5, మే 2026, మంగళవారం

పంచాంగము

  


మానవ జీవిత

 *మానవ జీవిత పరిణామక్రమం* 

🪷🪷🪷🪷🪷🪷🪷

*అవును... బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే...తీసి స్కూల్ లో వేస్తారు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే...బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు...డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే,..లాగి పెట్టి ఒకటి పీకి,..పెళ్లి అనే బంధాన్ని ముడి వేస్తాడు... సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే...పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేసి వెనక్కు లాగుతాడు...కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి మేధావిలా ఈసారి దేవుడి మాట కూడా వినడు...కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు...హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవ్వరూ ఉండరు,..పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోతారు...సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడు వాడి పిల్లల భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరి పోతారు...అప్పుడు ప్రతీ మగధీరుడుకి భార్య విలువ తెలవడం ప్రారంభిస్తుంది...కొందరు పిల్లలైతే ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళ బంగారు భవిషత్తు కోసం అని...తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు. శక్తి మొత్తం క్షీణించి ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు సినిమా లా కదలాడుతుంది. తెలియకుండానే అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్. అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. ఇదే సగటు మనిషి గా బతుకుతున్న జీవితం.*


*అందుకే మన జీవితంలో ప్రతి నిత్యం నీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకో...బాధ్యతల బరువుతో పాటూ నీ మరియు నీ జీవిత భాగస్వామీ సంతోషాన్ని ప్రతి దశలోనూ వెతుకు. Help ever, hurt never సూత్రాన్ని పాటించు...ఏదీ మోసుకుపోలేవని గుర్తెరిగి, నీకు వీలైనంతలో ఇవ్వడం నేర్చుకో, నవ్వడం నేర్చుకో, మన తల్లి దండ్రులు, భార్య/భర్త, మన పిల్లలు, మన రక్తసంబదీకులైన బంధువులు,మిత్రులతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి గట్టిగా ప్రయత్నించు. ప్రతి పనిలో నీదైన ఆనందాన్ని వెతుకు. బ్రతకడం మాని ఆనందంగా, ఆరోగ్యంగా... నాలుగు మంచి జ్ఞాపకాలు మిగుల్చుకో.* 💐🙏🇮🇳

బుధవారం*🌷 *🪷06, మే, 2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌷 *బుధవారం*🌷 

  *🪷06, మే, 2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : చవితి* ఉ 07.51 వరకు ఉపరి *పంచమి*

*వారం   :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : మూల* మ 03.54 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : సిద్ధ* రా 01.12 వరకు ఉపరి *సాధ్య*

*కరణం  : బాలువ* ఉ 07.51 *కౌలువ* రా 09.03 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*       

అమృత కాలం  : *ఉ 08.42 - 10.30*

 అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : మ 02.06 - 03.54 & రా 02.38 - 04.26*

*దుర్ముహూర్తం  :ప11.39- 12.30* 

*రాహు కాలం   : మ12.04- 01.40*

గుళికకాళం      : *ఉ 10.28 - 12.04*

యమగండం    : *ఉ 07.16 - 08.52*

సూర్యరాశి : *మేషం*                 

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.48*  

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.40 - 08.14*

సంగవ కాలం       :*08.14 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*

*ఆబ్ధికం తిధి  :వైశాఖ బహుళ పంచమి*

సాయంకాలం   :*సా 03.54 - 06.28*

ప్రదోష కాలం     :*సా 06.28 - 08.42*

రాత్రి కాలం       :*రా 08.42 - 11.42*

నిశీధి కాలం      :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.55*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *🪷సరస్వతి శ్లోకం🪷*


*జ్ఞానానందమయం దేవం* 

    *నిర్మలస్ఫటికాకృతిం*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 5 మే 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

              *78వ భాగం*


         *భగీరథుడి వంశం*```


భగీరథుని కుమారుడు సుహోత్రుడు. సుహోత్రుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు సింధుధ్వజుడు. సింధుధ్వజుని కుమారుడు అయతాయువు. అయతాయువు కుమారుడు ఋతుపర్ణుడు.


