10, నవంబర్ 2022, గురువారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 69 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రాక్షసుడు చిన్నికృష్ణుని ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వెళ్ళి పోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు పైకి తీసుకు వెళుతుంటే కృష్ణుడు తన చిన్నచిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరు చేయలేని పనిని తాను చేస్తున్నానని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు క్రిందపడిపోవడం మొదలు పెట్టాడు. ‘ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు, వదులు!’ అని అరవడం ప్రారంభించారు. పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు! బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో, గట్టిగా కంఠమును కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా క్రింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ళకుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలై పోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరంమీద పడుకొని మరల ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మకోసం చూస్తున్న వాడిలో దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది.

ఏమీ తెలియని వాడు, భక్తుడయిన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి వున్న చిన్ని కృష్ణుడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయమును విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం.

గత జన్మంబుల నేమి నోచితిమొ? యాగశ్రేణు లే మేమి చే

సితిమో? యెవ్వరి కేమి పెట్టితిమొ? యే చింతారతింబ్రొద్దు పు

చ్చితిమో? సత్యము లేమి పల్కితిమొ? యే సిద్ధప్రదేశంబు ద్రొ

క్కితిమో? యిప్పుడు సూడ గంటి మిచటం గృష్ణార్భకున్ నిర్భయున్.

ఒక్కొక్కసారి పిల్లలను గండం తరుముకు వచ్చేస్తుంది. అది ప్రమాదరూపంలో ప్రాణములను తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాదరూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు వెళ్ళాలా కూడదా అని ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదమునందు వెళ్లిపోతుంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్ళే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. ఆ పిల్లవాడి గండం గట్టెక్కించదానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది ఫలితములు ఆ నోము నోచిన వారిని కొన్ని కోట్లజన్మలు కాపాడతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం సత్యమును పలకాలి. మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈమాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి, ముద్దులు పెట్టుకొని ‘ నేను బ్రతికానురా నువ్వు దొరికావు’ అన్నది.

చిత్రం ఏమిటంటే ఎన్నిమాట్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటినన్నిటిని చేస్తున్నవాడు కృష్ణపరమాత్మని తెలియనక్కరలేదు.

ఈ లీలలో అంతరార్థం - ‘తృణము’ అంటే గడ్డిపరక. దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఉండదు. ‘ఆవర్తనము’ అంటే త్రిప్పుట త్రిప్పేది తృష్ణ. తృష్ణకే తృణావర్తుడని పేరు. గృహస్థు పుణ్యం ఖర్చయిపోతుంటే మరల పుణ్యమును సంపాదించుకుంటూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి. వచ్చేజన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసివస్తుంది.

తృష్ణయందు చిక్కుకోకూడదు. వచ్చిన దానియందు తృప్తిలేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. అది అర్థంలేని దాపరికం అయితే అది తృష్ణగా మారుతుంది. దీనివలన ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయి అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తారు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా వ్యయమైపోయి ఉత్తర జన్మలలో దరిద్రము అనుభవించ వలసి వస్తుంది. వందరూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం అయిదు రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తరజన్మకు పుణ్యం అవసరం. ఈ అయిదు రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమచేయబడతాయి. దీనివలన ఉత్తరజన్మలో అన్నవస్త్రములకు లోటులేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడయిపోతాడు. తృష్ణకు లొంగకుండా డబ్బు సంపాదించాలి. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగిచూసి ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవ్రజ ప్రజలందరి కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే గడ్డిపరకను చేసి తిప్పేస్తుంది. నందవ్రజ ప్రజలందరూ కృష్ణా! కృష్ణా! అని ఏడ్చారు. కృష్ణుడు తృణావర్తుని చంపాడు. చంపి తానే వాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా? తాను దక్కాడా? అంటే తానే దక్కాడు. భగవంతుని నామం చెప్పడం మొదలు పెట్టినట్లయితే అదే భగవంతుడిని మీ దగ్గరికి తీసుకువచ్చి, మీ బుద్ధిని మార్చి, మిమ్మల్ని సక్రమమయిన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏది గెలవలేక జీవితం పాడైపోతున్నదో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. తరించడానికి భగవంతుని నామము, రూపము పట్టుకుంటే చాలని తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుస్తుంది.

శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు

నెమ్మది నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకమున కంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యమని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం? ఏ పరమాత్మకు హవిస్సులు ఇస్తున్నామో అటువంటి పరమాత్మ ఈవేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు’ అని దివ్యదృష్టితో చూసి సమాధిమగ్నులయిపోయారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెపుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును ఇస్తే ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు.

తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పూతగాగ

ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునుకగాగ

ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్నుగాగ

గంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాగ

హారవల్లు లురగ హారవల్లులుగాగ బాలలీల బ్రౌఢబాలకుండు

శివుని పగిది నొప్పె శివునికి దనకును వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.

ఈ సందర్భంలో పోతనగారు ‘మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడడం లేదు. ఒంటినిండా భస్మం అలముకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో వేసుకొన్న నీలపతక హారం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళమును కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం ఉండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనం అవుతున్నాడు. మెడనిండా అమ్మ హారములు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్నికృష్ణుడు నా వంకచూసి పోతనా! కృష్ణుడు, శివుడని ఇద్దరు లేరు’ అని నాకు పాఠం చెప్పినట్లు ‘కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్త్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా! అన్నట్లుగా కనపడ్డాడు’ అని పద్యం రాసుకున్నారు. మహానుభావుడు ఎంతో శివకేశవ అభేదమును పాటించి ధన్యుడయిపోయాడు.

పోతనగారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యములు వ్రాశారు. పోతనగారిని మరచిపోవడం దౌర్భాగ్యం. ఒక్క గ్రామములో గాని పట్టణంలో కానీ, పోతనగారి విగ్రహం లేకపోవడం చాలా విచారించవలసిన విషయం. పిల్లలకి ఈయన పోతనగారని చెప్పడానికి ఇళ్ళల్లో ఫోటోలేని దరిద్రానికి తెలుగుజాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం.

కృష్ణుడు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళిపోయేవాడు. అన్ని ఇళ్ళల్లో ఉన్న వెన్న, నెయ్యి అన్నీ తినే వాడు. ఎవరయినా తన మీద నేరములు చెపితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునే వాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉన్నది.

తమంత తాముగా చేసుకోవలసిన ప్రయత్నముతో ఏర్పడేది నిర్మలమయిన మనస్సు ఈ నిర్మలత్వము ఎవ్వరూ తేలేరు. ఈశ్వర కథాశ్రవణం చేసి, భగవంతుడిని మనస్సుకి ఆలంబనముగా ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిర్మలంగా ఉన్న మనస్సును పాలకుండని పిలుస్తారు. మనస్సుకు ఈశ్వరుని తీసుకు వచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే పొంగిపోయి భక్తితోకూడిన కర్మాచరణమును సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మవలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధివలన వైరాగ్యభావన కలుగుతుంది. ఈ వైరాగ్యమనే అగ్నిహోత్రము మీద నిర్మలమయిన మనస్సనే పాలు కాగాలి. ఈ పాలు ఎర్రటి తొరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యమయిన మనసు వలన, భక్తివలన వైరాగ్యభావననే అగ్నిహోత్రం మీద కాలి, కాగి వున్నాయి. ఈ పాలు పెరుగు అవ్వాలి.

పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకూ పూర్వం ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించారో వారే వచ్చి మరల ఆమాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురు ఉపదేశమును కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడితే పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనుక గురువు తయారవుతాడు.

పెరుగు గట్టిగా తోడుకున్న తరువాత పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వము. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయములను కూర్చుని మనసుపెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపలనుండి వెన్న పైకి తేలుతుంది. వెన్నకి రెండు లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలోకాని, మజ్జిగలో కానీ వేస్తే తేలుతుంది. భగవత్సంబంధమయిన జ్ఞానమనే అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్నా పైకి కనపడని నెయ్యి చిట్టచివరి దశలోపైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. నేతిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందిన తర్వాత ఇంక వెనక్కి వెళ్ళడము జరగదు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలో ఉండి శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరమును వదిలి పెట్టేస్తున్నానని జీవుడు సంతోషిస్తాడు.

