27, ఏప్రిల్ 2026, సోమవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 21 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *202వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


ఉద్యోగ పర్వము,  మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము. 

ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. 

సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి.  సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు..


         *ప్రధమాశ్వాసం*

```

ఉత్తరాభిమన్యుల వివాహం గడిచి నాలుగు రోజుల తరువాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి “పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందరికీ తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింప చేయాలి. పాండవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు,శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం. వారి బలపరాక్రమాలను ప్రదర్శించ వలసిన సమయం ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుక హస్తినా పురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము” అన్నాడు. 


అప్పుడు బలరాముడు లేచి.. 

“తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితం. ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. జూదం ఆడటం సరిగా ఎరుగని ధర్మనందనుడు జూదానికి సిద్దంగావున్న కర్ణ దుర్యోధనాదులను వదిలి జూదంలో నిపుణుడైన శకునిని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోతూ, రోషావేశంతో జూదంను కొనసాగించి ఓడిపోయాడు. దానిలో శకుని తప్పేమీ లేదు. తన ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరంచేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళే దూత ధృతరాష్ట్రుడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి” అన్నాడు.```


         *సాత్యకి ఆవేశం*```


బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి "బలరామా! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. మనుష్యునికి ఎలాంటి హృదయం వుంటే వారు అటువంటి మాటలే మాట్లాడుతారు. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి, కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించారు. ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? నియమం ప్రకారం వనవాసం నుండి విముక్తుడు కాగానే వారి రాజ్యంను పొందడానికి ధర్మరాజు అర్హుడైనాడు. దీనుడై అతడు రాజ్యంను యాచించడం తగదు. పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్న పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునులను ఎదిరించి యుద్ధభూమిలో నిలువగల వాడెవడు. విరాటుని పరాక్రం తక్కువా? పాంచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి. అంతేగాని యాచన వలదు" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 23 ఏప్రిల్ 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *204 వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*సహాయార్ధియై దుర్యోధనుడు ద్వారకకేగుట*```


హస్థినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దుర్యోధనుడు మనసు మార్చుకుని తనే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. 


అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంపై కూర్చుచున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునిని వైపు చూసి తరువాత దుర్యోధనుని చూసాడు. ఇద్దరినీ తగురీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. 


సుయోధనుడు ముందుగా "కృష్ణా! పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే. పైగా నేను ముందు వచ్చాను ముందుగా వచ్చిన వారిని ఆదరించడం లోక నీతి కనుక నాకు నీ సహాయాన్ని అందించ కోరుతున్నాను.”అన్నాడు.


అందుకు శ్రీకృష్ణుడు "సుయోధనా నీవు ముందు ఏతెంచిన మాట వాస్తవం. కాని నేను ముందుగా అర్జునుని చూసాను కనుక మీ ఇద్దరికి సహాయాన్నందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన నాతో సమాన రూపం కల "నారాయణ" నామం గల పది లక్షల మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక వైపు ఉంటాను అయితే నేను మాత్రం యుద్ధం చేయను. ఆయుధం పట్టను. కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు కనుక అతడు ముందు కోరుకోవడం ధర్మం" అన్నాడు. 


వెంటనే అర్జునుడు "నాకు శ్రీకృష్ణుడు కావాలి" అన్నాడు. 


సుయోధనుడు మనసులో సంతోషించి పది లక్షల నారాయణ సైన్యంను తీసుకుని బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. 