ఋతుపర్ణుడు అక్షవిద్యలో(జూదములో) నిపుణుడు. జూదములో ఓడిపోయిన నలునికి జూదవిద్యలో మెలుకువలు తెలిపి జూదములో గెలిచి తిరిగి రాజ్యాధికారం వచ్చేట్టు చేసినవాడు. 


ఋతుపర్ణుని కుమారుడు సర్వకాముడు. సర్వకాముని కుమారుడు సుదాసుడు. సుదాసుని కుమారుడు మిత్రసఖుడు. మిత్రసఖునికి సౌదాముడు అనే మరొక పేరు ఉంది.


మిత్రసఖుడు ఒకసారి వేటకు అడవికి వెళ్లి రెండు పెద్ద పులులు భయంకరంగా గాండ్రిస్తూ ఒకదానితో మరొకటి తలపడటం చూశాడు. పులుల గాండ్రిపులకు భయపడి మిగిలిన జంతువులన్ని వనం వదిలి దూరంగా వెళ్లిపోయాయి.మిత్రసఖుడు బాణములతో ఒక పులిని పడగొట్టాడు. 


చనిపోయిన పులి పెద్ద రాక్షసాకారం ధరించి మరణించింది. అది చూసి రెండవ పులి రాక్షసాకారం ధరించి మిత్రసఖుడితో “రాజా! నా తోటి స్నేహితుని అన్యాయంగా చంపావు. ఇందుకు నీ పై తగిన సమయంలో ప్రతికారం తీర్చు కుంటాను” అంటూ గర్జించి వెళ్లి పోయింది. 


మిత్రసఖుడు ఏమి జరుగుతుందో అని చింతించి రాజధానికి తిరిగి వెళ్లాడు.


కొంతకాలం తరువాత మిత్రసఖుడు కులగురువైన వసిష్టుడి పురోహితుడిగా యాగం చేసాడు. యాగం పూర్తైన తరువాత పురోహితుడైన వసిష్టుడికి భోజనం పెట్టి ఆశీస్సులు పొందాలి. నదికి వెళ్లి అనుష్ఠానం చేసుకుని భోజనానికి వస్తానని వసిష్టుడు నదీ తీరానికి వెళ్లాడు. యాగానికి ముందే మిత్రసఖుడిపై పగ పట్టిన రాక్షసుడు వంటవాడి రూపంలో రాజుగారి వంటశాలలో చేరాడు. సమయం కోసం వేచి చూస్తున్న వాడికి రాజుగారు వసిష్టుడికి భోజనం ఏర్పాటు చేయాలనడం గమనించి తగిన సమయం వచ్చింది అని తలచాడు నరమాంసం వండిపెడితే వసిష్టుడు గమనించి రాజుని శపించి శిక్షిస్తాడు అని భావించాడు.


వెంటనే చనిపోయిన మనిషి శరీరం ఒకటి తీసుకువచ్చి నరమాంసంతో భోజనం వండాడు. 

అనుష్ఠానం ముగించి భోజనానికి కూర్చున్న వసిష్టుడు పెట్టిన ఆహారం చూసి అది నరమాంసంతో చేసినదని గ్రహించాడు. కోపంతో ఆసనం మీద నుంచి లేచి "రాజా! తపో సంపన్నుల మైన మాకు నర మాంసంతో భోజనం ఏర్పాటు చేస్తావా! ఇది క్షమించరాని నేరం. నీవు నేటి నుండి రాక్షసుడవై నరులను భక్షిస్తూ అడవులలో జీవించు” అని శాపం ఇచ్చాడు.


మిత్రసఖుడు వసిష్టుడి పాదాలకు నమస్కరించి “మహర్షీ! మీరు మా వంశానికి కులగురువు. మా వంశజులం సదా తమరికి శిష్యులమై ఉన్నాము. ఇటువంటి పాపకార్యం ఎన్నడూ తలంచము,చేయము. ఈ అపచారం నాకు తెలియకుండా జరిగింది. అర్ధం చేసుకుని శాపం ఉపసంహరించండి" అని ప్రార్ధించాడు.