ఆత్మజ్ఞాన స్వరూపమయిన వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధిధ్యాసనం లోనికి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవ్వరికీ పనికిరాదు ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అత్యంత ప్రశాంతమయిన ప్రదేశమునందు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తినడమే గోపకాంతల ఇళ్ళల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శచేత జ్ఞానముగా మారుతుంది అది నేయి. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతాడు. ఇదీ కృష్ణుడు వెన్న తినడం అంటే! అంతేకానీ చేతకాక, పనిలేక, అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి, వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చేయాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనక ఉన్న రహస్యం అది!


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

భోజనం చేయుటకు

 భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు - వాటిలోని ఔషధ గుణాలు  - 


        కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు.  ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .


              అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును. 


          పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.


 *  అరటి ఆకు  -


      ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును.  ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .


 *  మోదుగ విస్తరి  -


      ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.


 *  మర్రి ఆకు విస్తరి  -


      దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.


 *  పనస  -


      దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.


 *  రావి  -


      ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .


 *  వక్క వట్ట  -


      ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును . 


      పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. 


   

 

     

జీవిత రహస్యం

 *బిడ్డ పుట్టినప్పుడు:*

------------------

లాలీ లాలీ లాలీ లాలీ... 

వటపత్రసాయికి 

వరహాల  లాలీ 

రాజీవనేత్రునికి రతనాల లాలీ 

 మురిపాల కృష్ణునికి ముత్యాల  లాలీ..."


 *16 ఏళ్ళకి:*


"పదహారు ప్రాయంలో 

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. 

నేటి సరికొత్త  జాజిపువ్వల్లె 

 నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..." 


 *18 ఏళ్ళకి:*


"ఎక్కడ ఉన్నా పక్కన  నువ్వే  ఉన్నట్టుంటుంది 

చెలీ ఇదేం అల్లరీ.. 

నా  నీడైనా అచ్చం  నీలా  కనిపిస్తూ  వుంది..

అరే ఇదేం గారడీ..

నేను  కూడా  నువ్వయానా 

 పేరుకైనా  నేను  లేనా..."


  *25 ఏళ్ళకి:*


My Love is Gone 

My Love is Gone 

పోయే  పోయే లవ్వేపోయే 

పోతే పోయిందే .. 

 its gone, its gone, 

my love is gone."


*35 ఏళ్ళకి:*


"ఎందుకే  రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా

తాను  దూర సందు లేదు 

మెడకేమో డోల రవణమ్మా 

సతాయించాకే రవణమ్మా 

బాగోదే రవణమ్మా

 ఛీ ఛీ అంటారే రవణమ్మా"


*45 ఏళ్ళకి:*


"జన్మమెత్తితిరా.. 

అనుభవించితిరా.. 

 బ్రతుకు సమరములో..  

పండిపోయితిరా..

మంచి తెలిసి మానవుడిగా మారినానురా...."


*55 ఏళ్ళకి:*


"సంసారం  ఒక చదరంగం 

అనుబంధం  ఒక రణరంగం 

స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో 

ఆవేశాలు రుణపాశాలు తెంచే  వేళలో 

సంసారం  ఒక చదరంగం 

 అనుబంధం  ఒక రణరంగం.." 


*65 ఏళ్ళకి:*


(పురుషుడు)

"కాశీకి  పోయాను  రామాహరి

గంగ తీర్థమ్ము  తెచ్చాను  రామాహరి

గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.."

(స్త్రీ)

"కాశీకి పోలేదు రామాహరి 

ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి

 మురుగు  కాల్వలో నీళ్ళండి రామాహరి.."


*75 ఏళ్ళకి:*


"జగమంత  కుటుంబం నాది 

ఏకాకి  జీవితం నాది 

సంసారం సాగరం నాదే

 సన్యాసం శూన్యం నాదే"


*85 ఏళ్ళకి:*


"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు  లేదులే 

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... 

 లోకమెన్నడో చీకటాయెలే..."


*100 ఏళ్ళకి:*


"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు. 

తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది..."

😄😄😄😄😄 మిత్రులారా Just నవ్వు కోండి. కాని ఇదే జీవిత రహస్యం..🙏🏻🙏🏻🙏🏻 ఆలోచించండి ఎందుకు ఈ తాపత్రయం, అశా, కుట్రలు, కుతంత్రములు.

