4, సెప్టెంబర్ 2022, ఆదివారం

సంభోగ నియమాలు -

 ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు  -


 *  ప్రాణులకు నిత్యము శరీరము నందు సంభోగేచ్ఛ కలుగుచుండును. సంభోగం ఆచరించని యెడల శరీరము నందు మేహరోగం , మేధోవృద్ది , శరీర సంధులు సడలుట వంటి సమస్యలు కలుగును.


 *  సంభోగ సంబంధ ఆలోచనలు కలిగినపుడు బలవంతముగా మనస్సును నిరోధించుట , క్రోధము చెందుట, బ్రహ్మచర్యము , స్త్రీ సంభోగ సుఖం అనుభవించకుండా ఉండటం వలన మనుష్యుడు యొక్క శుక్రము క్షీణించును.


 *  శుక్రము క్షీణించినవానికి శరీర దౌర్బల్యము , ముఖం వాడుట, పాండురోగం , చిక్కిపోవుట , భ్రమ , నపుంసకత్వం , తన ప్రమేయం లేకుండానే శుక్రస్కలనం జరుగును.


 *  ఒకే గోత్రం గల స్త్రీ , శత్రువు భార్య , రాజు భార్య , మిత్రుని భార్య , దీర్ఘరోగములు కలిగిన స్త్రీ , శిష్యుని భార్య , బ్రాహ్మణ స్త్రీ , పిచ్చితో బాధపడుతున్న స్త్రీ , సన్యసించిన స్త్రీ , పతివ్రత , గురువు యొక్క భార్య , ముసలితనం గల స్త్రీ , గర్భవతి , అపరిచిత స్త్రీ వీరితో సంభోగం జరుపుట నిషిద్దం మరియు ధర్మశాస్త్ర విరుద్ధం.


 *  బాల,ముగ్ధ , ప్రౌఢ (అధిక వయస్సు ) స్త్రీల యొక్క వయోబేధమును , అనురాగమును అనుసరించి సంభోగక్రియ జరుపవలెను .


 *  స్త్రీ పదహారు సంవత్సరముల వరకు బాల అనియు , పదహారు మొదలుకొని ముప్పైరెండు సంవత్సరముల వరకు తరుణి అనియు , ముప్పైరెండు సంవత్సరముల నుండి యాభై సంవత్సరాల వరకు ప్రౌఢ అనియు , యాభై సంవత్సరాల పైబడిన వృద్ధస్త్రీ అని అందురు . ఈ వృద్ధస్త్రీతో సంభోగం నిషిద్దం.


 *  గ్రీష్మ, శరదృతువుల యందు కామేచ్ఛ గల పురుషుడు బాలసంభోగం హితకరం . హేమంత , శిశిర ఋతువు నందు తరుణియగు స్త్రీతో రమించుట హితకరం , వర్ష, వసంత ఋతువు యందు ప్రౌడస్త్రీతో రమించుట హితకరం.


 *  బాలా సంభోగం బలమును వృద్దిచేయును. తరుణీ సంభోగం శక్తిని క్షీణింపచేయును. ప్రౌఢ సంభోగం ముసలితనమును కలిగించును. ఈ నియమాలు అతిగా సంభోగించువారికి మాత్రమే . నియమిత పద్దతిలో కాలాన్ని అనుసరించి సంభోగించువారికి ఎటువంటి అనారోగ్యం కలగదు .


 *  కొత్తమాంసం , వేడిగా ఉన్న అన్నం , యవ్వనస్త్రీతో సంభోగం , పాలతో కూడిన అన్నం , నెయ్యి , వేడినీటి స్నానం ఈ ఆరు సేవించినవెంటనే శరీరబలాన్ని పెంచును.


 *  చెడిపోయిన మాంసం , వృద్ధస్త్రీ సంభోగం , ఉదయపు ఎండ , రేగటి పెరుగు , ప్రాతఃకాలంలో స్త్రీతో సంభోగం , ప్రాతఃకాలంలో నిద్ర ఈ ఆరు వెంటనే బలాన్ని హరించును .


