2, అక్టోబర్ 2020, శుక్రవారం

సుప్రీంకోర్టు విచారణలో

 రామ ఆలయ కేసుపై సుప్రీంకోర్టు విచారణలో రెండు ఆసక్తికరమైన విచారణ వివరాలు.


మొదటిది: న్యాయమూర్తి- మసీదు కింద గోడల అవశేషాలు కనుగొనబడ్డాయి.


మీనాక్షి అరోరా, ముస్లిం పక్షం తరపు న్యాయవాది - ఆ గోడలు దర్గాకు చెందినవి.


న్యాయమూర్తి - కానీ మీ అభిప్రాయం ఏమిటంటే మసీదు ఖాళీ ప్రదేశంలో నిర్మించబడింది… ఏ నిర్మాణాన్ని విచ్ఛిన్నం లేదా కూల్చి వేయడం చేయడం ద్వారా జరుగలేదా.


న్యాయవాది - నిశ్శబ్దం


జడ్జి-సిట్ తవ్వకాలలో కొన్ని శిల్పాలు కనుగొనబడ్డాయి.


న్యాయవాది - అవి పిల్లల బొమ్మలు కూడా కావచ్చు.


న్యాయమూర్తి- హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు అవతారమైన వరాహ అవతార0(పంది) విగ్రహాన్ని కూడా వారు తవ్వకాలలో కనుగొన్నారు .. ముస్లింలలో పంది విగ్రహంతో ఆడుకునే పద్ధతి ఉందా?


న్యాయవాది -నిశ్శబ్దం .. !!


వేదాలలో శ్రీరాముడు ఉన్నాడు… అయోధ్యలో కూడా శ్రీ రాముడి జన్మస్థలం గురించి ఖచ్చితమైన ప్రస్తావన ఉంది !!


రెండవ విచారణ


సుప్రీంకోర్టు... ధర్మచక్రవర్తి, తులసిపీఠ వ్యవస్థాపకుడు, పద్మవిభూషణ్, శ్రీ రామ్ జన్మభూమికి న్యాయవాదిగా హాజరైన జగద్గురు రంభద్రచార్య జి ... వివాదాస్పద ప్రదేశంలో శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా లేఖనాత్మక సాక్ష్యాలపై ఆధారాలు ఇచ్చారు.


న్యాయమూర్తి కుర్చీపై కూర్చున్న వ్యక్తి ముస్లిం ...


ఆయన వెంటనే "మీరు ప్రతిదానికి వేదాలను ప్రమాణికాలుగా మాట్లాడతారు... కాబట్టి అయోధ్యలోని ఆ ప్రదేశంలో శ్రీ రాముడు జన్మించాడని వేదాల నుండి ఆధారాలు ఇవ్వగలరా?"


జగద్గురు రామభద్రాచార్య జి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, "నేను ఇవ్వగలను సార్", ... వెంటనే ఆయన బుగ్వేదం యొక్క జైమినియ సంహిత నుండి చదవటం ప్రారంభించారు, ఆ సంహితలో సరయు నది యొక్క నిర్దిష్ట ప్రదేశం నుండి అయోద్య దిశ మరియు దూరం సరిగ్గా ఉంది. శ్రీ రాముడి జన్మస్థలం యొక్క స్థితి వివరించబడింది.


కోర్టు ఉత్తర్వుల ప్రకారం జైమినియ సంహిత తెప్పించి అందులో జగద్గురు పేర్కొన్న వివరాలను తెరిచి అన్ని వివరాలు సరైనవని తేల్చింది. శ్రీ రామ జన్మభూమి స్థానం ఇవ్వబడిన ప్రదేశం ... వివాదాస్పద స్థలం సరిగ్గా అదే.


జగద్గురు వాదన ప్రకటన తీర్పును హిందువుల వైపు మళ్లించింది.


ముస్లిం న్యాయమూర్తి అంగీకరించారు, "ఈ రోజు నేను భారతీయ జ్ఞానం యొక్క అద్భుతాన్ని చూశాను ... కళ్ళు లేని వ్యక్తి, వేదాలు మరియు గ్రంథాల యొక్క భారీ వాజ్మయం నుండి ఎలా ఇంత వివరాలు ఇవ్వగలిగారు? ఇది దైవిక శక్తి కాక ఇంకేమిటి?" అని ఆశ్చర్యచకితులయ్యారు.


ఇప్పుడు మనకొచ్చే సందేహం శ్రీ రాముడు పుట్టకముందే వేదాలు ఉన్నాయి కదా…వాటిలో శ్రీ రాముడు ఎలా ప్రస్తావించబడతారు?


వేద మంత్రద్రష్టలైన బుషులు - భూత, వర్తమాన, భవిష్యత్తు ఈ మూడు కాలాల గురించి జ్ఞానం కలిగి ఉండేవారు.

సత్యమద్వైతము

 ఇది *శ్రీశర్మద* సేకరణ 👇


🌸🌸 🌸🌸

శ్రీభగవత్పాదాచార్యులు తాము దిగ్విజయాత్ర చేసే సమయంలో చోళ దేశములో నున్న శ్రీ మధ్యార్జున క్షేత్రమునకు వెళ్ళినప్పుడు పండితులనేకులు శ్రీ భగవత్పాద సమీపమునకువచ్చి ఈవిధముగ అన్నారు 

మీరువ్రాసిన భాష్యాది గ్రంథాలకు 

మీ ఉపదేశాలు శ్రుతులకు తాత్పర్యమైన అద్వైతమే పరమ తాత్పర్యము - అని తెలుసుకున్నాము 

అయిననూ ఈవిషయంలో మీరుప్రతిపాదించినదే సత్యము - అని తెలియజేయు వైదికమైన నిదర్శనము ఏదైనావుంటే అందరకు ఇప్పుడున్న అద్వైత నిశ్చయము స్థిరమౌతుంది 

                    వెంటనే శ్రీభగవత్పాదులు చోళదేశములో మధ్యలోనున్నట్లుగా కనుబడుచున్న శ్రీ మధ్యార్జున క్షేత్రములో విరాజిల్లుచున్న శ్రీ మహాలింగము స న్ని ధికి పండితులతోకలసివెళ్లి   

ఈ విధంగా ప్రార్థించారు " భగవన్ ! శ్రుతి తాత్పర్యమును పూర్తిగా తెలిసినవారు మీరే 

శ్రుతి మీనుండి యే ఆవిర్భవించినది 

అందువలన శ్రుతి కి తాత్పర్యమైన విషయమిది? 

అని సంశయ రహితముగా ఉండేటట్లు అందరి సమక్షంలో ప్రకటించాలి " 

వెంటనే భగవానుడు శరీరముతో మహాలింగమునుండి ఆవిర్భవించి తన కుడిచేతిని అభయ ముద్రతో పైకెత్తి "సత్యమద్వైతమ్  

సత్యమద్వైతమ్ 

సత్యమద్వైమ్ " అని మూడు పర్యాములు మేఘ గంభీరమైన ధ్వనితో చాటి చెప్పినాడు

65వ పద్యం

 

మ.

ఒకయర్థంబును నిన్ను నే నడుగగా నూహింప, నెట్లైన బొ

మ్ము, కవిత్వంబులు నాకుజెందవని యేమోయంటివా? నాదు జి

హ్వకు నైసర్గిక కృత్యమంతియ సుమీ! ప్రార్థించుటే కాదు కో

రికలన్ నిన్నును గాన నాకు వశమా? శ్రీకాళహస్తీశ్వరా!

🪔 దీపోజ్యోతిః నమోస్తుతే🪔🪔



*దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమోపహః|

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||

 

*భావం.*.. దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. *

 

*దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. *అజ్ఞానం = చీకటి,* *జ్ఞానం = వెలుతురు. *మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.*


    🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏 

65వ పద్యం

 

మ.

ఒకయర్థంబును నిన్ను నే నడుగగా నూహింప, నెట్లైన బొ

మ్ము, కవిత్వంబులు నాకుజెందవని యేమోయంటివా? నాదు జి

హ్వకు నైసర్గిక కృత్యమంతియ సుమీ! ప్రార్థించుటే కాదు కో

రికలన్ నిన్నును గాన నాకు వశమా? శ్రీకాళహస్తీశ్వరా!

ఎంత గొప్ప వినాయకుడి శ్లోకం.🙏



దేవతారాధనలో ముందుగా మనం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు గణపతిని పూజించాలి అంటే ఏ పని అయినా ప్రారంభించే ముందు విఘ్నం కలగకూడదని విఘ్నధిపతి అయినా విఘ్నేశ్వరుడిని పూజించమని చెబుతారు. గజాననుని శ్లోకం అనగానే అందరికి ముందు వచ్చేది శుక్లం బరధరం విష్ణుం,శేషివర్ణం చతుర్భుజం| 

ప్రసన్నవదనం ధ్యాయేత్ ,సర్వ విగ్నోప శాంత యే... 


శుక్ల – స్వచ్చమైన

అంబర – ఆకాశాన్ని

ధర్మ – ధరించిన

శశివర్ణం – చంద్రుని వంటి కాంతి కలిగిన

చతుర్భుజం – నాలుగు వేదాలను నాలుగు భుజములుగా కలిగినవాడు / చతుర్విధపురుషార్ధాలను ఇచ్చువాడు

ప్రసన్నవదనం – చిరునవ్వులొలికించి సిరివెన్నలలను చిందించు నగుమోము కలవాడు

విష్ణుం – సర్వవ్యాపకుడైన పరమాత్మ

సర్వ విఘ్నోపశాంతయే – సమస్త అడ్డంకులను శాంతింపచేయుటకు

ధ్యాయేత్ – ధ్యానం చేస్తున్నాను.


తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన.


ఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందినది అని అనుకుంటాము. కాని, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు.


శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.


ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి కి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది.


ఏకో దేవః సర్వభూతేషు…అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.🙏.

హిందూ ధర్మం గురించి


 

మూర్తి గారి పద్యం


 

ఐకమత్యం


 

శివానందలహరి 14 వ శ్లోకం

 **దశిక రాము**



" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:”

" వేద శాస్త్ర ధర్మాలను ఉల్లంఘించి , నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు. 

అందువల్ల నీవు అపరాధివి. నిన్ను రక్షింౘడం ఎలా ?" అని శివుడు 

ప్రశ్నిస్తాడేమో అని , తాను దీనుడననీ, ఈశ్వరుడు దీనజన బాంధవుడనీ,

కాబట్టి తనను రక్షింౘడం బంధు మర్యాద అనీ, శంకరులు శివునికి 

విన్నవించారు. 


        శ్లో" ప్రభుస్త్వం దీనానాం _ ఖలు పరమబంధుః పశుపతే 

                  ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః, 

                  త్వయైవ క్షంతవ్యాః శివ ! మదపరాధాశ్చ సకలాః

                  ప్రయత్నా త్కర్తవ్యం _ మదవన మియం బంధు సరణిః !!


పదవిభాగం: 

ప్రభుః _ త్వమ్ _ దీనానాం _ ఖలు _ పరమబంధుః _ పశుపతే _ 

ప్రముఖ్యః _ అహం _ తేషామ్ _ అపి _ కిముత _ బంధుత్వమ్ _ 

అనయోః _ త్వయా _ ఏవ _ క్షంతవ్యాః _ శివ _ మదపరాధాః _ 

చ _ సకలాః _ ప్రయత్నాత్ _ కర్తవ్యం _ మదవనమ్ _ ఇయం _ 

బంధు సరణిః .


తాత్పర్యం:  

పశుపతివైన ఓ ఈశ్వరా ! నీవు దీనులకు దగ్గఱ ౘుట్టమైన ప్రభుడవు.

నేను అటువంటి దీనులలో అగ్రగణ్యుడను. మన ఇద్దరికీ ఇంతకంటే 

ౘుట్టరికం ఇంకేమి కావాలి ? నా నేరము లన్నిటినీ , నీవు మన్నించి , 

నన్ను నీవే కరుణించి, రక్షింప వలసి యున్నది. ఇది బంధు మర్యాదా

లక్షణం.


వివరణ:


ఈశ్వరుడు దీనులకు పరమ బంధువు. భక్తుడు, దీనాతి దీనుడుగా

ఉన్నప్పుడు దైవానికి ఆభక్తుని ఆదుకోవలసిన బాధ్యత ఉంటుంది.