మనోడు ఉప ఎన్నిక

 ముగిసిన మనోడు ఉప ఎన్నిక ఈ ఎన్నిక కేవలం మూడు ముచ్చట్ల మీదనే ఆధారపడి జరిగింది మందు ,ముక్క , ముడుపులు, మరి గత రెండు నెలలుగా జరిగిన ఈ తతంగంలో ప్రజాస్వామ్యం గెలిచిందా ప్రజలు గెలిచారా కానే కాదు కేవలం డబ్బున్న వాడు అంగ బలమున్నవాడు అధికారం ఉన్నవాడు మాత్రమే గెలిచిందని చెప్పుకోవాలి , ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఒక ఉపనిక వచ్చిందంటే మొత్తము ప్రభుత్వ యంత్రాంగం మొత్తము అధికార అనధికార వ్యక్తులు మొత్తము ఒక చనిపోయిన కళేబరం దగ్గర పెద్ద బోధలు వాళ్ళనట్లుగా ప్రజలపై వాళ్ల వాళ్ల ప్రలోభాల జల్లులు కురిపించి వారిని మత్తులో ఉంచి గెలిచిన గెలిచే తప్ప ప్రజాస్వామ్యంగా ప్రజల మనస్ఫూర్తిగా ఇచ్చిన తీర్పు కానీ కాదు, ప్రస్తుతము అన్ని పార్టీలు అవలంబిస్తున్న ఈ ప్రచార సరళి రేపు ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది ఈ తీరు మారకుంటే ఎప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో జరగవని సామాన్య మానవుడు తెలుసుకోవాల్సిన విషయం, ప్రస్తుతం గెలిచినవారు ఓడినవారు కలిసి ప్రజలను ఓడించినట్లుగా ఉంది ఈ ఉప ఎన్నిక.


సేకరన

_మహాయోగులకి

 *-:జీవన కాలమ్:-*

  _గురజాడ అప్పారావు గారు_ వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి ‘ *‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’* అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.

 *ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు*. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ఏం కావాలని. *ఓ పెగ్గు స్కాచ్ కావాలన్నారట ఆమె.*


 ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.  చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - *ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.*

  మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం. _మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత._ భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - *ఏదో ఒకనాడు వెళ్లిపోక తప్పదని. కొందరు ఆ క్షణాన్ని గంభీరంగా ఆహ్వానిస్తారు.* _కొందరు బెంబేలు పడతారు. కొందరు బేల అవుతారు._


 *ప్రఖ్యాత అమెరికన్ టెన్నిస్ ఆటగాడు ఆర్దర్ ఆష్‌కి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది.* 1983లో గుండెకి శస్త్రచికిత్స జరిగినప్పుడు, శరీరంలోకి ఎక్కించిన రక్తం ద్వారా, ఈ వ్యాధి సంక్రమించింది. చావు తప్పదని అర్థమవుతోంది. అభిమానులు దుఃఖంతో గుండె పట్టుకున్నారు. ఎందరో ఉత్తరాలు రాశారు. ఒక అభిమాని అన్నాడు: *‘‘ఇంత దారుణమైన రోగానికి దేవుడు మిమ్మల్నే ఎందుకు గురిచేయాలి?’’ అని.*


_దీనికి ఆర్దర్ ఆష్ ఇలా సమాధానం రాశాడు:_

 ఈ ప్రపంచంలో, 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడుతున్నారు. 50 లక్షల మందికి, టెన్నిస్ వంటబట్టింది. 5 లక్షల మంది ప్రొఫెషనల్‌గా టెన్నిస్‌ని ఆడగలుగుతున్నారు. 50 వేల మంది టెన్నిస్ పోటీ టోర్నమెంట్‌లలో ఆడుతున్నారు. _50 మంది మాత్రమే వింబుల్డన్ స్థాయికి వచ్చారు. నలుగురే సెమీ ఫైనల్స్‌కి వచ్చారు. ఇద్దరే ఫైనల్స్‌కి వచ్చారు. నేను_ *చాంపియన్‌షిప్‌ని సాధించి, వింబుల్డన్ కప్పుని గెలిచి, చేత్తో పట్టుకున్నప్పుడు - నేను దేవుడిని అడగలేదు.* ‘ _ఎందుకయ్యా నన్నొక్కడినీ ఎంపిక చేశావు?’ అని._ _ఇప్పుడు కష్టంలో ఉండి ‘నాకే ఎందుకు ఈ అనర్థాన్ని ఇచ్చావు? అని దేవుడిని అడిగే హక్కు నాకేముంది?’’_