 *  వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీతో రమించిన పడుచువాడు అయినను వృద్ధలక్షణాలు కలిగినవాడిగా అగును.


 *  హేమంత , శిశిర ఋతువుల యందు వాజీకరణ ఔషధాలు సేవించిన పురుషుడు యథేచ్ఛగా స్త్రీతో రమించవచ్చు. తప్పనిసరిగా వాజీకరణ ఔషధాలు సేవించవలెను . వసంత, శరదృతువుల యందు మూడు దినములకొకసారి , గ్రీష్మ , వర్ష ఋతువుల యందు పదిహేను రోజులకు ఒకసారి స్త్రీ సంభోగం ఆచరించవలెను.


 *  మనుష్యునికి శీతాకాలం నందు రాత్రి సమయములో , గ్రీష్మ కాలము నందు పగటి యందు , వసంతఋతువులో ఆహోరాత్రుల యందు , వర్షాకాలం నందు మేఘాలు గర్జించు కాలం నందు , శరదృతువులో ఎల్లప్పుడూ కామోద్రేకం కలుగుచుండును.


 *  పగటి యందు స్త్రీ సంభోగం ఆయుక్షీణం . సంభోగమునకు గ్రీష్మ, వసంత ఋతువులు అనుకూల కాలం .


 *  ఉదయ సంధ్య, సాయంత్రపు సంధ్యాకాలము నందు , పర్వదినముల యందు , గోవులను విడుచు ప్రభాతవేళ , అర్థరాత్రి యందు , మధ్యాహ్న కాలం నందు సంభోగం నిషిద్దం.


 *  శరీరబలం కలిగినవాడు, వాజీకరణ ఔషధాలు సేవించువాడు , యవ్వనవంతుడు ప్రతినిత్యం సంభోగం జరపవచ్చు.


 *  గురువులు నివశించే ప్రదేశమునకు సమీపస్థలం , బహిరంగ ప్రదేశముల యందు , దుఃఖకరమైన మాటలు వినపడు ప్రదేశముల యందు స్త్రీసంభోగం నిషిద్దం.


 *  అధికభోజనం చేసినవాడు , భయం కలిగినవాడు, శరీర అవయవముల యందు బాధ కలిగినవాడు , దప్పిక కలిగినవాడు , బాలుడు , వృద్దుడు , మలమూత్రాలు వచ్చువాడు , రోగముతో భాధపడువాడు స్త్రీసంభోగం చేయరాదు .


 *  రజస్వల అయిన స్త్రీ , సంభోగము నందు ఇష్టతలేనిది , మాలిన్యము కలిగినది , వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీ , రోగపీడితురాలు , అంగలోపము కలిగినది , గర్బవతి, ద్వేషించునది అయిన స్త్రీతో సంభోగం నిషిద్దం. ఇట్టి స్త్రీలతో రమించిన రోగములు కలుగును.


 *  సంభోగ నిగ్రహము లేని పురుషుడు రజస్వల అయిన స్త్రీతో సంభోగించిన పురుషునికి దృష్టి, ఆయువు, తేజస్సు నశించును.


 *  గర్భవతితో రమించిన గర్బమునకు హాని , రోగగ్రస్థ స్త్రీతో రమించిన బలం కోల్పోవును . మరియు మలినంతో ఉన్నది, ద్వేషించునది , శరీరం కృశించినది , బహిరంగ ప్రదేశమునందు సంభోగించిన శుక్రము క్షీణించి మనస్సు వికలతనొందును.


 *  ఆకలిగొనినవాడు , మనస్సు యందు కలవరం కలిగినవాడు , దప్పికతో ఉండువాడు , శరీర దుర్బలత కలిగినవాడు స్త్రీసంభోగం చేసినయెడల శుక్రం క్షీణించి వాతం ప్రకోపించును . ఆరోగ్యవంతుడు అయినను మధ్యాహ్న కాలం నందు రమించిన యెడల పైనచెప్పిన గుణములే కలుగును.