అందువల్ల భక్తుడు తెలియక పొరపాటు చేసినా , భక్తులను రక్షింౘడం 

లోకసహజం. కాబట్టి బంధు మర్యాదననుసరించి , దీనుడైన తనను 

దీనబాంధవుడైన పరమేశ్వరుడు తప్పక ఆదు కోవాలని శంకరులు 

నొక్కి చెప్పారు.

🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏



**ధర్మో రక్షతి రక్షితః**

*ఆవిరి వారం*



వైద్యుల అభిప్రాయం ప్రకారం, COVID-19 ను ముక్కు నోటి నుండి ఆవిరి ద్వారా చంపవచ్చు, కరోనాను తొలగిస్తుంది. ప్రజలందరూ ఒక వారం పాటు * స్టీమ్ డ్రైవ్ ప్రచారాన్ని ప్రారంభిస్తే, * కరోనాను ముగించవచ్చు.


పై దిశలో ఈ పని చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కోరుతున్నాము


అక్టోబరు 3 నుండి అక్టోబర్ 10 వరకు ఒక వారం ఆవిరి ప్రక్రియను ప్రారంభించండి, అనగా ఉదయం మరియు సాయంత్రం. ఆవిరిని తీయడానికి కేవలం 05 నిమిషాలు. ఒక వారం పాటు ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా, ఘోరమైన COVID-19 చెరిపివేయబడుతుందని విశ్వసిస్తున్నాము.


 ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది, దుష్ప్రభావాలు కూడా ఉండవు.


   కాబట్టి దయచేసి మీ బంధువులు, స్నేహితులు మరియు పొరుగువారందరికీ ఈ సందేశాన్ని పంపండి, తద్వారా మనమందరం కలిసి ఈ కరోనా వైరస్ను చంపి ఈ అందమైన ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించగలము.


 ఇవన్నీ ఒకేసారి చేయడంలో, అది పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. దయచేసి మరింత ఎక్కువ భాగస్వామ్యం చేయండి.


 రండి, అక్టోబరు 3 నుండి ఇప్పుడు మనమందరం ప్రమాణం చేద్దాం .. ఒక వారం .. ఉదయం / సాయంత్రం .. 5 నిమిషాలు .. తప్పనిసరిగా ఆవిరి తీసుకోవాలి. ”!! 

         

 *మీకు తెలిసిన గ్రూపుకు దీన్ని పంపమని అభ్యర్థించుచున్నా ము*


  *ప్రజా ప్రయోజనంలో జారీ చేయబడింది*🙏🙏

శ్రీమద్భాగవతము

 *వందేమాతరం*

                                                                                                                          *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


 పద్యం: 1915 (౧౯౧౫)*


*10.1-901-*


*క. గురు దేవ హీను బాలుని*

*గిరిభూజ ప్రముఖ వాసుఁ గృష్ణు ననీశుం*

*బరిమాణశీల కుల గుణ*

*విరహితుఁ జేపట్టి యింద్రు విడిచిరి గొల్లల్.* 🌺



*_భావము: ఈ యాదవులు "గురువులను, దైవమును లక్ష్యపెట్టని వాడును, కొండలు, గుట్టలు, చెట్లు పుట్టల్లో తిరిగెడి వాడును, జ్ఞానము, విద్య లలో ఏ శిక్షణ పొందని వాఁడును, ఏ మాత్రము మంచి గుణములు గాని, నడవడి గాని లేని వాడును అగు ఒక సామాన్య బాలుని ఆశ్రయించి నావంటి ప్రతిభావంతుడు, శక్తివంతుడగు ఇంద్రుడను, అని కూడా ఆలోచించక" నన్ను వదిలివేశారు._* 🙏


*_ఈ కృష్ణుని గురించి మరొక తాత్విక నిగూఢమైన భావన లో: "తనకంటూ ఒక గురువు కానీ, దైవము కానీ లేని ఆది దైవము, కొండలు, చెట్లు, పుట్టలు, నీరు ఆకాశము అన్నీ తానే యైన విరాట్పురుషుడు, సకల విద్యలకు, జ్ఞానమునకు మూలమైన ఆదిగురువు, ఇంత అని కొలవలేని అనంతుడు, ఈ కులము, వంశము అని చెప్పజాలని అప్రమేయుడు, త్రిగుణములకు మూలమై యుండియు, ఆ గుణములకు అతీతుడగు పరమాత్మ"._* 🙏


*_పోతనగారు ఈ భాగవతమనే సుమధుర ఫలప్రసాదమును అందించారు. అత్యంత సరళమైన భాష లో చిన్ని చిన్ని పదములలో చొప్పించిన మహత్తరమైన భావము - భాషకు, భావానికి, భక్తికి వారు చేసిన సేవకు మన తెలుగు వారము తరతరాలుగా ఋణపడి ఉంటాము._* 🙏



*_Meaning: Indra was angry with the Yadava folks and was thinking: "These cowherds ignored me as they depended on the words of a boy, who does not care for God or Guru, who moves in forests and plains, who is not aware of any higher knowledge, who does not possess good character and not a single good quality. Heeding to the advice of such ignorant lad, these folks snubbed and disregarded me"._* 🙏🏻


*_Meaning of the same poem in philosophical sense: "This super-human lad is the God-incarnate Himself and Guru of Gurus. He is the creator of the entire universe and occupies the whole of the earth and sky. He is the origin of all knowledge and is beyond the trigunas (Sattva, Rajas and Tamo). He is Immeasurable, Omniscient, Omnipresent and Omnipotent"._* 🙏 



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

మూకపంచశతి

 దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


**మూకపంచశతి**


**ఆర్యాశతకము**


🌹14.

శ్లోకం


**అధికాఞ్చిపరమయోగిభి**


**ఆదిమపరపీఠ సీమ్ని దృశ్యేన౹**


**అనుబద్ధం మమ మానసం**


**అరుణిమ సర్వస్వ సమ్ప్రదాయేన౹౹**


🌺భావం :అమ్మాకామాక్షీ ! కాంచీపురమునందు ఆది ఐనదీ ,శ్రేష్ఠమైనదీ అయిన పరశివపీఠమున అధిష్ఠించియున్న ,పరమయోగులు మాత్రమే కాంచ గలిగిన ,సంపూర్ణ అరుణిమసంప్రదాయముతో ఒప్పుచున్న నీ యందే నామనస్సు అనుబంధింపబడినది.🙏



💮 పంచాశత్పీఠరూపిణి అయిన ఆ సర్వేశ్వరి ,కాంచీక్షేత్రమున ఆదిమపర పీఠముపై కొలువైయున్నది.కేవలము శ్రేష్ఠులైన యోగులకు మాత్రమే దర్శనీయమైన ఆతల్లి పూర్తి అరుణిమకాంతులతో శోభిల్లుచున్నది.అరుణా , కరుణాతరంగితాక్షి అయిన ఆ కామాక్షీ దేవితో నామనస్సునకు అనుబంధ మేర్పడినది.


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏



**ధర్మో రక్షతి రక్షితః**

😘 *Strange but TRUE*



*గాంధీజీ...*

వాళ్ళ అమ్మ, నాన్నలకు14 వ సంతానం...!


*అంబేద్కర్...*

వాళ్ళ అమ్మ, నాన్నలకు 16వ సంతానం...!


*రవీంద్రనాథ్ ఠాగూర్...*

14 వ సంతానం...!


*సుభాష్ చంద్రబోస్...*

కూడా 14వ సంతానమే...!


*వివేకానంద...*

6వ సంతానం...!


కాలం మారి

*"మేము ఇద్దరం* 

*మనకు ఇద్దరు"* నినాదం రావటంతో 

మహా పురుషులు పుట్టడం మానేశారు...!

 😂😂😂😂😂😂😂😂

ధనదాదేవి స్తోత్రం

 ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను. 

దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. 

ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. 


సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. 

ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును. 

రాక్షసాది గ్రహాలు భాదించవు.


ధనదాదేవి స్తోత్రం 


నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే l

మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతేll


మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే 

సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి l

దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే l

శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణిl

మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతేll


శివరూపే శోవానందే కారణానంద విగ్రహేl

విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతేll


పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే

సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే ll

శ్రీ రామ* నామం

 ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోడం పొరపాటు. 


*శ్రీ రామ* అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట.అదెలాగో చూద్దాం.


1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే


2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*


3⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*


4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 


అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహమచర్యాని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 


అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపం లో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 


మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.


రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 


*శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుండండి. జన్మ తరించండి.

అయ్యప్ప దీక్షవల్ల

 *అయ్యప్ప దీక్షవల్ల మనకు కలిగే లాభాలు (దీక్ష తీసుకునే స్వామికి, వారి కుటుంబ సభ్యులకు)* 


*సమర్పణ: అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ (ABAP), తెలంగాణ*


1. అయ్యప్ప దీక్ష సకల పాపహరణం, పుణ్యదాయకం మరియు మోక్ష కారకం. అందుచేత ఎంత నిష్ఠతో చేస్తే అంత సత్పలితం లభిస్తుంది. అయ్యప్ప దీక్ష మనిషి శరీర, మనసు, ఆత్మలను ఏకం చేస్తుంది. ఇది భక్తి, జ్ఞాన, కర్మ, రాజ యోగల సమాహారం.


2. పొద్దున, సాయంత్రం పూజలు, భజనలు చేయటం వలన ఇంటిల్లిపాదికి దైవ భక్తి, విశ్వాసం పెరుగుతుంది. కార్తీక, మార్గశిర మాసాల్లో, రోజు ఇల్లు శుద్ది చేసుకొని దీపాలు వెలిగించడం వలన ఇల్లంత కూడా దైవిక కాంతులతో వెలిగిపోతోంది.


3. ఉదయమే లేవటం వలన మానసిక ఉల్లాసం, ఒత్తిడి నుండి దూరం, బిపి షుగర్ తగ్గుతుంది. పొద్దునే లేవటం వలన కాలాన్ని నిత్యజీవిత కార్యక్రమాలకు సంపూర్ణంగా వినియోగించవచ్చు.


4. ఒంటిపూట భోజనం, అల్పాహారం వలన జీర్ణ వ్యవస్థ తిరిగి యాధస్థితికి వస్తుంది. సాత్విక ఆహరం తీసుకొవటం వలన నాలుగు నుండి ఆరు కిలోల బరువు కోల్పోయే అవకాశం. క్షమించాలి ఈ ప్రయోజనం మితంగా తింటేనే లభిస్తోంది.


5. బెల్లం, నెయ్యి, పళ్ళు,పాలు సంబంధ ఆహరం, ప్రసాదాలవలన రక్తశుద్ధి, కాలేయం పని తీరు మెరుగైతుంది. గుండె, మెదడు పనితీరులో మార్ప కలుగుతుంది. జ్ఞాపక శక్తీ పెరుగుతుంది.


6. సన్నిధానంలో అందరూ స్వాములతో కలిసి జీవించటం వలన మనషుల ప్రవర్తన, సమాజం గురించి అవగాహనా, జీవించే విధానం అర్థం చేస్కునే అవకాశం కలుగుతుంది.


7. అయ్యప్ప పూజలో తల్లితండ్రికి విశిష్ట స్థానం ఉండటం వలన తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య వాత్సల్య భావన పెరుగుతుంది. టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే చూడటంతో చిన్నప్పటి నుండే పిల్లలకు దైవ చింతన కలుగుతుంది. పగలు ప్రతికరాలు చొప్పించే పనికిమాలిన టివి సీరియళ్లుకు, పిల్లలను వ్యసననికి గురిచేసే కార్టూన్లకు దూరం


8. అయ్యప్ప మాలధారణ మొదలుకొని పడి పూజ, ఇరుముడి కార్యక్రమాల్లో మన ఇంటి సభ్యులే కాకా, బంధుమిత్రులు కలవటం, పాలుపంచుకోవడం వలన అందరితో సఖ్యత భావన కలుగుతుంది. 


9. అయ్యప్ప మాలధారణ చేసుకున్న వ్యక్తి సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా చూడటం వలన సమాజంలో వారి మీద, వారి కుంటుంబం మీద ఉన్న ఏమైనా చెడ్డ అభిప్రాయం ఉన్నా తొలిగి, మంచి అభిప్రాయం కలుగుతుంది.


