇంకా నాడు కొండవీటి సంతలకు (మార్కెట్లకు) వచ్చే

మామిడికాయలు, ఉసిరికలు, వంకాయలు, మినుములు, శనగలు, గోధుమలు, ఉలవలు, కందులు, రాగులు, నువ్వులు, ఆముదాలు, అనుములు, పత్తి, చింతపండు, కరక్కాయలు, ఉసిరికెపప్పు, కంద, చామ, చిరుగడం, ఉల్లి, పసుపు, గుగ్గిలం, మెంతి, జీలకర్ర, అల్లం, నిమ్మ, టెంకాయలు, బెల్లం, నేయి, ఇప్పపూవు, శొంఠి, ఉక్కుతో చేసిన ఉలులు, ఇనుము, సీసం, తగరం, రాగి, పంచధార, నూలు, తమలపాకులు, గందం, పిప్పలి, కరాంభువు, జాజికాయ, జాపత్రి,


మొదలైన వాటిపై స్వల్పసుంకాలు విధించి గుడి నిర్వహణకు చెందాలని పేర్కొన్నాడు.


ఉల్లి వెల్లుల్లి చీనాదేశంనుండి దాదాపు రెండువేల సంవత్సరాల కిందట భారతానికి వచ్చాయి. ఉల్లివెల్లుల్లి కామక్రోధాలను ప్రేరేపించే విదేశీదినుసులు కనుక గుప్తులకాలంలో అగ్రవర్ణాలు తినేవారు కాదని చైనా యాత్రికుడైన పాహియాన్ పేర్కొన్నాడు.

..................................................................... జిబి.విశ్వనాథ, డిప్యూటి కలెక్టర్ (Rtd), 9441245857, అనంతపురం.

కొరకరాని కొయ్య

 కొరకరాని కొయ్య - కొరగానివాడు

...............................................................


కొరకరాని కొయ్య > ఎవరైనా కొయ్యను కొరుకుతారా ?

కొయ్యను కొరకం కదా ! మరి ఈ జాతీయం ఎలా పుట్టిందబ్బా ?

అలాగే కొరగానివాడంటే ఏమిటి ?


గుంటూరుజిల్లా వట్టిచెరుకూరు మండలంలో ముట్లూరు అనే గ్రామముంది. ముట్టులు + ఊరు = ముట్లూరన్నమాట. ముట్టులు లేదా ముట్టు అంటే తాకడం, సృజించడం, పట్టుకోవడం లాంటి అర్థాలున్నాయి. ముట్టులు లేదా ముట్టు అనే మాటకు సాధనం, పరికరమనే అర్థం కూడా వుంది. ఉదా॥ పనిముట్లు లేదా కొరముట్లు.

మరొక అర్థంప్రకారం 


సేద్యానికి పనికివచ్చే పనిముట్లు లేదా కొరముట్లు ఆ వూరిలో తయారైతాయి కనుక అక్కడ వెలసిన గ్రామానికి ముట్లురనే పేరు వచ్చింది. కొర అంటే పని అనే అర్థం.

కనుక కొరకరాని కొయ్య అంటే ఏ పనికి బహుశా వ్యవసాయానికి పనికిరాని కొయ్య, కర్ర, దుంగ, కొమ్మ అని అర్థమంతే.


మరోప్రకారం ప్రభుత్వపాలనకు అవసరమయ్యే సాధకులు ( పనిముట్లు) అనగా అధికారులు నివాసమున్న ప్రాంతాన్ని కూడా ముట్లూరంటారు.


కొర అంటే కూడా పని అనే అర్థముంది.


కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుఁ

జెరకు తుద వెన్నుఁపుట్టిన

జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! 


పనికిరాని కొడుకు పుడితే వాడు చెడేదేకాకుండా తండ్రికి అపకీర్తి తెస్తాడని సుమతీ శతకకారుడు తెలియచేస్తున్నాడు.

............................................................... జిబి.విశ్వనాథ, Deputy Co॥ector (Rtd) 9441245857. అనంతపురం.

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగురువుగారు

 పౌరాణికసార్వభౌమ, అభినవవ్యాస , మహామహోపాధ్యాయ

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగురువుగారు ఇవాళ శివసాయుజ్యం పొందారు. ఆ మహాత్ముడికి 

వారికి సాష్టాంగప్రణామాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ


-మరుమాముల_వెంకటరమణశర్మ

సంపాదకులు , దర్శనమ్ మాసపత్రిక 


'పురాణ’ పురుషుడు: 

బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖరశాస్త్రిగారి జీవన రేఖలు


తల్లిదండ్రులు: దక్షిణామూర్తిశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ

ఎక్కువగా ప్రభావం చూపినవారు: పితామహులు (తాతగారు) రామకృష్ణ చయనులవారు

చదువు: వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, వేదాంత భాష్యం...

భార్య: సీతారామ ప్రసన్న


సంతానం: ఆరుగురు మగ పిల్లలు... రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి; ఇద్దరు ఆడపిల్లలు... ఆదిలక్ష్మి, సరస్వతి. కొడుకులందరూ వారికి నచ్చిన చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కుమార్తెలు గృహిణులు. అల్లుళ్లు దెందుకూరి నర్సింహమూర్తి, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి. ఒకరు జేఎన్టీయూలోనూ, మరొకరు ఎల్.ఐ.సీలోనూ ఉన్నతోద్యోగులు. పెద్దబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసర్‌గా రిటైరైతే మరో అబ్బాయి రాఘవ బుల్లితెర నటుడు.


పురాణాలతోబాటు నేను జంధ్యాల పాపయ్యశాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండకావ్యాలు చదివాను. నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ టీవీలో ఏదైనా మంచి సీరియల్ వస్తుంటే చూసి ఆనందిస్తుంటాను. ప్రతిరోజూ వేదపారాయణం చేస్తుంటాను.


ఇటీవల పత్రికలతో సహా ప్రతి ఒక్కరూ పురాణ కాలక్షేపం అనే మాటను వాడుతున్నారు. అది శుద్ధ తప్పు. పురాణప్రవచనం అనాలి తప్పితే పురాణ కాలక్షేపం అనకూడదు. కాలక్షేపం ఏమిటి? అలా అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లే!


పురాణ’ పురుషుడు:


ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!

ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!

ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!

ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారని!

ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...

మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.

ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.

మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.

తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.

నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.

ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.

నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.

దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!

కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.

స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.

ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.

వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!

బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.

అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.

నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.

నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.

ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.

ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.

అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.

భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.

ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.

అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!

(సే)కరణ: ఫన్ డే 'పురాణ పురుషుడు':)

Vitamin D is made by the body

 Vitamin D is made by the body with sunlight.


Sesame seeds (Ellu or Til) have the highest calcium (975mg per 100g). Milk has 125mg only.


The body is capable of storing vitamin D up to a year, and use the reserves.


Lastly, the body is capable of getting its vitamin D reserves full with 3 full days of sunlight.


The best quality of sunlight is end of winter & beginning of summer.


Now join the dots, and see how wise our sages were in ancient India.


They created a festival of flying kites where by our kids get excited to go in the open, under direct sunlight, throughout the day starting from early morning. And their mothers feed them homemade TIL ladoos.


Are we not a fantastic culture 😊?


#Uttarayan

#MakaraSankranti

భోగి రోజున

 భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి?🍒


భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి..?


🍒భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి?


🍒తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు.


🍒సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.


🍒రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.


🍒భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.


🍒కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే..12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.