28, డిసెంబర్ 2020, సోమవారం

ధార్మికగీత - 75*

 *ధార్మికగీత - 75*

                                     

      *శ్లో:- కార్యేషు  దాసీ౹ కరణేషు మంత్రీ ౹*

             *రూపే  చ  లక్ష్మీ:౹ క్షమయా  ధరిత్రీ ౹*

             *భోజ్యేషు  మాతా౹ శయనే  తు  రంభా ౹*

             *షట్కర్మయుక్తా కులధర్మపత్నీ ౹౹*

                                                      

కార్యములందు దాసియును 

            కర్మలపొందికయందు మంత్రి , నా 

హార్యమునందు లక్ష్మియు, క్ష 

          మన్ పలుకర్జ మోనర్చి ధాత్రిగన్ ,

వీర్యత నొప్పు భోజనము 

           వేడ్కగ బెట్టుచు మాతభంగిగన్ ,

భార్యగ శయ్యపైనను వి 

            భాసితసుందరరంభపొలికన్ ,

యార్యతనూజ షట్విధిగ

            నారయ నుండును ధర్మపత్నియై .

హనుమాన్ చాలీసా మహత్యం

 హనుమాన్ చాలీసా మహత్యం


ఉత్తరభారతదేశంలో క్రీ||శ||16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. 


భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, 

ఓ ప్రాంతీయభాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. 


వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు.


 వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. 


ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు.


తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా పిర్యాదులు చేస్తుండేవారు. 

కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.


ఇదిఇలావుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్టు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. 


వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. 


జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. 


చనిపోయిన యువకునికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. 


స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. 


శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకోన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది.


 ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి ‘దీర్ఘసుమంగళీభవః’ అని దీవించాడు.

 

దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్నా శవయాత్ర చూపించింది. 

వెంటనే తులసీదాస్ ‘తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!’ అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు.

 ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.


ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభాక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. 

ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి


వెళ్ళి బాదుషాకు స్వయముగా వవరించి తగిన చర్య తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. 

ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. 

విచారణ ఇలా సాగింది.


పాదుషా: తులసీదాస్ జీ! మీరు రామనామం అన్నింటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట!


తులసీదాస్: అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?


పాదుషా: అలాగా! రామానామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా?


తులసీదాస్: అవును ప్రభూ! రామనామానికి మించినదేమి లేదు.


పాదుషా: సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. 

దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. 

అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.


తులసీదాస్: క్షమించండి ప్రభూ! ప్రతి జీవి జనన మనరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుతుతాయి. 

మానవమాత్రులు మార్చలేరు.


పాదుషా: తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. 


మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సుభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి!


తులసీదాస్: క్షమించండి! నేను చెప్పేది నిజం!


పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. 


నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. 


అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్ధించాడు.


 అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. 


అంటే! ఇక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. 


ఈ హాటాత్ సంఘటనతో అదరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. 


ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. 


ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.


ఆ స్త్రోతంతో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ! నీ స్త్రోత్రంతో మాకు చాల ఆనందమైంది. 

ఏమీకావాలో కోరుకో!’ అన్నాడు. 


అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నా కేమి కావాలి! నేను చేసిన నీ స్త్రోత్రం లోక క్షేమం కొఱకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. 


నా ఈ స్త్రోతంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకున్నాడు.


ఆమాటలతో మరింతప్రీతిచెందిన హనుమంతుడు ‘తులసీ! ఈస్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమేం వహిస్తాము’ అని వాగ్దానం చేశారు.

 అప్పట్నుండి ఇప్పటివరకు ‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.


అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక ‘హనుమాన్ చాలీసా’. 

దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంతా హనుమాన్ చాలీసా పారాయణ,

 గానం జరుగుతూనే ఉంది. 

ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.


ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్నీ కాపాడుతుంది.......


ప్ర: 'హనుమాన్ చాలీసా' లో - "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు, నవనిధులు - అంటే ఏమిటి?


జ: హనుమంతుడు తన భక్తులకు (భక్తిబలాన్ని అనుసరించి) అష్టసిద్ధులను, నవనిధులను అనుగ్రహిస్తాడు - అని తులసీదాసు తెలియ జేస్తున్నారు.


*అష్టసిద్ధులు*: 1. అణిమా, 2. మహిమ, 3. లఘిమ, 4. ప్రాప్తి, 5. ప్రాకామ్యము, 6. ఈశత్వం, 7. వశిత్వం, 8. సర్వ కామసిద్ధి ( కామావసాయిత్వము ). కొన్ని చోట్ల 'సర్వకామసిద్ధి' బదులుగా 'గరిమ' అని చెప్పబడింది.


 'అణువు' లా సూక్ష్మరూపాన్ని పొందడం 'అణిమాసిద్ది'. అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం 'మహిమా సిద్ధి'. పరమాణువుల కంటే తేలిక కావడం 'లఘిమా సిద్ది'. గొప్ప బరువుగా మారగలగడం 'గరిమ'. ఇష్టపదార్థాలను పొందగలగడం 'ప్రాప్తిసిద్ది'.


లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం 'ప్రాకామ్యసిద్ధి'. అన్నిటిపై, అందరిపై అధికారాన్ని పొంది, తన ఇచ్ఛ మేరకు నడిపించడం 'ఈశత్వం'. దేవతలతో సహా తాను కోరిన వారిని వశం చేసుకొనడం 'వశిత్వం'. అన్ని కోరికలను పూర్తిగా తీర్చుకొనడం 'కామావసాయిత్వం'.


*నవనిధులు*: 1. పద్మం, 2. మహాపద్మం, 3. శంఖం, 4. మకరం, 5. కచ్ఛపం, 6. ముకుందం, 7. నీలం, 8. కుందం, 9. వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ, జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి.

Nelakondapally

 https://drive.google.com/file/d/1QtbzF6rg4gCH4dwE_EAtcq5Q1ttD_QZ7/view?usp=drivesdk

Paropakaram











 

God










 

Nature






 

Musti matam

 


Suprabatam