 *  రోగపీడితుడు స్త్రీసంభోగం చేసిన దేహబాధ , ప్లీహోదరం (spleen enlargement ) , మూర్చ, మృత్యువు కలుగును. సంధ్యాసమయం , అర్థరాత్రి యందు సంభోగం వొనర్చిన వాత,పిత్తములు ప్రకోపించును .


 *  రోగములు కలిగిన యోని యందు , గుదము నందు అంగప్రవేశం చేసి సంభోగం జరిపిన ఉపదంశం ( అంగము నందు తీవ్రంగా పోటు , కురుపులు ) , వాతప్రకోపం , శుక్ర క్షయం కలుగును.


 *  మలమూత్రాలు వచ్చుచున్నప్పుడు అవి నిరోధించి (ఆపుకొని ) సంభోగం చేసిన , స్కలన సమయంలో శుక్రము బయటకి రాకుండా బలవంతముగా ఆపుట వలనను , శుక్ర స్కలన సమయంలో వెల్లికిలా పడుకొని శుక్రం స్కలించుచున్న శుక్రం రాయిలా గడ్డకట్టి విపరీతమగు నొప్పి వచ్చు శుక్రశ్మరీ అను వ్యాధి వచ్చును.  కావున ప్రకృతి విరుద్ధములు అగు కార్యములను చేయకుండా ఉండటం మంచిది .


 *  సంభోగానంతరం , స్నానం , చందనలేపనం చేసుకుని చల్లనిగాలి , మధురభక్ష్యములు , చల్లనినీరు , పాలు , మాంసరసం , పెసరకట్టు , ద్రాక్షారసం వంటివాటిని సేవించి మెత్తనిపాన్పుపైన పడుకొని నిద్రించవలెను . ఇలా చేయుట వలన శరీరమునకు అంతకు ముందు ఉండు బలం సిద్ధించి నీరసం , నిస్సత్తువ పోవును .


 *  మన శరీరబలమునకు మించి అతిమైధునం చేయుటవలన వాతవ్యాధులు , శూల , కాస , జ్వరం , శ్వాస , లివరు రోగములు , పాండువు , క్షయ వంటి వ్యాధులు సంభంవించును.


         పైనచెప్పిన విధముగా నియమితకాలాన్ని అనుసరించి సంభోగ క్రియను నిర్వర్తిస్తూ ఆరోగ్యముగా ఉండగలరు.


              పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    

 ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ  -


        రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది.  దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.


            భూమి ఒక పెద్ద అయస్కాంతం . మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు  పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం , శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును .


            ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది.  మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం . శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.


         వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం . బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం . దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.


       దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని " వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.


            శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును . ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును . విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను . కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.


        ఇదేవిధముగా పడమట దిక్కు కూడా . ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు . సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును.


  

              

అజ్ఞానానికి నవ్వుతాడు.*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐



*భగవంతుడు రెండు సార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు.*


*ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీఅబ్బాయికి ఏమి కాదు.నేను బతికిస్తాను  అన్నప్పుడు.*


*మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటు వైపు వున్నది నా తమ్మునిది అన్నప్పుడు. వీడితండ్రి,తాత,ఇదేమాట అన్నారు పోయారు.*


*ఇప్పుడు వీడు అదే అంటున్నాడు.రేపు వీడు పోతాడు అయినా “ఇది నాది” అనే భ్రమలో, మాయలో,అజ్ఞానంలో బతుకు తున్నాడు అని నవ్వుకుంటాడట.*



*నిజమే...ఏదిీ శాశ్వతం కాదు. మనం ,మన పిల్లలు,మనం సంపాదించుకున్న ఇళ్ళు,భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవి మనవెంట రావు.*


కాబట్టి

*మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు:-*


*అనాయాసేన మరణం. బాధలేని సుఖమరణం*


*వినా దైన్యేన జీవనం. ఒకరిపై ఆధారపడని జీవితం*


*దేహాంతే తవ సాన్నిధ్యం పోయేముందు నీ దర్శనం*


*దేహిమాం పరమేశ్వర ప్రసాదించు పరమాత్మా !!*.