10. పొద్దునే లేవటం, తొందరగా నిద్రపోవటం వలన సమయ పాలనా జరిగి స్వాములు, ఇంటి సభ్యులు వారి వారి విద్య, వ్యాపార, వృత్తి, గృహ తదితర దైనందిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనవచ్చు తద్వారా విద్య వ్యాపార వృత్తులలో అభివృద్ధిని పొందవచ్చు.


11. మద్యపానం, ధూమపానం లాంటి చేడు వ్యసనాలకు దూరం కావటం వలన డబ్బు ఆదా అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు, భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతాయి.


12. స్వాములు, వారి కుటుంబం ఎవరిపట్ల కోపం, ఆవేశం ప్రదర్శించకూడని కారణంగా, అందరూ వారిని ప్రేమిస్తారు, అభిమానిస్తారు.


*మూలం: Own post, Facebook page ఈ జీవితం అయ్యప్పకు అంకితం నుండి*

*ధార్మికగీత - 27*


                                  

           *శ్లో:- ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే ౹*

                  *నారీ గృహద్వారి, జనా శ్శ్మశానే ౹*

                  *దేహా శ్చితాయాం, పరలోక మార్గే ౹*

                  *ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః ౹౹*



సంపద యింటిలో , పశుల

        సంపద లెల్లను గోష్టమందునన్ ,

యింపగు భార్య గుమ్మమున ,

         యెల్లరు బంధులు ప్రేత భూమినిన్ ,

సొంపగు కాయమగ్నియును

         జొచ్చు , నినేవియు వెంటరావు , తా 

నింపిన ధర్మమే కలసి

         నిల్చును తోడుగ జీవు నెల్లెడన్


గోపాలుని మధుసూదన రావు

శయన_నియమాలు

 

         పడుకోవాలంటే   

      పాటించే పదహారు

       సూత్రాలు:-

1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశాన వాటికలో* కూడా పడుకోకూడదు.( *మను స్మృతి*)

2. పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. ( *విష్ణు స్మృతి*)

3. *విద్యార్థి, నౌకర మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*)

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం 

*బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.

( *దేవీ భాగవతము*).

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.

( *పద్మ పురాణము*)

5. *తడి పాదము* లతో నిద్రించవద్దు... 

పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.( *అత్రి స్మృతి*)

 విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. ( *మహాభారతం*)

6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.( *గౌతమ ధర్మ సూత్రం*)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*, 

పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత*,

ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని,మృత్యువు*,ఇంకా 

దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది.

( *ఆచార మయూఖ్*)

8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం*లో 1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.

( *బ్రహ్మా వైవర్తపురాణం*)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే *పడుకోవాలి*

11. ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.

12. దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు* *యముడు మరియు దుష్ట గ్రహము* ల నివాసము వుంటారు...

దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* మృత్యువు* లేదా *అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.

15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది.)

*ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు*

🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

🙏*సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత*🙏



_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.._

_సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము..._


ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..


_ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి._


_1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి._


_2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి._


_3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి._


_4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి._


_5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి._


*అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*


_6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..._


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. 

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


_నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం..._

35 పుస్తకాలు(PDF)

 *సామాజిక సమస్యలపై అవగాహన కలుగచేసే 35 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో! ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Download చేసుకోగలరు*

------------------------------------------------


1) మానవత్వం పై అవగాహన https://www.freegurukul.org/g/Humanity


2) టీనేజ్ ఆకర్షణ-స్నేహం-ప్రేమ పై అవగాహన https://www.freegurukul.org/g/TeenageAttraction-Friendship-Love


3) రక్తదానం పై అవగాహన https://www.freegurukul.org/g/Blood-Donation


4) అవయవదానం పై అవగాహన https://www.freegurukul.org/g/Organ-Donation


5) మరుగుదొడ్డి(ఆత్మగౌరవ గృహం) పై అవగాహన https://www.freegurukul.org/g/Toilet-OpenDefecation


6) వేధించటం-హింసించటం-ఏడిపించటం పై అవగాహన https://www.freegurukul.org/g/Abusing-Harassment-Violence


7) చెట్లు పెంపకం పై అవగాహన https://www.freegurukul.org/g/Trees


8) నీటి కాలుష్యం,వృధా పై అవగాహన https://www.freegurukul.org/g/Water


9) గాలి కాలుష్యం పై అవగాహన https://www.freegurukul.org/g/Air-Pollution


10) మద్యపానం పై అవగాహన https://www.freegurukul.org/g/Alcohol-Drinking


11) జంతువుల పై అవగాహన https://www.freegurukul.org/g/Animal


12) బాల్య వివాహాలు పై అవగాహన https://www.freegurukul.org/g/ChildMarriage


13) బాల కార్మికులు పై అవగాహన https://www.freegurukul.org/g/ChildLabour


14) పిల్లల బద్రత పై అవగాహన https://www.freegurukul.org/g/ChildSafety


15) అవినీతి పై అవగాహన https://www.freegurukul.org/g/Corruption


16) డ్రగ్స్(మాదక ద్రవ్యాలు) పై అవగాహన https://www.freegurukul.org/g/Drug


17) భూమి వేడెక్కటం(గ్లోబల్ వార్మింగ్) పై అవగాహన https://www.freegurukul.org/g/Global-Warming


18) ఇంటర్నెట్-సోషల్ మీడియా పై అవగాహన https://www.freegurukul.org/g/Internet-SocialMedia


19) ప్లాస్టిక్ పై అవగాహన https://www.freegurukul.org/g/Plastic


20) స్వచ్ఛ భారత్ పై అవగాహన https://www.freegurukul.org/g/SwachhBharat


21)A-డ్రైవింగ్ - వేగం పై అవగాహన https://www.freegurukul.org/g/Driving-Speed


21)B-మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయటం పై అవగాహన https://www.freegurukul.org/g/Driving-Mobile


21)C-డ్రైవింగ్ - హెల్మెట్ పై అవగాహన https://www.freegurukul.org/g/Driving-Helmet


21)D-డ్రైవింగ్ - సీట్ బెల్ట్ పై అవగాహన https://www.freegurukul.org/g/Driving-Seatbelt


21)E-త్రాగి డ్రైవింగ్ చేయటం పై అవగాహన https://www.freegurukul.org/g/Drink-And-Drive


21)F-నిద్ర మత్తు తో డ్రైవింగ్ చేయటం పై అవగాహన https://www.freegurukul.org/g/Driving-Sleepiness


21)G-రోడ్ నియమాలు https://www.freegurukul.org/g/Road-Rules


21)H-రోడ్ చిహ్నాలు(గుర్తులు) https://www.freegurukul.org/g/Road-Signs


21)I-వీడియోల ద్వారా డ్రైవింగ్ పై అవగాహన https://www.freegurukul.org/g/Driving-By-Videos


21)J-మైనర్ డ్రైవింగ్ పై అవగాహన https://www.freegurukul.org/g/MinorDriving


21)K-డ్రైవింగ్ నియమాలు https://www.freegurukul.org/g/Driving-Principles


22)A-పొగత్రాగటం పై అవగాహన - పార్ట్ 1 https://www.freegurukul.org/g/Smoking-Part1


22)B-పొగత్రాగటం పై అవగాహన - పార్ట్ 2 https://www.freegurukul.org/g/Smoking-Part2


22)C-పాసివ్ స్మోకింగ్(సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) పై అవగాహన https://www.freegurukul.org/g/PassiveSmoking


22)D-వీడియోల ద్వారా పొగత్రాగటం పై అవగాహన https://www.freegurukul.org/g/Smoking-By-Videos


సామాజిక సమస్యలపై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

To Join In WhatsApp Group: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this "www.freegurukul.org/join" link

కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా’

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 15 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


‘కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా’


ఇది పదహారు అక్షరముల నామము. మధ్యలో ఆపకుండా పూర్తిగా చదవాలి. తలమీద పెట్టుకునే ఆభరణములు కొన్ని ఉంటాయి. పరిపాలన చేసే అమ్మవారు తలమీద కిరీటము పెట్టుకుంటుంది. పద్మరాగమణులతో ప్రకాశించే కిరీటము పెట్టుకున్నదానా అని అంటున్నారు. పరిపాలన అన్నమాటలో హద్దు నిర్ణయము ఉంటుంది. యజమాని చేత అధికారపు హద్దు చూడబడుతూ ఉంటుంది. ఆ హద్దుదాటితే శిక్షించగలిగిన అంతర్లీన అధికారము ఎక్కడ ఉన్నదో అది కిరీట ధారణ చెయ్యబడినది గుర్తు. కిరీటము పెట్టుకుని కేవలము అధికారము మాత్రమే ఇచ్చి, హద్దు దాటిన వారిని శిక్షించే అధికారము తన దగ్గర పెట్టుకుంటుంది. ప్రపంచ విషయములలో అందరినీ అమ్మవారు ఎలా చూస్తుంది? అంటే రుచిని ప్రధానముగా చెప్పగల నాలుక ఇచ్చింది. రుచిని చెప్పని నాలుకలు ఉండవు. మొదటి స్వరూపము పదార్థము రుచిని తెలుసుకోవడము. 


రెండవస్వరూపము భగవంతుని నామములో ఉన్న గొప్పతనమును తెలుసుకోవడము. ఒక మధురపదార్థము తింటే తియ్యగా, ఆవకాయ తింటే కారముగా, నిమ్మకాయ తింటే పుల్లగా ఉన్నదని చెప్పకలిగినప్పుడు రామనామము పలికితే ఎంతోతృప్తిగా ఉంటుందని చెప్పకలిగితే – ‘శ్రీరామ నీనామమెంత రుచిరా’ అనగలుగుతారు. లోకములో అమ్మవారు ఈ రుచి చూడడమన్నది ఆరోగ్యమును జాగర్తగా ఉంచుకోవడానికి పెట్టింది. శరీరమును జాగర్తగా ఉంచుకోవడానికి రుచి తెలుసుకుని అనుభవించగల శక్తిని ఇచ్చింది. పరిధిని దాటి రుచితో తాదాత్మ్యత చెంది ఆరోగ్యమును విస్మరించి అన్నీ తినేస్తారు. విచ్చలవిడిగా ఇంకొకరికి పెట్టకుండా తినేసి అనారోగ్యము వస్తే వైద్యుడి సలహా మేరకు తినడము మానేస్తారు. వారు రుచిని గెలిచారని అనుకోకూడదు. జ్ఞాని వ్యాధితో మమైకము కాడు. అజ్ఞాని వ్యాధితో మమైకము అవుతారు. రసేంద్రియము శరీరపోషణకు ఉపకరణము - హద్దుమీరితే బాధకు కారణము. అధికారము ఇచ్చినవారే హద్దులు దాటినప్పుడు గమనిస్తూ ఉంటారు. అదీ కిరీటము అంటే. అమ్మవారి అనుగ్రహమును ఎంతవరకు వాడుకోవచ్చునో తెలుసుకుని వాడుకోవాలి. ప్రవర్తనకు ఒక నియతి ఉన్నది. అదుపుతప్పి వాడుకుంటే ఉత్తరక్షణములో శిక్షించగలదు. ‘కనత్కోటీరమండితా’ – కిరీటము పెట్టుకున్న ఆవిడ చిత్రముగా ఒక చోట కూర్చుని గుప్తముగా అన్నీ వ్రాస్తూనే ఉంటుంది. ఆవిడే చిత్రగుప్తుడు. మనసుతో ఏమి చేస్తున్నారో, ఎంత నిజాయితీగా ఉన్నారో కూడా తెలుసు.


అమ్మవారు కామము ఇచ్చింది. ధర్మపత్నితో ఉంటే దానిని దోషము అనరు. ‘ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతిచరామి’ అని అగ్నిసాక్షిగా చెప్పటము జరిగింది. వేరొకరియందు కామము ఉండకూడదు. కామమును, నాలుకను హద్దులో వాడుకోవాలి. హద్దు తెలుసుకుంటే ఉద్ధరింపబడతారు లేదా పతనమై పోతారు. ఏదో ఒకరోజు శరీరము జర్జరీభూతమై కాలములో పడిపోతుంది. ఆరోగ్యము భగవదుపాసనకు హేతువుగా శాస్త్రము నిర్ణయించింది తప్ప ఆరోగ్యస్థాయిలో కాదు. అమ్మవారి కిరీటమును బాగా చూడడము వస్తే హద్దు బాగా తెలుస్తుంది. హద్దు తెలుసుకోకుండా ఉన్న ఏ బలాన్ని అయినా దుర్వినియోగము చేస్తే చూసేదానివి అమ్మ చూస్తుంది అన్న భయమును పొందాలి. 