వసిష్టుడు దివ్యదృష్టితో జరిగింది గ్రహించాడు. మిత్రసఖుడి తప్పు ఏమి లేదని తెలుసుకున్నాడు. "రాజా! నీమీద పగతో ఒక రాక్షసుడు వంటవానిగా చేరి ఈ పని చేశాడు. తెలిసి జరిగినా తెలియక జరిగినా, జరిగినదానికి రాజుగా నీకు బాధ్యత ఉంటుంది.నా శాపాన్ని ఉపసహరించ లేను. కానీ సమయ పరిమితి పెడతాను. పన్నెండు సంవత్సరాలు రాత్రి పూట రాక్షసుడిగా అడవుల్లో తిరుగుతూ నరమాంస భక్షణ చేస్తూ గడుపుతావు. గడువు ముగిసిన తరువాత శాపం నుండి విముక్తి పొందుతావు" అని శాప విమోచనం చెప్పాడు.


తన తప్పు లేదని తెలిసినా తనను శాపానికి గురి చేయడం మిత్రసఖుడికి కోపం తెప్పించింది. “మహర్షీ! నిరపరాధినని తెలిసినా నన్ను తమ శాపానికి గురిచేయడం మా వంశ గురువులైన మీకు తగినది కాదు. మీరు ఇకనుండి సూర్య వంశ గురువులుగా ఉండ టానికి అనర్హులు" అంటూ ప్రతి శాపం ఇవ్వడానికి చేతిలో నీరు తీసుకున్నాడు. మహారాణి మదయంతి రాజునకు అడ్డుపడి “ప్రభూ కుల గురువులను మీరు ఇలా శపించకూడదు. రాబోయే వంశజులు గురు ఆదరణ లేక ఇబ్బందులకు గురి అవుతారు. విరమించండి" అని ప్రాధేయ

పడింది.


మిత్రసఖుడికి తప్పు తెలిసివచ్చి శపించడం వదలి చేతిలోని మంత్ర జలాన్ని తన పాదాలపై చల్లుకున్నాడు. ఆ నీటి ప్రభావం వలన పాదాలు నల్లబడ్డాయి. కల్మషమైనట్టు కళాకాంతులు లేనివయ్యాయి. మిత్రసఖుడు(సౌదాముడు) నాటి నుంచి కల్మషపాదుడు అయ్యాడు.


వసిష్ట మహర్షి శాపం వలన కల్మషపాదుడు రాత్రివేళల్లో రాక్షసుడై అడవుల్లో తిరుగుతూ కనిపించే మానవులను తినేవాడు. పగలు నరుడిగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి కల్మషపాదుడికి అడవిలో చెట్టుకింద కలసియున్న బ్రాహ్మణ దంపతులు కనిపించారు. రాక్షసుడైన కల్మషపాదుడు భర్తను భార్యనుండి విడదీసి తినబోయాడు.


బ్రాహ్మణుని భార్య.. "ఇక్ష్వాకు వంశజుడైన రాజా! రాక్షస రూపం ధరించిన నీవు కలసి వున్న దంప తులలో భార్య నుండి భర్తను విడదీసి చంపడం పాపం. బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య దోషం వస్తుంది. నా భర్తను వదిలిపెట్టుము" అని బ్రతిమాలింది. 


రాక్షస స్వభావం కల కల్మషపాదుడు వినకుండా బ్రాహ్మణుని చంపి తిన్నాడు.


బ్రాహ్మణ స్త్రీ కోపించి "నాతో కలసి ఉన్న నా భర్తను విడదీసి చంపి నాకు భర్త లేకుండా చేసావు. ఇందుకు ప్రతిగాశాపం ఇస్తున్నాను నీవు నీ భార్యతో కలవడానికి ప్రయత్నంచేస్తే వెంటనే మరణిస్తావు" అని శపించి అగ్ని ప్రవేశం చేసి మరణించింది.


కల్మషపాదుడు బాధపడటం తప్ప తనకు కలిగే రాక్షస బుద్దిని మార్చలేక పోయాడు. అలాగే పన్నెండు సంవత్సరాలు రాక్షస కార్యాలు చేస్తూ గడిపేశాడు. పన్నెండు సంవత్సరాల తరువాత వసిష్టుడు శాప విముక్తి శుద్దికి యాగం చేసి రాజుని రాక్షసత్వం నుండి విముక్తి కలిగించారు. సౌదాముడు రాజధానికి వచ్చి ధర్మ పాలన చేయసాగాడు.