సర్వేజనాసుఖినోభవంతు

        శుభమస్తు 

----------------------------------------

          గోమాతను పూజించండి

          గోమాతను సంరక్షించండి

ధర్మాకృతి

 ధర్మాకృతి : పరాపర గురువులు - 1


రాజా గోవింద దీక్షితుల వారి వంశానికి చెందినా శ్రీ వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు కామకోటి 64వ పీఠాధిపతులయ్యారు. వీరి సంయాసాశ్రమ నామము చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. స్వామివారు పీఠాధిపత్యానంతరము కొంతకాలము కుంభకోణములోనే ఉండి తపస్సు చేశారు. మంత్రశాస్త్రములో మంచి పరిశ్రమ చేశారు. శ్రీవిద్యా సంప్రదాయములో అందెవేసిన చేయిగా ప్రసిద్ధిచెందారు.


అమ్మవారు వీరికి అనవరతము ప్రత్యక్షముగా ఉండేదని ప్రసిద్ధి. ఒకసారి ఔత్తరాహికులైన పండితులు స్వామి దర్శనానికి వచ్చారట. స్వామివారు వారి బసకు, భోజనానికి తగిన ఏర్పాట్లు చేయించి, సన్మానం చేయబోతున్నంతలో వారు తమకు కావలసినది ఈ సన్మానం కాదనీ స్వామి వారితోనే శాస్త్రవాదం కావాలనీ కోరారట. స్వామివారు అలాగే కానీయండని తమ దైనందిన పూజాదికములు ముగించి తిరువిసైనల్లూరు, కుంభకోణము, తిరువిడైమరుదూరు, తంజావూరు ప్రాంతములలోని పండితులను రావించి విద్వత్సభ ఏర్పాటు చేశారు. ఔత్తరాహ పండితులు సుఖాసీనులయిన తరువాత పూర్వపక్షం ఆరంభించమన్నారు.


పూర్వపక్షం ప్రారంభించిన పండితుడు రెండు మూడు వాక్యములు చెప్పి శ్రీవారి వంకకు చూసి నిశ్చేష్టుడై ఊరకుండిపోయారు. వారిలో వారు మాట్లాడుకొని, చివరకు వారి పెద్ద స్వామివారితో మీ ఒళ్ళో కూర్చుని జ్యోతిలా వెలిగిపోతున్న ఆ బాలిక చిరు మందహాసపు సొగసు మాకు పైవాక్యం తోచకుండా చేస్తోంది. దయచేసి ఆమెను లోపలి పంపి వేస్తె వాదం ఆరంభిస్తామన్నారట. అక్కడున్న మిగతా పండిత గణము, పరిచారక వర్గం ఆశ్చర్యమగ్నులై పోయారు. స్వామివారు చిరునవ్వుతో “సన్యాసినైన నా ఒళ్ళో దండకమండలాదులు తప్పితే బాలిక ఉండే అవకాశమున్నదా? ధైర్యంగా మీరు పూర్వపక్షాన్ని ఆరంభించండి అన్నారట. వారంతా సాష్టాంగంగా నమస్కరించి ‘పరదేవతా స్వరూపులయిన మీతో వాదన కోరడం అపచారం. మా అజ్ఞానాన్ని క్షమించండి” అని ప్రార్థించారు. “అదృష్టవంతులయ్యా మీరు! అమ్మవారి దర్శనం లభించింది” అని సంతోషపడి తగిన సత్కారములు చేసి పంపారు.