 అమ్మవారి కిరీటము పద్మరాగమణులతో చేయబడింది. రావణగంగన్న నదిలో సౌగందికములు, కురువిందములు, స్పటికములు అన్నవి దొరుకుతాయి. కురువిందము అనగా ఎర్రటి పద్మరాగమణి. దానిని స్పటికము దగ్గరగా పెట్టినట్లయితే మణికాంతితో స్పటికమును కప్పేస్తుంది. తెల్లనికాంతి ఎరుపుతో కలిసి ఎర్రగా ప్రకాశిస్తుంది. మణి పక్కకు తీస్తే మళ్ళీ తెల్లగా ప్రకాశిస్తుంది. పద్మరాగమణులకు, స్పటికములకు ఒక శక్తి ఉన్నది. ఎర్రగా ఉండే ఈ మణులు అమ్మవారి కిరీటములో ఉన్నాయని తెలుసుకుని మనసులో వాటి పేర్లను తలచుకుంటే ఉత్తరక్షణములో శుభములను, మంగళములను కలిగిస్తాయి. అమ్మవారి పట్లభక్తిని, హరిభక్తిని కలిగిస్తాయి. పురుషరూపములో ఉంటే నారాయణుడు. స్త్రీ రూపములో ఉంటే అమ్మవారు. ఇద్దరూ అలంకారప్రియులు. 


సహస్రనామము చదివే భాగ్యము కలిగి కొంతకాలము చదవగా దాని వెనుక ఉన్న రహస్యమును తెలుసుకునే అవకాశమును కృప చేస్తుంది. కిరీటము ధరించిన ఆవిడ చూస్తున్నదని పరిధులు అర్థమవుతాయి. ఒకవిధమైన భయము ఏర్పడి ప్రవర్తన చక్కబడి జాగర్తగా ఉంటారు. భక్తితో పాటు ఆవిడ చెప్పిన మాట అతిక్రమించడమునకు భయము కలుగుతుంది. 

‘కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా’ – అన్న నామము నోటితో పలకడము వలన పసుపు పచ్చని బంగారు కిరీటములో ఎర్రటిమణిని పెట్టుకుని ఉన్నదన్న భావనతో మనసులో చూడగలిగితే ఫలితము వస్తుందని అమ్మవారు ఆనాడు వశిన్యాదిదేవతలతో చెప్పించింది. 

కిరీటము అధికారములో ఉన్న హద్దులను చెపుతుంది. అమ్మవారి కిరీటమునకు హద్దులు ఉంటాయా? అంతకన్నా గొప్ప కిరీటము ఉన్నదా? అంటే సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు కిరీటదర్శనము గురించి మహోత్కృష్టమైన ప్రయత్నమును చేస్తూ అద్భుతమైన శ్లోకము చెప్పారు. 


కిరీటం వైరిఞ్చం పరిహర పురః కైటభ భిదః

కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్భారి మకుటమ్ | 

ప్రణమ్రేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనమ్ 

భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||


అమ్మవారు సింహాసనము మీద కూర్చుని ఉండగా కొంతమంది సేవించడానికి వచ్చి ఆమె ఎదురుగా కూర్చోకుండా మంత్రి సామంతులు పక్కగా కూర్చున్నారు. ఆ సభలోకి ఎంతో మహాపురుషులు అయితే తప్ప వచ్చి ఫలానావారు వస్తున్నారని చెప్పకూడదు. అమ్మవారు సభ నడిపిస్తున్నది. ఆ సభలో లోకములన్నీ సృష్టి చేసే నాలుగుతలల మీద కిరీటములతో చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, దేవతల పరిపాలకుడు ఇంద్రుడు తలమీద కిరీటముతో ఉన్నారు. అంత గొప్పవాళ్ళు అయిన వాళ్ళే అమ్మవారి దగ్గర భయ భక్తులతో కింద కూర్చుని ఉంటే అంతకన్నా గొప్పవాళ్ళు ఉంటారని అనుకోకూడదు. అమ్మవారు సింహాసనము మీద కిరీటము పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు ఎవరు గొప్ప? అంటే కిరీటము బట్టి నిర్ణయము అవ్వాలి. 


 శ్రీమహారాజ్ఞి అయిన అమ్మవారు సభతీర్చి కూర్చుని ఉన్నసమయములో ఒక ప్రతీహారి వచ్చి ‘భవస్యాభ్యుత్థానే’ - (భవుడు అంటే లోకములన్నీ పోషించ కలిగినవాడు) పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడని చెప్పాడు. అమ్మవారు సింహాసనము మీద నుంచి లేచి గబగబా ఆయనకు ఎదురు వెళ్ళింది. ఈ హడావుడికి సభలోని వారు అమ్మ పాదములకు నమస్కరించడానికి కింద పడిపోయారు. ఆయనను ప్రవేశపెట్టమనకుండా తన పరివారముతో ఆయనకు ఎదురు వెళ్ళింది. అమ్మవారి చెలికత్తెలు ‘కిరీటం వైరిఞ్చం’ -- అమ్మా! ఇవి బ్రహ్మగారి కిరీటము జాగర్త కాళ్ళకు తగులుతుంది అన్నారు. అమ్మవారు మాత్రము కిందకి చూడకుండా వెళ్ళిపోతున్నది. ప్రస్తుతము వరకు అమ్మవారి కిరీటము పెద్దదని శంకరులు చెప్పకనే చెపుతున్నారు. ‘పరిహర పురః కైటభ భిదః’ – ‘అమ్మా! ఇది కైటభుడు అనే రాక్షసుని మర్దించిన మహావిష్ణువు కిరీటము అది చాలా కఠినముగా ఉంటుంది. (స్థితికారుడైన విష్ణువు ధర్మమునకు హాని కలిగితే ముందుగా యుద్ధమునకు వెళ్ళేది ఆయనే. ఆయన కిరీటము మీదకు బాణములు వేస్తారు. మిగిలిన కిరీటముల వలె ఉండదు) అది పల్లవమైన నీ పాదములకు తగులుతుందేమో జాగర్త అని చెపుతున్నారు ఆమె ఆగకుండా దానిని కూడా దాటి వెళ్ళిపోతున్నది. సఖులు నమస్కరిస్తున్న వాళ్ళను పక్కకు తప్పుకోమని చెపుతున్నారు. ‘కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్భారి మకుటమ్’ - ఇంద్రుడి దగ్గరకు వచ్చేసరికి - ‘ఇంద్రా! అమ్మవారు వెడుతున్నది నీ కిరీటము తియ్యి – అది అమ్మవారి పాదములకు తగులుతుందని ఆమెను దానిని దాటి నడవమన్నారు. ఆవిడ సభలోనుంచి హఠాత్తుగా వెడుతుంటే బ్రహ్మాది దేవతలయొక్క కిరీటములు నేలమీద పడి తల్లి పాదములకు ప్రణిపాతము చేస్తున్నాయి. మహారాజ్ఞి ఆజ్ఞల్ని అందరూ శిరసావహిస్తారు తప్ప ఆ కిరీటము వేరొకరి దగ్గర ఒంగేది కాదు. మరి ఎందుకు పరుగెడుతున్నది? అంటే వస్తున్నవాడు భర్త. ఆయన పరిపాలకుడా ! కాదా ! అన్న విషయము పక్కన పెడితే భార్యాభర్తల మధ్య భేదము ఉండదు. ఆవిడ మహాపతివ్రత. అంతస్థితిలో ఉన్నా భర్త వస్తున్నాడనేప్పటికి ఎదురువెళ్ళింది. అంత గొప్ప కిరీటము భర్త ముందు మాత్రమే ఒంగుతున్నది. మిగిలినవి అన్నీ ఆమె పాదముల ముందు ఒంగుతున్నాయి కాబట్టి ఆమె కిరీటమే పెద్దది. ఆ కిరీటములోని పద్మరాగమణులను గురించి నాలుగు మంచిమాటలు అనకలిగితే ఉత్తర క్షణములో భక్తి కలుగుతుంది. పైన ఒకడు చూసేవాడు ఉన్నాడని హద్దు తెలుసుకుని జీవించుట భక్తి. దానికి సాధనము కిరీట దర్శనము.   


కిరీటములు చాలా రకములుగా ఉంటాయి. రామచంద్రమూర్త్రి పెట్టుకునే కిరీటము చాలా ఘనముగా ఉంటుంది. ఒక సార్వభౌముడు పెట్టుకునే కిరీటము ఎత్తుగా ఉండి దానిమీద పడగలు మొదలైనవి ఉంటాయి. అమ్మవారు పెట్టుకునే కిరీటము చాలా చమత్కారముగా ఉంటుంది. అమ్మవారి కిరీటమును ఆయన చూసారు కనక ఒక గుర్తు చెపుతున్నారు. ఎప్పుడు ఊహించినా అలాగే ఊహిస్తూ ఉండాలి. బాగా కిరీట ధ్యానము చెయ్య కలిగినవారికి సమీపములో నిలబడి దర్శనము ఇస్తుంది.  

 

 సమస్తవిశ్వములు ఆవహించి ఉన్న అమ్మవారికి కిరీటము ఎవరు తయారు చేస్తారు? దానికి మణులు ఎక్కడనుంచి వస్తాయి? ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు ఎర్రటిమణులు. ద్వాదశాదిత్యులు పన్నెండుమంది అమ్మవారి కిరీటములో మణులుగా ఉన్న వాళ్ళ పేర్లు తలచుకుంటే చక్కటి ఆరోగ్యము లభిస్తుంది. అమ్మవారి కిరీటమునకు ఉన్న చంద్రరేఖ గమ్మతుగా శుక్లపక్షములో ఉన్న తదియనాటి చంద్రరేఖ ఆకారములో ఉంటుంది. మిగిలిన వాటికి ఉండదు. అమ్మవారు నవ్వుతూ కూర్చుని ఉన్నది. 


 ఈ చంద్రబింబము దగ్గర నుంచి అమృతబిందువులు కిందకు పడుతుంటే ద్వాదశాదిత్యులలోనుంచి ఒక కిరణము ఆ బిందువులోకి వెళ్ళింది. వానపడుతున్నది సూర్య ప్రకాశము ఉన్నది. సూర్యకిరణము వానబిందువులోనుంచి వెళ్ళగానే ఆకాశములో ఇంద్రధనుస్సుగా వచ్చి ఏడురంగులుగా విడిపోతుంది. అలాగే చంద్రునినుంచి పడుతున్న సుధాబిందువు మీద సూర్యకిరణము పడగానే ఎటునుంచి పడినా చుట్టూ ఆదిత్యులు ఉన్నారు కాబట్టి అమ్మవారి కిరీటము మీద ఇంద్రధనుస్సు వస్తుంది. ఏడురంగుల కింద విడి ధ్యానములో ఆ ఇంద్రధనుస్సు కనపడాలి. ఈ చంద్రరేఖ, దానినుండి పడుతున్న సుధాబిందువు, సూర్యకిరణము అలా వెళ్ళడము, అందులోనుంచి ఇంద్రధనుస్సు పడడము జరిగింది అంటే బాగా ధ్యానము చేసినట్లు గుర్తు ఆ నామము పలికి ఇలా ధ్యానములో దృగ్గోచరమయిందో వారు ఆ క్షణములోనే సార్థకత పొందారు. ఒక కిరీటము ఎంతోస్థాయిలో ప్రయోజనమును తీసుకుని వచ్చింది. 

  

 ఇంకొక రహస్యము ఉన్నది. అమ్మవారి కిరీటము గురించి ఏమీ తెలియని వారికి కూడా దర్శనము అవుతుంది. కార్తీకమాసములో కృష్ణపక్షములో వచ్చే చతుర్దశినాడు అమ్మవారి కిరీటము ఆకాశములో కనపడుతుంది. ఆ చతుర్ధశిని రూపచతుర్దశి, కృష్ణచతుర్దశని పిలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పట్టుకోగలిగినవారు ధన్యులు. సూర్యచంద్రులు ఇద్దరూ ఒక రాశి చక్రములో ఎప్పుడూ అమావాస్యనాడు ఒక డిగ్రీ దగ్గరే ఉంటారు.  