సంతానం లేకపోవడంతో సౌదాముడు భార్య మదయంతితో కలసి పుత్రులను పొందాలి అని భార్యను దగ్గరకు తీసుకోబోయాడు. బ్రాహ్మణ స్త్రీ శాపం తెలిసిన రాణి మదయంతి భర్తకు మరణం రాకూడదని శాపం గుర్తుచేసి దూరంగా వెళ్లిపోయింది. భార్యాభర్తలు ఇరువురు వంశగురువు వసిష్ట మహర్షి వద్దకు వెళ్లి బ్రాహ్మణ స్త్రీ శాపం చెప్పి తమకు సంతానం కలిగేలా చేయమని ప్రార్ధించారు.


వసిష్టుడు తన తపశక్తితో సౌదాముడి తేజస్సు కలవకుండానే భార్య మదయంతి లో ప్రవేశించేట్టు చేసి గర్భం వచ్చేట్టు చేసాడు. ఇరువురిని ఆశీర్వదించాడు. మదయంతి గర్భాన్ని ఏడు సంవత్సరాలు ధరించినా పురుడు రాలేదు. భరించలేక మదయంతి ఒకఅశ్మము(రాయితో) గర్భ విచ్ఛిత్తి చేసింది. గర్భము నుండి ఒక పుత్రుడు బయటకు వచ్చాడు.


బాలునికి అశ్మకుడు అని పేరు పెట్టి పెంచారు. కుమారుడు పెద్దయ్యాక అశ్మకునికి రాజ్యం అప్పగించి కల్మషపాదుడు వాన ప్రస్థానికి అరణ్యాలకు వెళ్లిపోయాడు. తండ్రి తరువాత చక్కగా పరిపాలించిన అశ్మకునికి మూలకుడు అనే కుమారుడు పుట్టాడు.


మూలకుడు రాజై పరిపాలన సాగిస్తునప్పుడు పరశురాముడు రాజులను సంహరిస్తూ రాగా మూలకుడు స్త్రీ వేషంతో అంతపురంలో స్త్రీల మధ్య ఉండి ప్రాణ రక్షణ చేసుకున్నాడు. స్త్రీ సమానుడు అని భావించి పరశురాముడు వదలి వెళ్లి పోయాడు. అతనికి ఇలబిలుడు అనే కుమారుడు జన్మించాడు.


ఇలబిలునకు ఖట్వాంగుడు అనే కుమారుడు జన్మించి రాజైనాడు. ఖట్వాంగుడు దేవదానవ యుద్దంలో దేవతలకు సహాయంగా యుద్దం చేసి దేవతలను గెలిపించాడు. దేవతలు సంతోషముతో వరం కోరుకోమనగా ఖట్వాంగుడు తన ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అని అడిగాడు.


దేవతలు నీ ఆయుష్యు ఇంకా రెండు ఘడియలు ఉంది అనే చెప్పగా ఖట్వాంగుడు "అయితే మీ వరం నాకు వద్దు. నన్ను భూమి పైకి వెంటనే పంపండి" అని భూమి మీదకు వచ్చేసాడు. సర్వం వదిలివేసి బ్రహ్మాదులకు సాధ్యం కాని పరమయోగ ప్రభావం పొంది ముహూర్త కాలంలో దేహత్యాగం చేసి విష్ణుసాయిజ్యం పొందాడు.


*దిలీప మహారాజు కుమారుడు రఘువు. ప్రసిద్ధ రఘు వంశం అతనితోనే ప్రారంభమైంది.


             *(సశేషం)*

*రఘువంశ కథ రేపటి భాగంలో చచదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

Mantra - 30

 Mantra - 30 ARUNAM 4 anuvaakam


ఇప్పుడు మనం మూడవ అనువాకం పూర్తి చేసుకుని నాలుగవ అనువాకం లోకి ప్రవేశిస్తున్నాము.


ఈ మంత్రం కంటి ఆరోగ్యం మరియు ఇంద్రియాల ప్రసన్నత గురించి వివరిస్తుంది.