వీరికి తమ మఠ ఆధ్వర్యములో నడుస్తున్న కామాక్షీ దేవాలయపు కుంభాభిషేకము చేయించాలని అభిప్రాయం కలిగింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారి తోడ్పాడుతో కంచికి విజయం చేశారు. కలాకర్షణ హోమము అయిన తరువాత అమ్మవారి కళను కలశములో ఆవాహన చేసి, అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి విగ్రహాన్ని కదిలించి జలావాసం చేయించారు. అప్పుడు చూస్తే గర్భాలయము అంతా పటిష్టము చేయవలసిన అవసరం కనిపించింది. ప్రభుత్వం వారు మంజూరు చేసిన ద్రవ్యం, మరి మఠద్రవ్యం కలిపినా ఈ కార్యానికి కావలసిన మొత్తానికి తక్కువగా కనిపించింది. ఇక తప్పదని స్వామివారు మద్రాస్ పర్యటనకు బయలుదేరారు.


శ్రీవారు చెన్నపురిలో ఒకరోజు రాత్రి రెండు గంటలకు ధ్యానమగ్నులై ఉండగా అమ్మవారు కనిపించి వారి చేయి తమ శిరోజములపై ఉంచి, పాలాభిషేకం అయిన కురులు ఎలా జటలు కట్టాయో చూడు. తిలాభిషేకము ఎప్పడు చేయిస్తావు. డబ్బులు కొరతపడితే నేనీయనా అని ప్రశ్నించిందట. ధిగ్గున లేచిన స్వామివారు వెంటనే కాంచీపురా ప్రయాణము సమకట్టారు. ఆ రోజుల్లో మదరాసు నగర ద్వారాలు రాత్రిపూట మూసివేసి ఉంచేవారట. శ్రీవారి కోర్కెపై తెల్లవారక ముందే నగర ద్వారాలు తెరిపించారు తెల్లదొరతనము వారు. స్వామివారు నేరుగా కంచి కామాక్షీ దేవాలయానికి వెళ్ళి జీర్ణోద్ధరణ పనులు పర్యవేక్షించారు. దానం ఎక్కణ్ణుంచి వచ్చిందో కానీ అవసరానికి వర్షించిందట. అమ్మవారికి అష్టబంధన మహా కుంభాభిషేకములు జరిపించి అమ్మ సన్నిధిలో ఆనంద భాష్పములతో మైమరచిపోయారు.


తరువాత మహాస్వామి వారు “శ్రీమఠం ఖైదు అయిన కథ’లో వివరించిన తాటంక ప్రతిష్ఠ ఉదంతం, తంజావూరు కనకాభిషేకం జరిగినాయి. కుంభకోణము చేరిన స్వామివారు తమకు అవసాన కాలమాసన్నమయిందని గ్రహించి తదనంతర శిష్యులను స్వీకరించి మహా దేవేంద్ర సరస్వతీ స్వామి వారనే పేరుతో సంయాసమిచ్చి, ప్రశాంతచిత్తులై బ్రహ్మలీనులైపోయారు. వీరి అధిష్ఠానము కుంభకోణపు మఠపు పెరటిలో తూర్పు మూలన వడకోటి బృందావనమనే పేరుతో పూజింపబడుతోంది. అయితే వీరి సమయములో శ్రీమఠాన్ని కదిలించి వేసిన సంఘటనల గురించి చెప్పుకోకుండా వీరి చరిత్ర పూర్తి కాదు.


క్రీ.శ. 1817 నుండి క్రీ.శ. 1879వరకు శృంగేరీ పీఠములో విరాజమానులయిన ఉగ్రనృసింహభారతీ స్వామివారు మహాప్రతిభాశాలురు. మన మహాస్వామి వారి మాటలలో మహా తపస్వి. మహా తేజస్వి. చిన్నతనములోనే కాలినడకన రెండు మార్లు కాశీయాత్ర చేసి విద్యాభ్యాసం చేశారు. మణికుట్టి శాస్త్రిగారి వద్ద ప్రస్థానత్రయ భాష్యశాంతి చేశారు. ఇరవై ఏళ్ళవయస్సులో శృంగేరీ పీఠాన్ని అధిష్ఠించారు. అప్పటికి మూడు తరములుగా శృంగేరీ ఆచార్యులు యుద్ధ భయం వలన పూనాలో ఎక్కువ కాలం గడిపారని బోడస్ వ్రాసిన మారాఠీ పుస్తకంలో ఉన్నది. 