 

మూకశంకరులు అమ్మా! నువ్వు నల్లకలువలు చేసిన తపస్సుకి ఫలితమా! అన్నట్టు ఉన్నావని అన్నారు. కలువపువ్వులు చంద్రుడు ప్రకాశిస్తే తప్పవిచ్చుకోవు. కామాక్షి అమ్మవారి కిరీటము మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ కారణము చేత కలువలు ఎప్పుడు కామాక్షి దర్శనము కోసము తపస్సు చేస్తాయన్నారు. చంద్రకాంతికి విచ్చుకునే కలువపువ్వు సూర్యుడి కాంతికి ముడుచుకుంటుంది. అమ్మవారి కిరీటముమీద సూర్యుడు ఉన్నాడు. అమ్మ అనుగ్రహముతో సూర్యుని వలన ఇబ్బంది పొందవు. నీ కిరీటము ధ్యానము చేసిన పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తిని పొందింది. నువ్వు పర్వతరాజైన హిమవంతుడి ఇంటిలో పుట్టి, సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వము పొందిన మణిదీపానివి. సూర్య చంద్రులను కిరీటములో పెట్టుకుని ఉన్నకుమార్తెను చూసి ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నాడో అంటూ – 

ధరణి మయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం 

అంబుమయీం అంబా మనుకంపమాది మామిచ్ఛే ఆదిమ జననీ || 

అమ్మా! నీ తండ్రి ఒక పర్వతము. ఈ భూమి అంతా నువ్వే తల్లీ. నువ్వే అన్నీ నువ్వే అయి ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వమును పొంది కిరీటమును పెట్టుకున్నావు అన్నారు. అమ్మవారి కిరీటమును చూసి ఎందరో మహానుభావులు బహువిధములుగా కీర్తన చేసారు.


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

real peace is within our own hearts. _

 Murugan, the proprietor of a coffee shop had been busy all day. Being Saturday, his shop was very crowded and the customers seemed unending. 


He had been on his toes since morning. Towards the evening he felt a splitting headache surfacing. 


As the clock ticked away, his headache worsened. 


Unable to bear it, he stepped out of the shop leaving his staff to look after the sales. 


He walked across the street to the Pharmacy to buy himself a painkiller to relieve his headache. 


He swallowed the pill and felt relieved. He knew that in a few minutes he would feel better. 


As he strolled out of the shop, he casually asked the salesgirl, "Where is Mr. Gopalan, the Chemist? He's not at the cash counter today!" 


The girl replied, "Sir, Mr. Gopalan had a splitting headache and said he was going across to your coffee shop. He said a cup of hot coffee would relieve him of his headache." 


The man's mouth went dry and he mumbled, "Oh! I see."


*_This is a typical case of looking outside ourselves for something that we have within us._* 


How strange, but true! 


The Chemist relieves his headache by drinking coffee and the coffee shop owner finds relief in a pain relieving pill! 


Similarly, many of us travel across the lengths and breadths of the universe and also visit several places to find peace. 


_Eventually, we come to realize that real peace is within our own hearts. _


 PEACE is really a state of mind

**హిందూ ధర్మం** 55

 **దశిక రాము**




 (సత్యం)


సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం. అందరిలాగే జన్మంచాం, జీవిస్తున్నాం, మరణిస్తాం. జీవితంలో కష్టాలు, కనీళ్ళు వస్తాయి. నిన్న ఉన్నట్టుగా జీవితం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, నిరంతరం మార్పులు చెందుతుంది. కానీ ఎన్ని మార్పులు సంభవించినా, ఒకటి మాత్రం నిశ్చలంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అది ఈ శరీరం పుట్టక ముందు ఉంది, తల్లి గర్భంలో ప్రవేశించి దేహానికి చైతన్యాన్ని ఇచ్చింది. పెరుగుతున్నది శరీరమే కానీ, ఆ శక్తి కాదు. ముడతలు శరీరానికే పడతాయి, ముసలితనం శరీరానికే వస్తుంది కానీ ఆ పదార్ధానికి రాదు. ఆనందమైనా, విచారమైనా ఆ తత్వానికి తేడా ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది. సుఖదుఖాఃలతో దానికి సంబంధం లేదు. అది ఆత్మ. ఆత్మయే నిజం. ఆత్మను తెలుసుకోవడమే సత్యం. ఆత్మను తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. కేవలం పుస్తకంలో చదవడం కాదు, #అనుభూతి చెందడం ముఖ్యం.


ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యం. ఈ లోకాన్ని మనం అనుభూతి చెందుతున్నాం కానీ ఈ లోకం శాశ్వతం కాదు. నిత్యం మార్పులకు గురవుతుంది. ఒకనాడు ప్రళయం వచ్చి, సమస్త లోకాలు గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాయి. రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ప్రకృతి, సమస్త లయమవుతాయి. అయినా అప్పుడు కూడా పరమాత్మ నిలిచి ఉంటాడు. మన చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. మరణం తప్పదు. కానీ ఎందరు మరణించినా, ఎప్పటికి నిలిచి ఉండే తత్వం భగవంతుడు. భగవంతుడే సత్యం. ఆ మాటకు అర్దం ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ అసత్యం అని కాదు. మనమున్న స్థితిలో ఇవన్నీ సత్యాలే. కానీ మనకున్న అజ్ఞానమనే చీకటి తొలగి, సత్యం గోచరించిన రోజు, ఈ లోకమంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. మనం ఆ నాటకాన్ని చూస్తున్న ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతాం. నాటకం ముగియగానే మనం వచ్చిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోతాం. అంతవరకు మనకు కనిపిస్తున్నవి సత్యాలే. కానీ ఇవన్నీ చిన్నపాటి సత్యాలు, తాత్కాలిక సత్యాలు. శాశ్వతమైన సత్యం భగవంతుడు. ఆ శాశ్వతమైన, నిత్యమైన సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం.


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/FSIYl9MMCPk5REnQyWCXwy


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి*


**ధర్మో రక్షతి రక్షితః**


 గ్రూప్స్ ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

*గురువాక్కు యొక్కమహత్యం*:

 


ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. 


ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నారు. 


గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. 


" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను." 


"ఏమిటా కోరిక గురువు గారూ" 


"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని." 


"వచ్చే జన్మలోనా" 


"కాదు ఈ జన్మలోనే" 


శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా" 


" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" అన్నాడు శిష్యుడు.


ఆది విని " ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు." అన్నారు గురువుగారు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


 " *సరిగ్గా, సంవత్సరం తరువాత..*"


ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత విన్నారా…!


శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" అన్నాడు.


దానికి గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా.." అన్నారు.


అంటే..?? అడిగాడు శిష్యుడు.


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు 'పాదుకలకి పట్టాభిషేకం" చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.


ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." 


అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. 


" సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది"., 


కాదు కాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.


ఆ భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు..!. 


చెప్తున్న నా కళ్ళు భక్తి పారవశ్యంతో చెమ్మగిల్లాయి.😢😢




 The BRAVE Brahmin with a very Big Heart*

===================================


*The gentleman in the photo is Krishnamurthy Iyer ji - known as Kittu Mama.*


*Kittu Mama is a 65 year old senior citizen and sells Dosai and Idli in Trichy near Theppakulam closer to Chathiram Bus Stand.*


*He sets up his shop after 6 PM and sells delicious Idli, Dosai with tasty chutney at very affordable prices. He is a roadside cart based outlet. He is assisted by his wife and a young worker.*


*Most of his clients are labourers, working women staying in Women's hostels, Bus Conductors, Auto Rickshaw drivers, goods cart pullers, Bus Drivers/Truck Drivers etc. Local people there highly respect him.*


*Few days back he was making and selling idlis and dosa as usual. And local councillor Pandian came and asked for Idli/Dosa.. He was punch drunk. He is a local ruffian and collects hafta from vendors. He was with two rowdies. All of them ate food and Pandian did not pay the money for the food.*


*When Kittu Mama's wife asked for money, Pandian became angry and pushed Kittu Mama and threw away Utencils with Atta for Dosai/Idli. And abused them - "You Iyer - how dare you ask ME money?"*


*And he proceeded to pull and tear the janeyu of Kittu Mama..*


*Kittu Mama became ferocious and picked up a bamboo stick which was lying nearby and bashed up the goons. And he was saying "Yes I am poor brahmin but my Poonool (Janeyu) is vedaswaroopam. How dare you try to insult it? I also know martial arts and has learnt it perfectly".. Then he showed his skills in Silambattam and hit the goons again.*


*Everyone there were watching but did not stop the goon due to fear. The thuggish neta Pandian ran away but threatening Kittu Mama that he would come next day with his party workers and sort him out.*


*Kittu Mama continued his work of making food. Few labourers around there told Kittu Iyer that next day they would protect him when the goons come.*


*Next day evening Kittu Mama started his shop as usual. Councilor goon did not turn up. Next Day also he did not come.*


*Then Kittu Mama came to know that after fighting with him, the councilor met with an accident and was in ICU and in need of rare blood group for operation. Blood donation request had been flashed in TV too.*


*Kittu Mama immediately went to hospital, donated blood as his blood group matched that of the councilor, stayed in the night till the operation was over.*


*Next day morning, Councilor's family thanked him and Kittu Mama went and met the councilor who was in a Condition to talk. He apologized profusely to Kittu Mama.*


*And Kittu Mama told -"I had to defend my Janeyu as it is my dharma. I had to save you too as it is also my dharma. And you have a family hence I felt I should definitely donate blood" and moved away.*


మహాభారతము**

 **దశిక రాము**


**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


100 - అరణ్యపర్వం.


సై౦ధవునికి పరాభవం జరిగిన తరువాత, మార్కండేయమహర్షి పాండవులను కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటుండగా, ధర్మరాజు మళ్ళీ మళ్ళీ వ్యధ చెందుతూ,' యిట్టి అవమానాలు మాకే యెందుకు జరుగుతున్నాయి 'అని మహర్షిని, అడిగాడు.


దానికి మార్కండేయమహర్షి, ' ధర్మజా మీకే కాదు. ఇంతకుముందు త్రేతాయుగంలో అయోనిజ, జనకమహారాజు పెంపుడుకుమార్తె, శ్రీరామచంద్రుని ఇల్లాలికి, సీతాదేవి వంటి సాద్వీమతల్లికి కూడా, కష్టపరంపర వచ్చిపడింది. ఆమె ఒంటరిగా, పగవాని పంచన సంవత్సరం పాటు వుండవలసి వచ్చింది. కనీసం మీకు చుట్టుప్రక్కల ఆప్తులున్నారు, మీ కష్టాలు వినడానికి, పంచుకోవడానికి. ఆమెకూడా ద్రౌపదివలే అయోనిజయే. ఇప్పుడు ద్రౌపదిని హరించినట్లు, అప్పుడు సితాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్ళాడు. ' అని చెబుతూ రామాయణ మహాకథను ఎనిమిదివందల శ్లోకాలలో మధురంగా వినిపించాడు మార్కండేయమహర్షి.  