"అక్షిదుఃఖోత్థితస్యైవ |

విప్రసన్నే కనీనీకే। 

ఆంక్తే చాద్గణం నాస్తి| 

ఋభూణాం తన్నిబోధత॥”


“అక్షిదుఃఖోత్థితస్యైవ” - కంటి వ్యాధుల (ex. కళ్ల కలక) వల్ల గానీ, శారీరక క్లేశం వల్ల గానీ కలిగే 'అక్షిదుఃఖం' (కళ్ళ బాధ) నుండి విముక్తి పొందిన వాడికి


"విప్రసన్నే కనీనీకే” - కనుపాపలు (కనీనీకలు) అత్యంత నిర్మలంగా, ప్రకాశవంతంగా మారుతాయి.


“ఆంక్తే చాద్గణం నాస్తి” - కళ్ళకు అంజనం (దివ్యమైన కాటుక లేదా రక్షణ) ఉన్నప్పుడు, అక్కడ 'అద్గణం' (మలినం లేదా లోపం) ఏమీ ఉండదు. అంటే దృష్టి దోషాలు తొలగిపోతాయి.


“ఋభూణాం తన్నిబోధత” - జ్ఞానోదయం పొందిన ఋభువుల (జ్ఞానుల) స్థితి అలా ఉంటుందని తెలుసుకోండి. ఈ రహస్యాన్ని 'ఋభువుల' (దేవతా శిల్పులు లేదా దివ్యమైన మేధస్సు గల దేవతలు) ద్వారా తెలుసుకోండి.


కనీనీక (Pupil) - వేద మంత్రాలలో శరీరంలోని సూక్ష్మ భాగాల ప్రస్తావన రావడం విశేషం. కనుపాప ప్రసన్నంగా ఉండటం అనేది కేవలం చూపుకే కాదు, మనిషి యొక్క మానసిక ప్రశాంతతకు మరియు ఉత్సాహానికి కూడా సంకేతం.


ఋభువులు - వేదాలలో ఋభువులను నైపుణ్యం కలిగిన దేవతలుగా వర్ణిస్తారు. వారు ముసలివారిని యవ్వనవంతులుగా మార్చగలరని, ఇంద్రియాలకు కొత్త శక్తిని ఇవ్వగలరని ప్రతీతి. అందుకే వారిని స్మరించడం ద్వారా దృష్టి దోషాలు తొలగుతాయని ఈ మంత్రం చెబుతోంది.


అరుణప్రశ్నలోని ఈ భాగాన్ని చక్షుష్య మంత్రాలుగా పరిగణిస్తారు. పురుష సూక్తం ప్రకారం ‘చక్షోః సూర్యో అజాయత’, ఐతరేయోపనిషత్ ప్రకారం ‘ఆదిత్యశ్చక్షుర్భూత్వాక్షిణీ ప్రావిశత్’ మొదలైన ప్రమాణముల ద్వారా సూర్యుడు నేత్రం (కన్ను) కి అధిదేవత కాబట్టి, సూర్యారాధన ద్వారా కంటి చూపు మెరుగుపడుతుందని మరియు బుద్ధి వికాసం కలుగుతుందని మంత్ర భావం.


తత్వ విచారణలో..

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం మన అంతర్గత దృష్టి (Inward Vision) ఎలా ఉండాలో వివరిస్తుంది:

అక్షిదుఃఖం - అజ్ఞానం (The Disease of Ignorance) - కంటికి జబ్బు చేసినప్పుడు వస్తువులు సరిగ్గా కనిపించవు, మసకగా ఉంటాయి లేదా అసలు కనిపించవు. అద్వైతంలో 'అజ్ఞానం' (Avidya) అనేది ఒక మానసిక నేత్ర వ్యాధి వంటిది. ఈ అజ్ఞానం వల్లనే మనం ఒకే ఆత్మను అనేక జీవులుగా, జగత్తుగా భ్రమపడుతున్నాం (రజ్జు-సర్ప భ్రమ వలె). ‘అక్షిదుఃఖోత్థితః’ అంటే - గురువు ఉపదేశం వల్ల, విచారణ వల్ల అజ్ఞానమనే వ్యాధి నుండి మేల్కొన్న సాధకుడు అని అర్థం.