(సశేషం)

ధర్మాకృతి : పరాపర గురువులు - 2


వీరు ఆహార భయ నిద్రాడులను జయించినవారు. కేవలం కందమూలాలు కొంతకాలం, కాకరకాయలు కొంతకాలం భుజిస్తూ రోజుకు ఇరవై గంటలు అత్యాశ్చర్యకరమైన తపశ్చర్య ఆచరించారు. అణిమాది సిద్ధులు వీరి పాదాక్రాంతమయ్యాయి. శృంగేరీ బిరుదములలో చెప్పబడిన ‘సర్వతంత్రస్వతంత్ర’ బిరుదము వీరి యెడ సార్థకమైనది. వీరిని చూసినంతనే గౌరవభావము కలిగి సంస్థానాధీశులు పాదాక్రాంతులయిపోయేవారని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని సాధించేదాకా వదలిపెట్టడం వారి మనస్తత్వం కాదని వారి చరిత్రలో వ్రాసి ఉన్నది. వీరి మహాత్తుల గురించిన అనేక సంఘటనలు చెప్పబడినవి. మచ్చుకు ఒకటి రెండు చెప్పుకొందాం.


ఒకప్పుడు వీరు మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారికి తామే స్వయంగా పూజ చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. అక్కడి అర్చకులు శైవాగమమునకు సంబంధించిన వారు. వారు స్వామివారు సైతం లోపలి రావడానికి ఒప్పుకోలేదు. ఆగ్రహించిన స్వామివారు అమ్మవారి జీవకళను కొబ్బరికాయలోనికి ఆవాహన చేసి, తమతో విడిదికి పట్టుకొని పోయారు. ఆ విషయం బహిరంగంగా చెప్పి మరీ వెళ్ళారు. అమ్మవారి విగ్రహంలో జీవకళ లోపించిన విషయం అర్చకులు గ్రహించి కాళ్ళా వేళ్ళా పడితే క్షమించి స్వయంగా దేవాలయానికి వెళ్ళి తిరిగి కళాప్రతిష్ఠ చేశారు. ఈరోజునకు కూడా శృంగేరీ పీఠములో మీనాక్షీ దేవికి ప్రతిదినము మహా నివేదనము జరుగుతుందట.


ఒక సంస్థానాధీశులు స్వామివారిణి స్వయంగా వచ్చి ఆహ్వానించడానికి బదులు తమ ప్రతినిధి ద్వారా ఆహ్వానం పంపారట. రాజుగారికి పక్షవాతం వచ్చింది. తన తప్పు గ్రహించి, బుద్ధి తెచ్చుకొని స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే క్షమించి సంస్థానానికి విజయం చేశారు. పక్షవాతం గుణమయిందని వేరే చెప్పనక్కరలేదు కదా!


మహదేవ శాస్త్రి అనే పేరు గల మహా ప్రతిభాశాలి అయిన పండితుడు తన వాదనా పటిమతో అందరినీ పరాజితులను గావించి, శృంగేరీ స్వామివారితో వారి తపోవృద్ధత్వాన్ని, జ్ఞాన వృద్ధత్వాన్ని వయో వృద్ధత్వాన్ని కూడా గణనలోనికి తీసుకోకుండా వాడనలోనికి దిగి స్వామివారినే తికమక పెట్టారట. “మహాదేవా! నీకు సరస్వతి మంచి వాక్పటిమను ప్రసాదించింది. నామీదే ప్రయోగింప చూశావు. ఇమనుంచి మరచిపోతావు” అని నిగ్రహించారట. తరువాత మహదేవులు శివగంగ పీఠాధిపతులుగా చాలా కొద్దికాలం ఉన్నారు. మతిమరుపు సంభవించింది.