తరువాత, సావిత్రీ సత్యవంతుల కథను కూడా వినిపించి, వారు పడిన కష్టాలను కళ్ళకు గట్టినట్లు వివరించి, ధర్మరాజాదులను వూరడించాడు, మార్కండేయమహర్షి. సావిత్రీ సత్యవంతులకథను యింకా విపులంగా చెప్పమని ధర్మరాజు కోరగా, మార్కండేయ మహర్షి ఆ పవిత్రగాథను యీవిధంగా వివరించాడు :  


పూర్వము, మద్రదేశాన్ని,అశ్వపతి అనేరాజు పరిపాలించేవాడు. ఆయన యెంతో సత్యవ్రతుడు. సకలగుణసంపన్నుడు, జనరంజకుడు. వినయసంపన్నుడు. కానీ ఆయనకు సంతానం కలుగలేదు. ఆయన 18 సంవత్సరాలు, యెంతో ఓపికతో, నియమనిష్టలతో అనుదినము గాయత్రిదేవిని ఉపాసిస్తూ, ఆమెను సావిత్రీదేవి రూపం లో ఆరాధించాడు. ఆయన చేసిన పూజలకు మెచ్చి సావిత్రీదేవి, ఒక పుత్రిక జన్మించేటట్లుగా ఆయనను, అనుగ్రహించింది. నిరాశతో, అశ్వపతి, ' అమ్మా ! నేను పుత్రుని కొరకు నిన్ను యిన్నిసంవత్సరాలు ఆరాధించాను, నాకు పుత్రికను ప్రసాదించావా ! ' అనిదీనంగా అడిగాడు. దానికి అమ్మవారు, యీ పుత్రికద్వారా, నీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈమె కారణజన్మురాలు. స్త్రీ లోకానికే తలమానికంగా వుంటుంది, యీమె నడవడిక. కాబట్టి, పుత్రుడైనా, పుత్రిక అయినా భగవత్ప్రసాదం గా స్వీకరించడం లోనే, మానవజీవితాలు సక్రమమార్గంలో నడిచే సృష్టిపరమార్ధం దాగి వున్నది. ' అనిచెప్పింది.  


కొంతకాలానికి అశ్వపతిభార్య మాళవి గర్భం ధరించి, ఒక శుభముహూర్తాన ఆడశిశువును ప్రసవించింది. ఆబిడ్డకు సావిత్రి అని నామకరణం, చేశారు. ఆమె శుక్లపక్ష చంద్రునిలా రోజురోజుకూ అసమాన అందచందాలు పుణికిపుచ్చుకుంటూ, పుత్తడిబొమ్మ లాగా, ఆ ఇంట నడయాడసాగింది. ఆమెను యెంతో అల్లారుముద్దుగా పెంచసాగారు, 


ఆమె యుక్తవయస్కురాలు అవగానే, ఆమె అందచందాలకు, గుణసంపదకు తగిన వరుని తీసుకురావడానికి, అశ్వపతి చాలా శ్రమించాడు. కానీ, యెక్కడా ఆయన యెంచ దగిన, వరుడు కానరాలేదు. ఆయన కొన్నిదినాలు రాజపురోహితునితో కూడా అలోచించి, సావిత్రిని పిలిచి, ' అమ్మా ! సావిత్రీ ! చూస్తున్నావు కదా నేను నీకు తగిన భర్త రావాలని యెన్ని ప్రయత్నాలు చేస్తున్నానో ! కానీ ఒక్క వరుని విషయంలో కూడా నా మనసు, నీకు తగినవాడని సంకేతం యివ్వలేకపోతున్నది. తల్లీ ! వివాహవయస్సు వచ్చిన, కుమార్తెకు వివాహం తగినసమయంలో చెయ్యలేని తండ్రి, తండ్రి చనిపోయిన తరువాత తల్లిని కనిబెట్టి చూచుకోలేని తనయుడు, వున్నా వ్యర్ధమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. '


' కాబట్టి, మన పరివారం అంతా నీ వెంటరాగా, నీవు దేశాటన చేసి, నీ వరుని నీవే నిర్ణయించుకో. ఇందులో ధర్మహాని యేమియులేదు. తండ్రిగా నీకు నేనే ఆ స్వేచ్ఛ యిస్తున్నాను కనుక, నీవు సందేహించవలసిన అవసరం లేదు. ' అని చెప్పాడు. సావిత్రి కూడా తండ్రిమాటలను ఆజ్ఞగా భావించి, వరాన్వేషణలో, ఒక శుభముహూర్తాన బంగారు రథంపై, తనపరివారం వెంటరాగా, యెంతో శోభాయమానంగా బయలుదేరింది.


ఆమె పర్యటన కార్యక్రమాన్ని ఆమెకే వదిలిపెట్టారు,పరివారం. సావిత్రి మొదటగా, మహర్షులు వుండే తపోభూములకు వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నది. ఆ తరువాత, దైవదర్శనం చేసుకుని, రాజ్యాలలో పర్యటించాలని నిర్ణయించుకుంది. ఆహా ! యెంత మంచి నిర్ణయం. తండ్రి యిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగ పరచుకోకుండా, ఒక పధకం ప్రకారం మార్గనిర్దేశం చేసుకొనడంలోనే, ఆమె సౌశీల్యం అవగతమౌతుంది.


తండ్రి ఆజ్ఞప్రకారం బయలు దేరింది కానీ, వరుణ్ణి ఎంపిక చేసుకోవడం అంత సులువైన విషయం కాదని, సావిత్రికి, అర్ధమౌతున్నది, ఆ ప్రయాణంలో. యెంతో సునిశితంగా, వెంటవచ్చిన పెద్దలసలహాలు తీసుకుంటూ, ఆమె అనేకరాజ్యాలు తిరిగి స్వస్థలమైన మద్రదేశం చేరుకున్నది.  


అప్పటికి నారదమహర్షి కూడా అక్కడే వేంచేసివున్నారు. ఆమె ప్రయాణబడలిక తీరిన తరువాత, అశ్వపతి, ఆమె అభీష్టాన్ని, నిస్సంకోచంగా చెప్పమని అడిగాడు. సావిత్రి,

' తండ్రీ ! సాళ్వదేశాన్ని ఒకప్పుడు యేలిన ద్యుమత్సేనుడు, ఆయన యేకైక కుమారుడు సత్యవంతుడు అనే పేరుగలవాడు, బాలునిగా వున్న సమయంలో, ద్యుమత్సేనునికి అంధత్వం ప్రాప్టించి, రాజ్యం శత్రురాజుల చేతిలోకిపోగా, భార్యాపుత్రులతో కలిసి అడవులలోజీవిస్తున్నాడు. తల్లిదండ్రుల సేవలో జన్మ చరితార్థం చేసుకుంటున్న ఆ సత్యవంతుని నేను వరించాను ' అని సిగ్గుపడుతూ చెప్పింది.


అశ్వపతి, ప్రస్తుతం రాజ్యం కోల్పోయినా, రాజవంశీకుడైన సత్యవంతునికి తన కుమార్తెను యివ్వడానికి యెట్టిసంకోచమూ చూపించలేదు. నారదమునీంద్రుల వైపు అశ్వపతి సాలోచనగా చూసి, ఆయన అభిప్రాయం కోసం యెదురుచూడసాగాడు. మహర్షి యీ వివాహానికి అంత సుముఖంగా లేనట్లు ఆయన ముఖ కవళికలద్వారా స్పష్టమైంది అశ్వపతి మహారాజుకు.  


కారణం లేకుండా మహర్షులు,విముఖత చూపరుకదా ! అందుకే, విశదంగా అభిప్రాయం చెప్పమని నారదమహర్షిని, అశ్వపతి అడిగాడు.  


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

భార్యాభర్తల అనుబంధం

 శుభోదయం

*💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑*


💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.


💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.


💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.


💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...


💖 భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.


💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.


💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీఅర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.


💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.


💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!


💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.


💖 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధంముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.


💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటేఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.


💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.


💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.


💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.


💖 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.


💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.


💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.


💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.


💖 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.


💖 నేలకు జారిన తారకలై

ముత్యాల తలంబ్రాలు

ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!


💖 సప్తపది ఏడు అడుగులు

మొదటి అడుగు - అన్న వృద్ధికి

రెండవ అడుగు - బలవృద్ధికి

మూడవ అడుగు - ధన వృద్ధికి

నాల్గవ అడుగు - సుఖవృద్ధికి

ఐదవ అడుగు - ప్రజాపాలనకి

ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి

ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి


💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.


💖 వివాహాన్ని సుఖమయం

 చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.


💖 కలిమి లేములతో...

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో...


💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేదిఅందులోఒకపేజీమాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.


💖 మగవాడు గాలి పటం

(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)

ఆడది దారం, అతడికి ఆధారం


(ఆమెకువెన్నంటిప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)

విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.


💖 భర్తకి భార్య బలం కావాలి

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదుభార్యా భర్తల బంధం 

అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.


మనసులోనిప్రేమని,బాధనికళ్లలోచూసిచెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.


💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటేఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.


💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.


💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య.

*దారం తెగిన గాలిపటం*

 


తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. 


గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. 


కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగి పోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.


*నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా* అన్నాడు.


తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు.


 "తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.


ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేసారు.

"టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. 


*అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది.*


"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు.


కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. *గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు.*

మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు.


జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ‘కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని!’


 నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి.


గాలిపటానికి దారం ఆధారం 

ఆ దారం తెగిన గాలిపటం ఏ దారిన వెళ్లాలో తెలియక, సక్రమంగా గాలి లో నిలబడలేక కుప్పకూలిపోతుంది.


అలాగే తెరచాపలు తెగిన నావ ఎటు వెళ్ళాలో దిక్కు తెలియక 

నడి సముద్రంలో కొట్టుమిట్టాడుతూ మునిగిపోయే ప్రమాదం ఉంది.


అలాగే మనలో చాలామంది చాలాసార్లు ఈ కుటుంబంతో ఉన్న భవబంధాలు బంధి

వల్ల నేను జీవితంలో నేను 

పైకి ఎదగ లేకుండా ఉన్నాను. వీటిని తెంపుకుంటే నేను స్వేచ్ఛా, హాయిగా వ్యవహరించవచ్చు అనే భ్రమలో ఉంటారు.


 *విలువ తెలియని మూర్ఖుడికి వజ్రాన్ని ఇస్తే విసరి సముద్రంలో పారవేశాడు అటా!* ఆ వజ్రం విలువ తెలిసేసరికి అది అందనంత,అందుకోలేనంత లోతులో పడిపోయిందిని తెలుస్తుంది. మనం కూడా అంతే భగవంతుడు చక్కని బంధాలను ఇస్తే వాటిని బందిఖానా గా భావించి దూరం చేసుకుంటే వాటి విలువ తెలిసిన తర్వాత మనం వారిని కలుసుకోవాలి అనుకునేసరికి మనకు కనిపించనంత,మవ మాట వినిపించనంత దూరంగా వారు వెళ్ళిపోయి ఉంటారు.అప్పుడు మనం వారి విలువ తెలుసుకున్నాను ఏం ప్రయోజనం లేదు.


కుటుంబ బంధాలు అనేవి మన ఆలాన, పాలన చూస్తూ, బాంధవ్యాల మాధుర్యాన్ని మనకు అందించి మనలను బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ప్రేరణ కల్పిస్తూ మహోన్నతమైన వ్యక్తిగా మనం మారుతువుంటే,మనం సాధించిన విజయాలు చూసి ఉప్పొంగిపోతూ ఉంటారు.


 పొరపాటుగా వాటిని తెంచుకుంటే జీవితంలో అశాంతి మొదలై ఎటు వెళ్ళాలో తెలియక మానసిక చికాకులతో, సమస్యల సుడిగుండము లో చిక్కుకుని,


దారం తెగిన గాలిపటం వలె తెరచాపలు లేని నావ వలే 

మన జీవితం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దు కుందాం.

**హిందూ ధర్మం - 14**

 **దశిక రాము**


మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ధృతి అని తప్పుడు పనులను కూడా అట్లాగే పూర్తి చేయాలనుకోకూడదు. మనం చేసే పని మంచిదైనప్పుడు, లోకమంతా అడ్డగించినా, పూర్తి చేయడం మాత్రమే ధృతి అవుతుంది. అంతేకానీ, దుష్ట ఆలోచనలు చేసి, అవి తప్పని తెలిసినా, వాటిని వదిలిపెట్టక, వాటిని పూర్తి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది


ఈ జీవితం అనేది సుఖదుఃఖాల కలియక, గెలుపు, ఓటముల సంగమం. ఒక సమయంలో సుఖం ఉంటే, మరొక సమయంలో దుఖం ఉంటుంది. సుఖం వచ్చిందని అతిగా ఆనందపడిపోకూడదు, దుఖం వచ్చిందని క్రుంగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, తట్టుకుని, మరణం వచ్చేవరకు జీవించాలి. సముద్రానికి ఆటుపోట్లు ఉన్నట్టే జీవితానికి ఉంటాయి. తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తున్నా, సముద్రం పొంగిపోదు. సూర్యుడు తన నీటిని ఆవిరిరూపంలో పీల్చుకున్నా క్రుంగిపోదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అట్లాగే మనిషి కూడా జీవితంలో అన్నిటిని తట్టుకుని నిలబడాలి. ఈ ప్రపంచం ఒక వ్యాయమశాల వంటిది, ఇక్కడ నిన్ను బలవంతుడిగా చేసుకోవాలి అంటారు స్వామి వివేకానంద. స్వామిజీ చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుని, జీవితంలో మనం అనుభవించే ప్రతి కష్టం నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాలి. ఇక్కడ మన బలవంతులుగా మారాలి. ఎక్కడ జీవితం మీద నిరాశ చెందకుండా, ఆశవాదంతో జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం ధృతి. అదే ధర్మం యొక్క ప్రధమలక్షణం.