‘విప్రసన్నే కనీనీకే - చిత్త శుద్ధి (Purification of Intellect) - జబ్బు నయమయ్యాక కన్ను ఎంత నిర్మలంగా (Clear) మారుతుందో, అజ్ఞానం తొలగాక బుద్ధి అంత ప్రసన్నంగా మారుతుంది. కంటి పాప (కనీనిక) ఎంత స్వచ్ఛంగా ఉంటే దృష్టి అంత స్పష్టంగా ఉంటుంది. అలాగే, మనస్సులోని రాగద్వేషాలనే మాలిన్యాలు తొలగిపోయినప్పుడు, అది ఆత్మ చైతన్యాన్ని యథాతథంగా ప్రతిబింబిస్తుంది. దీనినే 'అంతఃకరణ శుద్ధి' అంటారు.


అద్గణం నాస్తి - అద్వైత స్థితి (State of Non-Duality) - కన్ను ప్రసన్నమైనప్పుడు దృష్టిలో అస్పష్టత (అద్గణం) ఉండదు. అదేవిధంగా, జ్ఞాని దృష్టిలో 'భేదం' అనే మాలిన్యం ఉండదు. అక్కడ "నేను-నీవు", "మంచి-చెడు" అనే విభజనలు కనిపించవు. అంతా ఏకైక చైతన్యంగానే గోచరిస్తుంది.

మాయ పొరలు తొలగిపోయిన తర్వాత కనిపించే ఆ నిర్మలత్వమే బ్రహ్మానుభూతి.


జ్ఞానుల అనుభవం - 'ఋభువులు' అంటే అత్యున్నతమైన జ్ఞాన స్థితిని పొందిన వారు.

సూర్యుడు ప్రకాశిస్తున్నా కంటి జబ్బు ఉన్నవాడు చూడలేనట్లు, పరమాత్మ సర్వవ్యాపి అయి ఉన్నా అజ్ఞాని గుర్తించలేడు. కానీ, ఋభువుల వంటి జ్ఞానులు తమ ప్రసన్నమైన జ్ఞాననేత్రంతో ఆ సత్యాన్ని నిరంతరం దర్శిస్తుంటారు. ఆ స్థితిని పొందుమని ఈ మంత్రం మనల్ని ప్రోత్సహిస్తోంది.


మంత్ర సందేశం:

అజ్ఞానమనే పొర నీ కంటిని కప్పి ఉంచినంత కాలం నీకు సత్యం కనిపించదు. సాధన ద్వారా ఆ పొరను తొలగించుకున్నప్పుడు, నీ బుద్ధి నిర్మలమై (విప్రసన్నే), నీవు ఏకత్వాన్ని దర్శిస్తావు. అప్పుడు నీ దృష్టిలో ఎక్కడా దోషం (ద్వైతం) ఉండదు. అదే పరమ శాంతి.

05-05-2026 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

05-05-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. 

---------------------------------------


వృషభం


కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.

---------------------------------------


మిధునం


కుటుంబ సభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కర్కాటకం


కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు. 

---------------------------------------


సింహం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కన్య


ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

---------------------------------------


వృశ్చికం


ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. 

---------------------------------------


ధనస్సు


ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

---------------------------------------


మకరం


నిరుద్యోగుల యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కుంభం


కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యటం మంచిది కాదు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------


మీనం


కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత మందకొడిగా సాగుతుంది. ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

---------------------------------------

మంగళవారం,మే.5,2026

 శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం,మే.5,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి తె4.51 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:జ్యేష్ఠ ఉ10.41 వరకు 

యోగం:శివం రా10.17 వరకు

కరణం:బవ మ3.50 వరకు

తదుపరి బాలువ తె4.51 వరకు

వర్జ్యం:రా7.33 - 9.19

దుర్ముహూర్తము:ఉ8.07 - 8.58

మరల రా10.48 - 11.33

అమృతకాలం:లేదు

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:వృశ్చికం     

సూర్యోదయం: 5.38

సూర్యాస్తమయం:6.15

సంకష్టహర చతుర్థీ

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