 *ఆకెళ్ల అచ్యుతరామమ్ గారు రైల్వేలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రామాయణాన్ని ‘రగడ’ వృత్తంలో రాశారు. ఆదిశంకరుల రచనల్ని, త్యాగరాజ భక్తి తత్వాన్ని రచనల ద్వారా నిరూపించారు.* 1984 ఫిబ్రవరి 12 ఉదయం సికింద్రాబాద్‌లో వారి అమ్మాయి కొత్త ఇంటికి శంకుస్థాపన. శుభకార్యానికి, తెల్లవారుఝామున ఒక బాచ్‌ని దింపి ఇంటికి వస్తున్నారు. దారిలో గుండెపోటు వచ్చింది. సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న, పురాతన ఆంజనేయస్వామి గుడి ముందు కారుని పక్కకి ఆపి, పార్కింగు దీపాలు వెలిగించి, కారు తాళం చెవులు జేబులో వేసుకుని, స్టీరింగు మీద తల ఆనించి వెళ్లిపోయారు. *రామభక్తుడికి మృత్యువు ఆంజనేయుడి సమక్షంలో ఒక యాత్ర.*


 _ఒక విచిత్రమైన సంఘటన. మా వియ్యపురాలి తండ్రిగారు దాదాపు 69 ఏళ్ల కిందట - విజయవాడలో పీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు._ *విజయవాడ రేడియో స్టేషన్ పాత బంగళాలో ఉండేవారు. చల్లా వెంకటరత్నంగారు వారి తండ్రిగారు. రామభక్తుడు.* శ్రీరామనవమి నవరాత్రులలో ఆయన పూజలు చేసి, ప్రవచనాలు చెప్పించేవారు. ఆ సంవత్సరం మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు (అప్పట్లో వారు ఇరవయ్యవ పడిలో ఉండి ఉంటారు) రామాయణం చెప్తున్నారు. ఉదయం కల్యాణం జరిగింది. సాయంకాలం ప్రవచనం. జటాయువు నిర్యాణం గురించి, చెప్తున్నారు శాస్త్రిగారు. వెంకటరత్నం గారు స్తంభానికి చేరబడి కూర్చుని వింటున్నారు. _జటాయువు ‘రామా! రామా!’’ అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు_ - అన్నారు శాస్త్రిగారు. *‘‘జటా యువు వెళ్లిపోయాడా?’’ అన్నారు వెంకటరత్నంగారు*. _అవునన్నారు శాస్త్రిగారు. అంతే. స్తంభానికి ఆనుకున్న వెంకటరత్నంగారి తల వాలిపోయింది. వెళ్లిపోయారు._ *దాదాపు 21 ఏళ్ల కిందట మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో మహాభారత ప్రవచనం చెప్తూ ఈ ఉదంతాన్ని చెప్పారు. వెంకటరత్నం గారికి, మృత్యువు ఒక ముహూర్తం.*


 _చాలా మందికి మృత్యువు ఒక మజిలీ. కొందరికి ఆటవిడుపు._ _మహాయోగులకి నిర్యాణం. కొందరికి ఐహికమైన ‘మోజు’లకు విడాకులు ఇచ్చే ఆఖరి క్షణం._ *కొందరు అదృష్టవంతులకు, మరో గమ్యానికి దాటే వంతెన.*

*వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు*

వినాయగర్ అగవల్

 “వినాయగర్ అగవల్” చదవండి


దాదాపు నలభై సంవత్సరాల క్రితం, పూజ్యశ్రీ కంచి శంకరాచార్య పరమాచార్య స్వామివారు మైలాడుతురై దగ్గర్లోని వేట్టమంగళం అన్న చిన్న గ్రామంలో మకాం చేస్తున్నారు. ఆ సమయంలో పెరియార్ రామస్వామి వినాయకుని విగ్రహాలను ధ్వంసం చేసే ఉద్యమాన్ని ప్రారంభించాడు. విగ్రహాలను పగులగొట్టే తేదీని ప్రకటించగానే కుంభకోణానికి చెందిన శివనాడియార్లు - శివ భక్తులు కలత చెంది, వేట్టమంగళంలో మహాస్వామివారిని కలిసి, “దీన్ని ఎదుర్కొనేందుకు మేము ఎంటువంటి చర్యలు తీసుకోవాలి?” అని అడిగారు. స్వామివారు ఎంతో అనుగ్రహంతో, “అందరు భక్తులు రేపటి నుండి వినాయకుని దేవాలయాలకు వెళ్ళి, కొబ్బరికాయలను కొట్టి, అభిషేక ఆరాధనలు చేయండి” అని సెలవిచ్చారు.


అందరూ “వినాయగర్ అగవల్” పారాయణ చేయమన్న సందేశాన్ని పత్రికలో ప్రచురించాల్సిందిగా నాకు సైగలతో చెప్పారు పరమాచార్య స్వామివారు. అవ్వయ్యార్ అందించిన “వినాయగర్ అగవల్”ను ముద్రించి అందరికీ ఉచితంగా పంచమన్న ఆదేశాన్ని కూడా అనుగ్రహించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, “వినాయగర్ అగవల్” అన్న ఒక పుస్తకం ఉందన్న విషయం కూడా నాకు తెలియకపోవడం. వారు అవ్వయ్యార్ అన్నదాన్ని సైగలతో చూపడమూ అర్థం చేసుకోలేకపోయాను. “వినాయగర్ అగవల్” అన్న పుస్తకం గురించిన సైగలను కూడా అర్థం చేసుకోలేకపోయాను. తరువాత స్వామివారు ఇసుకలో పేరు వ్రాసి చూపించారు. అది రాత్రి కావడంతో, స్వామివారి దగ్గరున్న కాంతి చాలా తక్కువ ఉండడంతో అది కూడా ఫలించలేదు. చివరికి వారు ఒక పలక, బలపం తెప్పించి పలకపై రాసి చూపారు. నాకు అర్థం అయ్యింది. వారి ఆదేశానుసారం “వినాయగర్ అగవల్” పుస్తకం ప్రచురించి, ఉచితంగా పంచడం జరిగింది. అన్నీ పత్రికలు, అచ్చు మాధ్యామాలలో “వినాయగర్ అగవల్” పారాయణ చెయ్యమన్న పరమాచార్య స్వామివారి సందేశం ప్రచురణ అయ్యింది. అచ్చోత్తిన అక్షరాల వలే ముత్యాలవంటి అక్షరాలతో ఉండే స్వామివారి చేతివ్రాతను చూసే భాగ్యం నాకు కలిగింది.


తంజావూరులో పెరియార్ విగ్రహం క్రిందన రాసివున్న “దేవుడు ఉన్నాడని నమ్మేవాడు మూర్ఖుడు” మాటలను చూసి కొందరు స్వామివారికి తెలిపి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అడుగగా, “మీరు గాంధీ విగ్రహం పెట్టి దాని క్రింద, రామనామం వ్రాసి, ‘రామనామాన్ని జపించడం ఉన్నతమైన ఆధ్యాత్మిక కార్యం’ అని కూడా వ్రాయండి” అని చెప్పారు. 


1952లో మహాస్వామి వారు నఙ్గంకుడిలో మకాం చేస్తున్నారు. హరిజనుల్లో ఉన్న వళ్ళువర్ తెగ జనంతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. వళ్ళువర్లు మంచి జ్యోతిష్యులు మరియు హరిజన సమూహానికి కర్మలు క్రతువులు చేయించేవారు.


వచ్చినవారందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని స్వామివారి ఆదేశం. అప్పుడే ఒక సమస్య వచ్చింది. వళ్ళువర్లలో ఉపతెగలకు చెందిన కొంతమంది సహపంక్తి భోజనానికి సుముఖత చూపలేదు. ఇది మహాస్వామివారినే విస్మయపరచిన విషయం. “ఈరోజు దాకా ఈ సమూహంలో అటువంటి ఆచార పద్ధతులు ఉన్నాయన్న విషయం నాకు తెలియదు” అని ఆశ్చర్యపోయారు.