తరువాయి భాగం రేపు.........

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏



**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

శ్రీలక్ష్మీస్తోత్రం లోపాముద్రా ||*

 


శ్రీలక్ష్మీస్తోత్రం లోపాముద్రా ||*

శ్రీలక్ష్మీస్తోత్రం లోపాముద్రా ||*

*|| మూలపాఠ శ్రీలోపాముద్రా ఉవాచ ||*


మాతర్నమామి కమలే పద్మాయతసులోచనే .

శ్రీవిష్ణుహృత్కమలస్థే విశ్వమాతర్నమోఽస్తు తే .. 1..


క్షీరసాగరసత్పుత్రి పద్మగర్భాభసుందరి .

లక్ష్మి ప్రసీద సతతం విశ్వమాతర్నమోఽస్తు తే .. 2..


మహేంద్రసదనే త్వం శ్రీః రుక్మిణి కృష్ణభామిని .

చంద్రే జ్యోత్స్నా ప్రభా సూర్యే విశ్వమాతర్నమోఽస్తు తే .. 3..


స్మితాననే జగధ్దాత్రి శరణ్యే సుఖవర్ద్ధిని .

జాతవేదసి దహనే విశ్వమాతర్నమోఽస్తు తే .. 4..


బ్రహ్మాణి త్వం సర్జనాఽసి విష్ణౌ త్వం పోషికా సదా .

శివౌ సంహారికా శక్తిః విశ్వమాతర్నమోఽస్తు తే .. 5..


త్వయా శూరాగుణీవిజ్ఞా ధన్యామాన్యాకులీనకా .

కలాశీలకలాపాఢ్యై విశ్వమాతర్నమోఽస్తు తే .. 6..


త్వయా గజస్తురంగశ్చ స్త్రైణస్తృర్ణం సరః సదః 

దేవో గృహం కణః శ్రేష్ఠా విశ్వమాతర్నమోఽస్తు తే .. 7..


త్వయా పక్షీపశుః శయ్యా రత్నం పృథ్వీ నరో వధూః .

శ్రేష్ఠా శుధ్దా మహాలక్ష్మి విశ్వమాతర్నమోఽస్తు తే .. 8..


లక్ష్మి శ్రి కమలే పద్మే రమే పద్మోద్భవే సతి .

అబ్ధిజే విష్ణుపత్ని త్వం ప్రసీద సతతం ప్రియే .. 9..


శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం శ్రీలోపాముద్రాకృత శ్రీలక్ష్మీస్తోత్రం ||


*🌞శుభ శుభోదయం🌞*


🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏 

Chair Suryanamaskara"




 Encourage your parents and senior citizens to practise this ""Chair Suryanamaskara"" 12 times daily. This will improve their overall health, reduce joint stiffness, improve lung capacity, strengthen the knees and muscles, reduce age related issues such as acidity and gas etc. It's very mild but effective in a long run and very much sustainable. It's also practicable and beneficial for people with knee problems and those who find difficult to walk.

Ma saraswati





 

request




 I request all the graduate friends to avail my services to enroll as voter in forthcoming united Hyderabad, Ranga Reddy, & Mahaboob Nagar Dist.,Graduates M.L.C. elections to vote in favour of our BJP candidate 

Sri. Ramchander Rao Naraparaju, 

Senior Advocate of Telangana High Court and I also request my friends to please share this to all the Advocates & Graduates. PH: 8074 4545 36 

*No one should buy!!!*

 Right now, in one month, we will have Navratri and followed by Diwali.*


*China sells Rs. 3,000 million worth of fire crackers.*




*Special Notice*

*They don't mention Made in China on Chinese products these days!*

*Now they write Made in PRC meaning People's Republic of China!*


*Spread the word to people to avoid buying things that are Made in China.*


*You need to send this msg to 3 people.*


*1st person needs to send to 3 other people!*


*These 3 people will msg 3 others!*


3 × 3 = 9

9 × 3 = 27

27 × 3 = 81

81 × 3 = 243

243 × 3 = 729

729 × 3 = 2187

2187 × 3 = 6561

6561 × 3 = 19683

19683 × 3 = 59049

59049 × 3 = 177147

177147 × 3 = 531441

531441 × 3 = 1594323

1594323 × 3 = 4782969

4782969 × 3 = 14348907

14348907 × 3 = 43046721

43046721 × 3 = 129140163

129140163 × 3 = 387420489

387420489 × 3 = 1,162,261,467


*Within 20 days, the entire country will share this msg! If you start, the whole country will join in .....*


*Let's stop using Chinese products! They are sub- standard! They are dangerous!*

 ◦

శివాయ










 


**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -36


బ్రహ్మాండోత్పత్తి 

అది ఎలాగంటే ఈ మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై, యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాల మందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్త్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులూ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తివల్ల ప్రేరేపించబడిన తామసాహంకారంనుండి శబ్దతన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రంనుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్దతన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శంవల్ల వాయువూ, ఆ వాయువువల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప జేయటం శబ్దనేతృత్వం. భగవత్ప్రేరణతో స్పర్శతన్మాత్రం వల్ల పుట్టిన వాయువువల్ల రూపం పుట్టింది.ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనుపించునటువంటి ఆకారానికి వృత్తులు ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం). ఇక తేజస్సుకు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సువల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పువల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేకవిధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జెలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్రవల్ల దైవప్రేరణతో మార్పుచెందిన జలంనుండి గంధతన్మాత్రం పుట్టింది. ఈ గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది. ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమగంధం అనీ, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అనీ, కర్పూరం మొదలైనవానితో కలిసినపుడు సుగంధం అనీ, తామరపూలు మొదలైన వానితో కలిసినపుడు శాంతగంధం అనీ, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినపుడు ఉగ్రగంధం అనీ, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినపుడు ఆమ్లగంధం అనీ వేరువేరు పదార్థాలతో కలిసినపుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీవృత్తులు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. “పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు. ఇవికాక వానికి సంబంధించిన అసాధారణ ధర్మాలు విను. ఆకాశానికి అసాధారణగుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణగుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణగుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణగుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణగుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ ఏడు తత్త్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడూ అంతుపట్టని అస్తిత్వం కలవాడూ, జగత్కారణుడూ, సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడూ, సమస్తాన్ని నియమించేవాడూ, నిరంజనాకారుడూ అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది. ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటె ఒకటి పదింతల ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీలవలె ఒప్పియున్న ఆ పొరలలో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంతో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.


విరాట్పురుష ప్రకారంబు 


ఆ అండంలో విరాట్పురుషుడు వెలుగుతూ ఉంటాడు. అతని ముఖం నుండి వాణి, వాణితోపాటు అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నులవల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యాన మేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం దిక్కులూ పుట్టాయి. చర్మంనుండి గడ్డం, మీసాలు మొదలగు రోమసమూహమూ, ఓషధులూ జనించాయి. ఇంకా...చర్మం వలన మూత్రావయవం పుట్టింది. దానినుండి రేతస్సు పుట్టింది. రేతస్సువల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది.విరాట్పురుషుని చేతులవల్ల బలం, చేతుల బలంవల్ల ఇంద్రుడు, పాదాలవల్ల గమనం, పాదగతులవల్ల ఉపేంద్రుడు ఉద్భవించటం జరిగింది. విరాట్పురుషుని నాడులవల్ల రక్తమూ, రక్తంవల్ల నదులూ, జఠరం వల్ల ఆకలిదప్పులూ, ఈ రెండింటివల్ల సముద్రాలు పుట్టాయి.విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ, చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.

ఇంకా విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలూ, శబ్దం మొదలైన పంచతన్మాత్రలూ, వాక్కు మొదలైన ఇంద్రియాలూ, ఆ ఇంద్రియాల అధిదేవతలూ వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. ఆ యా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు, తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోకవ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించి నప్పటికీ విరాట్పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడ విరాట్పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయవం మృత్యువుతోకూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలిదప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఊరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి, చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు, జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంతబలంతో కదలాడలేవు. లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్ఠానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా, అవి శక్తిహీనా లయ్యాయి. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీరభాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి, పురుషుల యథార్థజ్ఞానం వల్ల మోక్షమూ, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధమూ కలుగుతుంది” అని చెప్పి కపిలుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**సౌందర్య లహరి శ్లోకము - 14**

 **దశిక రాము**




**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


శ్లోకం 14


**క్షితౌషట్పఞ్చాశ** 


**ద్ద్విసమధిక పఞ్చాశదుదకే**


**హుతాశే ద్వాషష్టిశ్చశ్చతురధిక పఞ్చాశదనిలే,**


**దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే**


**మయూఖా స్తేషామప్యుపరితవ పాదామ్బుజ యుగమ్!!**

.

ఓ దేవీ ! క్షితి యందు ఏభై ఆరు, ఉదకంలో ఏభై రెండు, అనిలునిలో అరవై రెండు, వాయువులో ఏభై నాలుగు, దివిలో డెబ్భైరెండు , మనస్సులో 

అరవైనాలుగు సంఖ్య గలవై నీ చరణ కిరణాలు వెలుగొందుతున్నవి. ఆ ఆరింటికి పైన సహస్రదళ కమల మధ్యంలో వర్తించే చంద్ర బింబాత్మకమై

బైందవ స్థానమనే పేరుగల అమృత జలధితో నీ పాదపద్మ యుగళం ప్రకాశిస్తోంది.


**ఓం హిమాద్రిజా యైనమః**


**ఓం వేదాంతలక్షణాయైనమః**


**ఓం కర్మబ్రహ్మమయ్యైనమః**


🙏🙏🙏


**ధర్మము-సంస్కృతి**

15-11-గీతా మకరందము

 

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి


అవతారిక - చిత్తశుద్ధిలేనివారు ప్రయత్నము సలిపినప్పటికిని ఆత్మను చూడజాలరని చెప్పుచున్నారు – 


యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ | 

యతన్తోఽప్యకృతాత్మానో

నైనం పశ్యన్త్యచేతసః || 


తాత్పర్యము:- (ఆత్మాసాక్షాత్కారమునకై) ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు (అనుభూత మొనర్చుకొనుచున్నారు). అట్లు ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు.


వ్యాఖ్య:- అనేకులు భగవత్ప్రాప్తికై యత్నించుచున్నప్పటికిని అందులో కొందఱు సఫలురగుటకును, కొందఱు విఫలురగుటకును కారణమేమియో ఇచట తెలుపబడుచున్నది. చిత్తశుద్ధిగలిగి యత్నించువారు తప్పక సాఫల్యమును బొందగలరు. అనగా పరమాత్మను తమయందు సాక్షాత్కరించుకొనగలరు. కాని అదే ప్రయత్నము, అవే ధ్యానాదులు గావించుచున్నప్పటికిని, మలినచిత్తులు, సంస్కరింపబడని మనస్సు గలవారు, పరమాత్మను సాక్షాత్కరించుకొనజాలరు. కొందఱు శాస్త్రపాండిత్యము మున్నగునవి మాత్రము కలిగి హృదయపవిత్రతలేక ఆత్మాన్వేషణమునకై ఉపక్రమింతురు. మఱికొందఱు కేవలము వేషధారులుగ నున్నవారై ధ్యానాదులను చేయుచున్నట్లు కనుపించుచుందురు. అట్టివారు ఇంద్రియనిగ్రహము లేని కారణముచేతను, చిత్తశుద్ధి లేనందువలనను ఆత్మను తమయందు గాంచజాలరని ఈ శ్లోకమున ఘంటాపథముగ చెప్పివేయబడినది. క్షేత్రమును బాగుగ దున్ని కలుపుతీసి, శుద్ధముచేసి, ఎరువుచల్లి ఆ పిదప విత్తనము వేసినచో చక్కగ పైరగును. అట్లుకాక, దున్నక, కలుపుతీయక వేసినను, లేక ఊషరక్షేత్రమునవేసినను ఆ విత్తనము మొలవదు. ఒకవేళ మొలచినను పెరగదు. ఒకవేళ పెరిగినను ఫలించదు. అట్లే సాధనచతుష్టయసంపత్తి మున్నగువానిద్వారా చిత్తమును మున్ముందు శుద్ధమొనర్చుకొనినచో, అత్తఱి ఆత్మవిచారణాధ్యానాదులచే అతిసులభముగ ఆత్మ యనుభూతము కాగలదు. అవి లేనివారు ఎంత ప్రయత్నించినను ఆత్మను చూడజాలరు.