బలరాముడు "సుయోధనా! అభిమన్యుని వివాహ సమయంలో నేను నిన్ను సమర్ధించాను.అందుకు కొందరు వ్యతిరేకించారు ఆ విషయం నీకు తెలిసే ఉంటుది. ఇరుపక్షాల్తోను మనకు సమాన బంధుత్వం వున్నదని గుర్తుచేశాను. నా మాటను కృష్ణుడు స్వీకరించ లేదు. నాకు కృష్ణుడంటే అభిమానం. అతడిని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. కనుక నేను ఎవరి పక్షం వహించక ఊరక ఉంటాను" అన్నాడు. 


సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్ధించాడు. కృతవర్మ ఒక అక్షౌహిణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకుని సుయోధనుడు హస్థినకు తిరిగి వెళ్ళాడు.```


*అర్జునుని అంతర్యం*```


శ్రీకృష్ణుడు "అర్జునా! అదేమిటి నన్ను కోరుకున్నావు. ఆయుధము పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకు మేలు ఏమిటి" అన్న్నాడు. 


అర్జునుడు "కృష్ణా! నీవు యుద్ధంలో వారందరిని సంహరించ గలవాడవు. వారిని చంపితే ఆ కీర్తి నీకు చెందుతుంది. నేనుకూడా వారిని సంహరించి ఆ కీర్తిని పొందాలనుకుంటున్నాను. నిన్ను ఎదిరించి నేను గెలువగలనా? పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది కనుక నీ తోడ్పాటు చాలు. దానితో నేను యుద్ధం చేసి రాజ్యం హస్థగతం చేసుకుని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నీవు గెలిచిన రాజ్యానికి ధర్మజుని రాజుని చేయడం ధర్మమా? నీవు మా వైపు ఉంటే చాలు. నా చిరకాల వాంఛ అయిన నీ సారథ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదేచాలు" అన్నాడు. 


శ్రీ కృష్ణుడు "అర్జునా! నీ కోరిక తప్పక తీరుతుంది. నీకు సారథ్యం వహించి విజయలక్ష్మిని నీకు స్వంతం చేస్తాను. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాము పద " అని అర్జునునితో ఉపప్లావ్యం చేరాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శివుడు ఉండమని అడిగినా

 శివుడు ఉండమని అడిగినా ఆదిశంకరులు ఎందుకు ఉండలేదు రెండు రోజులు:



శంకరాచార్యులు " శివానందలహరి " చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు:


అశనం గరళం ఫణీ కలాపో

వసనం చర్మచ వాహనం మహోక్షః

మమ దాస్యసి కిం కిమస్తి శంభో

తవ పాదాంబుజ భక్తిమేవ దేహి "


ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి " రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో " అన్నారు. 10 ని.లు అవగానే తను తిరిగి వెడతానన్నారు శంకరులు. " అదేమిటోయ్ రాకరాక వచ్చావు, రెండు రోజులు ఉండి వెడుదువుగాని " అన్నారు శివుడు.

అప్పుడు శంకరులు పై శ్లోకాన్ని చెబుతారు.

మనం వేరే ఊరిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళామనుకోండి. ఇంట్లోకి ఆహ్వానించి సామాను ప్రక్కరూములో పెట్టుకో అంటాడు. లుంగీ ఇచ్చి కట్టుకోమని కాఫీ ఇస్తాడు. స్నానంచేసి రమ్మని టిఫిన్ పెడతాడు. తన స్కూటర్ మీదో కారుమీదో ఊరంతా చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న జ్ఞాపిక ఇచ్చి సాగనంపుతాడు.

ఇదే విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా శివుడితో ఏమన్నారో చూద్దాం.

నువ్వు ఉండేదే శ్మశానంలో కనుక నన్నుకూడా ఓ ప్రక్కన సర్దుకోమంటావు. నువ్వు త్రాగేదే గరళం కనుక నాకు కూడా కొంచెం అదే త్రాగమని ఇస్తావు. నువ్వుకట్టుకునేదే జంతుచర్మం కనుక ఓ చిన్నముక్క నాకు కూడా ఇస్తావు కట్టుకోమని. నువ్వు తిరిగేదే ఎద్దుమీద కనుక దానిమీద ఎక్కించుకునే అటూ ఇటూ త్రిప్పుతావు నన్ను. నువ్వు ధరించేవే నాగుపాములు కనుక నేను వేళ్ళేటప్పుడు ఓ చిన్నపాముని జ్ఞాపికగా ఇస్తావు. " ఇవన్నీ భరించడం నావల్ల అవదు కానీ నీపాదాలను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి అనుగ్రహించు స్వామీ " అని వేడుకున్నారు అనుకోవాలి.

ఎంత అద్భుతంగా ఉంది శంకరుల వేడికోలు..


ఈ పవిత్రమైన "  సోమవారం ". "అవ్యాజకరుణామూర్తి" పరమేశ్వరుడి అశీస్సులు అందరికీ లభించాలని కోరుకుందాం.


శుభ సోమవారం 🔱Happy Monday

ఓ మధురమైన జ్ఞాపకం

 (ఓ మధురమైన జ్ఞాపకం)


శుభోదయం మిత్రులందరికి :


ఆచార్య సి.వి.బి.సుబ్రమణ్యంగారు జ్యోతిష నిపుణులు, శాస్త్ర బోధకులు

ముఖ్యంగా హాస్యప్రియులు.చాలా

జ్యోతిష సభలలో ''హాస్యం-బుధకార

కత్వము అనే విషయంపై నాకు మాట్లాడే

అవకాశాన్ని చ్చి.వివిధ సభలలో నేను

చెప్పిన హాస్యాన్ని''చురకసంహిత ''గా

జ్యోతిర్వాస్తు విజ్ఞానసంస్ద ద్వారా ముద్రించి నన్ను ప్రోత్సహించిన సహృదయులు.వారి వద్దనే ఎం.ఏ

జ్యోతిషం తెలుగువిశ్వవిద్యాలయంలో

చేసాను.


సప్తమభావం(భార్యచురుకైనదయితే)


ఒకాయన రోజూతెగపూజచేస్తున్నాట్ట.

భార్య అడిగింది ఎప్పుడూ లేనిది

ఈ మధ్య ఎక్కువగా పూజ చేస్తున్నా

రేమిటండి అని! (ఆశ్చర్యంగా )


నా శత్రువు నశించాలని చేస్తున్నానోయ్

అన్నాట్ట (కోపంగా ).


మీరెంత పూజలుచేసినా నేనిప్పట్లోపోను

అందిట భార్య (నవ్వుతూ ).


                         ........

జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్. (డా::సి.వి.బి.సుబ్రమణ్యంగారు సత్కరి

స్తున్న జ్ఞాపకం ఫోటోలోసాగికమలాకర

శర్మగారు కూడా ఉన్నారు. )