--- కడర్శాప్ ఎ.వి. వేంకటరామన్, శ్రీరంగం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాలభైరవ అష్టకం

 కాలభైరవ అష్టకం -

శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి..

ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !!


పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు..


శ్రీ ఆదిశంకరాచార్య విరచిత


కాలభైరవాష్టకం


⚜️⚜️⚜️⚜️⚜️⚜️


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం

వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||


శూలటంకపాశదండపాణిమాదికారణం

శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం

భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||


అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం

దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం

కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహలోభదైన్యకోపతాపనాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ |

_విశ్వేశ్వర లింగము

 *_విశ్వేశ్వర లింగము – వారణాసి_* 🙏☘️🌿


వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.


సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం 

వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!


ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. 


కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. 


దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. 


అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. 


ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు. 


ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. 


అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. 


అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. 


శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది. 


అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. 


ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. 


శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి. 


అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. 


కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు.

మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన.


అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. 


భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. 


మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. 


అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. 


ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. 


వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. 


అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.


వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.


ఓం శివాయ నమః

కాశీకి పోయితి

 కాశీకి పోయితి గంగలో ముమ్మారు


ముని పూతుడనైతి మోక్షమొచ్చు బదరికాక్షేత్రాన పలుమారు స్నానించి పండితి నికవచ్చు పరమపదము


కష్టించి సేసితి కాశిరామేశ్వర


ములయాత్ర నిక నాకు ముక్తి గలుగు


పుణ్యతీర్థములన్ని పూతచిత్తము తోడ సేవించి తనిసితి శివము వచ్చు


తే.గీ.


ననుచు తృప్తితో మనగానె యభవ మగునె? దేహమందు వలపు పెంపు తెంపుకొనక లోకవిషయాల ప్రీతులు మాపుకొనక జ్ఞానతృష్ణను బొందకన్ చవులతోడ శ్రీశర్మద


(శివము=మోక్షము; అభవము=మోక్షము;)

ద్రౌపదీదేవికి

 శ్లోకం:☝️

*ద్రౌపద్యాః పాండుతనయాః*

  *పతి దేవర భావుకః |*

*న దేవరో ధర్మరాజః*

  *సహదేవో న భావుకః ||*


భావం: ద్రౌపదీదేవికి పాండవులతో భర్త, మరది, బావగారు, అనే మూడు రకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరది కాడు, సహదేవుడు బావ కాడు అని భావం.

    ఒకసారి కాళిదాసు కాశీలోని వ్యాసుని విగ్రహం చూసి " ఓహో  ! వీరా 'చ'కారకుక్షి ! " అంటూ విగ్రహం బొడ్డులో తన వేలు పెట్టాడుట. అంతే ఆ వేలు యిరుక్కుపోయింది. కాళిదాసు ఆశ్చర్యపడుచుండగా ఆ విగ్రహంనుండి " మనవడా! నన్నాక్షేపిస్తున్నావు! ఏదీ 'చ'కారం లేకుండా ద్రౌపది పాండవుల యొక్క బంధుత్వాల గురించి ఒక్క శ్లోకం చెప్పు చూదాం?" అన్నాడట. అప్పుడు కాళిదాసు వినయంగా పై శ్లోకం చెప్పాడని ఐతిహ్యం.

    సర్వజ్ఞ సింగభూపాలుడు ఈ శ్లోకాన్ని మనసులో ఉంచుకొని తన వద్దకు వచ్చిన ఒక కవిని ఇలా ప్రశ్నించాడు. "ద్రౌపదికి పాండవు లైదుగురు భర్తలు కదా! వారిలో ఒకరు ఆమెకు భర్త అయినప్పుడు తక్కినవారు ఆమెకు ఏమవుతారో ఆశువుగా కందపద్యంలో చెప్పగలవా?" అని. అప్పుడా కవి చెప్పిన కంద పద్యం ..

*పతి మఱఁదియు సహదేవుఁడు*

*పతి బావయు ధర్మజుండు, బావలు మఱఁదుల్*

*పతులు నర నకుల భీములు*

*పతు లేవురు సింగభూప! పాంచాలి కిలన్*

సింగభూపాలుడు ఆనందించి ఆ కవిని ఉచితంగా సత్కరించాడట! (శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)