 భగవద్దర్శనమునకై రెండు విషయములు ప్రతివారికి అత్యవసరములని ఇచ్చోట తెలుపబడినది. అవియేవి యనిన - (1) ప్రయత్నము (2) చిత్తశుద్ధి - ఈ రెండును గలవారికి పరమాత్మ తప్పక అనుభూతుడు కాగలడు. రెండును అవసరములే. “యతన్తః” - అని

చెప్పబడుటవలన పరమార్థమార్గమున ప్రయత్నము అత్యావశ్యకమని తేలుచున్నది. అయితే ఆ ప్రయత్నమునకు చిత్తశుద్ధియు తోడుగానున్నపుడు అది యింకను ప్రకాశించును. ఇచట "అచేతసః" అని చెప్పబడినదానికి అర్థము కేవలము మూఢులని అజ్ఞానులని, నాస్తికులని కాదు. ఏలయనిన ఆ యత్నించువారికి దైవమును పొందవలెనను తలంపుగలదు. ముముక్షుత్వము కలదు. లేకున్న వారు భగవత్ర్పాప్తికై అసలు ప్రయత్నమే చేయరుగదా! వీరు ప్రయత్నము చేయుచున్నారు. కాని వక్రమార్గమున, అపసవ్యపద్ధతిలో చేయుచున్నారు. అట్టివారు అనుభవజ్ఞులగు పెద్దల సాంగత్యముచేసినచో సత్యమార్గమును కనుగొని తరించగలరు. దైవమార్గమున ప్రయత్నము మంచిదేకాని దానికి చిత్తశుద్ధికూడ తోడైనచో ఇంకను రాణించును. బాగుగ ఫలించును. మోటుగా సాధనచేయుటవలన గొప్ప ప్రయోజనములు చేకూరవు; సాధనపద్ధతిని, సాధనరహస్యములను

భగవవత్ప్రోక్తములగు ఇట్టి వచనములవలనను, సద్గ్రంథమువలనను, మహాత్ముల సాంగత్యమువలనను తెలిసికొని ముముక్షువులు సక్రమపద్ధతిలో ధ్యానించి తరించవలయును.


ప్రశ్న:- పరమాత్మ యెచట గలడు?

ఉత్తరము:- తనయందే.

ప్రశ్న:- ఆతనిని ఎవరు చూడగలరు? 

ఉత్తరము:- చిత్తశుద్ధిగలిగి ధ్యానాది ప్రయత్నములను చేయువారు. 

ప్రశ్న:- ఎవరు చూడలేరు? 

ఉత్తరము:- చిత్తశుద్ధిలేక ప్రయత్నము చేయువారు.

ప్రశ్న:- కాబట్టి భగవద్దర్శనమున కేవి అవసరము?

ఉత్తరము:- (1) చిత్తశుద్ధి (2) ప్రయత్నము.

శ్రీ వెంకటేశ్వర మహాత్యము



               రచన

గోపాలుని మధుసూదన రావు 


         --- భృగుమహర్షి త్రిమూర్తుల దర్శించుట కెళ్ళుట ---


భృగువంతట త్రయమూర్తుల 

సుగుణంబుల నెంచనెంచి సురపురములకున్ 

నగణితమౌ ధైర్యంబున 

ఖగపతి జనినంత వడిగ గడచుచు వెడలెన్. 16


భృగు సంయమి యా రీతిన 

ముగురయ్యల శక్తి జూడ ముచ్ఛటపడియున్ 

తెగువతొ కైలాసంబుకు 

యగణితమగు భక్తితోడ నరిగెను తొలుతన్ 17


హరుసదనము ముని జేరియు 

హరహర మహాదేవ యనుచు నంజలి సేయన్ 

హరు డించుక మాఱాడక 

హరి దలచుచు నూరకుండె యా క్షణమందున్ 18


తనరాకను పరమేశుడు 

కనియును మాఱాడకుండ కఠినతనుండన్ 

కని భృగుముని విస్మితుడై 

ననియెను నీ రీతి వ్యధతొ నాతని తోడన్ 19


" మునినైన నన్ను కనుగొని 

కనికరమును జూపకుండ కఠినపుమదితో 

పనిగొని యవమానించుట 

ఘనమా పరమేశ ! నీకు , కరుణను గనుమా ! 20


త్రిగుణాతీతుడవని నిను 

నగణితమౌ భక్తితోడ నారాధించన్ 

భృగువును , నాపై నీ విధి 

పగబూనుట నీకు తగునె పన్నగభూషా ! 21


కడుభక్తితొ నీ వద్దకు 

వడి వడి గా వంద్యు డంచు వచ్చిన నన్నున్ 

కడగంట జూడ నైతివి 

మృడుడా ! యిదినీకు తగదు , మేలవ దెపుడున్ 22


పలుమరు ప్రార్థన జేసిన 

పలుకక నున్నట్టి నీదు ప్రల్లదమునకున్ 

నిలలో బూడిద బిల్వము 

జలధారలె నీకు దక్కు జంగమ దేవా !" 23


ఆగ్రహమొచ్చిన భృగుముని 

నిగ్రహమును మఱచి యిట్లు నిటలాక్షునికిన్ 

యుగ్రపు శాపంబిచ్చియు 

వ్యగ్రుండై యచటనునుండి వడి వడి చనియెన్ 24


చతురంబగు నిగమంబుల 

చతురత మీరంగ జూచు సరసిజ జన్మున్ 

చతురానను దర్శించగ 

యతులిత మగు భక్తితోడ నరిగెను పిదపన్ 25

109. ఓం మహాసక్త్యై నమః.🙏





శివశక్త్యైక్య విశిష్ఠ తత్వమెద భాసింపంగ తాద్రూప్యమున్


స్తవనీయంబుగ నొందుటందున మహాసక్తీ! ముదంబొందెదే?


జవసత్వంబులు నీవె కాన శివునిన్ శక్తిన్ మదిన్ గల్పుమా.


శివశక్త్యైక్యము నాత్మఁ గొల్పి సుగతిన్ సిద్ధింపగా చేయుమా.🙏


అమ్మపాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

*ధార్మికగీత - 37*

 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                     

                                        *****

          *శ్లో:- అవినయ మపహర౹ విష్ణో!*

                  *శమయ మనః ౹ దమయ* 

                   *విషయ మృగ తృష్ణామ్౹*

                   *భూత దయాం విస్తారయ ౹*

                   *తారయ సంసార సాగరతః ౹౹*

                                       *****

*భా:- సర్వ వ్యాపకుడవైన హే! భగవాన్! నాలో మాటిమాటికి పొడసూపుచున్న విద్యా, రూప, ధన, యౌవన,అధికార, ఇత్యాది అష్టవిధ "గర్వము"లను క్రమముగా పోగొట్టుము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములచే దారితప్పుతున్న "మనసు"ను నిగ్రహిస్తూ, నీ రూప,గుణ,లీలా ధ్యానము నందు మరలింపుము. దార, ధన, పుత్ర అనే త్రివిధ ఈషణములతో పాటు "తుచ్ఛమైన విషయ వాసనలనే ఎండమావులను" ఉపశమింపజేయుము. పుడమిపై గల సకల జీవకోటి యెడల పరిపూర్ణ "దయాస్వభావము"ను, ఆర్ద్రతను పెంపొందించుము. ఈద శక్యము గాని యీ ఘోర సంసార సాగరమును సులువైన ఉపకరణమైన నామస్మరణ మనెడి నావపై అపారకరుణచే దాటించి "ఉద్ధరింపుము". తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా, తోడూనీడగా సర్వము నీవై నా జన్మను ధన్యము చేయుము. నీ కివే నా సాష్టాంగదండప్రణామములు*.

                                  *****

                   *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః.🙏

(శ్రీ లలితా సహస్రనామములలో ౫౦౫ వ నామము)


కం. పరవు, చతుర్వక్త్ర మనో


హరవు. సుగుణ చరితులకు స్పృహనుగొలిపెడి ని


న్నరయగ స్వాధిష్ఠానా


క్షరవు జనని., నిను నుతింతు, కావుము జగతిన్.🙏


అమ్మకు పాదాభివందనములతో🙏

చింతా రామకృష్ణారావు.

🌷#శివగంగ- కర్ణాటక🙏🌹




     

#అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకం


    #శివాలయంలో '1600' సంవత్సరాల నుండి #జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం...


“#నెయ్యి- అభిషేకం” చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారుతుంది...శివానుగ్రహం... తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం...🍁🌹🍀


#కర్ణాటక రాష్ట్రం తుముకూరు

గంగాధరేశ్వర స్వామి ఆలయం లో జరిగే మర్మమైన విషయం అంతుపట్టని శివవైభవం.


#శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం అభిషేకం సమయంలో #భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం.   


#వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.🍁🌹🌷


#ఈ అద్భుతం 1600 సంవత్సరాల నుండి ఆలయంలో జరుగుతోంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ #కనుగొనలేకపోయారు.. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని #చూసితీరాల్సిందే.


#ఈ ఆలయం కర్ణాటక రాజధాని నుండి 54 కిలోమీటర్లు, 

#శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు లేదా 2640.3 అడుగుల #ఎత్తులో ఉంది. 🌸🌷


#పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది మరియు స్థానికంగా "గంగా" అని పిలువబడే ఒక నీటిధార #ప్రవహిస్తుంది, తద్వారా ఈ ప్రదేశానికి దాని పేరు వస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది లేదా #బసవన్న నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.


#శివయ్య కొలువైఉన్న పర్వతం 

#శివలింగాకృతిని పోలి ఉంటుంది.


#పర్వతం నుండి నిత్యం పారే జలాధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మ ను తలిపిస్తుంది


#పర్వతం పై కొలువైఉన్న దేవాలయాలు, ప్రమధగణాలు సాక్షాత్ కైలాస శిఖరం పై ఉన్న భావనకు వేదికలవుతాయి.


#పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని,సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన #అనుగ్రహం🍁🌹🍀


#ఇలా అనేక విశిష్ఠతల సమాహారం శివగంగ దివ్య క్షేత్రం


#ఈ క్షేత్రాన్ని 'దక్షిణ కాశీ' గా పిలుస్తారు.


#పర్వతశిఖరం పైన గంగాధరేశ్వరుడు దేవాలయం, హున్నమదేవి ఆలయం,పాతాళగంగా ఆలయం,నందీశ్వరుడు కొలువై ఉన్నారు


ఈ శిఖరం పైనే శారదాంబ ఆలయం ఈ ఆలయం చూస్తూ అగస్త్య తీర్ధ, కపిల తీర్ధ,కన్వ తీర్ధ,పాతాళ #గంగ సరస్సులు ఉన్నాయి.


#మకర సంక్రాంతి సందర్భంగా, ఆలయం సాయంత్రం సూర్యరశ్మి నంది కొమ్ముల మధ్య ఒక ఆర్క్ గుండా వెళుతుంది మరియు గుహ లోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ #దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల సాంకేతిక #నైపుణ్యం యొక్క రుజువు


#ఈ ఆలయం యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన #దీపం తప్ప వేరే విద్యుత్ శక్తి లేదు.


#ప్రజలు ఈ వెలుగులో మాత్రమే స్వామి వారిని చూస్తారు. చెక్కిన అనేక మంటపాలు కూడా #ఉన్నాయి.🌻🌸🌹🙏


                  🙏🌷ఓం నమఃశివాయ🙏