వీరి మహిమలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం కారణంగా వీరి కీర్తి దిగంతాలకు పాకింది. ఉగ్ర నరసింహ భారతీ స్వామివారు శృంగేరీ పీఠపు ఔన్నత్యాన్ని పునరుద్ధరించడానికి అహర్నిశలూ కృషి చేశారు. కూడలి, శివగంగ, విరూపాక్ష పీఠములపై వివిధ కోర్టులలో కేసులు వేశారు. అయితే వాదనకు తగిన ఆధారాలు లేకపోవడంతో శృంగేరీ వాదము కొన్ని కేసులలో కోర్టులలో నిలువలేదు. వీరి విస్తృత దక్షిణ దేశ పర్యటనలో కంచి కామకోటి పీఠమునకున్న ప్రత్యేక మర్యాదలన్నీ తాము పొందాలని ప్రయత్నించారు.


1838లో మహా మఖ సందర్భంగా కామకోటి పీఠాధిపతులు పల్లకీలో వెళ్ళే మార్గంలోనే తమ పల్లకీ వెళ్లాలని పట్టుబట్టారు. అయితే కుంభకోణంలో ఉన్న ఇతర మఠాధిపతులు ఒప్పుకోనందున ప్రభుత్వమూ వారికి వేరే మార్గము నిర్ణయించింది. మిగిలిన మఠముల ఎదురుగా పల్లకీ పైన వెళ్ళే అధికారం కామకోటి పీఠాధిపటులకే ఉన్నదని నిర్ణయమయింది. 1844లో అఖిలాండేశ్వరీ దేవాలయ కుంభాభిషేకపు కేసులో వివిధ కోర్టులలో జరిగిన వివాదము శ్రీమఠం ఖైదు అయిన కథలో చూడవచ్చు. 1866లో తిరిగి కుంభకోణం కామకోటి మఠం వీధిలో ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రయత్నించి నిరోధించబడ్డారు. తిరుచ్చి ప్రాంతాలలో అగ్ర సంభావనకు ప్రయత్నించి కలెక్టరు చేత కూడదని కట్టడి చేయబడ్డారు. 


మద్రాసు సమీప ప్రాంతాలలో అగ్రపూజకై ప్రయత్నించడం చెన్నపురి మహాజనసభకు నచ్చలేదు. అది ఆ ప్రాంతాలకు పరంపరగా గురువులయిన కామకోటి పీఠ మర్యాదకు వ్యతిరేకమని ఆ ప్రాంత ప్రజలలో భావన కలిగింది. ఈ సమయంలో వీరు మదరాసు నగరానికి విచ్చేయనున్నామని చెన్నపురి మహాసభకు శ్రీముఖం పంపారు. 


మదరాసు మహాజన సభ ప్రత్యేక సమావేశంలో ఈ శ్రీముఖాన్ని చర్చించింది. ఆ నగరంలో సర్వ ప్రాతినిధ్యం గల సభ నిర్ణయానుసారం ఆ సభాధ్యక్షులు కామకోటి పీఠ గౌరవ ప్రపత్తులకు భంగం కానివిధంగా మాత్రమే శృంగేరీ స్వామివారు మదరాసు విజయం చేయవచ్చునని ఆహ్వానించారు. డానికి ఆ స్వామివారు బదులు వ్రాస్తూ “శ్రీ కంచి కామకోటి పీఠానికి విరోధము చేయవలెనని అభిప్రాయము ఉండేది లేదని యీ వివరం తెలిసేది” అంటూ సమాధానంగా శ్రీముఖం పంపారు.

పై వివరాలను బట్టీ ఈ స్వామివారిని అన్యధా అర్థం చేసుకోరాదు. వారు తపస్సంపన్నులు, జీవన్ముక్తులు. మహాపురుషులనే విషయం మనం మరచిపోరాదు. బిసి అని చెప్పడానికే వీరి వృత్తాంతాన్ని చెప్పాను. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం